పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్,...,మురుగదాస్! చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహించే జాబితాలోని పేర్లివి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..కచ్ఛితంగా 150వ సినిమా పూర్తిచేయాలని.. సాక్షాత్తూ బిగ్బి అమితాబ్ స్వయంగా కోరిన నేపథ్యంలో చిరు ‘సరే’నని మాట ఇచ్చారు. అది నిలబెట్టుకుంటూ..ఎట్టకేలకు మురుగదాస్ వినిపించే కథ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఫిలినగర్లో చర్చ సాగుతోంది. గజని, సెవెన్త్సెన్స్ -వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన మురుగ..అదే స్థాయి కథ కోసం మరోసారి కసరత్తు చేస్తున్నారని, ఈ మెగాప్రాజెక్టును తనదైన బాధ్యతతో పూర్తి చేయాలని భావిస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి.
Tuesday, December 6, 2011
గోపిచంద్ తర్వలో పెళ్లి కొడుకుగా చూడొచ్చు
గోపీచంద్ తర్వలో పెళ్లి కొడుకుగా అవుతున్నాడు. హైదరాబాదుకు చెందిన హరితతో గోపీచంద్కు పెళ్లి ఖాయమైనట్లు సమాచారం. హరిత కుటుంబానికి సినిపరిశ్రమతో సంబంధాలు లేవు. వారికి నగరంలో పలు వ్యాపారాలున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. తర్వలోనే నిశ్చయ తాంబూలాలు మార్చుకోబోతున్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుంది.
Saturday, December 3, 2011
మూడు భాషల్లో బిజినెస్...
Wednesday, November 30, 2011
నేడు సినీ హీరో రామ్చరణ్ నిశ్చితార్థం
నేడు ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే చిరంజీవి తనయుడు రామ్చరణ్తేజ, అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి మనుమరాలు ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఈ నిశ్చితార్థనికి మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని అపోలో ఫాంహౌస్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫాంహౌస్ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ముందు ప్రతాప్రెడ్డి సొంత జిల్లా అయిన నిజామా బాద్లోని తన సొంత కోటలో నిశ్చితార్థం నిర్వహించాల నుకున్నారు. అనంతరం హైదరాబాద్ నగరా నికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండే విధంగా నిశ్చితార్థ వేదికను ఈ ఫాంహౌస్కి మార్చారు. 20 రోజులుగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నిశ్చితార్థం ప్రాంగణాన్ని తయారు చేశారు. వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు దేశ రాజధాని నుంచి వివిఐపిలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ను ఏర్పాటు చేశారు.
హాజరుకానున్న ప్రముఖులు
చిరంజీవి కుమారుడు రామ్చరణ్తేజ నిశ్చితార్థానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ అధికారులు సైతం హాజరవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరానికి చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిలోమీటర్ దూరంలో నిశ్చితార్థ వేదిక ఏర్పాట్లు చేశారు. వివిఐపిలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వివిఐపిల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నగరానికి దగ్గరలో ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని నుంచి కొందరు ప్రముఖులు రావడంతో విమానాశ్రయానికి చేరువలో ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నిశ్చితార్థం ప్రాంగణంలోనికి వివిఐపిలకు ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. విలేకర్లను మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు.
Tuesday, November 29, 2011
తొలివన్డేలో భారత్ గెలుపు
వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య బారబతి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ పోటీ చూసేందుకు తొలినుంచి ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టాస్నెగ్గిన ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ వెస్టిండీస్ను నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు పడగొట్టి 211 పరుగలకే కట్టడి చేసింది. ఆ తరువాత 212 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 60 పరుగలకే 5 వికెట్లు కోల్పోయి చతికిలపడింది. ఆ దశలో రోహిత్శర్మ, జడేజాలు నిలదొక్కుకుని భారత్ స్కోరును నెమ్మదిగా పెంచారు. చివర్లో వికెట్లు వడివడిగా పడినప్పటికీ భారత్ 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి ఒక వికెట్టు వియాన్ని సాధించింది. రోహిత్ 72 పరుగులు చేసి వన్డేల్లో 9వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
Monday, November 28, 2011
బాలీవుడ్లోకి అల్లరి నరేష్
అల్లరి వేషాలతో తెలుగులో టాప్ కామెడీ హీరోగా మారిన అల్లరి నరేష్ త్వరలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై నరేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా ప్రియదర్శన్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ కాబోతోంది. అందులో నన్ను నటించమని అడిగారు, కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నరేష్ చెప్పుకొచ్చారు.
Friday, November 25, 2011
వెస్టిండీస్తో మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక , కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్
వెస్టిండీస్తో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు.. కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్ని ఎంపిక చేశారు. గంభీర్, కోహ్లీ, పార్థివ్ పటేల్, రహానే, మనోజ్తివారీ, రైనా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, వరుణ్ ఆరోన్, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్కుమార్, వినయ్కుమార్కు టీమ్లో స్థానం కల్పించారు. ధోనీ, సచిన్, యువరాజ్ సింగ్లకు విశ్రాంతి కల్పించారు. హర్భజన్కు చోటు దక్కలేదు.
Sunday, November 13, 2011
ఇంటివాడయిన క్రికెటర్ అశ్విన్
భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం ఇక్కడి రాఘవేంద్ర కల్యాణమండపంలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్ను సంప్రదాయబద్ధంగా అశ్విన్ వివాహం చేసుకున్నాడు. గత వారం ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 9వికెట్ల తీసిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట కోల్కతా వెళ్లే అవకాశం ఉంది. కోల్కతాలో సోమవారం నుంచి వెస్టిండీస్తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ అడాల్సి ఉన్న విషయం విదితమే.
Subscribe to:
Posts (Atom)

