‘సరైనోడు’తో విలన్గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
Saturday, June 11, 2016
అనుష్కకి జోడీగా?
‘సరైనోడు’తో విలన్గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
Thursday, June 9, 2016
ఒక ప్రశ్న... ముగ్గురి పోరాటం
చర్చి ఫాదర్ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు...‘‘పాప గురించి ఏమైనా తెలిసిందా’’
ఓ పోలీసు అధికారిణి న్యాయం కోసం చూస్తోంది...
ఓ తాత నిజం కోసం ఎదురుచూస్తున్నాడు...
ఈ ముగ్గురు కలసి ఒకే విషయమై పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వేధిస్తోన్న ఓ నిజాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ పోరాటం ఎవరిపై.. ఏ విషయంలో... ఎందుకు... అనే విషయాలు తెలియాలంటే ‘తీన్’ చూడాల్సిందే. అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రిబుదాస్ గుప్తా దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
- తన కళ్ల ముందే కిడ్నాపైన మనవరాలి కోసం తాత జాన్ బిశ్వాస్ ప్రశ్న!
‘‘ఎనిమిదేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు...’’
- ఇదీ పోలీసు అధికారిణి సరితా సర్కార్ సమాధానం!
‘‘అంతకుమించి నా దగ్గర ఇంకో ప్రశ్న లేదు...’’ కన్నీళ్లు తుడుచుకుంటూ జాన్ బిశ్వాస్ స్టేషన్ నుంచి బయటికొచ్చేస్తాడు.
ఇది పోలీసు స్టేషన్లో జరిగే ప్రధాన సన్నివేశం. పోలీసు స్టేషన్కు వచ్చేముందు జాన్ బిశ్వాస్ (అమితాబ్ బచ్చన్) ఓ టేపు రికార్డర్లో ఓ చిన్న పిల్ల మాటలు, ఏడుపు విని వస్తాడు. ఈ రోజే కాదు గత ఎనిమిదేళ్లుగా ఇంతే. స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా రాత్రి వరకు వూరంతా ఓ పాప ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఓ రోజు ఇలా పోలీసు స్టేషన్కు వెళ్తుంటే జాన్ కళ్లముందే ఓ చిన్న పిల్లాడు అపహరణకు గురవుతాడు. దీంతో సరితా సర్కార్ (విద్యా బాలన్) నేతృత్వంలో పోలీసు బృందం గాలింపు ముమ్మరం చేస్తుంది. గతంలో పోలీసుగా పని చేసి ప్రస్తుతం చర్చి ఫాదర్గా ఉంటున్న మార్టిన్ దాస్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) సహాయం తీసుకుంటారు. అడ్డంకులు దాటి ఆ ముగ్గురు ఈ మిస్టరీ చేధించారా? అనేదే కథ. దక్షిణ కొరియాలో విజయవంతమైన ‘మాంటేజ్’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్ బచ్చన్ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.
హీరోయిన్ని ఇంట్లో నుంచి గెంటేశారు
మోడల్, బాలీవుడ్
నటి అలీసా ఖాన్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్
హష్మికిజంటగా అలీసా ఓ చిత్రంలో నడుస్తోంది. రాత్రి వేళ్లల్లో ఇంట్లో ఉండాల్సిన అలీసా
దిల్లీ వీధుల్లో ఒంటరిగా తిరుగుతుండడం మీడియా గమనించి ఏం జరిగిందని ఆరా
తీశారు. తన మాజీ ప్రియుడు అసభ్యకర వీడియోలన్నీ తీసి బెదిరిస్తుండడంతో
పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ విషయం తెలిసి తల్లి, సోదరుడు తనని ఇంట్లో
నుంచి గెంటేశాడని అలీసా మీడియాకి తెలిపింది. ఎటూ వెళ్లలేక గుళ్లలో, స్నేహితుల
ఇళ్లలో తల దాచుకుంటున్నానని అలీసా తెలిపింది. పోలీసులు విషయం తెలుసుకుని
అలీసా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు.
కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలసి ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో కోహ్లీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫొటోలు దిగి సందడి చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి ముందు అనూహ్య సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది. యువీ సహనం కోల్పోయేలా చేసిన ఆ ప్రశ్న ఏంటంటే.. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. 'ఈ ఈవెంట్ గురించి మాట్లాడేందుకు ఇక్కడి వచ్చా. క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదు. ఓకే..? థ్యాంక్యూ' అంటూ మీడియా ప్రతినిధులకు మరో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా యువీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా యువీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈవెంట్ లో అందరితో కలసి హుషారుగా పాల్గొన్నాడు.
Wednesday, June 8, 2016
‘ఆషిఖీ-3’లో అన్నీ నేనే పాడుతా!
మహేశ్భట్
వారసురాలిగా బాలీవుడ్లోకి
అడుగుపెట్టింది ఆలియాభట్.
విభిన్న పాత్రల్లో నటిస్తూ
మెప్పిస్తోంది. రొమాంటిక్
చిత్రం ‘ఆషిఖీ 3’లో ఈ భామ నటించేందుకు
సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో
ఆలియా పలు ఆసక్తికరమైన విషయాలు
వెల్లడించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా 2013లో వచ్చిన ‘ఆషిఖీ 2’ రొమాంటిక్ మ్యూజికల్ హిట్గా నిలిచింది. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదేస్థాయిలో ‘ఆషిఖీ 3’ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలు తానే పాడనున్నట్లు ఆలియాభట్ తెలిపింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని చెప్పిన ఈ అమ్మడు... సెట్స్పైకి ఎప్పుడు వెళ్లనుందో మాత్రం తెలియదంటోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా 2013లో వచ్చిన ‘ఆషిఖీ 2’ రొమాంటిక్ మ్యూజికల్ హిట్గా నిలిచింది. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదేస్థాయిలో ‘ఆషిఖీ 3’ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలు తానే పాడనున్నట్లు ఆలియాభట్ తెలిపింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని చెప్పిన ఈ అమ్మడు... సెట్స్పైకి ఎప్పుడు వెళ్లనుందో మాత్రం తెలియదంటోంది.
స్టెప్పులు అదిరిపోతాయ్
ఎన్టీఆర్
డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని
మరీ బరిలో దిగాడేమో, ఎలాంటి భంగిమనైనా చిటికెలో చేసేస్తాడు. మెరుపు
కంటే వేగంగా కాలు కదుపుతాడు. ఈసారి ‘జనతా గ్యారేజ్’లోనూ అలాంటి స్టెప్పులతోనే
అదరగొట్టబోతున్నాడట. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న
చిత్రమిది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సమంత, నిత్యమేనన్ కథానాయికలు.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నుంచి ఎన్టీఆర్,
సమంతపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తారు. రామజోగయ్యశాస్త్రి రాసిన
ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట
కోసం కళా దర్శకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు సెట్లు వేశారు. ‘‘డ్యాన్సుల
విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. ప్రతి పాటలోనూ
కొత్తదనం చూపిస్తారు. అయితే ఓ పాట మాత్రం మాస్ అభిమానుల్ని అలరించే విధంగా
ఉంటుంది. ఈ పాట అదే. ఈ సినిమాలో ఈ పాట చాలా ప్రత్యేకం. దానికి తగ్గట్టు ఎన్టీఆర్
డ్యాన్సులు కూడా అదిరిపోతాయ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ
ప్రసాద్
నచ్చితే కొనేస్తా!
కథానాయికగా త్వరలో కాజల్ అగర్వాల్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు.
హీరోయిన్లు ఇన్నేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. పైగా ఇంకా బిజీగా ఉండటం
అంటే చిన్న విషయం కాదు. ఏంటా సీక్రెట్? అనే ప్రశ్న కాజల్ అగర్వాల్
ముందుంచితే - ‘‘సినిమా సినిమాకీ నటిగా ఇంప్రూవ్ అవుతుంటాను. కొత్త కొత్త
పాత్రలు సెలక్ట్ చేసుకుంటుంటాను. అన్నింటికన్నా మించి సక్సెస్ని
నెత్తికెక్కించుకోను. కష్టపడటానికి వెనకాడను’’ అన్నారు. ఒకవైపు సినిమాలు
చేయడంతో పాటు మరోవైపు కొన్ని బ్రాండ్స్కి ప్రచారకర్తగా కూడా
వ్యవహరిస్తున్నారామె.
మరి... డ్రెస్సుల విషయంలో మీరు బ్రాండ్కి ప్రాధాన్యం ఇస్తారా? అని కాజల్ని అడిగితే - ‘‘బ్రాండ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్లే.. నేను స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుంటాను. బట్టలకు కూడా దీన్ని ఆపాదించొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో పాటు చిన్న చిన్న షాఫుల్లో, స్ట్రీట్ సైడ్ కూడా కొంటాను. వాటిని బ్రాండెడ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసి, వేసుకుంటా. ఏది కొన్నా నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా’’ అని చెప్పారు.
మరి... డ్రెస్సుల విషయంలో మీరు బ్రాండ్కి ప్రాధాన్యం ఇస్తారా? అని కాజల్ని అడిగితే - ‘‘బ్రాండ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్లే.. నేను స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుంటాను. బట్టలకు కూడా దీన్ని ఆపాదించొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో పాటు చిన్న చిన్న షాఫుల్లో, స్ట్రీట్ సైడ్ కూడా కొంటాను. వాటిని బ్రాండెడ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసి, వేసుకుంటా. ఏది కొన్నా నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా’’ అని చెప్పారు.
అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!
రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు. దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్ని డూప్స్తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్ని డూప్తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట. ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)





