Saturday, November 6, 2010
భారత్కు కివీస్ చెక్
uó²sÁÔYÔà ÈsÁT>·TÔáTq• yîTT<Š{ì fÉdŸT¼ eÖ«#YýË eTÖ&à sÃE qÖ«›ý²+&Ž €³eTTÐd dŸeTjáÖ“¿ì ×<ŠT $¿³T¢ ¿ÃýËÎsTT 331/5 |ŸsÁT>·T\T #ûd¾+~. ÂsÕ&ƒsY 104 , $*jáTyŽTdŸHŽ 87, yîT¿ù¿£\¢yŽT 65, fñ\sY 56 |ŸsÁT>·T\T #ûXæsÁT. uó²sÁÔY u…*+>´ýË zC² Âs+&ƒT $¿³T¢ rdŸTÅ£”H•&ƒT. ÈVÓ²sY U²HŽ, çoXæ+ÔY, VŸ²sÁÒÈHŽ d¾+>´ #îsà $¿³T rdŸTÅ£”H•sÁT. uó²sÁÔY ©&+>´ 156 |ŸsÁT>·T\T.
Thursday, November 4, 2010
పరుగుల విందు
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాట్ పదునును న్యూజిలాండ్ బౌలర్లకు మరోసారి రుచి చూపించాడు. వరుస వైఫల్యాలతో నిరుత్సాహపరుస్తున్న రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఫామ్లోకి వచ్చి మొటేరా మైదానంలో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. వీరిద్దరూ విజృంభించి ఆడి సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్తో గురువారం నాడిక్కడ ప్రారంభమైన తొలి క్రికెట్ టెస్టులో భారత్ మొదటి రోజు మూడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ 173 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ద్రావిడ్104 పరుగులకు అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 237 పరుగులు జోడించి రికార్డు నెల కొల్పారు. వరుసగా తొమ్మిది టెస్టుల్లో టాస్ కోల్పో యిన ధోనీ ఈ టెస్టులో టాస్ గెలవడం తరువాయి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లకు భారంగా పరిణ మించిన పిచ్పై భారత్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు.
తొలి వికెట్కు గంభీర్, సెహ్వాగ్ 12 ఓవర్లలోనే 60 పరుగులు చేసి శుభారంభం అందించారు. గంభీర్ అవుటైన తరువాత వచ్చిన ద్రావిడ్ ఆరంభంలో కొంత నిదానంగా ఆడినప్పటికీ తరువాత పుంజు కున్నాడు.సెహ్వాగ్తో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. సునీల్ గవాస్కర్, సురీందర్ అమర్నాథ్ 1976లో ఆక్లండ్లో 204 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును సెహ్వాగ్, ద్రావిడ్ జోడీ చెరిపేసింది. మొదటి రోజు ఆట టీ విరామం తరువాత భారత్ ఈ రెండు వికెట్లను కోల్పోయింది.సెహ్వాగ్కు టెస్టుల్లో ఇది 22వ సెంచరీ కాగా ద్రావిడ్కు 30వది.
Wednesday, November 3, 2010
సినిమా ఉసురు తీస్తున్నఫైరసి
కొన్ని వందల కోట్లు కర్చుపెట్టి, ప్రపంచంలోని వివిద దేశాలు తిరిగి సుందర ప్రదేశాలను అద్భుతంగా చూపించి, ఎండనక వాననక నిద్రాహారాలు మాని ఎంతో శ్రమించి నిర్మించిన సినిమా నేడు విడుదలైన రోజే ఇంటర్నెట్టులో ప్రత్యక్షమౌతోంది. దీంతో కోట్లు కర్చుపెట్టిన నిర్మాత కుదేలవుతున్నాడు. భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఏ నయాపైసా కర్చు లేకుండా ఇంటర్నెట్టుల్లో చూస్తూ దానికి తాము ఎంతో పొడిచినట్టు రాసే రివ్యూలు అబ్బో చేసే యాక్షన్లు అంతా ఇంతా కాదు. మరి సినిమా తీసిన వారిని విమర్శించే ముందు మనం వారు చేసిన దాంట్లో చిటికెన వేలంత అయినా చేయగలమా అని మనస్ఫూర్తిగా ఆలోచించే ధైర్యం చేస్తే మళ్లీ ఇలాంటి రివ్యూలు, ఎవరు రాయరు రాయలేరు. వీరు చేసే వెకిలి పని, వికారపు పని ఒక్క నిర్మాతనే కాదు అందులో పనిచేసే లైట్ బాయ్ దగ్గర నుంచి వేల మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల, మరియు వందల మంది సిబ్బంది జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఇంకా అర్థం అయినా కానట్టు నాదేం పోతుందిలే అని ఈ ఇంటర్నెట్ సినిమాయలో పడి చాలా మంది థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోకూర్చుని దర్జాగా సినిమాని చూస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు.
కాని ఎంతో కళాత్మకంగా అందిచిన ఆ సంగీతం 70 ఎంఎం థియేటర్లో వినిపిచినంత మధురంగా ఆ డొక్కు కంప్యూటర్లో వినిపిస్తుందా. వందల మందితో కలిసి చూసేటప్పుడు కలిగే ఆ థ్రిల్లింగ్, ఈ నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కూర్చుని చూస్తే వస్తుందా..? ఆ గ్రాఫిక్స్ మాయ కళ్ల నిండా వెలిగి గుండె నిండా వెదజల్లుతూ... థియేటర్ తెర మన మనసులో చేసే సందడి ఈ 28 ఇంచిల కంప్యూటర్ కలిగిస్తుందా...? అయినా ఒకే సారి రాకుండా ఆగుతూ ఆగుతూ వచ్చే తొస్సు మాటలలా వచ్చే డైలగాలు.... ఒక్కక్కొక్కరిని కాదు షేర్ఖాన్ వందమందిని ఒకే సారి పంపించు అనే గాంభీర్యం గానీ..... వదల బొమాలి వదలా.......అనగానే మనసులో కలిగే ఓ భయంలాంటి ఆనందంగానీ.... ఆ వినీ పిచని స్ట్రక్ అవుతూ వచ్చే మాటలలో ఉంటుందా....? అంటే ఒక్క పర్సెంట్ కూడా ఉండదు కానీ వాటినే చూడటం వాటికోసం వెంపర్లాడటం తర్వాత ఏం బాగోలేదనో.. లేక ఆవరేజ్ అనో సైట్లలో రాసి పెడితే.. అది సదివిన వెర్రి ప్రేక్షకుడు సినిమాహాలుకు వెళ్లకుండా సినిమా బాగోలేదని కూర్చోవడం ఇదంతా సినిమా ఇండిస్టీ పతనానికి దారి తప్ప ఇంకోటి కాదు. ఇలా కంప్యూటర్ల మానిటర్లపై సినిమా చూడటం ఆరంభిస్తే ముందుముందు కాలంలో భారీ బడ్జెట్తో మగధీరా, రోబో లాంటి విన్యాసాలు, చూపేందుకు నిర్మాతలు ముందుకు రారు అలాంటప్పుడు, తెలుగు సినీ ఇండిస్టీ, లేదా మరే సినీ ఇండిస్టీ అయినా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రివ్యూలు చదివో, ఇంటర్నెట్లోకి సినిమాలు అప్లోడ్ చేసి, లేక వాటిని చూస్తూ ఆనందింస్తున్న వాళ్లు కనీస మానవతావాద దృక్ఫథంతో ఆలోచించి మనం చూస్తుంది, ఇంటర్నెట్ సినిమా కాదు వందల మంది నెత్తుటి బొట్టును చెమటచుక్కగా కరిగించి సినిమా తీసిన వారి నోటికాడి ముద్దని లాగేస్తున్నమని మర్చిపోవద్దు. సినిమానే జీవనాదారంగా బ్రతుకుతున్న జీవితాలతో ఆడుకుంటున్నామనే సంగతి కొద్దిగా ఆలోచించాలని ఆశిస్తూ ,,,,,,!
శ్రీలంక అద్భుత విజయం
1983 ప్రపంచకప్లో కపిల్దేవ్, సయ్యద్ కిర్మాణీ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసారు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధసెంచరీని మలింగ నమోదు చేసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాథ్యూస్ 77 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆసీస్ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 44.2 ఓవర్లలోనే సాధించింది. అంతకుముందు పెరీరా 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ హాడిన్ 49, మైక్ హస్సే 71, మార్ష్ 31 పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో కెప్టెన్ సంగక్కర 49 పరుగులు చేసాడు. మలింగ 48 బంతుల్లో 56 పరుగులు చేసి రనౌటయ్యాడు. తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఆసీస్ బౌలర్ దోహర్తీ 46 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
Sunday, October 24, 2010
గోవా వన్డే రద్దు
అనుకున్న దంతా అయింది. వర్షం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం నాడిక్కడ జరగాల్సిన మూడవ, చివరి వన్డేను బలి తీసుకుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కార ణంగా నెహ్రూ స్టేడియం మైదానం తడిసి ముద్దవడంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు బిల్లీ బౌడెన్, అమిష్ సహేబా నిర్ణయించారు. మధ్యాహ్నం 12.15 నిమి షాలకు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు ఒంటి గంటకు ఈ నిర్ణయానికి వచ్చారు. గోవా వన్డే మ్యాచ్ రద్దు కావడంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్తోపాటు వన్డే సిరీస్ను కూడా కోల్పోయిన ఆసీస్ భారత్లో ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించకుండా రిక్తహస్తాలతో స్వదేశం తిరిగి ప్రయాణమైంది.
Wednesday, October 13, 2010
రెండవ టెస్టులో భారత్ ఘనవిజయం : సిరీస్ కైవశం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెంటు టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆసిస్ 21 పరుగులు చేసి ఆలౌటయింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. పుజారా 72, సచిన్ 53, విజయ్ 37, డ్రావిడ్ 21 సెహ్వాగ్ 7 పరుగులు చేశారు. చిన్నస్వామీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్కిది తొలి విజయం. ఈ విజయంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను భారత్ 15వ సారి ఓడించింది.
Tuesday, October 12, 2010
బెంగళూరు టెస్ట్లో సచిన్ డబుల్ సెంచరీ
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్లో భారత్ మాస్టర్స్ బ్యాట్స్మేన్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కలుపుకొని సచిన్ తన కేరీర్'లో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది చేసిన రెండవ డబుల్ సెంచరీ ఇది. ఆస్ట్రేలియాపై రెండవ డబుల్ సెంచరీ.
Subscribe to:
Posts (Atom)






మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిళ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కైవసం చేసుకున్నారు.