జోడీ కుదిరిందా?
‘నేను శైలజ’ చిత్రంతో ఆకట్టుకొంది కీర్తి సురేష్. ప్రస్తుతం నాని ‘నేను లోకల్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈలోగా మరో మంచి అవకాశం అందుకొన్నట్టు ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్’గా రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయ్యాకే లింగుస్వామి ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లనుంది. ఈలోగా నటీనటుల్ని, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే పనిలో పడింది చిత్రబృందం. అధికారిక వివరాలు త్వరలో తెలుస్తాయి.
No comments:
Post a Comment