Thursday, December 24, 2015

సౌఖ్యం సినిమా రివ్యూ


'జాబ్‌లెస్‌, రెక్‌లెస్‌, రూత్‌లెస్‌, రిడిక్యులస్‌.. టోటల్‌గా యూజ్‌లెస్‌' అంటూ హీరో పాత్రని ఇంట్రడ్యూస్‌ చేస్తారిందులో. ఈ సినిమా గురించి వర్ణించడానికి కూడా అదే లైన్‌ని వాడేసుకోవచ్చు. పృధ్వీ, కృష్ణ భగవాన్‌ పాత్రలని పరిచయం చేసే ముందు... వాళ్లు తమ ఊళ్లో పెద్ద సినిమాలు రిలీజ్‌ చేసుకోలేక హిట్‌ అయిన సినిమాలని పేరడీ చేస్తూ సినిమాలు తీసి వాటినే ప్రదర్శిస్తుంటారని చెప్తారు. 'లౌక్యం' సినిమాలాంటి మరో హిట్‌ కావాలంటూ గోపీచంద్‌, ఆనంద్‌ ప్రసాద్‌ అడిగితే.. మళ్లీ అలాంటిది రాయలేక 'లౌక్యం'నే స్పూఫ్‌ చేసి.. 'సౌఖ్యం' అనే టైటిల్‌ పెట్టేసినట్టున్నారు.

           సినిమా అనే కళ అనుక్షణం కుంగిపోయేలా, కంపించిపోయేలా, కళ్లు వాచేలా ఏడ్చి కళ తప్పేలా ఉందీ సౌఖ్యం. హీరో పాత్ర పరిచయానికి ముందు పోలీస్‌ స్టేషన్‌కి పరుగెత్తుకుంటూ వచ్చే అతని ఫ్యామిలీని, వాళ్లు చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌ని చూసేసరికే 'ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్స్‌ ఫెస్టివల్‌' అనే పిక్చర్‌ వచ్చేయాలి. ఒకవేళ అప్పటికీ ట్యూబ్‌లైటు వెలగనట్టయితే... ఫెరోషియస్‌ విలనీకి పేరు పడ్డ ప్రదీప్‌ రావత్‌ వచ్చి 'డోరేమోన్‌' తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌లో కార్టూన్‌ క్యారెక్టర్‌లా ఓవరాక్ట్‌ చేస్తుంటే అయినా సీన్‌ అర్థమైపోవాలి. అప్పటికీ బల్బు వెలగకపోతే ఇక అటుపై వెలగాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎలాగో ఫ్యూజ్‌లు కొట్టేసి, వెలిగిన బల్బ్‌లు కూడా మాడిపోతాయి!
క్లయిమాక్స్‌ సీన్‌లో విలన్స్‌ని అడ్డుకున్న బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ అతని అనుచరుడు హీరోకి ఫోన్‌ చేసి 'త్వరగా రండి సర్‌... కంటెంట్‌ లేకుండా ఎక్కువ సేపు మా సర్‌ మ్యానేజ్‌ చేయలేడు' అని చెప్తాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కంటెంట్‌ లేక, దీనిని ఎలా మ్యానేజ్‌ చేయాలనేది తెలీక, రెండు గంటలకి పైగా నిడివి ఉండేట్టు చూసుకోవడమెలాగో అర్థం కాక.. తోచిన సన్నివేశాలని, తట్టిన కామెడీని రాసుకుంటూ పోయారనిపిస్తుంది. సప్తగిరికి ఆత్మలు కనిపిస్తాయంటూ మొదలు పెట్టి, రెండు సీన్ల తర్వాత అతడిని పక్కన పడేసారు. వెంకీలో బ్రహ్మానందం పాత్రని అటు తిప్పి, ఇటు తిప్పి రైల్లో పోసానిని దించారు. బొమ్మరిల్లు ఫాదర్‌ని బురిడీ కొట్టించడానికి రఘుబాబుని రెడీలో బ్రహ్మానందంని చేసారు. ఇంక నవ్వించడమెలాగో తెలీదన్నట్టు బాహుబలి, శ్రీమంతుడుని స్పూఫ్‌ చేసి వదిలారు. అక్కడికీ కంటెంట్‌ లేదని బోధ పడి క్లయిమాక్స్‌ ఫైట్‌లో అడ్డం పడి 'లౌక్యం' హిట్‌కి తనవంతు సహకారం అందించిన పృధ్వీ పాత్రకి బదులు బ్రహ్మానందాన్ని పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. అడుగడుగునా ఏదో తానులోంచి చింపుకొచ్చిన ముక్కలన్నీ కుట్టి ఇదే కొత్త స్క్రిప్టు అంటూ చేతులు దులిపేసుకున్నారు. ఇక దాని వాటం ఎలాగుంటుందనేది, దాన్ని చూడ్డం ఎంత సౌఖ్యంగా ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం.
               లౌక్యంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన రైటర్లు కనుక వాళ్లిచ్చిన స్క్రిప్టుని గోపీచంద్‌ క్వశ్చన్‌ చేయలేడు. ఆ సినిమా అంత హిట్‌ అయింది కాబట్టి ఈసారి దీనిపై నిర్మాత డౌట్‌ పడలేడు. చేయి తిరిగిన వాళ్లు, చేసి చూపించిన సమర్ధులు ఇచ్చిన దానిని మార్చి తీసే ధైర్యం దర్శకుడు చేయడు. ఇంకేముంది ఇష్టానికి రాసుకున్న స్క్రిప్టు తీరూ తెన్నూ లేకుండా, తలా తోకా తెలీకుండా సౌఖ్యం అనే పదానికి ఎగ్జాక్ట్‌ ఆపోజిట్‌గా మారింది. గోపీచంద్‌ అయినా, జేమ్స్‌బాండ్‌ అయినా ఇలాంటి క్యారెక్టర్‌ ఇస్తే చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిందే. కెమెరా ముందు ఏదోటి చేసేసి కట్‌ చెప్పించుకోవాల్సిందే. గోపీచంద్‌ అదే చేసాడు. లౌక్యం ఇచ్చారనే కృతజ్ఞతని చూపించి పరిహారం చెల్లించుకున్నాడు. తన సౌఖ్యం కోసమైనా కాస్త లౌక్యం ప్రదర్శిస్తే బాగుండేది. హీరో గురించే చెప్పడానికేం లేదంటే ఇక హీరోయిన్‌ గురించి దేనికిలెండి. నాయికానాయకులే కీలుబొమ్మలైనప్పుడు.. వారికి సహకారం అందించిన వాళ్లు, ప్రతినాయకులైన వాళ్లు మాత్రం ఎలా మెప్పించగలరని. లౌక్యం విజయంలో కీలక పాత్రధారులైన కమెడియన్లు కూడా తమకిచ్చిన స్టేల్‌ జోకులని, స్టింకింగ్‌ స్పూఫ్‌లని పండించడానికి పడ్డ పాట్లు వివరించడమెలాగని?
'శేషూ శేషూ..' అంటూ సప్తగిరి పరిచయం... 'ఎవ్వడంట ఎవ్వడంట' అంటూ పృధ్వీ ఇంట్రడక్షన్‌, 'నా పేరు దయ.. నాకు లేనిదే అది' అంటూ బ్రహ్మానందం రావడం.. అవేమీ సరిపోనట్టు 'గబ్బర్‌సింగ్‌' అంత్యాక్షరి సీన్‌కి ఎక్స్‌టెన్షన్‌! ఇంతకుమించి కామెడీ ఉండదా? లేక కామెడీ అంటే ఇంతే అనుకుంటున్నారా? ఫస్ట్‌ హాఫ్‌లో వాచ్‌ వైపు, సెకండ్‌ హాఫ్‌లో ఎగ్జిట్‌ వైపు చూస్తూ నూట నలభై నిమిషాలు గడవడం ఎంత కష్టమో తెలుసుకుంటాం. వరదల్లో చిక్కుకున్న వాళ్లని చూసి అయ్యోపాపం అంటాం. అలా ఇరుక్కుపోతే తిండి, నీళ్లు, నిత్యావసరాలు ఉండవేమో.. కనీసం అక్కడీ సౌఖ్యం చూసే 'భాగ్యం' ఉండదు. 'అంతకుమించిన' పరీక్షని పెట్టి, వర్ణించలేని విధమైన శిక్షని వేస్తుందీ చిత్రం. హిట్‌ సినిమా అనే దానికి ప్రత్యేకమైన సూత్రాల్లేవు. హిట్‌ కొట్టడానికి ఫలానా అంటూ దిక్సూచి లేదు. మంచి కథ, పకడ్బందీ కథనం ఉన్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వెలితి వచ్చి మొత్తంగా ఫలితం తిరగబడుతుంది. లౌక్యంకి అన్నీ కుదిరేసాయి. ఈసారి దానిని అనుకరించి పాస్‌ అయిపోదామని చూసేసరికి టేకాఫ్‌ అవకుండా రన్‌వేపైనే క్రాష్‌ అయిపోయింది.

Wednesday, December 23, 2015

నెంబర్‌ కొట్టండి .. సమస్య చెప్పండి




ప్రజల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెంబర్లు 


సిఎంఓ ఆఫీస్‌ 040-23454071                 మీ ఏరియాలో ఏదైనా సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో కొనసాగుతోందా.? అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా? ప్రజా ప్రతినిధులు మీవైపు చూడటం లేదా..? ప్రభుత్వ పథకాల్లో మీకు ఏమైనా అసౌకర్యం కలుగుతుందా..? ఇవన్నీ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికే చెప్పుకోవాలని ఉందా.. అయితే మీరు అక్కడి దాకా పోవాల్సిన పనిలేదు. ఇలాంటి వాళ్ల కోసమే సిఎంఓ కార్యాలయంలో 040- 23454071 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఫోన్‌ చేస్తే ముఖ్యమంత్రికి చెప్పినట్లేనని కెసిఆర్‌ చెప్పారు మరి. ఏ సమస్యకైనా 100

 మనం ఏ సమస్యలో ఉన్నా, పోలీసులకు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా 100 డయల్‌ చేస్తే సరి. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లకు కనెక్ట్‌ అవుతోంది. పైసా ఖర్చు లేకుండా సమాచారం ఇవ్వొచ్చు. తెలుసుకోవచ్చు.
 
తక్షణ వైద్యం కోసం 108




ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ చేస్తే వచ్చేది ఏమిటంటే 108 అంబులెన్స్‌ వాహనమని నేడు అందరికీ తెలుసు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగినా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నా? ఆసుపత్రికి చేరేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేస్తే చాలు. క్షణాల్లో మీ ముందుంటుంది. అయితే అంబులెన్స్‌ వచ్చేంత వరకు రూట్‌ వివరాల కోసం ఆ సిబ్బంది మనకూ ఫోన్‌ చేస్తుంటారు.
'మీసేవా' కేంద్రాలపై...


'మీసేవా' కేంద్రాల్లో మీ పనులు సకాలంలో జరగడం లేదా? ఇచ్చిన సమయానికి ధృవీకరణ పత్రాలు జారీ చేయడం లేదా? కేంద్రాల్లో కనీస వసతులు లేవా? సమాచారం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారా? పైసలిస్తే తప్ప పని జరగడం లేదా.. అయితే 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయండి మీ సమస్యను పరిష్కరిస్తారు.


ఆరోగ్య సందేహాలు తీర్చుకోండిలా...



మీ మానసిక పరిస్థితి బాగా లేదా? ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ పొందాలని అనుకుం టున్నారా? ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల్లో ఏమేమి ఉన్నాయి? వైద్య సేవల కోసం ఎక్కడెక్కడ సంప్రదించాలి? వంటి సలహాలతో పాటు ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికేందుకు 104 నంబర్‌ ఉపయోగపడుతుంది.
అవినీతి అంతు చూడాలంటే...1064



ప్రభుత్వ కార్యాలయంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడుగుతున్నారా? అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే 'ఎసిబి' వారు ఏర్పాటు చేసిన 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి, సమాచా రాన్ని వారికి చెప్పండి. ఇదే కాక 1800 222 021కు కూడా ఫోన్‌ చేసి చెప్పొచ్చు.



విద్యుత్‌ సమస్యపై 1912 కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వచ్చిందా..? విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిందా? సరఫరాలో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయా? ఇలా విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఏ ఫిర్యాదులనైనా స్వీరించేందుకు విద్యుత్‌ శాఖ '1912' టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసింది.


ఆర్టీసీ సంస్థ గురించి.. 


ఏదైనా విహారయాత్రకు బస్సులో పోవాల నుకుంటున్నారా ? ఆర్టీసీ బస్సు బాగా లేదా? సమయానికి బస్సు రావడం లేదా? బస్సులతో మరేమైనా ఇబ్బందులు ఉన్నాయా? వెంటనే 1800-200-4599 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫిర్యాదు వెళ్లిన వెంటనే హైదరాబా ద్‌లోని నియంత్రణ విభాగం (కంట్రోల్‌రూం) ద్వారా జిల్లా సిబ్బందికి ఆదేశాలు వస్తాయి. తద్వారా ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది. దీనికి తోడు సమాచారం కూడా అందిస్తారు.
 రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు...
 
హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఏదైనా సమాచారం కావాలా? విమానాలు సకాలంలో నడుస్తున్నాయా లేక రద్దు చేయబడ్డాయా అనే విషయాలతో పాటు విమానాల రాకపోకలు, ఛార్జీల వివరాలు తెలుసుకోవాలంటే 1800 419 2008 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సరి. 

యూత్‌ సమస్యలపై...

యుక్త వయస్సులోకి వచ్చాకా యువతలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మంది తికమకపడుతుంటున్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం యువ కౌన్సిలింగ్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఏ సమస్యనైనా నేరుగా 1800 116 888కు ఫోన్‌ చేయండి.
 ర్యాగింగ్‌ సమస్యపై...
 

కళాశాలలోనైనా, లేక ఇతర ప్రాంతాల్లోనైనా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఈ సమాచారాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. దీనికోసం 1800 180 5522 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. 
 
ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు కోసం...
 ప్రస్తుతం ప్రతి పనిలో ఆధార్‌ కార్డు ఒక బాగస్వామిగా అయిపోయింది. గతంతో ఒక వ్యక్తి గుర్తింపు కార్డుగా రేషన్‌ కార్డు ఉండగా ప్రస్తుతం ఆధార్‌, పాన్‌ కార్డులుగా మారిపో యాయి. మీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు పోయినా.. తప్పులు పడ్డా ఈ నెంబర్ల ద్వారా సూచనలు తీసుకోవచ్చు. ఆధార్‌ కార్డు 1800 300 1947, పాన్‌ కార్డు- 1800 180 1961 నెంబర్లను టోల్‌ ఫ్రీ గా ఏర్పాటు చేశారు.

 గ్యాస్‌ ఇబ్బందులపై..



గ్యాస్‌ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సకాలంలో అందివ్వకపోయినా దానికోసం గ్యాస్‌ సంస్థలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు. భారత్‌ గ్యాస్‌- 1800 222 725 , హిందుస్తాన్‌ గ్యాస్‌ - 1800 2333 777, ఇండెన్‌ గ్యాస్‌ -1800 2333 555లకు ఫోన్‌ చేయండి.


ఉపాధి హామీ వివరాలకు...

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీ పని దొరకడం లేదా? పని చేసినా కూలి ఇచ్చేం దుకు డబ్బులు అడుగుతున్నారా? సకాలంలో కూలీ అందడం లేదా? ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? సిబ్బంది పనితీరు సక్రమంగా లేదా? ఇలా ఎలాంటి సమస్యలపైనా '155321' నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చు.
 
వ్యవసాయరంగ ఫిర్యాదులకు..

అదనంగా వ్యవసాయరంగ ఫిర్యాదుల కోసం 1800-425-3536 అనే నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బందిపైనా, ఎటువంటి ఫిర్యాదుల కోసమైనా ఫోన్‌ చేసి చెప్పొచ్చు. వెంటనే స్పందించి సమస్య పరిష్క రిస్తారు.
 
సాగుపై సలహాలు పొందండిలా..


ప్రస్తుతం ఏ పంట వేస్తే బాగుంటుంది? అంతర పంటల్లో దేనికి డిమాండ్‌ ఉంటుంది. ఏ సమయంలో ఏ పంటలు వేసుకుంటే మేలు. వేసిన పంటలపై వచ్చే చీడపీడలు, పురుగుల నివారణ కోసం ఏ మందులు వాడాలి? ఇలా పంటల సాగుపై సలహాల కోసం వ్యవసాయ శాఖ 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. పంటల నష్టపరిహారం అందకపో వడం, నల్ల బజారుకు విత్తనాలు, ఎరువుల తరలిండం తదితర అంశాలపైనా సమాచా రాన్ని పొందొచ్చు.

ఫిబ్రవరిలో మెకల్లమ్ రిటైర్మెంట్

 న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ తనకు చివరిదని తెలిపాడు. ఫిబ్రవరి 12న ఆసీస్‌తో ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌తో మెకల్లమ్ కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకుంటాడు. తర్వాత 20 నుంచి జరిగే రెండో టెస్టు ఆడి రిటైర్ కానున్నాడు. అయితే మార్చి 8 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు కేన్ విలియమ్సన్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
                  రిటైర్మెంట్ గురించి తర్వాత చెప్పాలనుకున్నా ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక నేపథ్యంలో ముందుగానే నిర్ణయాన్ని వెల్లడించానని తెలిపాడు. ‘ఆసీస్‌తో తొలి టెస్టు ముగిసే వరకు ఈ విషయాన్ని బహిరంగం చేయొద్దని భావించా. అయితే టి20 ప్రపంచకప్ జట్టులో నా పేరు లేకపోతే చాలా సమస్యలు, ఆందోళనలు ఏర్పడతాయి. దాన్ని తప్పించేందుకే నా నిర్ణయాన్ని ముందుగానే చెప్పేశా. కివీస్ తరఫున ఆడినందుకు చాలా గర్వపడుతున్నా’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.



                   2002లో ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మెకల్లమ్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి 11 సెంచరీలతో 6273 పరుగులు సాధించాడు. 254 వన్డేల్లో ఐదు సెంచరీలతో 5909 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల క్రిస్ కెయిన్స్‌కు సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చిన మెకల్లమ్.. తన వీడ్కోలుపై దాని ప్రభావం లేదని స్పష్టం చేశాడు.

Tuesday, December 22, 2015

'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'

 దేశంలో మత అసహనం పెరిగిపోతుదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' సినిమా కలెక్షన్లపై పడడంతో విచారం వ్యక్తం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని వాపోయాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా వచ్చిన షారూఖ్ మీడియాతో మాట్లాడాడు. 'అసహనంపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనుకోవడం లేదు. వివరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. నా కళ్లతో చూసిందే నేను మాట్లాడాను. నా గురించి ప్రజలకు తెలుసు. అయితే నేను మాట్లాడినదాన్ని వారు అర్థం చేసుకోలేదు. నా వ్యాఖ్యలను సరిగా ప్రజెంట్ చేయలేదు. నా మాటలతో ఎవరైనా బాధపడివుంటే విచారం వ్యక్తం చేస్తున్నా' అని షారూఖ్ చెప్పాడు.                    తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అతడు అంగీకరించాడు. వివాదాల జోలికి పోకుండా తన సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాతం, కులం, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ తనను 25 ఏళ్లుగా ఆదరిస్తున్నారని తెలిపాడు. తన సినిమాల ద్వారానే తన ప్రేమను వారికి తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. కొంతమంది దుష్ప్రచారం చేసినంతమాత్రానా తన దేశభక్తిని శంకించాల్సిన పనిలేదన్నాడు.

'నవమన్మథుడు' మువీ రివ్యూ

రేటింగ్‌ 2.25
  తమిళ స్టార్‌ హీరో ధనుష తెలుగులో సక్సెస్‌ కొట్టేందుకు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూసున్నాడు. కాని ఈయన సస్సెస్‌ను మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు. ఇక ఈయన తాజాగా తమిళంలో నటించిన ఈ సిఁమాను అక్కడ ఇక్కడ ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కాని తెలుగులో కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయ్యింది.
కథలోకి వెళ్తే....
భరత్‌( ధనుష్‌ ) ఒక మధ్య తరగతి వ్యకి. ఈయన మొదట హేమ ( ఎమీ జాక్సన్‌)ను ప్రేమిస్తాడు. అయితే కొ
న్ని కారణాల వల్ల హేమతో ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తేరుకుని ఒక జాబ్‌లో జాయిన్‌ అవుతాడు. అలా కాలం గడుస్తున్న సమయంలో ఈయనకు యమున ( సమంత)తో వివాహం అవుతుంది. భరత్‌ వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఆయన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో సమస్యలు చుట్టు ముడుతాయి. ఆ సమస్యలు ఏంటి? వాటి నుండి భరత్‌ ఎలా తప్పించుకఁన్నాడు ? ఈయన ప్రేమ కథలు ఏంటి ? అనేది వెండి తెరపై సినిమా చూసి తెలుసుకోండి.
ధనుష్‌ ఎప్పటిలాగే మంచి నటనతో మెప్పించాడు. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో ఈయన చూపించిన వేరియేషన్స్‌ అద్బుతం అ
ని చెప్పాలి. లవర్‌గా, బాధ్యతగల వ్యక్తిగా ఈయన చూపించిన నటనకఁ ఎక్కడ కూడా లోటు పెట్టేలా లేదు. ఒక మిడిల్‌ క్లాస్‌ అమ్యాయిగా సమంత కఁపించి మెప్పించింది. అమీజాక్సన్‌ సైతం తనదైన శైలిలో నటించి మెప్పించింది. ఈమె అందంతో కూడా ఆకట్టుకఁంది. మిగిలిన వారు పర్వాలేదు. అన్నట్లుగా నటించారు. 






          అనిరుధ్‌ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అన్ని పాటలు కూడా సందర్బానుసారంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సన్ని వేశాలకు హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్‌ యావరేజ్‌గా ఉంది. దర్శకుడు వెల్‌ రాజ్‌ సెకండ్‌ హాఫ్‌ను మరింత బాగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. సినిమా ఒక మంచి ఫ్యామిలీ కథాంశంతో దర్శకుడు వెల్‌రాజ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయన ఫస్ట్‌ హాఫ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకఁలను ఆకట్టుకునేలా చూపించాడు. కాని సెకండ్‌ హాఫ్‌లో మాత్రం పెద్దగా మెప్పించడంలో విఫలం అయ్యాడు. చివరిగా 'నవమన్మధుడు' ఆకట్టుకునే స్థాయిలో లేదు.

Monday, December 21, 2015

'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ

 కథ :
పీష్వా బాజీరావ్ గా ప్రసిద్ధి పొందిన బాజీరావ్ బల్లాల భట్ ఓటమే ఎరుగని యుద్ధవీరుడు. దాదాపు 40 యుద్ధాలలో అప్రతిహతంగా విజయాలు సాధించిన ఘనత ఆయనది. ఢిల్లీ సింహాసనం నుంచి మొఘల్ రాజులను దించేశాక.. అఖండ భారతాన్ని పరిపాలించాలని నిశ్చయించుకుంటాడు బాజీరావ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తన కుటుంబసభ్యులతో కూడా పోరాడాల్సి వస్తుంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బాజీరావ్.. మస్తానీ అనే ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. బాజీరావ్ కు అప్పటికే కాశీబాయ్ తో పెళ్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాజీరావ్ యుద్ధంతో పాటు తన ప్రేమలోనూ ఎలా విజయం సాధించాడన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
రామ్ లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్ గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్ లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్ గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్ తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. విజువల్ గా  ఆకట్టుకున్నా.. కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడు. హిస్టారికల్ వార్ డ్రామాకు కావాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచింది.

Sunday, December 20, 2015

‘జబర్దస్త్’ శేషుకు గాయాలు

 జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీయన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు. రాజస్థాన్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కారు చేజింగ్ సీన్ లో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శేషు ఎడమ చేతికి గాయమైంది. ప్రస్తుతం శేషు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా షేకింగ్ శేషుగా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి

  సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్‌ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.