Tuesday, July 14, 2015

మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం ... సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

 జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకఁన్న టీమిండియా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా జాదవ్‌ కాగా, మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ అంబాటి రాయుడు ఎంపికయ్యాడు. టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఆట ప్రారంభించిన ఇండియా 84 పరుగులుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయాయి. ఓపెనర్లు రహానే ( 15), విజరు ( 13), ఉతప్ప ( 31), తివారి ( 10 ) తకఁ్కవ స్కోరు అవుట్‌ కాగా తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ జాగ్రత పడ్డారు. మనీష్‌ పాండే, జాదవ్‌ ఇద్దరు కలిసి ఐదో వికెటుకఁ 144 పరుగుల భాగస్వామ్యాఁ్న నెలకొల్పారు. జాదవ్‌ 87 బంతులల్లో ఒక సిక్స్‌, 12 ఫోర్లు సహాయంతో సెంచరీ చేశాడు. వన్డేలలో తొలి శతకం సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో మజ్జీవ రెండు వికెట్లు తీయగా చిబాబా, మసకద్జ, ఉత్సేయ తలో వికెటు తీశారు. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 193 పరుగలకే అలౌట్‌ అయ్యింది. చిబాబా ( 82), చకబ్వ ( 27), ముతుంబి ( 22) పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ తకఁ్కవ స్కోరు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలర్లులో స్టువర్ట్‌ బిన్నీ 3 వికెట్లు తీయగా మోహిత్‌ శర్మ, హర్బజన్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మురళీ విజరుకఁ ఒక వికెటు లభించింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం


 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లకు సంబంధించి చెన్నై సూప్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లను ఐపీఎల్‌ నుంచి రెండేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ ఛీఫ్‌ జస్టిస్‌ రాజేంద్ర మాల్‌ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసింది. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మేయప్పన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ సహభాగస్వామి రాజ్‌ కుద్రాపై జీవితకాల నిషేదం విధించింది. వీరిద్దరూ క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుడా నిషేధం పెట్టింది. వీరిద్దరూ బీసీసీఐ, క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చారని కమిటీ అభిప్రాయపడింది.
రానున్న ఐపీఎల్‌పై ప్రభావం ?
        
ఐపీఎల్‌లో మొత్తం 8 జట్టు వున్నాయి. వీటిలో రెండు జట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌ విధించడంతో ఆరు జట్లు మాత్రమే వున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఐపీఎల్‌ కార్యవర్గం తర్వలో సమావేశం కానుంది. కొత్త జట్లను కూడా తీసుకఁనే అవకాశాన్ని పరిశీలించే అవకాశముంది.
' ధోని లేకుడా ఐపీఎల్‌ ను ఊహించుకోవడం కష్టం'
         
చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌ దూరమైతే దాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్ఫష్టం చేశాడు.

Thursday, July 9, 2015

' బాహుబలి' పై సంభాషనాలు, రూమారులు, కామెంట్లు ....

' బాహుబలి' మరి కొన్ని  గంటల్లో ప్రేక్షకు ల ముందుకు వస్తున్న తరుణంలో సిని మాపై పలు కామెంట్లు వస్తున్నాయి. 'బాహుబలి' సిఁమా ముందు అనుకున్న ప్రకారం సంవత్సరనరలో పూర్తి చేయాలని  అనుకున్న విషయం ప్రబాస్‌కు తెలియజేశారు. ఈ విషయం ప్రభాస్‌ సినిమాకు 15 కోట్ల పారితోషికం మాట్లాడుకు ఓప్పదం కుదుర్చుకున్నాడు. అది కాస్త రెండున్నర సంవత్సరాలు అయ్యింది. దాంతో పారితోషికును కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. సినిమా మ్తొతంగా పూర్తి అయ్యే వరకఁ 35 కోట్లు తీసుకున్నట్లు సిని వర్గాల ద్వారా సమాచారం.

' బాహుబలి' సినిమా ఒక్క రోజులో 700ల షోలు...
' బాహుబలి' సినిమాకఁ ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హైదరాబాద్‌లో దాదాపు 90 శాతంకఁ పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. రేపు విడుదలకు సిద్దమవుతున్న సిఁమా టికెట్ల కోసం ఇప్పటి వరకఁ ధియేటర్ల వద్ద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ధియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు అమ్ముడు పోగా, మరి కొన్ని కొత్తగా చేరిన థియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ఇస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 700 ధియేటర్లలో వేయనున్నట్లు తెలుస్తుంది.

' బాహుబలి' అర్థరాత్రి బెన్‌ఫిట్‌ షో చూసి రివ్యూ మీకఁ అందించడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆంధ్రాహెడ్‌లైన్స్‌ మీకు రివ్వూను అందజేస్తుంది. అని  సమచారం వచ్చింది. ఇలా వస్తే సిఁమా చూసేవాలకి ఈట్రేష్‌టు పోతుంది.
బాహుబలి టికెట్లపై జోకులు
బాహుబలి టికెట్లకు ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం. వందలను దాటి, వేలలో ఈ టికెట్ల రేట్లు ఉన్నాయి. అయినా కూడా లక్షల కొద్ది టికెట్లు అడ్వాస్స్‌గానే అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది టికెట్లు తీసుకు సిసిమా కోసం ఎదురుచూస్తున్నారు. దొరకు అభిమానులు ఎంత బాధతో ఉన్నారు.
బాహుబలికి ప్లాప్‌ టాక్‌ రేటింగ్‌ 2/5మరో 24 గంటల్లో విడుదలయ్యే సిఁమాకఁ అప్పుడే రేటింగ్‌ వచ్చింది. ఈ విషయం అందరికి సందేహాలు రావచ్చు. ' బాహుబలి ' రేటింగ్‌ 2/5 ప్లాప్‌ సిని మా వచ్చింది. దుబారు సెన్సార్‌ బోర్డు సభ్యురాలు యూఏఈ ఎడిటర్‌ కియార సంధు సినిమా చూసి రేటింగ్‌ ఇచ్చింది. సంగీతం దర్శకత్వం, స్క్రీన్‌ప్లే ఏమాత్రం అకట్టుకునే విధంగా లేవు. అని ప్రేక్షకఁలు ఈ సినిమాకు వేల రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని చేప్పింది.




Wednesday, July 8, 2015

'బాహుబలి' టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు

 సిఁమా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్దమైయింది.నగరంలో విడుదలకు ముందే అన్ని ధియేటర్లలో టికెట్లు అమ్ముడుపోగా... రెండు రోజుల ముందుగానే ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ దాదాపు అన్ని ధియేటర్లలో అమ్ముడు పోయాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్లకు పైగా విడుదల చేయాలని నిర్ణయించారు. ' బాహుబలి' సినిమా ముందు అనుకు న్న ప్రకారం వన్‌ అండ్‌ హాఫ్‌ ఇయర్‌లోనే పూర్తి చేయాలనికు న్నారు. కానీ సమయం సరిపోలేదు. అందుకే రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇప్పటికే అభిమానులు సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. రెండు రోజుల ముందు తమన్నా ఇంటర్వూలో ' బాహుబలి' సినిమా మంచి అవకాశం లభించింది. ' బాహుబలి' తమ పాత్ర అతిలోక సుందరిలా ఉంది. దేవ కన్యగా నటిస్తుంది అని చేప్పింది. ఇక ఈసిఁమా ఫస్ట్‌కాపీ కూడా సిద్దం అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్మకృష్ణ తదితరులు నటిస్తున్నారు.






Monday, April 20, 2015

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన శ్రీజ కుటుంబం

                 తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడిన చిన్నారి శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ కలుసుకుంది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని జనసేనపార్టీ కార్యాలయంలో పవన్‌ను చిన్నారి శ్రీజ, ఆమె కుటుంబసభ్యులు కలుసుకున్నారు. మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రీజ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకానొక దశలో శ్రీజ బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు.
            ఈ క్రమంలో అభిమాన నటుడు పవన్‌ను కలవడం శ్రీజ చివరి కోరిక అని తెలుసుకున్న ‘‘మేక్‌ ఎ విష్‌’’ ఫౌండేషన్‌ కార్యకర్తలు ఆ విషయాన్ని పవన్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన పవన్‌ ఖమ్మం వెళ్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న శ్రీజను పరామర్శించారు. తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ వచ్చి పలకరించడంతో శ్రీజ ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపు నెలన్నర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుంది.
                         ఆరోగ్యం కుదుట పడిన తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని ఆనాడే శ్రీజ తల్లిదండ్రులకు పవన్‌ చెప్పారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న శ్రీజను తీసుకుని ఆమె తల్లిదండ్రులు ఈరోజు పవన్‌ను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు పవన్‌తో శ్రీజ భేటీ అయ్యారు. అభిమాన నటుడితో మాట్లాడిన తర్వాత శ్రీజ ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

Thursday, April 9, 2015

'సన్నాఫ్ సత్యమూర్తి' రివ్యూ

                    విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) సన్ ఆఫ్ సత్యమూర్తి‌గా పరిచయమవుతాడు. సత్యమూర్తి పాత్ర ను ప్రకాష్ రాజ్ పోషించారు. సత్యమూర్తి ఒక పెద్ద బిజినెస్ మాన్. అకస్మాత్తుగా సత్యమూర్తి మరణిస్తాడు. సత్యమూర్తి మరణంతో అతని కుటుంబం 300 కోట్ల అప్పులతో చాలా కష్టాలకు లోనవుతుంది. మెల్లగా అతని కుటుంబ సభ్యులు అందరు కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతారు. ఆనంద్‌కి సహాయం చేసే వారు కూడా ఉండరు. చివరకు ఆనంద్ కి కాబోయే భార్య అధ శర్మ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది.

             ల్లిని, వదిన, బ్రదర్ ను తీసుకొని చిన్నఇంటికి మారాడు. ఏదో ఓ ఉద్యోగం చేయాలి కాబట్టి శ్రియాస్ మీడియా అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో చేరి ఓ పెళ్లి చేయడానికి వెళతాడు. ఆ పెళ్లి ఎవరిదో కాదు... తనతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత కాదని వెళ్లిపోయిన పల్లవి క్యారెక్టర్ చేసిన అదాశర్మది. అక్కడే సుబ్బలక్ష్మి అలియాస్ సమీరా అనే పాత్ర పోషించిన సమంతాతో హీరో విరాజ్ ఆనంద్ అదే మన బన్నీలవ్ లో పడతాడు.
సుబ్బలక్ష్మి తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) బన్నీకి ఓ చాలెంజ్ విసురుతాడు. దేవరాజ్ (ఉపేంద్ర) దగ్గర ఉన్న తన 8000 గజాల స్థలం పేపర్స్ తీసుకొస్తే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. సరే అని హీరో తమిళనాడు వెళతాడు. దేవరాజ్ ను ఓసారి బన్నీ కాపాడుతాడు. దీంతో స్థలం పేపర్స్ ఇస్తానంటాడు... బట్..తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. వల్లికి పెళ్లి ఇష్టం లేదు. 


                 చివరికి బన్నీ ఏం చేశాడు. ఆ పెళ్లి నుంచి తప్పించుకొని స్థలం పేపర్స్ ఎలా సంపాదించాడు. తండ్రిని తూలనాడిన రాజేంద్రప్రసాద్ కు ఎలా బుద్ది చెప్పాడన్నదే మిగిలిన కథ.

                 ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్ - పాటలు - సమంతా - ఉపేంద్ర - చిన్నట్విస్ట్ - కుటుంబ సెంటిమెంట్
మైనస్ పాయింట్స్: స్టొరీ - సెకండ్ హాఫ్ - ఎడిటింగ్ - కామెడీ లేక పోవడం


 ఫైనల్ గా :
               
సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ డ్రామాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అందునా... అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోలు ఇలాంటి కథలు చేయడానికి ఒప్పుకోరు. అలాంటిది విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సత్యమూర్తిని ఓసారి చూడొచ్చు. దర్శకుడు పూర్తి న్యాయం చేయలేకపోయినా... అడ్జస్ట్ అవ్వడం మనకు అలవాటే కాబట్టే ఫ్యామిలీతో కలిసి చూసెయ్యెచ్చు.

Tuesday, April 7, 2015

ఆరంభం అదిరె ఐపీఎల్


  కళ్ల్లుమిరుమిట్లు గొలిపేలా విద్యుద్దీపకాంతులు.. వాటిని చిన్నబుచ్చుకునేలా చేస్తూ బాలీవుడ్ ముగ్ధ అనుష్క శర్మ నృత్యవిన్యాసం.. ఆపై ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్ స్టెప్పులు.. మధ్య మధ్యలో హోస్ట్ సైఫ్ అలీఖాన్ మాటల విన్యాసాలు.. ఇలా సాల్ట్‌లేక్ వేదికగా మంగళవారం సాగిన ఐపీఎల్-8 ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఐపీఎల్ ఓపెనింగ్‌షోను వరుణుడు జల్లులు కురిపించి ఆశీర్వదిస్తే, ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ల నృత్యజల్లు సాల్ట్‌లేక్ స్టేడియాన్ని తడిపి ముద్దచేసింది. బాలీవుడ్ యువహీరో షాహిద్ కపూర్ డ్యాన్స్ షో ప్రారంభోత్సవానికి నాంది వాక్యం పలికింది. అప్పటిదాకా వరుణుడి ఆటంకంతో నిరాశపడిన ప్రేక్షకులు కమీనే మూవీలో పాటపై ఎనర్జిటిక్ స్టెప్పులతో షాహిద్ బృందం చేసిన ప్రదర్శనతో ఫుల్‌జోష్‌లోకొచ్చారు. ఇక ఆ తర్వాత పొట్టి దుస్తుల్లో అనుష్క శర్మ వేసిన స్టెప్పులకైతే సాల్ట్‌లేక్ స్టేడియం ఈలల మోతతోహోరెత్తిపోయింది. ఫర్హాన్ అక్తర్ బ్యాండ్ బాజా అయితే రాక్ ఆన్ అంటూ కార్యక్రమాన్ని ఒకస్థాయికి తీసుకెళ్లింది.