Tuesday, May 17, 2016

లాస్ట్ ప్లేస్ నాదే అంటున్న రకుల్

 ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ అంటే.. హీరోతో ప్రేమ వ్యవహారాల కోసమే అన్నట్లుంటారు. తమ కెరీర్ మొత్తంలో ఒకటీ అరా మినహాయిస్తే.. మంచి రోల్స్ దొరికే ఛాన్సులు తక్కువ. అందరూ ఇదే దారిలో లేకపోయినా.. మెజారిటీ హీరోయిన్లు ఇదే బాపతు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు లవ్ అంటే చాలా చిన్న చూపు అంటోంది.

'ప్రేమ నా దృష్టిలో చాలా చిన్న విషయం. అసలు నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వను' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. గత నెలలో రిలీజ్ అయిన సరైనోడులో చెప్పుకోదగ్గ పాత్ర చేసిన రకుల్.. . ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలతోపాటు.. ఓ హిందీ చిత్రంలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ కుర్ర హీరోయిన్ ని.. ప్రేమపై అభిప్రాయమేంటి అని అడిగితే 'అసలు  ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కూల్లో చదివే టైంలో ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు. నేనేంటి? ప్రేమించడం ఏంటి? అంటూ పెద్ద క్లాస్ తీసుకొన్నాను. అయితే కాలేజీ రోజుల్లో మాత్రం నా వెంట పడే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటబడ్డా నేను పట్టించుకోలేదు.' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

అసలు టైం వేస్ట్ చేయడం తనకు నచ్చదని.. స్కూల్లో చదివే టైంలో అయితే.. చదువులోనే కాదు ఆట పాటల్లోనూ నాకే ఫస్ట్ ర్యాంక్ అంటోంది ఈ భామ. అందరికంటే ముందుండాలి అని కోరుకొనే తత్వమే.. తనను ఈ స్థాయికి చేర్చిందని గర్వంగా చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రేమలో మాత్రం తనది లాస్ట్ ప్లేసే అంటోంది.

మావాడు ఆ సినిమాలు చేయడం సరికాదు

 బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన బుల్లెట్ రాజా, హమ్ షకల్స్, హ్యాపీ ఎండింగ్, ఫాంటమ్ తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సైఫ్ సినిమాలపై అతని తల్లి, ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా సైఫ్ సినిమాల ఎంపిక సరిగా లేదని షర్మిల అంది.
జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ తనకు కూతురు వంటిదని చెప్పింది. సైఫ్, కరీనాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరన్నప్రశ్నకు.. 'ఇద్దరూ మంచి నటులే' అంటూ నవ్వుతూ సమాధానిమిచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా వెలుగొందిన షర్మిల.. టీమిండియా మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీని వివాహం చేసుకుంది. తన భర్తతో గడిపిన క్షణాలు చిరస్మరణీయమైనవని గుర్తు చేసుకుంది.

Monday, May 16, 2016

మళ్లీ.. 6 సిక్సర్లు బాదేస్తా: యువీ


ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. సాధారణ మ్యాచ్‌ల్లోనే సులభంగా సాధ్యమయ్యే ఫీట్‌ కాదిది. అలాంటిది తొలి టీ20 ప్రపంచకప్‌లోనే బలమైన ఇంగ్లండ్‌ జట్టు బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో సాధించి చూపాడు రెండు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో హీరోగా నిలిచిన యువరాజ్‌. మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా అంటున్నాడు.

మొహాలిలో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌సింగ్‌ (42; 24 బంతుల్లో 3×4, 3×6) తన అద్భుత ఆటతీరుతో సన్‌రైజర్స్‌కు అసాధారణ విజయం అందించి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 179/4 పరుగులు చేసింది. ఛేదనలో రన్‌రేట్‌ పెరిగిపోతున్న దశలో దీపక్‌హుడా (34), బెన్‌కట్టింగ్‌(18) సహకారంతో మొహిత్‌శర్మ బౌలింగ్‌లో సిక్సర్లు బాది యువరాజ్‌ జట్టుకు విజయం అందించాడు.
మ్యాచ్‌ ముగిసిన తర్వాత యువీ క్యాన్సర్‌తో పోరాడుతున్న 17 మంది చిన్నారులతో ముచ్చటించాడు. ఈ సందర్భంలో ఓ చిన్నారి.. మీరు మళ్లీ ఆరు సిక్సర్లు కొడతారా అన్ని ప్రశ్నించగా... ‘నువ్వు ప్రార్థించు.. నేను మళ్లీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేస్తా’ అని అన్నాడు. ఐతే అప్పుడు ఆరు సిక్సర్లు ఎలా కొట్టగలిగానో తెలియదనీ, ఆ ఫీట్‌ సాధించి చాలా ఏళ్లు గడిచిందని అన్నాడు.
 

సోనమ్.. సో స్వీట్‌గా.. ఐష్.. సో సోగా!

కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మొదటి రోజు ఐశ్వర్యా రాయ్ అందర్నీ కనువిందు చేశారు. కానీ, రెండో రోజు మాత్రం మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘సరబ్‌జిత్’ చిత్రం ప్రీమియర్ షో ఆదివారం  జరిగింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆ చిత్రదర్శకుడు ఒమంగ్ కుమార్, చిత్రంలో కీలక పాత్ర చేసిన రిచా చడ్డా తదితరులు వెళ్లారు. ఐష్ నలుపు, బంగారు వర్ణంతో తయారు చేసిన పొడవాటి గౌను వేసుకున్నారు. డ్రెస్‌కి వాడిన మెటీరియల్ కొంచెం మందంగా ఉండటంతో ఆమె బొద్దుగా కనిపించారు.
దాంతో రెండో రోజు మైనస్ మార్కులు పడ్డాయి. మరోవైపు యంగ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశారు. నీలం, నలుపు రంగు చీరలో సోనమ్ చాలా క్యూట్‌గా కనిపించారు. ఫ్యాషన్ విషయంలో ఐష్‌కీ, సోనమ్‌కీ  ఎప్పుడూ... ముఖ్యంగా కాన్స్ ఉత్సవాల్లో పోటీ ఉంటుంది. ఎప్పుడూ సోనమ్‌కే మంచి మార్కులు పడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది.

Sunday, May 15, 2016

అయ్యో పాపం... గాయం!

 
అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది.
ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.

పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు!

వెండితెర తారలు కళ్ల ముందు మెదిలితే అభిమానులు ఏం చేస్తారు? పెన్నూ పేపరు చేతిలో ఉంటే ఆటోగ్రాఫ్... స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీ లేదా ఓ ఫొటో... ఆ కోరిక తీరితే ‘ఈ జన్మకి ఇది చాలు’ అని సంబరపడి పోతారు. ఇంకో రక ం ఫ్యాన్స్ ఉంటారు.. తమ ఫేవరెట్ స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాళ్ల పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ఎలాగైనా అభిమాన తారను కలవాలని పట్టుదలగా ఉంటారు. వెర్రి ప్రేమతో ఏం చేస్తున్నారో తెలీని దశలో వాళ్లు ఉంటారు.  సరిగ్గా ఇలాంటి టైప్ 2 అభిమాని ఒకడు తాప్సీకి చుక్కలు చూపించి, తెగ ఇబ్బంది పెట్టేశాడట. మేటర్‌లోకి వెళితే... తాప్సీ తన సోదరితో కలసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకోసమే వాళ్ల ఆఫీసుకు బోల్డెన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. కోల్‌కతాకు చెందిన తాప్సీ వీరాభిమాని తన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించాలని కోరాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తాప్సీ కచ్చితంగా తన పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైతేనే వెడ్డింగ్ ప్లానింగ్ కాంట్రాక్ట్ ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో ఈ అభిమానిని తాప్సీ టీమ్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆ కాంట్రాక్ట్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు.
అయినా ఆ అభిమాని వదల్లేదు. విచిత్రమేమింటే, అసలింకా అతని పెళ్లి ఫిక్స్ లేదు. కానీ, పెళ్లికి మాత్రం తాప్సీ తప్పనిసరిగా రావాలని కండిషన్ పెట్టాడు. ఆ విషయం తెలిసి, ‘‘అతన్ని ముందు పెళ్లి కూతుర్ని వెతుక్కోమని సలహా ఇచ్చాను. ఒకవేళ కుదిరినా పెళ్లికి రావడానికి నా డేట్స్ ఖాళీగా లేవని చెప్పా. దాంతో పెళ్లి విషయం మానేసి, తన దగ్గర సినిమా స్క్రిప్ట్ ఉందనీ, దర్శకుణ్ణి పంపుతాననీ అన్నాడు. నాకిలాంటి అనుభవం కలగడం ఇది తొలిసారి’’ అని తాప్సీ చెప్పారు.

గురువు కోసం సింగిల్ సాంగ్‌లో..


 
గురువు కోసం సింగిల్ సాంగ్‌లో దుమ్ము రేపడానికి సిద్ధమైంది ఇంగ్లిష్ బ్యూటీ. ఆ అమ్మడు ఎవరో ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఎస్.అనతికాలంలోనే సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే స్థాయికి ఎదిగిన ఎమీజాక్సన్‌నే ఆ బ్యూటీ. ఇక ఆమె గురువెవరన్నది అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల పరువంలోనే ఈ ముద్దుగుమ్మను మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి చేసి దర్శకుడు ఏఎల్.విజయ్‌ను ఎమీ తన గురువుగా భావిస్తుంది. చాలా కాలం తరువాత ఏఎల్.విజయ్ కోరిక మేరకు సింగిల్‌సాంగ్ చేయడానికి సిద్ధమైంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఎమీ ఇప్పటి వరకూ సింగిల్ సాంగ్‌లో నటించలేదు. తొలిసారిగా తన గురువు కోసం తన సింగిల్‌సాంగ్‌లో తన కాలు కదపనుంది.

  సంగతేమిటంటే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్న కథానాయికగా నటిస్తున్నారు. హారర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి అభినుత్రి అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకోవడంతో అందులో ప్రభుదేవాతో లెగ్ షేక్ చేయడానికి క్రేజీ నటి అవసరం అవడంతో దర్శకుడి మదిలో మెదిలిన తార ఎమీజాక్సన్.

 మూడు భాషల్లోనూ ఎమీకి గుర్తిం పు ఉండడంతో తనే కరెక్ట్ అని భావించిన ఏఎల్.విజయ్ వెంటనే ఎమీజాక్సన్‌కు ఫోన్ కొట్టగా గురువు కోసం వెంటనే ఓకే అనడంతో పాటు అందుకు కొన్ని డేట్స్ కేటాయించేసిందట. ప్రస్తుతం రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టిన ఎమీ త్వరలోనే అభినేత్రి చిత్రం కోసం ప్రభుదేవాతో డాన్స్ చేయనుందని సమాచారం.ఈ చిత్రానికి ఎస్.తమన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించడం మరో విశేషం.

రహస్యంగా పెళ్లి చేసుకుంటున్న మరో నటి

 ఇటీవల కొందరు బాలీవుడ్‌ నటులు ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో బాలీవుడ్‌ నటి అమృతా రావ్‌(అతిథి ఫేం) చేరింది. అమృత ముంబయికి చెందిన రేడియో జాకీ అన్మోల్‌తో ఈరోజు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆన్మోల్‌, అమృతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.
అయితే అమృతా, అన్మోల్‌ల వివాహం కొన్ని నెలల క్రితమే అయిపోయిందని పెళ్లయ్యాక ఇద్దరూ విడిగా ఉంటున్నారని ఇంతకుముందువార్తలు వెలువడ్డాయి. ఇటీవల అమృత హాజరైన ఓ కార్యక్రమంలో చేతికిఉంగరం ఉండడం చూసి అమృత పెళ్లి విషయం కాస్తా బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఈరోజు వివాహమయ్యాక కొద్దిరోజుల తర్వాత అందరికీ గ్రాండ్‌గా రిసెప్సన్‌ ఇవ్వనున్నట్లు సన్నిహితులు తెలిపారు.
హిందీలో మై హూ నా, వివాహ్‌, ఇష్క్‌ విష్క్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అమృత. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో తన సోదరి ప్రీతికా రావ్‌లాగే టీవీ సీరియళ్లలో నటిస్తోంది.