Saturday, August 18, 2012

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా : లక్ష్మణ్‌

  అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌లోని హెచ్‌సీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్‌ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 16 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. 134 టెస్టుల్లో 8781 పరుగులు, 17 శతకాలు, 56 అర్ధ సెంచరీలు, 86 వన్డేల్లో 2338 పరుగులు, 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై ఈనెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక స్కోర్‌ 281 పరుగులు చేశాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. యువతకు అవకాశం కల్పించేందుకే రిటైర్మెంట్‌ అవుతున్నానని చెప్పారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, మిత్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి వాడినయ్యానని అన్నారు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మరవలేనిదని గుర్తుచేశారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Friday, July 20, 2012

మహేష్ కూతురికి పేరు పెట్టిన రాజమౌళి!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్ ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ కోసం ఓ పేరు కూడా సూచించారు.

ఆయన సూచించిన పేరు ాసితారః. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళి మహేష్ కూతురికి పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.

Tuesday, May 29, 2012

క్యాన్సర్‌ను జయించారు వీళ్లు ...

 యువరాజునూ మార్చేసింది
గౌతమి రొమ్ము క్యాన్సర్‌
యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ 
నెల్సన్‌ మండేలా 
సినీ నటి లీసారే  











http://www.prajasakti.com/coverstory/article-354838

'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరోగా నటించాను నేను ...

 ' దూకుడు ' సినిమాలో చేసిన క్యారెక్టర్‌ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీనువైట్ల గారు నా పాత్ర గురించి చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరో డైలాగుల్ని నాతో చెప్పించారు. థియేటర్‌లో ప్రేక్షకులు చూసిన ఆనందం చూసి సంతోషిచానాన్ను . అంతక ముందు చాలా సినిమాలో చేశాను. ఈ సినిమాలో చూసిన ఆనందం అంత ఇంత కాదు. ' మా నాన్న కు పెళ్లి', ' రామచక్కనోడు', ' సర్దుకుపోదాం' సినిమాలు నాకు నంది అవార్డుల్ని తెచ్చిపెట్టాయి.
http://www.prajasakti.com/cinema/article-354601

Sunday, May 27, 2012

ఐపీఎల్‌-5 విజేత కోల్‌కతా

ఐపీఎల్‌-5 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆవిర్భవించింది. చైన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా అదిలోనే ఓపెనరు గంభీర్‌ వికెటు కోల్పోయిడు. కానీ మరో ఓపెనర్‌ బిస్లా దిటుగా అడాడు. బిస్లా 89, కల్లిస్‌ 69, శుక్లా 3, యుసుఫ్‌ పఠాన్‌1 పరుగులు చేశారు. ఆఖర్లో షకిబుల్‌ 11, తివారీ 9 లాంఛనాన్ని పూర్తి చేశారు. చైన్నై బౌలింగ్‌లో హిల్ఫెనాస్‌ 2, మోర్కెల్‌, అశ్విన్‌, బ్రావో చెరో వికెటు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హస్సీ 54, విజరు 42, సురేష్‌ రైనా 73 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలింగ్‌లో షికిబుల్‌, కల్లిస్‌, భాటియా తలో వికెటు తీశారు.

జగన్మోహన్‌రెడ్డి అరెస్టు

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ, వెైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వెైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐపీసీ 120బి, 420, 409, 477-ఏ సెక్షన్‌ అవినీతి నిరోధక చట్టం 13-1 సీ మరియు డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ జగన్‌ను ఎ-1గా సీబీఐ పేర్కొంది. మూడో రోజు విచారణ అనంతరం సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. ఎంపీ సబ్బం హరి, జూపూడి ధ్రువీకరించారు. ఆస్తుల అరెస్టు కేసులో జగన్‌ది ఐదో అరెస్టు. సీబీఐ అధికారులు రేపు జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడో రోజు అరెస్టు తర్వాత జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

Saturday, May 26, 2012

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరిగింది. ... ?

 ఐపీఎల్‌ -5లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరుగుతుంది. అదే ఏమిటి అంటే చివరి రెండు మ్యాచ్‌లో ఓడిపోవడం. చూశారా చివరి రెండు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడం ఎంత తెలిగా జరిగింది. చివరి రెండు మ్యాచ్‌లు ఒకటి గెలిచినా ఫైనలో వెళ్లెంది. కాని ఒక మ్యాచ్‌ కూడా గెలవలేదు. చివరి రెండు మ్యాచ్‌లో వార్నర్‌, సెహ్వగ్‌ ఇద్దరు కావాలనే అవుట్‌ అయ్యారు. కాని ఇందులో మహేల జయవర్ణన్‌ రెండు మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు.
కాని చివరికి టైటిల్‌ చెన్నైకా కొల్‌కతా ... ?
( టైటిల్‌ చివరికి మీకా, మాకా అని ఘర్షనా జరుగుతుంది. ) 
 మనీ మోర్‌ ఎవరు ఎక్కువ ఇసై వాళ్లకే టైటిల్‌ ... ?
చెన్నై జట్టు పైనల్‌కు వెళ్లె పరిస్థితి తాడో పేడో తెలుచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న సమయంలో డెక్కన్‌ ఛార్జర్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగుళూరు రాయల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లో గెలిచి డెక్కన్‌ చార్జర్స్‌ గెలిచి ఫైనలో చెన్నై జట్టును పంపించింది. చూశారు ఎంత తెలివిగా జరిగింది. కాని ఇది చూసేవారికి ఇది నిజం అనుకుంటారు.

Friday, May 25, 2012

8 గంటలకు పైగా విచారణ చివరికి ఏమిటి ... ?

 దిల్‌కుషా అతిధి గృహంలోని సీబిఐ కార్యాలయంలో కడప ఎంపీ. జగన్‌ వివచారణ ఈరోజు ప్రారంభంమైయింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించి విచారించేందుకు జగన్‌ను పిలిపించిన సీబీఐ. ఇప్పటికే అరెస్టు కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మనందరెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో కలిపి జగన్‌ను విచారిస్తున్న సీబీఐ. సాయంత్రం 7 గంటలవరకూ విచారణ కొనసాగిపు. అన్ని ఏర్పాటు అక్కడే చేశారు. రేపు కూడా సీబీఐ జగన్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
వేర్వేరు గదుల్లో విచారణ ఎందుకు ... ?
జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందంరెడ్డిలను సీబీఐ వేర్వేరు గదుల్లో విచారిస్తుంది. ఎందుకు అన్ని వేర్వేరు గదుల్లో విచారణ. ఒకే చోట విచారణ లేదా ? అలా విచారిస్తే ఏమవుతుంది.  

రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారని జగన్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానన్నారు. రేపు 10.30 గంటలకు జగన్‌ విచారణకు హాజరు అవుతారు.