Thursday, February 17, 2011

ఘనంగా ప్రపంచ కప్‌ ప్రారంభోత్సవం

 నలభై ఐదు రోజుల పాటు అభిమానులను ఆనందోత్సాహాల్లో నింపేందుకు క్రికెట్‌ కార్నవాల్‌గా అభివర్ణించతగ్గ ఐసిసి ప్రపంచకప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ రాజధాని నగరంలోని చారిత్రాత్మకమైన బంగబంధు స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ మెగా పండుగను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు.
 వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్‌ తిరిగివచ్చింది.
 బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్‌ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం. ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు.

ఘనంగా ప్రారంభమైన ప్రపంచకప్‌ వేడుకలు

 ప్రపంచకప్‌ క్రికెట్‌ ఆరంభ కార్యక్రమాలు ఢాకా నగరంలోని బండబందు స్టేడియంలో ఘనంగా ప్రారంభమైనాయి. వివిధ దేశాలకు చెందిన కెప్టెన్లను బంగ్లాలోని సంప్రదాయ రిక్షాలో కూర్చో బెట్టి స్టేడియంలోకి తీసుకువచ్చారు. ఈ టోర్నిలో 14 దేశాలు, 210 మంది క్రీడాకారులు పాలుపంచుకున్నారు.

ఐసుపై మోజు పడ్డ సంజు!


అమితాబ్‌-హేమమాలిని జంటగా రూపొంది ఘన విజయం సాధించిన ‘సత్తే పె సత్తే’ చిత్రాన్ని సంజయ్‌దత్‌తో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో హేమమాలిని పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.అయితే.. విద్యాబాలన్‌ను తామెప్పుడూ అనుకోలేదని, తొలుత నుంచి ఈ పాత్రకోసం ఐశ్వర్యను మాత్రమే తాము అనుకుంటూ వచ్చామని హీరో సంజయ్‌దత్‌ చెబుతున్నాడు.ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. ఆరుగురు తమ్ముళ్లకు వదినగా ఐశ్వర్య అయితేనే బాగుంటుందని భావిస్తున్న సంజయ్‌దత్‌.. ఆమె డేట్స్‌ కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించేందుకు తాను సిద్ధమేనంటున్నాడు. అటు ఐశ్వర్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.కాబట్టి.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లడం ఖాయం!

ఐపీఎల్‌-4 షెడ్యూల్‌ విడుదల


అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌-4 టోర్నీ షెడ్యూల్‌ను ఐపీఎల్‌ పాలకమండలి బుధవారం ఇక్కడ విడుదల చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఇంకా దీనికి తుది ఆమోదాన్ని ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వం వహిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెనై్న సూపర్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య చెనై్నలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28 వ తేదీన టోర్నీ నిర్వహించబోయే కొన్ని నగరాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నందున్న ఆయా రాష్ట్రాల అధికారులను సంప్రదించిన అనంతరం. టోర్నీ షెడ్యూల్‌కు తుది అమోదాన్ని ఇస్తామని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ చిరాయు అమీన్‌ వెల్లడించారు.
74 మ్యాచులు: టోర్నీలో మొత్తం 74 మ్యాచులను నిర్వహించనున్నారు. వీటిన నిర్వహణ కోసం వివిధ నగరాల్లో ఎంపిక చేసిన 13 వేదికలను ఎంపిక చేశారు. ఈ మ్యాచులన్నీ మొత్తం 51 రోజుల పాటు జరగనున్నాయి.
క్రొత్త ఫార్మాట్‌
ఈసారి టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్‌ మ్యాచులను ఆడాల్సి ఉంటుంది. ఈ ప్లే ఆఫ్‌ మ్యాచులను క్వాలిఫైయర్‌-1, 2 లుగా వర్గీకరించారు. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆ తర్వాతి దశ అయిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌-1 (క్వాలిఫైయర్‌-1)లో పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది.

Tuesday, February 15, 2011

శక్తి వాల్‌పేపర్స్‌ విడుదల

                                               శక్తి వాల్‌పేపర్స్‌ 
 





Monday, February 14, 2011

ఐదు రోజుల్లో దొంగల ముఠా సినిమా ఘాటింగ్‌ పూర్తి

 దొంగల మూఠా సినిమా ఘాటింగ్‌ మునుపే చెప్పినట్లుగా ఐదు రోజుల్లో , కేవలం ఎనిమిది మంది క్య్రూమెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తియ్యింది. అందరూ ఊహించుకున్నట్లుగా ఘాటింగ్‌ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్‌తో కాకుండా కేవలం సాదారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్ధేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది.
ఇంత వరకూ మొత్తం ఫిలం ఇండ్రస్టీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్‌ లోనే ఒక సరి కొత్త అధ్యాయానికినాంది. నాలుగు కెనాన్‌ కెమెరాలను ఉపయోగించి. ఒకేసారి నాలుగు అంగిల్స్‌ లో ప్రతీ షాట్‌ తీయడం వల్ల అత్యంత వేగంగా ఘాట్‌ చేయడం సాధ్యపడింది.
అసలు లైట్స్‌ మరియు డాలి, జిబ్‌ మొదలుగు ఎక్విప్‌మెంట్స్‌ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్‌లో చేయడం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్‌ రాజ్‌, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజ్‌, బ్రహ్మాజి, మరియు సుప్రిత్‌ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్‌ తో నిర్మించడం జరిగింది. ఆక్టర్లకని గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్‌ ఇవ్వబడలేదు. మార్చి 4న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది.

ప్రాక్టీస్ గెలుపు

బౌలర్ల విజయం

ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆదివారం నాడిక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విఫలమై 214 పరుగులకు ఆలౌటైనప్పటికీ బౌలర్లు, ముఖ్యంగా పియూష్‌ చావ్లా, హర్భజన్‌ సింగ్‌ భారత్‌కు అద్భుత విజయం అందించారు. వన్డే మ్యాచ్‌ మజాను భారత బౌలర్లు అందించారు. ఒక వికెట్‌ నష్టానికి 118 పరుగులతో విజయంవైపు దూసుకెళుతున్న ఆసీస్‌కు పియూష్‌ చావ్లా అడ్డుకట్ట వేసాడు. చావ్లా తొమ్మిది ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ సింగ్‌ ఐదు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ 37.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. రెండో వార్మప్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో జరుగుతుంది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 214 పరుగులు మాత్రమే చేయ్యగలిగింది. భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత్‌ నిర్ణీత 44.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఒక్కడే భారత బ్యాట్స్‌మెన్‌లో రాణించి అర్ధసెంచరీ చేసాడు. సెహ్వాగ్‌ 56 బంతులను ఎదు ర్కొని ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసాడు. వీరూ తరువాత చెప్పు కోతగ్గ స్కోరు చేసింది యూసుఫ్‌ పఠాన్‌. పఠాన్‌ 38 బంతుల్లో రెండు సిక్సర్లతో 32 పరు గులు చేసాడు. 

 కెనాడాపై బంగ్లా విజయం
చిట్టగాంగ్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. తొలిగా బ్యాటింగ్‌ చేసిన కెనాడా 37.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్‌ కాగా విజయానికి అవసరమైన 113 పరుగులను బంగ్లాదేశ్‌ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఇంకా 184 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ 69, ఇమ్రుల్‌ కేయిస్‌ 39 పరుగులు చేసారు. తొలి వికెట్‌కు వీరు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌలింగ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ రాణించి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
కెన్యాపై విండీస్‌ విజయం
కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెన్యాను 45.3 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్‌ చేసింది.  
గుప్తిల్‌ సెంచరీ
ఐర్లండ్‌తో శనివారం నాగపూర్‌లో జరిగిన మరో వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ గుప్తిల్‌ సెంచరీ చేసాడు. గుప్తిల్‌ సెంచరీతోపాటు వన్‌డౌన్‌ జెస్సీ రైడర్‌ 48, ఫ్రాంక్లిన్‌ 49 పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆరంభంలోనే బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ రెండో వికెట్‌కు రైడర్‌, గుప్తిల్‌ 79 పరుగులు చేయడంతో కోలుకుంది. టేలర్‌ 33 పరుగులు చేయడంతోపాటు గుప్తిల్‌తో కలసి 47 పరుగులు జోడించాడు. ఇందులో టేలర్‌ వాట 33 పరుగులు . గుప్తిల్‌ 134 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లతో 130 పరుగులు చేసాడు. ఐర్లండ్‌ ఓపెనర్‌ పోర్టర్‌ఫీల్డ్‌ 72 పరుగులు చేయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లండ్‌ 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
  శ్రీలంక
మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా నెదర్లాండ్స్‌ 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధసెంచరీలు చేయడం విశేషం. 

పోటీ మా ముగ్గురు మధ్యే ...

భారత జట్టులో స్థానం కోసం విరాట్‌ కోహ్లీ, యూసుప్‌ పఠాన్‌ మధ్య తీవ్రంగా పోటీ మొదలైయిదని సురైష్‌ రైనా అన్నాడు. ఏడుగురు బ్యాట్‌మైన్స్‌లో సచిన్‌, వీరు, గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీలు ఖారారు కాగా.... మిగిలినా రెండు స్థానాలు కోసం పోటీ ముగ్గురు తలపడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌కోహ్లీ, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు రాణించగా.. రైనా విఫలమవడంతో అతని స్థానానికి ముప్పు వచ్చింది.