Thursday, March 26, 2015

యువరాజ్ లేని లోటు కనబడింది!

            టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అవసరం జట్టుకు ఉందా?అంటే అవుననే సమాధానమే వస్తుంది. టీమిండియా 2011 వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవడంలో యువరాజ్ పాత్ర మరువలేనిది. ఆ టోర్నమెంట్ లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువరాజ్ ను 2015 వరల్డ్ కప్ కు వచ్చేసరికి పక్కన పెట్టారు. యువరాజ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నా కూడా జట్టులో స్థానం కల్పించలేదు. ఆ డాషింగ్ హీరో లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడింది.

                       2011 వరల్డ్ కప్ లో యువరాజ్ బ్యాటింగ్ లో అదరగొట్టి కప్ ను తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించాడు. యువరాజ్ 113 పైగా సగటుతో 362 పరుగులు చేయడమే కాకుండా..  బౌలింగ్ లో 15 వికెట్లను కూడా తీశాడు. టోర్నీ ఆద్యంతం తనదైన ముద్ర వేసిన యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ టోర్నమెంట్ లో ఆసీస్ తో్ జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువరాజ్ 57 పరుగులతో నాటౌట్ గా ఉండటమే కాకుండా.. రెండు కీలక వికెట్లను తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 

                    అదే యువరాజ్ ఉండి ఉంటే అనే ప్రశ్న ఇప్పడు సగటు భారత క్రీడాభిమానికి కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ టోర్నమెంట్ లో జడేజా అవసరం ఉందా?అంటే అది ముమ్మాటికీ కానేకాదు అనే సమాధానమే వస్తుంది. ఈ సిరీస్ లో ఏ మ్యాచ్ ల్లో అంచనాలమేర రాణించని జడేజా నాలుగు మ్యాచ్ ల్లో 43 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు తీశాడు. ఇది పూర్తి స్థాయి ఆల్ రౌండర్ ప్రదర్శన అనడం సబబేనా? అంటే దీనికి క్రికెట్ విశ్లేషకులే స్పందించాలి.

Tuesday, March 24, 2015

పైనల్‌లో న్యూజిలాండ్‌

                           అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్‌ పైనల్స్‌కి చేరుకుంది. దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని వర్షం కారణంగా 43 ఓవర్లలో 281/5 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ ముందు భారీ లక్ష్యం ఉంచగలిగింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ప్రతి ఒక్కరు సమిష్ఠంగా రాణించడంతో పైనలో అడుగుపెట్టింది. ప్రపంచకప్‌లో పైనల్‌కి చేరటం న్యూజిలాండ్‌కు ఇది మొదటి సారి. స్టెయిన్‌ వేసిన చివరి ఓవర్లలో ఐదో బంతి సిక్స్‌గా కొట్టి జట్టుకు విజయాన్ని అందిచటంతో న్యూజిలాండ్‌ ఆటగాళ్లందరిలో ఉత్సాహాతో ఎగిరి గతువేశారు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానంలో కన్నీటిపర్యంతమై కుప్పకులిపోయారు. ప్రపంచకప్‌ చరిత్రలో అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల్లో ఇది ఒకటి. వరుసగా ప్రపంచకప్‌లో ఓటమి చవి చూడకుండా గెలుపుతో మరో అడుగు ముందుకు వెళ్లింది న్యూజిలాండ్‌ జట్టు.
                        మ్యాచ్‌కు ముందు పైనల్‌ చేరుతామని గట్టి ధీమా వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డివిలియర్స్‌ మ్యాచ్‌ అనంతరం జట్టులో సభ్యులు కన్నీటితో నిరుత్సహాంతో ఉండిపోయారు. 
  298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతివరకు పోరాటం చేసి 2015 ప్రపంచకప్‌ పైనల్‌లో అడుగుపెట్టింది. ఓపెనరు మెక్‌కల్లమ్‌ సుడిగాలి ఇన్సింగ్స్‌ అని చెప్పవచ్చు. బౌలర్‌ ఎవరరైనా సరే బాదుడు బాదుడే. న్యూజిలాండ్‌ 5 ఓవర్లలో 71 పరుగులు చేసింది. బ్రాండ్‌ మెక్‌కల్లమ్‌ 25 బంతులల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది పోర్లు సహాయంతో 59 పరుగులు చేశాడు. అతను ఉన్నంత సేపు స్టేడియం నాలువైపుల బౌండరీలతో మోత మోగించాడు. మరో వైపు గప్తిల్‌ కేవలం 6 పరుగులు చేశాడు. మెక్‌కల్లమ్‌ అవుట్‌ అయినా తరువాత విలియమ్‌ సన్‌ కేవలం 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. గప్తిల్‌, రాస్‌ టెలర్‌ ఇద్దరు మరో వికెటు పడ్డకుండా జాగ్రత వహించారు. అవకాశం వచ్చినప్పడల్లా గప్తిల్‌ బౌండరీలతో స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో అనవసరం రన్‌ కోసం వెళ్లి రనౌట్‌గా గప్తిల్‌ అవుట్‌ అయ్యాడు. రాస్‌ టైలర్‌ 30 పరుగులు చేసి డుమిని బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి న్యూజిలాండ్‌ జట్టు 150 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కోరె అండర్సన్‌, ఎలియెట్‌ ఉన్నారు. ఇప్పటిలో వికెటు పడింతే దక్షిణాఫ్రికా విజయాన్ని ముందు వచ్చేంది. కాని అవకాశం సద్వినియేగం చేసుకోలేకపోయింది. కోరె అండరసన్స్‌ 39 పరుగులు ఉన్నప్పడు రనౌట్‌ మిస్‌ చేసింది. అప్పటికే న్యూజిలాండ్‌ జట్టు అవసరం వచ్చినప్పడల్లా బౌండరీలతో స్కోరు బోర్డు ముందుకు నడిపించారు. కోరె అండరసన్‌ 57 బంతులల్లో ఆరు పోర్లు, రెండు సిక్స్‌లతో అర్థ సెంచరీ పూర్తి చేసి మౌర్కెల్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. స్కోరు దగ్గర పడుతుంది. 18 బంతులల్లో 29 పరుగులు చేయాలి. చివరి ఓవర్లలో ఎలియట్‌ సిక్స్‌ కొట్టి విజయం సాధించాడు.
దక్షిణాఫ్రికా జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్‌ అయ్యారు. మిడిల్డార్‌లో డెవిడ్‌ మిల్లర్‌, డివిలర్సర్‌, డుప్లెసిస్‌ రాణించడంతో అజట్టు 281 పరుగులు చేసింది. మ్యాచ్‌ మధ్యలో వర్షం రావడంతో అపెంర్లు 43 ఓవర్లకు కుదించారు.
వచ్చిన అవకాశం చేతురాలి జారవిడిచింది ....ఫీల్డింగ్‌ పొరపాట్లతో, చేతికి వచ్చిన క్యాచ్‌లను జారవిడిచి దక్షిణాఫ్రికా జట్టు చేజేతులా ఓడిపోయింది. అలాగే నాలుగు రనౌట్లు, మూడు క్యాచ్‌లు మిస్‌ చేసింది.
కాని స్టేడియంలో అభిమానులు సౌతాఫ్రికా జట్టు విజయం సాధింస్తుంది అని అభిమానులకు నిరాశ చేదారు.

Friday, February 20, 2015

చంద్రమోహన్‌కు అస్వస్థత

 సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం గుండెపోటురావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు. చంద్రమోహన్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు. రెండురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారని ఆయన చెప్పారు.

Thursday, February 19, 2015

ఐపీఎల్‌-8 యువరాజ్‌ కింగ్‌

 యువరాజ్‌ సింగ్‌ వన్డేలో స్థానంలో కోల్పోయినా ఐపీఎల్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఐపీఎల్‌-7లో 14 కోట్లు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది 16 కోట్లు అమ్ముడుపోయాడు. కాని ఏవరు ఊహించని స్థాయిల్లో ఈ సారి ఐపీఎల్‌ వేలంల్లో రికార్డు ధర పలికాడు. ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న అతని మాత్రం ఐపీఎల్‌-8లో బెంగుళూరు, పంజాబ్‌, ఢిల్లీ ఈ మూడు జట్టు యువరాజ్‌ కోసం వేలం పోటాపోటిగా ఎదురుకున్నాయి. చివరకి ఢిల్లీ 16 కోట్లుకు సోంతం చేసుకున్నంది. రంజీ మ్యాచ్‌లో ఏకంగా మూడు సెంచరీలు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. చివరిగా వన్డేలో అతను చివరిగా 2013 డిసెంబర్‌ సౌత్రాఫికా జట్టు అడాడు.
2015- ప్రపంచకప్‌లో స్థానం దక్కుతుందనే చిన్న ఆశ కూడ ఉండేది. అది కాస్థ అవిరైపోయింది. ఏదైతేనే మళ్లీ ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ రేటు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.

Wednesday, February 18, 2015

సిని రంగంలో మరో పూవ్వు నేల రాలింది...



డి.రామానాయుడు కాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నాం 3 గం|| మరణించారు. సినిమా రంగంలో అతనికి మారు పేరు మూవీ మోఘల్‌. రామానాయుడు 1936 జూన్‌ 6వ తేదిన జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. సినిమా రంగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఒక వేళ ఆ చిత్రం ప్లాప్‌ అయితే మరలా సినీరంగంలోకి అడుగుపెట్టనని సన్నిహితులతో అనేవారు. కానీ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో వెనక్కు తిరిగి చూసుకోలేదు.




నేడు సినిపరిశ్రమ బంద్‌
                 మూబీ మొఘల్‌ డా|| డి. రామానాయుడు మరణం పట్ల ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు గురువారం నాడు సినిమా పరిశ్రమ బంద్‌నకు పిలుపునిచ్చింది. అలాగే ఘూటింగులతో పాటు థియేటర్లుకూడా బంద్‌ పాటించాలని ఇదే ఆయనకు అర్పించే గౌరవమైన నివాళి అని ప్రకటనలో పేర్కొన్నారు.

 


పలు అవార్డులు

2009లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు లభించింది.
2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌తో సత్కరించింది.
అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌తో చోటు పొందారు. 





12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేశారు.
1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం తరుపున ఎంపీగా గెలుపొందారు.
2003లో బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు. 


Sunday, February 15, 2015

బెంగళూరులో ఐపీఎల్-8 వేలం


బెంగళూరులో ఐపీఎల్-8 వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో వేలం కొనసాగుతోంది. ఐపీఎల్ వేలంలో 344 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 3 కోట్లతో మురళీ విజయ్‌ను పంజాబ్ దక్కించుకుంది. రూ. 7.5 కోట్లతో ఏంజిలో మాథ్యూస్‌ను ఢిల్లీ దక్కించుకుంది.

Wednesday, December 3, 2014

వరల్డ్‌కప్‌కు భారత ప్రాబబుల్స్ ఎంపిక నేడే


ఇప్పటికే జాతీయ జట్టులో స్థానం కోల్పోయి రెండు సంవత్సరాలైనా... తిరిగి సాధించుకోవడంలో విఫలమవుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో జరుగనన్న ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేయనున్న 30 మందితో కూడిన ప్రాబబుల్‌‌సలో తన పేరుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరోసారి అవకాశమిసేం్త ఈ 36 ఏళ్ల క్రికెటర్‌ నాల్గోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆతృతతో ఉన్నాడు. ''ప్రతి క్రికెటర్‌ తన దేశం తరపున ప్రపంచ కప్‌ ఆడాలని కోరుకుంటాడు. నేను కూడా ఇప్పటికీ అదే విధంగా కలగంటున్నాను'' అన్న సెహ్వాగ్‌ అందుకే ప్రపంచ కప్‌ టోర్నీ కోసం ఎంపిక చేయనున్న 30 మంది క్రికెటర్ల ప్రాబబుల్‌‌సలో నా పేరు కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే (మూడుసార్లు) 2003, 2007, 2011 సంవత్సరాలలో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నీలో భారత్‌ తరపున సెహ్వాగ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి టైటిల్‌ సాధించగలదనే ధీమా వీరూ వ్యక్తం చేశాడు. 2011లో మేము టైటిల్‌ గెలుచుకున్నాము. 2015లో సైతం టైటిల్‌ నెగ్గే సత్తా భారత్‌కు ఉంది. టీమిండియా సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన ఆటతీరును వన్డేలో ప్రదర్శిస్తున్నారు. కాబట్టే భారత్‌కు మరో టైటిల్‌ సాధించే సత్తా ఉందని అంటున్నాను. అని అన్నాడు.
బౌన్‌‌సను నిషేదిస్తే క్రికెట్‌లో మజానే లేకుండా పోతుంది