Thursday, July 21, 2011

ప్రణీతకు మరో ఛాన్స్


praneetha-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన ‘బావ’ చిత్రం ద్వారా కన్నడ భామ ప్రణీత తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంతో తెలుగులో ఓ వెలుగు వెలగాలనుకున్న ఈ భామకు ‘బావ’ చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో తన దృష్టిని తమిళ చిత్రాల వైపు మళ్ళించిన ప్రణీత ప్రస్తుతం తమిళ్‌లో ‘యుగానికి ఒక్కడు’,‘ఆవారా’ చిత్రాల హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ‘ షగుణి’ లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంటే ప్రణీతకు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రూపంలో మరో లక్కీఛాన్స్ లభించిందని కోలీవుడ్ సమాచారం. క్రేజీ హీరో విజయ్ కథానాయకుడిగా ఎ.ఆర్.మురుగదాస్ తమిళ్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే విజయ్‌కి జోడీగా ప్రణీతని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘బావ’ చిత్రంతో తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని ఆశపడి భంగపడ్డ ప్రణీతకు తమిళ్‌లో వరుసగా భారీ చిత్రాల్లో క్రేజీ స్టార్స్‌తో నటించే అవకాశం వస్తుండటంతో ఇక ఆమె స్టార్ తిరిగిన తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

ప్రభాస్ ‌'రెబెల్ ' లో తండ్రీ కొడుకులుగా...

ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం... ‌'రెబెల్ ' ... ఈ చిత్రంలో కృష్ణరాజు, ప్రభాస్ తండ్రి కొడుకులగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఆయన మాటల్లోనే... ‌'రెబెల్ ' ...చిత్రంలో నేను నటిస్తున్న మాట నిజం. ప్రభాస్‌ తండ్రిగా కనిపించబోతున్నాను. దర్శకుడు లారెన్స్‌ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్‌ మాట్లాడుతూప్రస్తుతం ' రెబల్‌ ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాల కోసం ఆగస్టులో విదేశాలకు వెళతాం అన్నారు. ఇక లారెన్స్‌ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది.గతంలో లారెన్స్..నాగార్జున తో మాస్ వంటి హిట్ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత స్టైల్ అనే చిత్రం చేసారు. నాగార్జునతో చేసిన డాన్ చిత్రం ఫెయిల్యూర్ అవటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. తమిళంతో ముని చిత్రంలో హిట్టు కొట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇక లారెన్స్ డైరక్ట్ చేస్తూ నటించిన' కాంచనఃరీసెంట్ గా రిలీజై యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.

Friday, July 15, 2011

' కందిరీగ' పాటలు విడుదల

 ' కందిరీగ' పాటలు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ద్వారా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామ్‌, హన్సిక కాంబినేషన్‌లో ఇప్పటికే ఒక సినిమా విడుదల అయ్యింది. మళ్లీ రెండో సినిమా తీశాడు. నిన్న రాత్రి ' కందిరీగ ' పాటలు కూడా విడుదల చేశారు. వెంకటేష్‌, గోపీచంద్‌, వి.వి.వినాయక్‌ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 

Tuesday, July 12, 2011

సమంత హ్యట్రిక్‌ ట్రిక్‌

 సమంత ఇప్పటి వరకు రెండు సినిమాలు తీసింది ఆ రెండింటిలో హిట్‌ కొట్టింది. ఇంకా మూడో సినిమా తీసి హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అదేదో కాదు ఫ్రిన్స్‌ మహేష్‌ బాబుతో కలసి ' దుకూడు ' సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా కోసం 10 నెలలు కష్టపడింది. ఏమయా చేస్తావో సినిమాలో నాగ చైతన్యతో కలసి అలాగే బృందావనం సినిమాలో ఎన్టీఆర్‌తో కలసి చేసింది. ఇంకా మహేష్‌ బాబుతో కలసి తీసిన సినిమా సెప్టెంబర్‌లో విడుదలకు సిద్దం కానున్నంది.

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కాదు, టెన్నిస్‌ స్టార్‌ ప్రియమణి ...

ప్రియమణి కొత్త ప్రయోగాలు చేస్తుంది. అదేదో తెలుసా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాతో కలసి టెన్నిస్‌లో కలసిపోవాలని టెన్నిస్‌ ఫ్రాక్టిస్స్‌ చేసుకుంది. ఆమె చేసిన ప్రాక్టిస్స్‌ చూసి నేనే షాక్‌ అయ్యాను. ఇంకా సినిమాలో గుడ్‌ బ్యారు చెప్పిందా. అన్న అనుమానం వస్తుంది. మరి టెన్నిస్స్‌లో ప్రాక్టిస్స్‌ చేయడం ఏమిటి ... ?
 

 



Sunday, July 10, 2011

భారత్‌ 1-0 తేడా గెలుపు

మూడో టెస్టు మ్యాచ్‌ డ్రా
ఎడ్వూర్స్‌ , చందర్‌పాల్‌ సెంచరీలు
భారత్‌ రెండో ఇన్సింగ్‌ టార్గెట్‌ 180
ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
 
భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడోవ టెస్టు మ్యాచ్‌ డ్రా అయ్యింది. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 322 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. చందర్‌పాల్‌ 116, ఎడ్వూర్స్‌ 110 ఇద్దరు సెంచరీలు చేశారు. విండీస్‌ 10 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. వన్‌డౌన్‌గా వచ్చిన ఎడ్వూర్స్‌ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి భారత్‌ బౌలింగ్‌ దీటుగా ఎదుర్కొన్నాడు. 195 బంతులలో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. ఎడ్వూర్స్‌కు తోడుగా చందర్‌పాల్‌ సహయం చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు కనీసం 20 పరుగులు కూడ చేయలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్‌, సురేష్‌ రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.ఇషాంత్‌ శర్మ ఒక వికెట్లు లభించింది. భారత్‌ 180 టార్గెట్‌ ఇచ్చింది. రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఓపెనరు ముకుంద్‌ డకౌట్‌గా అయ్యాడు. మురళీ విజరు, ద్రావిడ్‌ ఇద్దరు మ్యాచ్‌ని గెలిచే ప్రయత్నించారు. మురళీ విజరు 45 పరుగుల వద్ద అవుట్‌ కావడంతో స్కోరు బోర్డు కాస్త మెల్లగా నడిచింది. సురేష్‌ రైనా 8 పరుగులు చేసి నిరశాపరిచాడు. ద్రావిడ్‌ 34, లక్ష్మణ్‌ 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Friday, July 8, 2011

మూడోరోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ 308/6

 భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్స్‌లు నాలుగు అర్ధసెంచరీలు చేశారు. ముకుంద్‌ 62, లక్ష్మణ్‌ 56, రైనా 50, ధోని 65 పరుగులు చేశారు. మురళీ విజరు 5, ద్రవిడ్‌ 5, కోహ్లి 30 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మూడో రోజు భారత్‌ ఆట ముగిసే సమాయానికి 308 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కెప్టెన్‌ ధోని 65, హర్భజన్‌ సింగ్‌ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్‌ లీడ్‌ ఇప్పటికే 104 అదిక్యతం ఉంది. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్స్‌, స్వామీ చెరో రెండు వికెట్లు తీయగా, బిస్‌వో, చందర్‌పాల్‌ ఇద్దరికి చెరో వికెటు లభించింది.

Wednesday, July 6, 2011

మొదటి రోజు వెస్టిండీస్‌ 75/3


 భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ప్రారంభంమయింది. టాస్‌ గెలిచి భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ జట్లులో ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌పటేల్‌, ప్రవీణ్‌కఁమార్‌ ముగ్గురు పేస్‌ బౌలర్‌తో బరిలోకి దిగారు. టాస్‌ ఓడి బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 35 పరుగులుకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్‌ ( 12), పోవెల్‌ (3), ఎడ్వ్‌ర్స్‌ (6) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మ మరో సారి తన సత్తా నిరుపించాడు. ప్రవీణ్‌కుమార్‌ ఒక వికెట్టు లభించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండో రోజుకి వాయిదా పడింది. చివరికి క్రీజులో బ్రావో 22, చందర్‌పాల్‌ 17 పరుగులతో ఉన్నారు.