Thursday, October 20, 2011

సిరీస్‌ భారత్‌ వశం : క్లీన్‌స్వీప్‌ కోసం భారత్‌ ఎదురుచూపు ...

 భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడోవ వన్డేలో భారత్‌ 49.2 బంతులలో 300 పరుగులు చేసి విజయం సాధించింది. ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ 3-0 తేడాతో ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనరు కుక్‌ 3 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌గా వచ్చిన ట్రాట్‌ 116 బంతులల్లో ఎనిమది పోర్లు సహయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు చివరికి రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. పీటర్సన్‌ 64, పటేల్‌ 70, బోపరా 24 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో ప్రవీణ్‌ కుమార్‌, వినరుకుమార్‌ , కోహ్లీ , జడేజా చెరో వికెటు తీసుకున్నారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇంకా నాలుగు బంతులు మిగిలి వుండగానే విజయం లక్ష్యం సాధించింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు అందరు కలిసి కట్టుగా అడి విజయం సాధించారు. పటేల్‌ 38, రెహ్మన్‌ 91, గంభీర్‌ 58, కోహ్లీ 35, రైనా 0 పరుగులు చేశారు. ధోని 35, జడేజా 26 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు.

Tuesday, October 11, 2011

హీరో రామ్‌ చరణ్‌ స్పల్పగాయాలు

 రచ్చ సినిమా షూటింగ్‌లో రాంచరణ్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు..................... గోవాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కారులో వేగంగా వెళుతూ రైలును ఓవర్‌టేక్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు యూనిట్ వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు వేగంగా వెళుతూ రైలు పట్టాలకు తగులుకోవడంతో రాంచరణ్ ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతోనే రాంచరణ్ బయటపడ్డారు.

Monday, October 10, 2011

క్రికెట్‌లో కొత్త నిబంధనలు

ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. రానున్న ఇండియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఈ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. ఈ నెల 14 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే ప్రారంభమవుతుంది. క్రికెట్‌కు ఒ కొత్త లుక్‌ తీసుకురావడానికి ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. ఐసీసీ క్రికెట్‌ కమిటీ సూచించిన ప్రతిపాదలను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోందించింది. దీని ప్రకారం వన్డేలతో పాటు అన్ని ఫార్మాట్‌లలోనూ కొన్ని కీలక మార్పులు రానున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగి మ్యాచ్‌లో అన్ని నిబందంనలు జరుగుతాయి. ఐసీసీ కొత్త నిబంధనలు ప్రకారం వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బంతి వాడాలన్నది ఇందులో ముఖ్యమైనది. ఒక పవర్‌ ప్లేలలోనూ కీలక మార్పులు తెచ్చారు. గతంలోలాగే 20 పవర్‌ ప్లే ఓవర్లలో తొలి 10 ఓవర్లు తప్పనిసరి. అయితే మిగతి 2 పవర్‌ప్లేలను మాత్రం 16 నుంచి 40 ఓవర్ల మధ్య వాడాలని నిబంధన విధించారు. ఇప్పటి నుంచి ఏ ఫార్మాట్లోనైనా రన్నర్‌ను అనుమతించరు. ఇక ఫీల్డర్‌ను బ్యాట్స్‌మెన్‌ కావాలనే అడ్డుకుంటే ఔట్‌గా ప్రకటించే అవకాశం అంపైర్‌లకు వుంటుంది. మిగిత నిబంధనలు సంగతి ఎలా వున్నా వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బాల్‌ వాడటం, పవర్‌ప్లేలో మార్పులు 50 ఓవర్ల ఫార్మెట్‌కు కొత్త లుక్‌ను తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 16 నుంచి 40 ఓవర్ల మధ్య రెండు పవర్‌ప్లేలను వాడలనే నిబంధనలతో ఇక నుంచి మధ్య ఓవర్లలో మ్యాచ్‌ బోర్‌ కొట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ సీరిస్‌తోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానుండడంతో మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా నడుస్తాయని అభిప్రాయం.

Monday, October 3, 2011

కెమెరా ముందుకు ' రజనీ '

 అనారోగ్యంతో కొంతకాలంగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారు. బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌ చిత్రం రాావన్‌లో రోబో పాత్రను పోషిస్తున్నారు. గతంలో తన చిత్రం రోబోలో ఆయన చిట్టిగా నటించిన విషయం తెలిసిందే. రజనీ ఆరోగ్యం కుదుట పడడంతో షూటింగ్‌లో పాల్గోనేందుకు ఓకే చెప్పారు. ఆయన నటించాల్సిన సన్నివేశాలను డూప్‌తో షూట్‌ చేసి రజనీకి పంపించారు.

Thursday, September 29, 2011

అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ ఫోటో గ్యాలరీ


అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ మృతి చెందాడు.అజ్మలుద్దీన్‌ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి తరలించారు. మృతదేహాం ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు. ఈనెల 11న పుప్పాలగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయాజ్‌తోపాటు గాయపడిన అజ్మల్‌ ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమే మరణించాడు. డాక్టర్లు ఆయనకు ఆరు రోజులపాటు కాపాడడానికి సకల ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అజ్మల్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
 

Friday, September 23, 2011

ఇంటివాడవుతున్న గంభీర్‌

 భారత జుట్టు ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తర్వలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఢిల్లీ 29 ఏళ్ల గంభీర్‌ నగరానికి చెందిన వ్యాపారవేత్త కుమారై నటాషా జైన్‌ వివాహం చేసుకోనున్నాడు. అక్టోబరు నెలాఖరుకు లేదా నవంబరు మొదటి వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.