Saturday, November 8, 2014

తల్లి పాత్రలో శ్రీదేవి

 నటిగా అందరి మనసులను దోచేసుకున్న శ్రీదేవీ ఇక తల్లి పాత్రలో కనిపించబోతోంది. హీరోయిన్ హన్సికకు తల్లిగా నటించబోతోంది శ్రీదేవి. హన్సిక తమిళ చిత్ర పరిశ్రమలో బిజీబిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హన్సిక ఈ మూవీలో మహారాణి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మహారాణి తల్లి శ్రీదేవి. వచ్చే వారం షూటింగ్ ప్రారంభం కానుంది. చింబుదేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్‌తో కలిసి హన్సిక నటించబోతోంది. చెన్నై శివార్లలో చిత్ర షూటింగ్ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.

Friday, November 7, 2014

వెంకటేష్ సరసన నదియా?

ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ కథానాయిక నదియా ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో కీలక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. త్వరలో ఆమె హీరో వెంకటేష్‌కు జోడీగా కనిపించనుందని తెలిసింది. గోపీచంద్‌తో సాహసం వంటి వినూత్న చిత్రాన్ని అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 


           వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని, ఒక పాత్రకు జోడీగా నదియా నటించనుండగా మరో పాత్ర సరసన ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.  

Wednesday, October 29, 2014

నటి శ్వేతాబసుకు విడుదలకు నాంపల్లి కోర్డు ఆదేశం

 వ్యభిచారం కేసులో అరెస్టు అయిన హీరోయిన్‌ శ్వేత బసు గత కొంత కాలంగా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంలో ఉంటున్న విషయం తెల్సిందే. ఈమెకు టాలీవుడ్‌ నుండే కాకుండా అనేక భాషల నటీనటులు, దర్శకుల నుండి మద్దతు లభించింది. తన కూతురును విడుదల చేయాల్సిందిగా నాంపల్లి కోర్టులో శ్వేత బసు తల్లి పిటీషన్‌ దాఖలు చేసింది. శ్వేతబసు తల్లి పిటీషన్‌ విచారించిన కోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. శ్వేతబసు విడుదలయిన తర్వాత తమ సినిమాల్లో అవకాశమిస్తామంటూ పలువురు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు వారంత శ్వేతను పట్టించుకుంటారో చూడాలి.

Tuesday, October 28, 2014

కలిసి కనిపించిన బాలీవుడ్‌ ప్రేమపక్షులు

  ప్రేమపక్షులుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు కలిసి.. బహిరంగంగా ఒక చోట కనిపించారు. పుణెలో ఆదివారం జరిగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆటను చూసేందుకు వీళ్లిద్దరూ కలిసి వచ్చారు.ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ జట్లలో విరాట్‌ కోహ్లీ ఎఫ్‌సీ గోవా ఫ్రాంచైజీకి సహ యజమాని.తన జట్టు ఓటమి అంచుల్లో ఉండటంతో కోహ్లీ చాలా ఆందోళనగా కనిపించగా.. తన ప్రేమికుడి ఆందోళనను అనుష్క కూడా పంచుకుంది. ఇక విరాట్‌ జట్టును ఓడించిన ఎఫ్‌సీ పుణె జట్టు సహ యజమాని „హృతిక్‌ రోషన్‌ కూడా మరికొందరు నటులతో కలిసి ఈ ఆట చూసేందుకు వచ్చాడు. అర్జున్‌ కపూర్‌, ఈషాగుప్తాలతో కలిసి ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తూ „హృతిక్‌ కనిపించాడు.

Monday, October 27, 2014

మూడు రోజుల్లో వందకోట్లు...

 షారుఖ్‌ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులన్నింటినీ చేరిపి వేస్తూ మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు దాదాపు 44 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి బాలీవుడ్ వర్గాల్ని విస్మయపరిచిన ఈ చిత్రం వారంతానికి 108.86 కోట్ల వసూళ్లకు చేరుకోవడం గమనార్హం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటించింది.

Sunday, October 26, 2014

పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు విడుదల

            సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్న పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నివాసు, శ్రీహర్షిత్ నిర్మిస్తున్నారు. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ప్రతిని రామ్‌చరణ్, అల్లు అర్జున్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ
 రామ్‌చరణ్‌తో పాటు సాయిధరమ్‌తేజ్ నాకు మరో బిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. అల్లు అరవింద్, దిల్‌రాజు, బన్నివాసు, హర్షిత్‌ల నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం ఆనందంగా వుంది. నా మొదటి సినిమా పునాదిరాళ్లు కంటే ముందు రెండవ సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ విషయంలో పునరావృతం అవుతోంది. రామ్‌చరణ్ మగధీర ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే స్థాయి విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. నేను ఏదైతే ఫాలోఅయ్యానో అదే క్రమశిక్షణను మా కుటుంబంలోని హీరోలంతా అనుసరించడం ఆనందంగా వుంది. ఈ ఇండస్ట్రీకి మరో ప్రకాష్‌రాజ్ లాంటి నటుడిగా జగపతిబాబు ఎదుగుతారు.  ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా, ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి, జగపతిబాబు,అనూప్ రూబెన్స్, బన్నివాసు, హర్షిత్, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, October 25, 2014

రెండూ సమానమే!

 తమిళంలో హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి.

ఈ సారి100కోట్ల హీరో ఎవరు?


 చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ .. వీళ్లంతా 50కోట్ల క్లబ్‌ హీరోలు. ఈ ఆరుగురిలో అరడుగుల బుల్లెట్టు పవన్‌ రికార్డుని అధిగమించే సత్తా ఎవరికి ఉంది? ఉన్నఫళాన ఎవరికైనా 100కోట్ల వసూళ్లు సాధించే సీనుందా? అంటే ఒకే ఒక్కరికి సాధ్యం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ ఒక్కరు ఎవరు? అనేదే ఈ కథాకమామీషు ... 

             టాలీవుడ్‌లో ఇప్పటివరకూ 100కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం `అత్తారింటికి దారేది' పేరు వినిపిస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాత్రమే ఇలాంటి ట్రెండ్‌ని సెట్‌ చేయగలను అని నిరూపించాడు. మరి ఆ తర్వాత ఆ రికార్డును కొట్టే మొనగాడే టాలీవుడ్‌లో లేడా? అంటే ఉన్నాడనే డిస్కషన్‌‌స సాగుతున్నాయి. చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ ఈ ఆరుగురిలో ఒక్కరికే ఆ ఛాన్సుందనేది నిజం. అయితే లేటెస్టు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్‌, మహేష్‌ ట్రాక్‌ రికార్డు ఏమంత బాలేదు. ఈ ఇద్దరూ వరుస ప్లాప్‌లతో రేసులో పూర్తిగా వెనుకబడ్డారు. అందువల్ల ఒక్కసారే అంత పికప్‌ సాధ్యపడదు. వంద కోట్లు అని రాసేసినంత సులువు కాదు వసూళ్లు రాబట్టడం. రికార్డులు తిరగరాయడం. కచ్ఛితంగా సినిమాలో స్టామినాతో పాటు, హీరో, దర్శకుడు కాంబినేషన్‌లోనూ ఆ రేంజు ఉండాలి. అలాగే చరణ్‌ ఇప్పటికే మగధీర సినిమాతో దాదాపు 88కోట్ల వసూళ్లు సాధించాడు. 100కోట్లకు చేరువలోనే ఉన్నా చరణ్‌కి ఆ స్థాయి సినిమాని ఇచ్చే దర్శకుడు టాలీవుడ్‌లో వేరెవరూ కనిపించడం లేదు. మళ్లీ రాజమౌళితో సినిమా చేస్తేనే ఆ స్థాయి వస్తుందేమో! అలాగే బన్నీ రేసుగుర్రం సినిమాతో దాదాపు రూ.65కోట్ల వసూళ్లు సాధించాడు. అతడికి ఇదే `జులాయి' తర్వాత 50కోట్ల వసూళ్లు దాటించిన సినిమా. బన్నీకి కూడా సరైన దర్శకుడు పడితే 100కోట్లు సాధ్యమే. కానీ అది అంత ఈజీ కానేకాదు. మాస్‌రాజా రావితేజ కొట్టాలంటే మ్యాజిక్‌ చేసే కథాంశం కావాల్సిందే. మరి యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కొట్టేస్తాడా? కచ్ఛితంగా .. ఆ ఛాన్‌‌స కనిపిస్తోంది. టాలీవుడ్‌ నంబర్‌ 1 డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బాహుబలి' చిత్రంతో 100కోట్లు బెంచ్‌మార్‌‌కను ప్రభాస్‌ సునాయాసంగా అధిగమిస్తాడు. ఈ సినిమా భారీ కాన్వాసుతో 300 రేంజులో తెరకెక్కుతోంది.
సౌత్‌లోనే `ఐ' చిత్రం తర్వాత దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అలాగే శంకర్‌ తర్వాత దక్షిణాదిన ఆ స్థాయి ఉన్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు ఉంది. మగధీర, ఈగ సినిమాలతో ప్రపంచస్థాయి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళి ఈసారి అంతకంటే పకడ్భందీ స్క్రిప్టుతో యూనివర్శల్‌ అప్పీల్‌తో ఉన్న సినిమాతో ముందుకొచ్చాడు. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకంగా ప్రభాస్‌ ఒక్కడే ఇప్పటికి పవన్‌ రికార్డును కొట్టేసే ఛాన్సుందన్నమాట!