Tuesday, September 27, 2016

జోడీ కుదిరిందా?

‘నేను శైలజ’ చిత్రంతో ఆకట్టుకొంది కీర్తి సురేష్‌. ప్రస్తుతం నాని ‘నేను లోకల్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈలోగా మరో మంచి అవకాశం అందుకొన్నట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్‌’గా రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయ్యాకే లింగుస్వామి ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా నటీనటుల్ని, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే పనిలో పడింది చిత్రబృందం. అధికారిక వివరాలు త్వరలో తెలుస్తాయి.

No comments:

Post a Comment