Saturday, April 16, 2016

ధైర్యముంటే చాలు!

  సినిమాలో సాధించడానికి నటీమణుల కు ధైర్యం చాలా అవసరం అంటున్నారు నటి తమన్నా. ఏమిటీ చాలా మంది శ్రమ, కృషి, ప్రతిభ అన్నింటికీ మించి అదృష్టం ఉండాలంటుంటారు. అలాంటిది ఈ మిల్కీబ్యూటీ ైధైర్యం కావాలంటున్నారేమిటనుకుంటున్నారా? అదేమిటో తమన్నా మాటల్లోనే చూద్దాం. నేను చిత్ర రంగప్రవేశం చేసి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ తమిళం, తెలుగు,హిందీ భాషల్లో ప్రము ఖ నాయకిగానే వెలుగొందుతున్నాను. ఇన్నేళ్లలో సినిమా నాకు చాలానే నేర్పించింది. కొత్తలో నటినవ్వాలన్న ఆసక్తి మినహా వేరేమీ తెలియదు. నేను ఉత్తరాది సంస్కృతిలో పెరిగిన యువతిని. అలాంటిది దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక్కడ భాష తెలియదు. సంస్కృతి, సంప్రదాయాలు అస్సలు తెలియవు.
అయినా ఇక్కడి చిత్రాల్లో నటించడం మొదలెట్టాను. ఎలాంటి భయానికి గురి కాలేదు. ధైర్యం మాత్రమే నాలో ఉంది. అదే నన్ను ఉన్నత స్థాయికి చేర్చింది. తెలి యని భాష అని అప్పుడు భయపడి ఉంటే నటిగా ఇంత గుర్తింపు తెచ్చుకునే దానిని కాదు. అందుకే అంటున్నా నటీమణులు సాధించాలంటే చాలా ధైర్యం అవసరం. సినిమా జయాపజయాల గురించి నేను చింతించను. కఠనంగా శ్రమిస్తాను. చిత్ర జయాపజయాలన్నవి ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది.
నా వరకు నేను నటిగా చాలా సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నాను. అనుభవా లు చాలా పాఠాలు నేర్పాయి. అవే ఇప్పుడు జీవితాన్ని ఎలా మలచుకోవాల న్న పరిణితిని కలిగించాయి. అంటున్న తమన్నా ప్రస్తుతం తమిళం,తెలుగు,హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌సేతుపతికి జం టగా ధర్మదురై చిత్రంలోనూ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న బ్ర హ్మాండ చిత్రం బాహుబలి-2 చిత్రంతో పాటు హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ధోనీ భార్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో

 భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజీ బిజీ గా  ఉన్నా,  ఆయన భార్య  సాక్షి సింగ్ మాత్రం మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ పాపాయిని  అల్లారుముద్దుగా పెంచుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ లో ఆమె పలుసార్లు స్పందించారు కూడా.  ఇపుడు తాజాగా  మరో ఆసక్తికరమైన ఫోటోను  షేర్ చేశారు.    రైజింగ్ గుజరాత్ లయన్స్ పై  ధోనీ సారధ్యంలోని పూనే సూపర్ గెయింట్స్  ఓడిపోవడం,  రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీ రాజీనామా  లాంటి అంశాలతో ఒత్తిడిలో ఉన్న   ధోనీ  తన  ముద్దుల  కుమార్త జియా తో సేద తీరుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  మై  లైఫ్  కాప్షన్ తో  ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ పోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

కాగా  భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రియల్ ఎస్టేట్‌ సంస్థ అమ్రపాలి అంబాసిడర్‌ పదవికి  గుడ్‌బై చెప్పడం పలువురి ప్రశంసలకు నోచుకుంది.నోయిడాలోని సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్న సంగతి తెలిసిందే.

'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా'

 బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఓ సినిమాలో నటించినందుకు ఎంత డబ్బు తీసుకుంటాడు? ఆయన పారితోషకం 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే సినిమాల్లో నటించినందుకు తానెప్పుడూ డబ్బులు తీసుకోలేదని షారుక్ చెబుతున్నాడు. బాక్సాఫీసు వద్ద తన సినిమాలు హిట్ అయితే నిర్మాతలు ఇష్టపూర్వకంగా ఇచ్చింది తీసుకుంటానని చెప్పాడు.
'నా సినిమాలు హిట్ అయితేనే నాకు డబ్బులు ఇవ్వమని నిర్మాతలకు చెబుతా. అదికూడా వాళ్లు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే మొత్తం తీసుకుంటా. డబ్బుల కోసం డిమాండ్ చేయను. ఎండార్స్ మెంట్లు, ఈవెంట్లు, లైవ్ షోలలో పాల్గొన్నందుకు మాత్రమే ఫీజు తీసుకుంటాను. సినిమాల్లో నటించడాన్ని వ్యాపారంగా భావించను. నేను సినిమాల్లో నటిస్తూ ఉండాలి. వీలైనంతవరకు ఎక్కువ మంది నా సినిమాలు చూడాలన్నదే నా ఆశ' అని షారుక్ అన్నాడు. షారుక్ తాజా చిత్రం ఫ్యాన్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.