Thursday, April 21, 2011

ఐపీఎల్‌-4లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ స్థానం లభించింది

 ఐపీఎల్‌-4లో వెస్టిండీస్‌ ఓపెనరు బ్యాట్స్‌మెన్‌ గేల్‌ చోటు దక్కలేదు. ఇప్పుడు బెంగుళూరు తరఉపున అడే అవకాశం లభించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడడంతో పాటు గేల్‌ ఆఫ్‌స్పిన్‌తో కూడా సత్తా చాటగలడు. వేలంలో గేల్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించకపోవడం ఆశ్యర్యపరిచింది. ఇప్పుడు బెంగుళూరు ఆటగాడిలా అతడికి నిరూపించుకునే అవకాశం లభించింది.

దాదా కథ ముగియలేదు ....

 భారత మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీకి ఐపీఎల్‌-4లో బరిలోకి దిగే ఆశలు చిగురించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఆటగాళ్ల వేలంలో తిరస్కరణకు గురైన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కొచ్చి టస్కర్స్‌ కేరళ తరపున ఆడే అవకాశముంది. కొచ్చికి నాయకత్వం మహిస్తున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ మహేల జయవర్థనే వచ్చే నెల మొదటి వారంలో ఇంగ్లాండ్‌ పర్యటించే అవకాశముంది. దాంతో జయవర్థనే స్థానంలో గంగూలీని తీసుకోవాలని కొచ్చి ఫ్రాంచైజీ భావిస్తోంది.

Monday, April 18, 2011

శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్‌ .....

 ప్రపంచకప్‌ను వరకు శ్రీలంకకు కెప్టన్‌గా సంగక్కర ఉన్నాడు. ఇప్పుడు కొత్త కెప్టెన్‌గా ఓపెనరు దిల్షాన్‌ నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. 34 సంవత్సరాల దిల్షాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-4లో రాయల్‌ ఛాలెంజ్సర్‌ బెంగుళూరు జట్టులో అడుతున్నాడు. దిల్షాన్‌ 66 టెస్ట్‌ల్లో 42.44 సగటుతో 3990 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 203 మ్యాచ్‌ల్లో 36.61 సగటుతో, 10 సెంచరీలు, 50 అర్థసెంచరీలతో 5456 పరుగులు చేశాడు.

Sunday, April 17, 2011

సచిన్‌ కల నెరవేరింది.

 సచిన్‌ కల నెరవేరింది. టీమిండియా అనుకున్నది సాధించి జట్టు సభ్యులందరు కలసి సచిన్‌కు వరల్డ్‌కప్‌ అంకితం చేశారు. భారత జట్టు 27 సంవత్సరాల తరువాత ప్రపంచకప్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పట్టుదల, సమిష్టతత్వంతో భారత జట్టు విజయం సాధించింది. సచిన్‌కు కోసం ప్రపంచకప్‌ గెలుచుకుంటామని జాతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సచిన్‌ సెంచరీ చేయలేకపోవడంతో కొంత నిరాశ అనిపించినప్పటికీ సచిన్‌ కోరిక నెరవేరింది. తన చేతుల్లో ప్రపంచకప్‌ను చూసి మురిసిపోవాలని సచిన్‌ కన్న కలలు ఫలించాయి. మ్యాచ్‌ మూగిసిన తరువాత సచిన్‌ టెండ్కూలర్‌ని యూసుఫ్‌ పఠాన్‌ తన భూజాలపై ఎంతుకోన్ని స్టేడియం అంతటా తిరిగారు. 
అలాగే భారత జట్టు కోచ్‌ కిర్‌స్టీన్‌ను కూడా వారు తమ భుజాలపై మోసారు. భారత జట్టు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరింది. యువరాజ్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఇలా ఒక్కరి తరువాత ఒక్కరు సచిన్‌ని దగ్గరికి తీసుకోన్ని కౌగిలించుకున్నారు. గెలిచిన ఆనందంలో ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

యువరాజ్‌ హిట్‌ మ్యాచ్‌ ఫట్‌

 ఐపీఎల్‌-4లో పూణే వారియర్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 
ఢంకా మోగించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌లో బ్యాట్స్‌మెన్‌లు అందరూ సమిష్ట విజయం సాధించారు. మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు రాణించడంతో విజయం సాధించారు. టాస్‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పూణే వారియర్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరిలో యువరాజ్‌ మెరుపులు మెరింపించాడు. 32 బంతులలో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సహయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పరుగులు సాధించింది. ఓపెనర్లు ఇద్దరు దూకుడు ఆడారు. వార్నర్‌ 28 బంతులలో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 46 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. సెహ్వాగ్‌ ఎక్కువగా వార్నర్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఐదు ఓవర్లలో 52 పరుగులు చేశారు. వార్నర్‌ అవుట్‌ అయ్యాక సెహ్వాగ్‌ తన దైన శైలిలో విరుచుకపడ్డాడు. 23 బంతులలో ఆరు ఫోర్లులతో 37 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా ఇర్పాన్‌ పఠాన్‌ వచ్చాడు. యువరాజ్‌ సింగ్‌ తన మొదటి ఓవర్లలో రెండు వికెట్లు తర్వతగా తీసుకున్నాడు. హ్యట్రిక్‌ విజయం కోసం చూశాడు. కానీ వేణుగోపాల్‌రావు అవకాశం ఇవ్వలేదు. వాడే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. వేణుగోపాల్‌రావు, ఫ్నిచ్‌ ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. యురాజ్‌ సింగ్‌ నాలుగో ఓవర్లలో మళ్ళీ రెండు వికెట్లు లభించాయి. ఫిన్న్‌చ్‌ 12 బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్లులతో 25 పరుగులు చేసి జట్టు సహయపడ్డాడు. అదే ఓవర్లలో వేణుగోపాల్‌రావు ఒక సిక్స్‌, ఒక ఫోర్లు కొట్టి మరుసటి బంతికి ఔట్‌ అయ్యాడు. ఇంకా చివరి ఓవర్లలో ఆరు బంతులలో ఎనిమిది పరుగుల కావాలి. స్పిన్నర్‌ రైడర్‌కు అవకాశం ఇచ్చాడు. స్ట్రైక్‌ హోఫ్‌ ఉన్నాడు. మొదటి బంతికి సిక్స్‌ రెండో బంతికి ఫోర్లు కొట్టి మ్యాచ్‌ విజయం సాధించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స ఐపీఎల్‌-4లో మొదటి విజయం సాధించింది. పూణే వారియర్‌ మొదటి పరాజయం.

Friday, April 15, 2011

సచిన్‌ ' హిట్‌ ' ముంబయి ' ఫట్‌ '


ఐపీఎల్‌-4లో మ్యాచ్‌లో ముంబయి,కోచిల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొచ్చి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి కొచ్చి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి జాకబ్‌,సచిన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ ప్రారంభించారు. జాకబ్‌ 12 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రాయుడు. వచ్చి రావడంతో చిచ్చర పిడుగులగా సిక్స్‌ల మోత మోగించాడు. ఇద్దరు ఒక్కరి మిచ్చి ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. సచిన్‌ 66 బంతులలో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహయంతో 100 పరుగులు చేశారు. ఐపీఎల్‌-4లో ఇది రెండో సెంచరీ. రాయుడు కేవలం 33 బంతులలో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. రాయుడు చివరిలో రెండు పరుగులు కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో 182 పరుగుల చేసింది. లక్ష్యం చాలా పెద్దది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించారు. మెక్‌కల్లమ్‌, జయవర్థన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ వచ్చారు. మొదటి నుంచి పరుగులు రాబటడం ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 128 పరుగుల బాగ్యస్వామం వహించారు. మెక్‌కల్లమ్‌ 81, జయవర్థన్‌ 56 పరుగులు చేశారు. చివరిలో జడేజా 11 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 25 పరుగులు చేశాడు.

తీన్‌మార్‌ రివ్యూ

 ' తీన్‌మార్‌ ' మూడు రకాలు సినిమా వినోదం
తీన్‌మార్‌ సినిమాలో మూడు రకాలుగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాల పవన్‌కళ్యాణ్‌ రెండు విధాలుగా తెరపై కనిపిస్తాడు.మొదటిగా పవన్‌ కళ్యాణ్‌ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో ఛెప్‌ గా పని చేస్తుంటాడు. అల్లరి చిల్లరిగా వుంటూ అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటాడు. రెండోవాడిగా వారణాసిలో వుంటూ అందరికి సహాయపడుతుంటాడు. అక్కడ వసుమతి ( కృతి కర్బందా ) ప్రేమలో పడతాడు. త్రిష మొదటి పరియం అయిన తరువాత మూడు రోజులకే ( లీపూ టూ లీపూ ) పెడతాడు. అలా వాళ్ల ఇద్దరి మధ్య స్నేహం కోనసాగుతుంది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. అని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటాడు. అతలోనే త్రిషకు ఇండియాకు వెళ్ళడానికి సిద్దం అవుతుంది. అవిషయంపై పవన్‌కళ్యాణ్‌ చర్చింతుంది. అప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరోకటి లేదు అని తేలికగా తీసుకుంటాడు. వీరిద్దరు విడిపోవటం చూసిన ఒక రెస్టారెంట్‌ యజమాని- పేరు సేనాపతి ( పరేష్‌ రావెల్‌ ) సేనాపతి మైక్‌ ఒక కథ చెప్తాడు. అందులో అర్జున్‌ పాల్వారు, వసుమతి ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ చెప్తాడు. ఈ కథలో నాటి తరానికి నేటి తరానికి వున్న వ్యత్యాసాన్ని చూపిస్తారు. పవన్‌ కళ్యాణ్‌ అర్జున్‌ పాత్రలో పోషణలో మంచిమార్కులు కొట్టేస్తాడు. ఇంకా మైక్‌ పాత్రతో ఇప్పటికే ఎన్నో సినిమాలో చూసిన పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ చూపించాడు. అదే అల్లరిగా చిల్లరిగా తిరుగుతు అమ్మాయితో ఫబ్ల్‌లో డ్యాన్‌ చేయడం ఇలా చేస్తుంటాడు. త్రిష ఇండియాకు వెళ్లిపోయిన తరువాత పవన్‌కళ్యాణ్‌కు మరో అమ్మాయితో కలసి తిరుగుతుంటాడు. అప్పుడు అమ్మాయితో కలసి ఇండియాకు వెళ్లడానికి సిద్దం అవుతాడు. దానికి హోటల్‌ యజమాని మరి అప్పుడు కలగని ఫీలింగ్‌ ఇప్పడు ఎందుకు కలిగింది అని హోటల్‌ యజమాని అడుగుతాడు. తెలియదు అని సమాధానం చెప్తాతాడు. ఇండియా వెళ్లిన తరువాత త్రిషతో కలసి బయటికి వెళ్లుతాడు. కాని అప్పుడు కూడా అదే స్నేహం కొనసాగుతుంది. త్రిషకి అప్పటికే సోన్‌సూద్‌తో పరిచయం అవుతుంది. ఒక్కసారిగా త్రిష పెళ్లి విషయం పవన్‌కళ్యాణ్‌ చెప్పుతుంది. ఓకే త్యాన్‌ క్యూ అని సమాధానం చెప్పుతాడు. పెళ్లి రోజు ఇద్దరు కలసి మాట్లాడుతారు. అప్పుడు అతనిలో స్నేహం కనిపిచందు. ప్రేమ అని అర్థం అవుతుంది. సోన్‌సూద్‌తో త్రిష్‌ పెళ్లి జరుగుతుంది. అదే రోజు పవన్‌కళ్యాణ్‌కు జాబ్‌ వస్తుంది. జాబ్‌లో మంచి పేరు సంపాదింస్తాడు. ఒక రోజు పవన్‌కళ్యాణ్‌ రోడ్డుపై అమ్మాయిని రౌడిలు తీసుకు వెళ్తుతుంటే వారితో ఫైట్‌ చేసి రక్షిస్తాడు. అప్పుడు అతనికి జాబ్‌లో పెద్ద నష్టం వస్తుంది. కానీ అతక ముందే అమ్మాయిని రక్షించిన వాళ్ల బారుప్రెండ్‌ పెద్ద మొత్తంలో డాల్లర్లతో సహయం చేస్తాడు. అప్పుడే జాబ్‌కు రాజీనామ చేస్తాడు. పవన్‌కళ్యాణ్‌కు అప్పుడు అర్థం అవుతుంది. త్రిష కావాలని కోరుకుంటాడు. అప్పటికే త్రిషకు పెళ్లి కూడా అయిపోతుంది. త్రిష పెళ్లి చేసుకున్న తరువాత మరుసటి రోజు సోన్‌సూద్‌తో వీడాకులకు సిద్దం అవుతుంది. అతను ఎప్పటికైనా వస్తాడు అని త్రిష అనుకుంటుంది. చివరికి వీళ్ల ఇద్దరు ఒక్కటవుతారు. సినిమాలో పాటలు చాలా వరకు బాగున్నాయి.