Tuesday, August 16, 2011

150 రోజుల తర్వాత మరో అవకాశం


  ' ప్రేమకావాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషాచావ్లా 150 రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. వీరభ ద్రం దర్శకత్వంలో సునీల్‌ సరసన ఇషాచావ్లా జతకట్టనుంది. ఈ చిత్రం ఆగస్టు 18న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ధోని తర్వాత కెప్టెన్‌ ఎవరు ... ?

 టీమిండియాలో కొత్త కోణం వచ్చింది. మూడు టెస్టు సిరీస్‌లు వరుసగా ఓడిపోయిన టీమిండియా కెప్టెన్‌పై భారం పడింది. భారత్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఏది విధమైన రకమైన రాణించలేకపోవడం వల్ల కెప్టెన్‌పై భారం పడింది. వరుసగా మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయివడం అంటే టీమిండియా జట్టు లోపం వల్లనే, జట్టు సభ్యులు రాణించలేకపోవడం. అందులో వరుసగా గాయలపాలైన వారిని మళ్లీ జట్టులో అనుమతించడం ఇలా చాల అనుమానాలు వస్తున్నాయి. గాయలుపాలైన వారిని మళ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అడించడం వంటి ప్రయోగాలు వంటి చేసి జట్టులో అనుమతించాలి.
మాజీ క్రికెటర్లు బీసీసీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్‌ సరైన నిర్ణయం తీసుకోపోవడం వల్లనే జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైయింది. ధోని తర్వాత నాయకత్వ లక్షణాలెవరికైనా వున్నాయి. గంభీర్‌ కెప్టెన్సీకి తగ్గ వ్యక్తి కానే కాదు. సెహ్వాగ్‌ సంగతి సరై సరి. సచిన్‌ అల్‌రెడ్రీ కెప్టెన్సీ చేసి, తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నాడు. ఇంకా దావ్రిడ్‌ ఇంతకా ముందు టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లక్ష్మణ్‌ ఇప్పటివరకు కెప్టెన్‌ అన్న సందేహాములు తన దృష్టికి రాలేదు. అతను జట్టు సభ్యుడిలా అందరితో కలసి వుండటటమే తప్ప కెప్టెన్సీపై అలోచన లేదు. యువరాజ్‌సింగ్‌ అతను ఎప్పుడు జట్టు వస్తాడో, వెళ్తుతాడో తెలియదు. ఇంకా కొత్తగా వచ్చిన వారిలో విరాట్‌ కోహ్లీ, రైనా ఇద్దరు జట్టు కొత్త ముఖాలు ఉన్నాయి. వారికి అనుభవం తక్కువ ఉంది. ఇలా జట్టులో అందరీ చూస్తే కెప్టెన్సీపై ఎవరికి అలోచన లేదు.

Saturday, August 13, 2011

కాజల్‌తో ముచ్చటగా మూడోసారి

 'డార్లింగ్‌', మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' చిత్రాలతో హిట్‌ కొట్టి పేరు తేచ్చుకున్న ఈ జత మరో సారి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమా ఫ్యామిలి ఎంటర్‌మెటర్స్‌గా నిలిచాయి. ' రెబల్‌ ' సినిమాలో అనుష్క నిష్క్రమించిందనే వార్తలు వస్తుండండంతో ఆ సినిమాలో అనుష్క స్థానంలో కాజల్‌ భర్తీ చేయనుందా... లేక ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే సినిమా కోసం కాజల్‌ తీసుకుటారా అన్నది తెలియాల్సి వుంది.

Friday, August 12, 2011

మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందా ? సచిన్‌ సెంచరీ చేస్తాడా... ?

 భారత్‌,ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్‌ 35/1 పరుగులు చేసింది. గంభీర్‌ 14, రాహుల్‌ దావ్రిడ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 710/7 డిక్టెర్‌ చేసింది. స్ట్రాస్‌ 87, కుక్‌ 294, బెల్‌ 34, పీటర్స్‌న్‌ 63, మోర్గాన్‌ 104 , బెన్నస్న్‌ 53 పరుగులు చేసింది. భారత్‌ బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా 3, ప్రవీణ్‌ కుమార్‌ 2, ఇషాంత్‌ శర్మ, రైనా చెరో వికెట్‌ లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్‌ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్‌ అవుతుందా. ఇంకా భారత్‌ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుంది.

Tuesday, August 9, 2011

ఆసుపత్రిలో సూపర్‌స్టార్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వెన్ను నొప్పి కారణంగా గత నాలుగు రోజుల క్రితమే కృష్ణ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఆయన కోటుకుంటున్నారనీ, చిన్నపాటి సర్జరీ కూడా జరిగిందనీ, డాక్టర్‌ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారనీ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ అనారోగ్యం వార్త బయటకు తెలియగానే అయన అభిమాన్యులు అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కుటుంబ సభ్యులనుంచి ఆయన కోలుకుంటున్నారన్న ప్రకటన రావడంతో అభిమానుల్లో కొంతమేర ఆంతోళన తగ్గింది. కృష్ణ 300పైగా సినిమాల్లో నటించాడు.

Monday, August 8, 2011

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదట వీళ్లకు

ప్రభాస్‌, గోపిచంద్‌, నాగచైతన్య, తరుణ్‌ వీళ్లందరు పెళ్లి విషయం మాట్లాడే వరకు ఇప్పట్లో లేదు. దానికి టైమ్‌ రావాలి అట్టున్నారు. సినిమా వాళ్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు పెళ్లిళ్లకు వీళ్లు వెళ్తుతున్నారు. అక్కడ ఎవరో ఒక్కరు మరీ మీ పెళ్లి ఎప్పుడు సారు అన్ని అడిగితే ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాననీ అంటున్నారు. అందరు పెళ్లి చేసుకుంటే వీళ్లు మాత్రం పెళ్లికు దూరం ఉంటున్నారు. మారి అసలు విషయం బయటికి రావడం లేదు.

Saturday, August 6, 2011

ఇంగ్లాండ్‌తో వన్డే, ట్వంటీ20కి టీమిండియా రె‘ఢీ’

crickets
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు భారత జ ట్టు సిద్ధమైంది. అయితే ఎంపిక జట్టులో గాయంతో బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌, ఆల్‌రౌండర్‌ హర్భజన్‌ దూరమయ్యారు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లను ఓడిపోయిన భారత్‌ వన్డే జట్టులోకి సెహ్వగ్‌, గంభీర్‌ కోహ్లీ, శర్మ వచ్చి చేరారు. ఇదిలా ఉంటే హిట్‌ ప్లేయర్‌ యువరాజ్‌ గాయం వల్ల బాధపడుతుండటంతో దాదాపు రెండేళ్ల అనంతరం మిస్టర్‌ వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు వన్డే జట్టులో ఆడే అవకాశం దక్కింది. 2009 సెప్టంబర్‌లో చాంపియన్స్‌ టోఫ్రీలో భాగంగా దక్షిణాఫ్రికాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ద్రవిడ్‌ భారత తరపున వన్డేలో ఆడాడు.  మరోవైపు భారత్‌ను గాయాల భూతం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మొన్న జహీర్‌, గంభీర్‌ తీవ్రమైన నొప్పితో రెండవ టెస్టుకి దూరమమైతే ఇపుడు వన్డే జట్టుకు యువరాజ్‌, భజ్జీ దూరమైయారు. ఇంగ్లాండ్‌ టెస్ట్‌ పర్యటనలో బౌలింగ్‌లో ఎలాంటి ప్రభావం చూపించని భజ్జీ కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ‘ ఇంగ్లాండ్‌ పరిస్థితులను ఆధారంగా చేసుకునే జట్టును సెల క్ట్‌ చేశాం. ఎంపిక ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించాము’ అని సెక్షన్‌ క మిటి ఛీఫ్‌ శ్రీకాంత్‌ విలేఖరులతో చెప్పారు. ఆఫ్‌ స్పిన్నర్‌, హర్భజన్‌, బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ ఇద్దరిని మినహాయించి 15 మంది సభ్యులతో జట్టును ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, ట్వంటీ20కి ఎంపిక చేశారు

పెళ్లికొడుకు కాబోతున్న రామ్‌చరణ్‌

 చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్‌ తేజకు అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి మనవరాలు ఉపాసనతో తర్వలో వివాహం జరగనుంది. రెండు రోజుల్లో ఈ వివాహానికి సంబంధించిన ఇరు కుటుంబాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. రాంచరణ్‌, ఉపాసన చైన్నెలో కలిసి చదువుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నారు. అపోలో గ్రూపు ఛైర్మన్‌ మనవరాలితో తన కుమారుడు రాంచరణ్‌ తేజ్‌కు వివాహం నిశ్చయం కానున్న విషయాన్ని చిరంజీవి నేడు ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.