Friday, April 15, 2011

సచిన్‌ ' హిట్‌ ' ముంబయి ' ఫట్‌ '


ఐపీఎల్‌-4లో మ్యాచ్‌లో ముంబయి,కోచిల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొచ్చి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి కొచ్చి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి జాకబ్‌,సచిన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ ప్రారంభించారు. జాకబ్‌ 12 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రాయుడు. వచ్చి రావడంతో చిచ్చర పిడుగులగా సిక్స్‌ల మోత మోగించాడు. ఇద్దరు ఒక్కరి మిచ్చి ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. సచిన్‌ 66 బంతులలో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహయంతో 100 పరుగులు చేశారు. ఐపీఎల్‌-4లో ఇది రెండో సెంచరీ. రాయుడు కేవలం 33 బంతులలో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. రాయుడు చివరిలో రెండు పరుగులు కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో 182 పరుగుల చేసింది. లక్ష్యం చాలా పెద్దది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించారు. మెక్‌కల్లమ్‌, జయవర్థన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ వచ్చారు. మొదటి నుంచి పరుగులు రాబటడం ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 128 పరుగుల బాగ్యస్వామం వహించారు. మెక్‌కల్లమ్‌ 81, జయవర్థన్‌ 56 పరుగులు చేశారు. చివరిలో జడేజా 11 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 25 పరుగులు చేశాడు.

తీన్‌మార్‌ రివ్యూ

 ' తీన్‌మార్‌ ' మూడు రకాలు సినిమా వినోదం
తీన్‌మార్‌ సినిమాలో మూడు రకాలుగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాల పవన్‌కళ్యాణ్‌ రెండు విధాలుగా తెరపై కనిపిస్తాడు.మొదటిగా పవన్‌ కళ్యాణ్‌ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో ఛెప్‌ గా పని చేస్తుంటాడు. అల్లరి చిల్లరిగా వుంటూ అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటాడు. రెండోవాడిగా వారణాసిలో వుంటూ అందరికి సహాయపడుతుంటాడు. అక్కడ వసుమతి ( కృతి కర్బందా ) ప్రేమలో పడతాడు. త్రిష మొదటి పరియం అయిన తరువాత మూడు రోజులకే ( లీపూ టూ లీపూ ) పెడతాడు. అలా వాళ్ల ఇద్దరి మధ్య స్నేహం కోనసాగుతుంది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. అని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటాడు. అతలోనే త్రిషకు ఇండియాకు వెళ్ళడానికి సిద్దం అవుతుంది. అవిషయంపై పవన్‌కళ్యాణ్‌ చర్చింతుంది. అప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరోకటి లేదు అని తేలికగా తీసుకుంటాడు. వీరిద్దరు విడిపోవటం చూసిన ఒక రెస్టారెంట్‌ యజమాని- పేరు సేనాపతి ( పరేష్‌ రావెల్‌ ) సేనాపతి మైక్‌ ఒక కథ చెప్తాడు. అందులో అర్జున్‌ పాల్వారు, వసుమతి ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ చెప్తాడు. ఈ కథలో నాటి తరానికి నేటి తరానికి వున్న వ్యత్యాసాన్ని చూపిస్తారు. పవన్‌ కళ్యాణ్‌ అర్జున్‌ పాత్రలో పోషణలో మంచిమార్కులు కొట్టేస్తాడు. ఇంకా మైక్‌ పాత్రతో ఇప్పటికే ఎన్నో సినిమాలో చూసిన పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ చూపించాడు. అదే అల్లరిగా చిల్లరిగా తిరుగుతు అమ్మాయితో ఫబ్ల్‌లో డ్యాన్‌ చేయడం ఇలా చేస్తుంటాడు. త్రిష ఇండియాకు వెళ్లిపోయిన తరువాత పవన్‌కళ్యాణ్‌కు మరో అమ్మాయితో కలసి తిరుగుతుంటాడు. అప్పుడు అమ్మాయితో కలసి ఇండియాకు వెళ్లడానికి సిద్దం అవుతాడు. దానికి హోటల్‌ యజమాని మరి అప్పుడు కలగని ఫీలింగ్‌ ఇప్పడు ఎందుకు కలిగింది అని హోటల్‌ యజమాని అడుగుతాడు. తెలియదు అని సమాధానం చెప్తాతాడు. ఇండియా వెళ్లిన తరువాత త్రిషతో కలసి బయటికి వెళ్లుతాడు. కాని అప్పుడు కూడా అదే స్నేహం కొనసాగుతుంది. త్రిషకి అప్పటికే సోన్‌సూద్‌తో పరిచయం అవుతుంది. ఒక్కసారిగా త్రిష పెళ్లి విషయం పవన్‌కళ్యాణ్‌ చెప్పుతుంది. ఓకే త్యాన్‌ క్యూ అని సమాధానం చెప్పుతాడు. పెళ్లి రోజు ఇద్దరు కలసి మాట్లాడుతారు. అప్పుడు అతనిలో స్నేహం కనిపిచందు. ప్రేమ అని అర్థం అవుతుంది. సోన్‌సూద్‌తో త్రిష్‌ పెళ్లి జరుగుతుంది. అదే రోజు పవన్‌కళ్యాణ్‌కు జాబ్‌ వస్తుంది. జాబ్‌లో మంచి పేరు సంపాదింస్తాడు. ఒక రోజు పవన్‌కళ్యాణ్‌ రోడ్డుపై అమ్మాయిని రౌడిలు తీసుకు వెళ్తుతుంటే వారితో ఫైట్‌ చేసి రక్షిస్తాడు. అప్పుడు అతనికి జాబ్‌లో పెద్ద నష్టం వస్తుంది. కానీ అతక ముందే అమ్మాయిని రక్షించిన వాళ్ల బారుప్రెండ్‌ పెద్ద మొత్తంలో డాల్లర్లతో సహయం చేస్తాడు. అప్పుడే జాబ్‌కు రాజీనామ చేస్తాడు. పవన్‌కళ్యాణ్‌కు అప్పుడు అర్థం అవుతుంది. త్రిష కావాలని కోరుకుంటాడు. అప్పటికే త్రిషకు పెళ్లి కూడా అయిపోతుంది. త్రిష పెళ్లి చేసుకున్న తరువాత మరుసటి రోజు సోన్‌సూద్‌తో వీడాకులకు సిద్దం అవుతుంది. అతను ఎప్పటికైనా వస్తాడు అని త్రిష అనుకుంటుంది. చివరికి వీళ్ల ఇద్దరు ఒక్కటవుతారు. సినిమాలో పాటలు చాలా వరకు బాగున్నాయి.

Thursday, April 14, 2011

హైదరాబాద్‌ తొలి విజయం

ఐపీఎల్‌-4లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తొలి విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఈ రోజు తొలి విజయం సాధించింది. గురువారం నాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, డెక్కన్‌ ఛార్జర్స్‌ల మధ్య జరిగినా మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన బెంగుళూరు జట్టు డెక్కన్‌ ఛార్జర్స్‌కు బ్యాటింగ్‌ ఆహ్వానించింది. డెక్కన్‌ ఛార్జర్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చిప్లి అర్థసెంచరీ చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు కేవలం 142 పరుగులు చేసింది. కోహ్లీ 71 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు.

సినీనటుడు అంకుశం రామిరెడ్డి కన్నుమూత

 ప్రముఖ నటుడు రామిరెడ్డి (58) మరణించారు. గురువారం ఉదయం 10.30 సమయంలో కిమ్స్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 'అంకుశం' సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన రామిరెడ్డి విలన్‌ అనే పదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. 'అంకుశం' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన రోల్‌ బాగా పాపులర్‌ అవటంతో అనేక అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 250 సినిమాల్లోనూ, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహంలో రామిరెడ్డి భౌతికకాయాన్ని పలువురు సినీప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. కోడిరామకృష్ణ, జీవితా రాజశేఖర్‌, సాయికుమార్‌, కాదంబరి కిరణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రామిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, సంతాపం వ్యక్తం చేశారు.

Wednesday, April 13, 2011

తీన్‌మార్‌ నేడే విడుదల

 తీన్‌మార్‌ సినిమా నేడు విడుదల. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధికంగా 1150 ధియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ఖుషీ అంతగా సూపర్‌ హిట్‌ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నటీనటులు పవన్‌కళ్యాణ్‌, త్రిష, కృతి కర్బంద, పరేష్‌ రావల్‌, సోనూసూద్‌, ముఖేష్‌ రుషి, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో పాటలు ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది వచ్చింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది అని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం

 ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 361 పరుగులు చేసింది. ఓపెనరు వాట్సన్‌, రిక్‌పాటింగ్‌ వచ్చారు. వాట్సన్‌ 40 బంతులలో 72 పరుగులు చేశారు. పాటింగ్‌ మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అతను కూడా మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. స్మిత్‌ 5 పరుగులు చేశాడు. హుస్సీ 91 బంతులలో 108 పరుగులు చేశాడు. జాన్నస్‌ 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ 362 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనరు తమిమ్‌ ఇక్‌బాల్‌ 17 బంతులలో 32 పరుగులు చేశాడు. మరో ఓపెనరు క్యాయుస్స్‌ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. (93) నఫీస్‌ 60, మహ్మదుల్లా 68, పరుగులు చేశారు. మిగిలినా బ్యాట్స్‌మైన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అయ్యాడు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ హుస్సీ, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వాట్సన్‌.

100 శాతం ప్రేమగీతాలు


నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్‌గా అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం '100% లవ్‌'. చిత్ర గీతాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున ఆడియోను విడుదలచేసి హీరో రామ్‌, నిర్మాత బన్నీవాసుకు అందజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బన్నీ మాట్లాడుతుంటే నా అభిమానులు చప్పట్లు కొడుతున్నారు. నా ఫ్యాన్స్‌ ఎలా ఉంటారో చూపించారు. నాగ చైతన్య గీతా ఆర్ట్స్‌లో చేయటం, దానికి సుకుమార్‌ దర్శకుడు అవటం ఆనందంగా ఉంది. పాటలు విన్నాను. బాగున్నాయ
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...'మూడు తరాలుగా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నా అందరూ నాకు కావలిసనవాళ్ళే. మా నాన్న, నా దర్శకుడు, నా కథానాయిక, హీరో నా మిత్రుడు. ఈ సినిమాను చూశాను. డెఫనెట్‌గా హిట్టే. నాగచైతన్యను కొత్తగా చూస్తారు. తమన్నా కెరీయర్‌లో బెస్ట్‌ సినిమా అవుతుంది.
తమన్నా మాట్లాడుతూ...'సినిమాలో కొన్ని సీన్స్‌ చేస్తుంటే నా జీవితంలో లవ్‌స్టోరీ కూడా ఇలాగే ఉంటే బాగుండు అని అనుకున్నాను. సినిమాకు నా వాయిస్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చెప్పలేదు. గీతా ఆర్ట్స్‌లో చేయడమనేది గర్వంగా ఉంది. ఇందులో 'డియోలో డియాలో..' పాటకు యూనిట్‌ అంతా డాన్స్‌ వేశారు. సినిమా తర్వాతకూడా ప్రేక్షకుడు డాన్స్‌ చేస్తారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామానాయుడు, ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.