Sunday, January 31, 2016

'కళావతి' మూవీ రివ్యూ


2014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి  రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ గా పేరున్న హార్రర్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్ లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టింది..?
కథ
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.

సాంకేతిక నిపుణులు
చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

ఓవరాల్ గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్ పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమా

కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేశారు


ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఉత్కంఠ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేసింది. 198 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం అయ్యాయి. హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (15 నాటౌట్‌: 12 బంతుల్లో 1×4, 1×6) వరుసగా తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక్స్‌గా బాది మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. సురేశ్‌ రైనా (49 నాటౌట్‌: 25 బంతుల్లో 6×4, 1×6) చివరి బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను విజయ సంబరాల్లో ముంచెత్తాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ (52), శిఖర్‌ ధావన్‌ (26), విరాట్‌ కోహ్లి (50) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 200/3తో లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
 వాట్సన్‌ అజేయ శతకం వృథా
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడిన అరోన్‌ ఫించ్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వాట్సన్‌ (124 నాటౌట్‌: 71 బంతుల్లో 10×4, 6×6) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (14), షాన్‌ మార్ష్‌ (9), మాక్స్‌వెల్‌ (3) తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా.. వాట్సన్‌ ఎక్కడా జోరు తగ్గించకపోగా.. మరింత దూకుడుగా ఆడాడు. షాన్‌ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జతచేసిన షేన్‌ వాట్సన్‌.. నాలుగో వికెట్‌కి ట్రావీస్‌ హెడ్‌(26)తో కలిసి 7.5 ఓవర్లలోనే ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, అశ్విన్‌, జడేజా, యువరాజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

Saturday, January 30, 2016

హిట్ వచ్చింది... పారితోషికం పెంచేసింది

 విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఫలితంగా ఈ వర్ధమాన తారకు తమిళం, తెలుగు భాషలలో విజయం వరించింది.

  తెలుగులో రామ్‌తో నటించిన నేను శైలజ చిత్రం కీర్తిసురేష్ విజయానికి పునాది వేసింది. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం దాన్ని కొనసాగించింది. దీంతో కీర్తి తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కీర్తి కొట్టి పారేస్తున్నారు. తనేమంటున్నారో చూద్దాం. నేను నటించిన తెలుగు చిత్రం నేను శైలజ తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు నా బాధ్యత పెరిగింది.

 సాధారణంగా చిత్ర జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే మా అమ్మ మేనక నటి అవడంతో నాకు మార్గదర్శిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక తమిళంలో బాబీసింహాతో నటిస్తున్న పాంబు సండై, ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసనే మరో చిత్రం చేస్తున్నారు. అదే విధంగా నేను పారితోషికం పెంచేశాననే ప్రచారంలో నిజం లేదని కీర్తిసురేష్ స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కొత్త షేర్ ఆప్షన్..!

 సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. యూజర్లకు మరో కొత్త అవకాశం కల్పిస్తోంది. వినియోగదారుల కోసం తమ ఈవెంట్స్ పేజీలో సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతోంది. అందులో చేరినవారు.. తమ రైడ్స్ (సవారీ) ను పంచుకునే వీలు కల్పిస్తోంది. రైడ్ షేరింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, ఫేస్ బుక్ కూడా తమ ఈవెంట్ పేజీలో ఈ ఆప్షన్ కు శ్రీకారం చుడుతోంది. ఈ అవకాశంతో ఒకే దారిలో వెళ్లేవారు ఫేస్ బుక్ ద్వారా క్యాబ్ రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఫేస్ బుక్ పేటెంట్ అప్లికేషన్.. తమ్ ఈవెంట్ పేజీ స్టోర్ లో మరిన్ని ఆసక్తికరమైన ప్రణాళికలు చేపట్టనున్నట్లు సూచిస్తోంది. ఈవెంట్ పేజీలోని రైడ్ షేరింగ్ సెంటర్ ను రెట్టింపు చేయనున్నట్లు చెబుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వీలుగా ఫేస్ బుక్ ఈవెంట్ పేజీలో ప్రధానంగా  'గోయింగ్' అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. దీనికి రెండు ఉప జాబితాలనూ జోడించింది. 'గోయింగ్ అండ్ డ్రైవింగ్' 'గోయింగ్ బట్ నాట్ డ్రైవింగ్'  పేరుతో ఉన్న ఈ ఆప్షన్లను వినియోగించుకొని యూజర్లు రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న మొత్తం మూడు ఆప్షన్లలో గోయింగ్, నాట్ గోయింగ్ ఆప్షన్లపై జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ ఆసక్తికి అనుగుణంగా  రైడ్స్ ను షేర్ చేసుకునేందుకు ఫేస్ బుక్ వీలుకల్పిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసిన ఈ కొత్త అవకాశాన్ని అమెరికాలో ఫేస్ బుక్ వినియోగదారులు ఇప్పటికే మెసెంజర్ ద్వారా వినియోగిస్తున్నారు. మెసెంజర్ లో ముందుగా తమ స్నేహితులతో చాట్ చేసి,  క్యాబ్ ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాన్ని వాడకంలోకి తెచ్చారు.

Thursday, January 28, 2016

ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్న మరో క్రికెటర్‌

  భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలు ఇటీవలే ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా చేరనున్నాడు. భారత క్రికెటర్లలో ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన ఇర్ఫాన్‌ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఇర్ఫాన్‌ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో ప్రస్తావించలేదు. అయితే ఈ మధ్య పెళ్లి గురించి వార్తలు వెలువడుతుండడంతో ఆఖరికి ఇర్ఫాన్‌ నోరు విప్పాడు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్న విషయం నిజమేనని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగనున్నాయని, వధువుతో పాటు ఇర్ఫాన్‌ చెల్లెలికి కూడా సూరత్‌ నుంచి ఆభరణాలు డిజైన్‌ చేయిస్తున్నట్లు ఇర్ఫాన్‌ సన్నిహితులు తెలిపారు.

Wednesday, January 27, 2016

రాత్రంతా మేల్కొని...

 ‘‘నిద్రకూ నాకూ అస్సలు పడదు.. ఒక్కరోజు కూడా నేను మనస్ఫూర్తిగా పడుకోను..’’ అంటోంది శ్రుతి హాసన్‌. మరి రాత్రిళ్లు పడుకోకుండా ఏం చేస్తుంటారు? అని అడిగితే.. ‘‘పార్టీలకు వెళ్లి.. తెల్లవారుఝామువరకూ అక్కడే గడపడం నాకు ఇష్టం ఉండదు. సెట్‌ నుంచి నేరుగా ఇంటికే వెళ్లిపోతా. రేపు షూటింగ్‌ అంటే నాకు నిద్ర పట్టదు. సన్నివేశం ఏమిటి? ఆ సన్నివేశంలో ఎవరితో నటించాలి? అనే విషయాలే ఆలోచిస్తా. ఒకటికి పది సార్లు డైలాగ్‌ పేపర్‌ చదువుతూ కూర్చుంటా. షూటింగ్‌ లేకపోయినా అంతే. సంగీత సాధనలో రాత్రంతా గడిపేస్తుంటా. కొత్త కొత్త ట్యూన్లు అప్పుడే పుడతాయి. నాకే కాదు.. ఏ సంగీత దర్శకుడైనా అంతేనేమో. రాత్రిళ్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా పని చేసుకోవాలని అనుకొనేవాళ్లకు అదే సరైన సమయం. మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకొంటా. అంతే.. మళ్లీ షూటింగ్‌కి సిద్ధమైపోతా’’ అని చెప్పుకొచ్చింది.

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

 కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్‌ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు.
             మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్‌లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది.

Tuesday, January 26, 2016

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

 ‘దేశముదురు’లో సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించేసింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి ఇది కొనసాగింపు. సిద్ధార్థ్‌, త్రిష, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘చంద్రకళ’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా. ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష, పూనమ్‌, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
 
 * నటిగా నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. 
* ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్‌ పట్టుకొని... కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన నిర్వహించాలని ఉంది. * నాకు తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ) నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని. సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్‌ అయ్యా.
నా వ్యక్తిగత విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.

తొలి టీ20లో ఆసీస్‌ను చిత్తు చేసిన ధోనీసేన


  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5),ఫాల్కనర్ (10)లు నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
 
  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.

అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Monday, January 25, 2016

అసిన్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అదుర్స్‌



 తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్‌ మైక్రోమ్యాక్స్‌ సహవ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు అక్షయ్‌కుమార్‌, సుస్మితా సేన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెంజ్‌, ఖుష్భు, రానా, వెంకటేశ్‌, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర, ప్రీతీ జింటా, మనీష్‌ పాల్‌, మాధవన్‌ తదితరులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అసిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.












 

రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు



 తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్ , తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్ , ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు.  ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు..
పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్ మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్
పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బ్రిజేందర్ సింగ్, బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్

పద్మశ్రీ: రాజమౌళి, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ

Sunday, January 24, 2016

యువీ కనీస ధర రూ. 2 కోట్లు

 గత రెండు ఐపీఎల్‌ సీజన్లలోనూ రూ.15 కోట్లకు పైగా ధర దక్కించుకుని లీగ్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్‌ సింగ్‌. నిరుడు అతణ్ని ఎంచుకున్న దిల్లీ ఈసారికి అతణ్ని వదిలేసింది. దీంతో మళ్లీ అతను వేలంలోకి రాబోతున్నాడు. ఈసారి యువీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. యువీతో పాటు కెవిన్‌ పీటర్సన్‌, షేన్‌ వాట్సన్‌, ఇషాంత్‌ శర్మ, ఆశిష్‌ నెహ్రా, దినేశ్‌ కార్తీక్‌, స్టువర్ట్‌ బిన్నీ, సంజు శాంసన్‌, ధవల్‌ కులకర్ణి, మైకేల్‌ హసిలు కూడా రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. ఫిబ్రవరి 5న వేలం నిర్వహిస్తారు.

వేలంలోకి రానున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
కనీస విలువ రూ. 2 కోట్లు: యువరాజ్ సింగ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి.
రూ. 1.5 కోట్లు: డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్.
రూ. 1 కోటి: ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌతీ.
రూ. 50 లక్షలు: మార్టిన్ గప్టిల్, జాసన్ హోల్డర్, బరీందర్ శరణ్

‘24’లో సూర్య కొత్తలుక్‌

 ‘24’ చిత్రంలో నటుడు సూర్య సరికొత్త లుక్‌ విడుదల అయ్యింది. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిలర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటి వరకు విడుదలైన సూర్య పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్‌తో ఈ సినిమాలో సూర్య నటనపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Thursday, January 21, 2016

నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!

 బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా విజృంభించాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్ అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. నటుడు అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఈ చిత్రంలో ఆదా శర్మ, అడివి శేష్ కూడా నటించారు. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

బాహుబలికి వధువు కోసం భల్లాల ప్రకటన!

 టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు 'బాహుబలి' ప్రభాస్. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని పెదనాన్న కృష్ణంరాజుకు ఈ ఛోటా రెబల్‌ స్టార్ హామీ కూడా ఇచ్చాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అన్ని విధాల తగిన వధువు కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టారు. 'బాహుబలి-2' షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రభాస్‌ పెళ్లిపీటలు ఎక్కుతాడని తెలుస్తోంది.

మరోవైపు 'భల్లాలదేవ' రాణా కూడా తనవంతుగా 'బాహుబలి'కి వధువును వెతికే పని పెట్టుకున్నాడు. ఓపక్క 'బాహుబలి' ప్రభాస్ గుణగణాలు వివరిస్తూనే.. మరోపక్క ఈ 'బాహుబలి'కి తగిన అవంతిక (అంటే వధువు) ఎలా ఉండాలో కొంత సరదాగా, కొంత వ్యంగ్యంగా వివరిస్తూ 'పెళ్లి ప్రకటన'ను ట్విట్టర్‌లో జారీ చేశాడు. ఊహించినట్టే 'బాహుబలి' వధువు కోసం భల్లాల ఇచ్చిన ఈ ప్రకటన ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. రాణా పెట్టిన ఆ ప్రకటన ఇది..


 
బహుబలి కోసం వధువు కావాలెను!

  • వరుడు 36 ఏళ్ల యుద్ధయోధుడు, సంచార తెగకు చెందిన సైనిక నాయకుడు..
  • 6.2 అడుగుల ఎత్తుతో మాంఛీ బలిష్టంగా ఉండి ఇంట్లో పనులకు బాగా ఉపయోగపడతాడు..
  • తనతో పెళ్లికి సరిపోయే అమ్మాయి కనిపిస్తే చాలు కొండలు, గుట్టలు ఎక్కుతాడు. కానీ అమ్మాయిల వెంటపడే ఆకతాయి కాదు.
  • మేకప్‌ బాగావేస్తాడు. వధువుకు కూడా బాగా మేకప్‌ చేయగలడు

ఇక వధువు విషయానికొస్తే
  • అమ్మాయి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండాలి.
  • ఎంతగా అంటే.. ఆమె కోసం అడవులు, కొండలు, కొండచరియలు సైతం గాలించగలగాలి
  • కత్తియుద్ధం, విలువిద్యతోపాటు ముఖాముఖి మల్లయుద్ధం సైతం తెలిసి ఉండాలి
  • ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తను గౌరవించేదై ఉండాలి
  • ఇంటిపనుల్లోనే కాదు సైనిక వ్యూహాల్లో, శత్రువును చిత్తుచేసే ఎత్తుల్లో కూడా భర్తకు సాయం చేయగలగాలి.

Wednesday, January 20, 2016

అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నా!

  నయనతార సినిమాల్లో తప్ప, బయట ఫంక్షన్లలోనూ ఇతర వేడుకల్లోనూ ఎక్కడా కనబడరు. ఏడాదికి మహా అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా అవార్డు ఫంక్షన్‌లోనో, ఆడియో ఫంక్షన్‌లోనో మెరుస్తారు. అంతకు మించి పబ్లిక్‌గా ఆమె దర్శనాలు ఉండవు. ఆమెకు స్నేహితులు కూడా చాలా చాలా తక్కువ. ఇంత పెద్ద సినీ ప్రపంచంలో తక్కువ మంది స్నేహితులు ఉండటమేంటి? నయనతారకు ఫ్రెండ్‌షిప్ చేయడం ఇష్టం ఉండదా?... ఈ విషయం గురించి ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ -‘‘స్నేహితులు ఉండాలని అందరికీ ఉంటుంది. స్నేహం చేయడం నాకిష్టమే. కానీ, కొంతమంది స్నేహితుల కారణంగా బాధపడ్డాను. నా ముందు ఒకలా.. నా వెనకాల మరోలా మాట్లాడేవాళ్లు. అలాంటి స్నేహితుల అవసరం లేదనిపించింది.
                      అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నాను. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నిజాయతీగా వ్యవహరిస్తాను. నాతో స్నేహం చేసేవాళ్లు కూడా అలానే ఉండాలని ఆశిస్తాను. లేకపోతే బాధపడిపోతాను. చివరకు వాళ్లతో స్నేహాన్ని వదిలేసుకుంటాను’’ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఒక విధంగా వరం.. మరో విధంగా శాపం అని కూడా నయనతార అన్నారు. ‘‘నాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండేవాళ్లు నన్ను ఇష్టపడతారు. లేనివాళ్లు తిట్టుకుంటారు. అందుకే, ముక్కుసూటితనం వరం.. శాపం.. అంటున్నా’’ అని పేర్కొన్నారామె.

ఆసీస్‌తో నాలుగో వన్డేలోనూ భారత్‌ ఓటమి

ధావన్‌, కోహ్లి శతకాలు వృథా
సిరీస్‌ 4-0తో ఆసీస్‌ ఆదిక్యం
రిచర్డ్‌సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఎంపికయ్యాడు



భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 348 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో దూ
కుడుగా ఆరంభించిన భారత్‌ 49.2 ఓవర్లలో 323 పరుగులకు అలౌట్‌ అయ్యింది. రోహిత్‌ శర్మ 25 బంతులల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు సహయంతో 41 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా కోహ్లి వచ్చాడు. దావన్‌, కోహ్లీ రెండో వికెట్లు 212 పరుగులు భాగ్యస్వామం నెలకొల్పారు. ఇద్దరు సెంచరీలతో కదం తోక్యారు. శిఖర్‌ ధావన్‌ 113 బంతులల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ 92 బంతులల్లో 11 పోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు చేశారు. వీరిద్దరు దూకుడు అడుతుంటే మ్యాచ్‌ అవలోకగా గేలుస్తుందని బావించారు. కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది. ధావన్‌ అవుట్‌ అయినా తరువాత భారత్‌ బ్యాటింగ్‌ తడబడుతు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో నిలిచింది. కెప్టెన్‌ ధోఁ (0), గురకీరత్‌ ( 5), రహనే (2), రిషి ధావన్‌ ( 9), భువనేశ్వర్‌ (2), ఉమేష్‌ యాదవ్‌ (2), ఇషాత్‌ శర్మ (0) రెండంకెల స్కోరు కూడ చేయలేక పెవిలియకు క్యూ కట్టారు. చివరిగా జడేజా (24) అజేయంగా నిలిచిన జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్‌ 5, హెస్టింగ్‌ 2, మార్ష్‌ 2, లియాన్‌ ఒక వికెటు లభించింది.
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచు
కుది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌ తొలి వికెటుకు ఏకంగా 187 పరుగుల బ్యాగస్వామం చేశారు. ఆరోన్‌ ఫించ్‌ 107 బంతులల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ 92 బంతులల్లో 12 పోర్లు, 1 సిక్స్‌తో 93 పరుగులు చేసి సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కేవలం 29 బంతులల్లో 4 పోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మిచెల్‌ మార్స్‌ (33), బెయిల్‌ (10), ఫాల్కనర్‌ (0), వెడ్‌ (0) పరుగులు చేశారు. చివరిలో మాక్స్‌వెల్‌ 20 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేశారు. బారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4, ఉమేష్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశారు.

ప్రభాస్‌ నాకు మాట ఇచ్చాడు!

 
‘‘మంచి పాత్రలిస్తే నటించడానికి ఇప్పటికీ సిద్ధమే. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘రుద్రమదేవి’లో నేను చేసిన పాత్రలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. మరీ ముఖ్యంగా రామయ్య పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ కంట కనిపెడుతున్నా. వాటిలో ‘భలే భలే మగాడివోయ్‌’ నాకు బాగా నచ్చింది. కథానాయకుడిగా ఓ స్థాయిలో ఉన్న నాని, అలాంటి పాత్ర ఎంచుకోవడమే గొప్ప విషయం. నేను హీరోగా ఫామ్‌లో ఉన్న రోజుల్లో అయితే ఆ పాత్ర చేయకపోదునేమో? కథలు, పాత్రలు సమాజంలోంచి పుట్టాలి. అప్పుడే ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతాయి’’
గర్వంగా ఉంది
‘‘బాహుబలి’తో ప్రభాస్‌ స్థాయి పెరిగింది. తెలుగు సినిమా గురించి అమెరికాలోనూ గొప్పగా చెప్పుకొంటున్నారు. ‘ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు’ అని పిలుస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ప్రభాస్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తా. గోపీకృష్ణ సంస్థలోనే ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమవుతోంది. ప్రేమకథలో ప్రభాస్‌ తరహా యాక్షన్‌ జోడిస్తున్నాం. దర్శకుడెవరనేది త్వరలో చెబుతా. అందులో నేను నటిస్తానా, లేదా అన్నది కథని బట్టి ఉంటుంది. ‘ఒక్క అడుగు’ స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. కానీ దేనికైనా సమయం రావాలి’’.
ప్రభాస్‌ పెళ్లి..
‘‘బాహుబలి’ తరవాత పెళ్లి చేసుకొంటా అన్నాడు ప్రభాస్‌. ‘బాహుబలి’ వచ్చింది, వెళ్లిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ తరవాత చేసుకొంటా అంటున్నాడు. అందుకే మొన్న సంక్రాంతికి ప్రభాస్‌ దగ్గర మాట తీసుకొన్నా. ‘తప్పకుండా 2016లోనే పెళ్లి చేసుకొంటా పెదనాన్నా’ అని ఒట్టేశాడు.
ఈ యేడాది తప్పకుండా పెళ్లి కబురు వింటారు. అయితే ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది నేను చెప్పలేను. మేమే ఓ సంబంధం చూడాలనుకొంటున్నాం. తన మనసులో ఏముందో?’’
మినీ థియేటర్లు రావాలి
‘‘చిన్న సినిమాల్ని కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించాలి. ఆ పరిజ్ఞానాన్ని మనమే దిగుమతి చేసుకోవాలి. విదేశీ నిపుణులపై ఆధారపడే పరిస్థితి రాకూడదు. వంద, నూట యాభై మంది చూసేలా మినీ థియేటర్ల నిర్మాణం జరగాలి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 14 లక్షలమందికీ ఓ థియేటర్‌ ఉంది. అందుకే ఓ బృందం ద్వారా మినీథియేటర్లపై పరిశోధన చేయిస్తున్నా. ఇక రాజకీయాల విషయానికొస్తే... ప్రస్తుతం భాజపాలోనే ఉన్నా. ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగి ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలీదు. 2019 నాటికి నాలో ఓపిక ఉండకపోవచ్చు. ఎన్నికల ప్రచారం అంటే... చాలా హంగామా ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కనీసం 400 గ్రామాలైనా పర్యటించాలి. అంతలా తిరగలేనేమో అనిపిస్తోంది’’

Tuesday, January 19, 2016

అసిన్‌ పెళ్లికూతురాయెనే..!

 తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన అందాల తార అసిన్ వివాహం మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్ లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. గత కొంతకాలంగా రాహుల్, అసిన్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం క్రైస్తవ ఆచారం ప్రకారం జరిగిన పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.                       సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న పది వరుసల ఎత్తున్న కేకును దంపతులు కట్ చేయనున్నారు. ఇక పెళ్లి విందులో పూర్తి శాఖాహార భోజనం వడ్డించనున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో జనవరి 23న ముంబైలో వీరి వివాహ రిసెప్షన్ జరుగనుంది.

Monday, January 18, 2016

టీ20 హీరోలు యూవీ = క్రిస్‌ గేల్‌ సమం

టీ20లో వేగవంతమైన అర్థశతకం రికార్డు సమం
 


క్రికెట్‌ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు నిమిషాలో, రోజుల్లోనే గడిచిపోతుంటాయి. మరికొన్ని తరాలు మారినా, ఏళ్లు, దశాబ్దాలు గడిచినా చెక్కు చెదరగకుండా చరిత్ర పుటల్లో నిలిచి ఉంటాయి. అలాంటి వాటిల్లో భారత బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ 2007లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సృష్టించి అరుదైన 12 బంతుల్లో అర్థ శతకం రికార్డు. 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఫ్లింటాప్‌ బౌలింగ్‌ సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్‌తో వాగ్వాదాఁకి దిగాడు. దీఁపై యూవీ ఘాటుగా స్పందించాడు. ఫ్లింటాప్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చాన స్టువర్డ్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచేశాడు. 12 బంతులల్లో3/4,6/6 సాయంతో 50 పరుగులు చేసి టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ రికాడ్డు సమీపంలోకి చాలా మంది క్రికెటర్లు వచ్చినా దాన్ని బద్దలు కొట్టలేకపోయారు.
వెస్టిండీస్‌ వీరుడు సమం చేశాడు...?
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ టీ20 టోర్నీలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ రికార్డును సమం చేశాడు. టోర్నీలో మెల్‌బోర్న్‌ రెఁగేడ్స్‌ తరపున బరిలోకి దిగిన క్రిస్‌గేల్‌ 12 బంతులల్లో 1/4, 7/6 సాయంతో 50 పరుగులు చేశాడు.

ఆ కుటుంబాన్ని కలవడం ఆనందం: నాగార్జున

 బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దంపతులను కలవడం ఎప్పటికీ ఆనందమేనని నాగార్జున అన్నారు. ఓ వాణిజ్య సంస్థ ప్రకటన షూటింగ్‌లో భాగంగా నటుడు ప్రభుతోపాటు అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలిసిన ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు, అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలవడం ఆల్‌వేస్‌ ప్లెజర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. గతంలో కూడా నాగార్జున బిగ్‌బి అమితాబ్‌తో కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే.

Saturday, January 16, 2016

'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ

 

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్ తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్ ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..?



కథ :
రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..?



నటీనటులు :
అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్ తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.



ఓవరాల్ గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

Thursday, January 14, 2016

డిక్టేటర్‌ : సినిమా రివ్యూ

 
సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్ తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్ గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..?
కథ :

చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్ తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు.

ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్ తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ.


నటీనటులు :
చంద్రశేఖర్ ధర్మగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్ లతో ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్ లో కూల్ గా, సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా రెండు షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి  క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్ గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు.


ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్

Wednesday, January 13, 2016

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

 టెంపర్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్ తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపించిన ఎన్టీఆర్, కథా కథనాల ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించాడు. ముఖ్యంగా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంతో నమ్మకంగా తన సినిమాను రిలీజ్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో అంటూ సక్సెస్ అయ్యాడా.. 'వన్ నేనొక్కడినే' లాంటి భారీ డిజాస్టర్ తరువాత సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ సాధించాడా..?
కథ :
అభిరామ్ (ఎన్టీఆర్) లండన్ లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్ లోనే తన ఎమోషన్ ను దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం(రాజేంద్ర ప్రసాద్)కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్న( రాజీవ్ కనకాల) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.

ఈ ఆపరేషన్ లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరామ్ ను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.


నటీనటులు :
సినిమా అంతా వన్ మేన్ షోగా నడిపించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడు. రిలీజ్ కు ముందు నుంచి చుపుతున్నట్టుగా చివరి 45 నిమిషాలు అద్భుతమైన నటనతో ఆడియన్స్ తో కంటతడి పెట్టించాడు. లుక్ విషయంలో కూడా ఎన్టీఆర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు మాస్ లుక్ లోనే కనిపించిన జూనియర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ విషయంలోనూ కొత్త దనం చూపించాడు. రకుల్ ప్రీత్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నటిగా ప్రూవ్ చేసుకునే 

ఛాన్స్ రానీ రకుల్ కు ఈ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది.

ఓవరాల్ గా నాన్నకు ప్రేమతో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఆశించే ఆడియన్స్ ను కాస్త నిరాశపరిచినా.. కొత్త కథా కథనాలను కోరుకునే వారిని మాత్రం అలరిస్తోంది. సంక్రాంతి బరిలోకి సక్సెస్ ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్

Tuesday, January 12, 2016

లుంగీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ధోనీ, ప్రభుదేవా!

 మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్‌ ఆడటంలో ఆయనది ప్రత్యేకమైన ధనాధన్‌ శైలి. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడమే కాదు.. లుంగీ కట్టుకొని ప్రభుదేవాతో పోటీపడి స్టెప్పులు కూడా వేయగలనని తాజాగా ఆయన నిరూపించాడు.
ఓ మోటార్‌ బైక్ వాణిజ్య ప్రకటన కోసం ధోనీ దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ యాడ్‌లో దక్షిణాది స్టైల్‌లో లుంగీ కట్టడే కాదు.. గ్రేట్‌ డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు వేశాడు. రజనీకాంత్‌ గౌరవార్థం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొన్‌ చేసిన 'లుంగీ' డ్యాన్స్ సూపర్‌హిట్‌. ఇప్పుడే అదే స్టైల్‌లో ధోనీ, ప్రభుదేవా లుంగీ మోకాళ్లపైకి కట్టుకొని డ్యాన్స్ చేశారు. ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు నేతృత్వం వహించిన ఈ జార్ఖండ్ డైనమేట్‌ ధోనీ.. దక్షిణాది వారికి సన్నిహితుడే. ఇప్పుడు చెన్నై జట్టు లేకపోవడంతో ధోనీ ఐపీఎల్‌లో పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ ధోనీకి దక్షిణ భారతంలోనూ భారీ అభిమానులు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుభాషలో ఈ యాడ్‌ను మోటార్‌ బైక్‌ కంపెనీ రూపొందించింది. అనుకున్నట్టుగానే అభిమానులను అలరించేలా ధోనీ, ప్రభుదేవా తమ 'లుంగీ డ్యాన్స్‌' స్టెప్పులతో దుమ్మురేపారు.

Monday, January 11, 2016

ఊరి కోసం వెబ్‌సైట్‌

గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతెచ్చిన యువకుడు

            పుట్టిన ఊరుకు ఎదో చేయాలనే తపన. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్వయం కృషితో చిన్నషాపు నడుపుకుంటూ కుటుంబా న్ని వెల్లదీస్తున్న ఓ యువకుడు. గ్రామం కోసం రూ.20 వేల వరకు ఖర్చుపెట్టి ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. అందులో గ్రామచరిత్రను పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తన సంపాద లోంచి ఖర్చు చేయడం పట్ల పలువురు అభినం దిస్తున్నారు. అతనే కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ గ్రామానికి చెందిన శ్రీను. చిన్నఘనపూర్‌ ఈ పేరు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. కొల్చారం మండలంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వందేం డ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన, జిల్లాలో ఏకైక మధ్యతరహా, సాగునీటి ప్రాజెక్టు అయిన ఘన పూర్‌ ఆనకట్ట ఈ గ్రామ పరిధిలోనే ఉండ టం విశేషం. దీనిద్వారా సాగునీటి రంగంలో గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. ప్రస్తుతం మరో ప్రత్యేకతను సంతరించుకుని ఊరి పేరు ప్రపంచ వ్యాప్తమైంది.

Sunday, January 10, 2016

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు


 సరదాగా షికారుకు వెళ్లాలంటే ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైకులోనో లేదా లగ్జరీ కారులోనో వెళ్లొచ్చు. అందులోనూ క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో. అయితే హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్ లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు. తన పిల్లలతో కలసి ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ హృతిక్ తెగ ఎంజాయ్ చేశాడు. కార్లు తప్ప ఆటో ఎక్కని హృతిక్ కొడుకులకూ ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. హృతిక్ తన కొడుకులతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో ఆటో ప్రయాణం తన పిల్లలకు కొత్త అనుభవమని హృతిక్ ట్వీట్ చేశాడు.

ప్రేమ వరకూ ఓకే... పెళ్లే కష్టం!

  సాగర తీరంలో రొమాన్స్ చేస్తున్న బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఫొటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. జాన్ అబ్రహాంతో ఈ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతన్నుంచి విడిపోయారు బిపాసా. జాన్‌తో అంత కాకపోయినా ఆ తర్వాత హర్మాన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి, విడిపోయారు.
సో.. బిపాసా ఈ  హిస్టరీని రిపీట్ చేస్తారా? లేక ఈసారైనా తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళతారా? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పరిశ్రమ అంతా వీరిద్దరి బంధం గురించి కోడై కూస్తుంటే... ఇక సన్నిహితులు చూస్తూ ఊరుకుంటారా? అసలు విషయం తేల్చేశారట. క రణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. కానీ, భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్నారు.
చట్టప్రకారం మొదటి భార్య నుంచి విడాకులు పొందకుండా రెండో పెళ్లి చేసుకునే వీలు లేదు. అందుకని, ఇప్పటికి బిపాసా, కరణ్‌ల బంధం ప్రేమ వరకూ ఓకే కానీ.. అది పెళ్లి దాకా వెళ్లడం కష్టం అని తెలుస్తోంది. మరి.. జెన్నిఫర్ నుంచి కరణ్ విడాకులు తీసుకుంటారా? లేక కాపురాన్ని నిలబెట్టు కుంటారా?... రెండోది జరిగితే బిపాసా హిస్టరీ రిపీటే.

Thursday, January 7, 2016

ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం

 ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు.

  కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.


బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధ ...


 ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ స్థానాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీప్లేస్ చేయబోతున్నారు. పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమం 'అద్భుత భారత్(ఇన్‌క్రెడిబుల్ ఇండియా)' బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది. త్వరలో అమితాబ్ నియామకంపై ప్రకటన వెలువడనుంది.
  కాగా ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై  చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో  ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్   నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు పేర్కొన్నాడు.

Wednesday, January 6, 2016

తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!

 ‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.  ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్.  తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.  అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!

ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను అదే చేస్తా

 సినీతారలకు సాధారణంగానే  ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్ లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్‌లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్  అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు.
                 అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన ‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో  కాస్త  ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి  టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్ పాటలు వింటూ రిలాక్స్ అవుతా.  చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.

Tuesday, January 5, 2016

షూటింగ్‌లో యవ హీరోకు గాయాలు

 నటుడు శాంతనుకు షూటింగ్‌లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2  చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.

ఈ నెల 9న కృష్ణాష్టమి ఆడియో


సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణాష్టమి చిత్రం ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్‌ సంగీతం సమకూర్చారు. త్వరలో కృష్ణాష్టమి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sunday, January 3, 2016

మంచి నటి అన్న పేరు చాలు!

 మంచి నటి అన్న పేరు తనకు చాలు అంటోంది నట హన్సిక. ఇప్పటికే దర్శకుల నటి అన్న పేరును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను ఈ ఏడాది కొనసాగించుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని గురించి హన్సిక మాట్లాడుతూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని అంది.
   తాను నటించిన ఆంబళ, రోమియో జూలియట్,వాలు, పులి చిత్రాలు విడుదలయ్యాయని అంది. ఇక ఈ ఏడాది అరణ్మణై-2, ఉయిరే ఉయిరే, పోకిరిరాజా చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. అరణ్మణై-2 చిత్రం హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అని చెప్పింది. పోకిరిరాజా కథ పూర్తిగా తన పాత్ర చుట్టూ తిరుగుతుందని అంది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.
  ఇప్పుడు కొత్త వారు చాలా మంది వస్తున్నారని, వారి వారి ప్రతిభ,అదృ ష్టాన్ని బట్టి స్థానాన్ని దక్కించుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే తానేవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది. హీరోయిన్‌గా నంబర్‌ఒన్ స్థానంలో ఉన్నారా? అని అడుగుతున్నారని, అసలు తనకు నంబర్‌ఒన్ స్థానం మీదే నమ్మకం లేదని అంది. హన్సిక ఇచ్చిన పాత్రకు అంకితభావంతో నటించి న్యాయం చేస్తుందనే పేరు చాలు అని అంది. ఈమె నటించిన అరణ్మణై-2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో త్రిష కూడా నటించిందన్నది గమనార్హం.

Saturday, January 2, 2016

'కిల్లింగ్ వీరప్పన్' మూవీ రివ్యూ

 టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈసారి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ తో తెరకెక్కించిన సినిమా కిల్లింగ్ వీరప్పన్. చాలారోజులుగా క్వాలిటీ సినిమాలు చేయట్లేదన్న అపవాదు మూట కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? అనుకొని పరిస్థితుల్లో తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న వీరప్పన్ ను తెలుగు ఆడియన్స్ చూడాలంటే మాత్రం వర్మ మరో డేట్ చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే......