Saturday, February 27, 2016

'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం
ఆ సంస్థ అధినేత అశ్వనీదత్

  తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

 గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్‌టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు.

చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్‌టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
 

'క్షణం' మూవీ రివ్యూ


కర్మ, కిస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన అడవి శేష్ మరోసారి సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం క్షణం. టాలీవుడ్ లో చాలా అరుదుగా కనిపించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్, అంతా తానే అయి సినిమాను తెరకెక్కించాడు. అదాశర్మ గ్లామర్, అనసూయ పోలీస్ లుక్ లాంటి అంశాలతో పాటు పీవీపీ లాంటి భారీచిత్రాల నిర్మాణ సంస్థ కూడా తోడవ్వటంతో క్షణం సినిమా రిలీజ్ కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను ఈ క్షణం అందుకుందా..?
కథ : ఇండియాలో మెడిసిన్ చదవడానికి వచ్చిన ఎన్నారై కుర్రాడు రిషి (అడవి శేష్), అదే కాలేజ్ లో చదివే శ్వేత (అదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన వెంటనే ఆ విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. రిషి పద్ధతి శ్వేత తండ్రికి నచ్చదు. తను ఇక్కడివాడు కాదన్న కారణంతో వారి ప్రేమను అంగీకరించడు. శ్వేతను కార్తీక్ (సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేసి రిషి అమెరికా వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత శ్వేత, రిషికి ఫోన్ చేసి తనను కలవాలంటుంది. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని అడుగుతుంది. రిషి కూడా శ్వేతకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు.

ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, శ్వేత ఇరుగుపొరుగులను కలిసిన రిషి, వాళ్లు చెప్పిన సమాధానంతో షాక్ అవుతాడు. అసలు రియా అనే అమ్మాయే లేదని, శ్వేత మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్లే తనకు కూతురు ఉన్నట్టు ఊహించుకుంటుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్వేతతో చెబుతాడు రిషి. తను ఎంతో నమ్మకంగా సాయం చేస్తాడనుకున్న రిషి కూడా తన మాట నమ్మకపోవటంతో శ్వేత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత రిషి ఏం చేశాడు..? అసలు నిజంగా శ్వేతకు కూతురు ఉందా..? ఉంటే ఏమయ్యింది..? తనకు సాయం చేయమని శ్వేత, రిషినే ఎందుకు అడిగింది..? లాంటి అంశాలన్ని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే


నటీనటులు:
ప్రతి సినిమాకు ఎంతో మెచ్యూరిటీ చూపిస్తున్న అడవి శేష్, ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ మంచి వేరియేషన్స్ చూపించి, సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కూడా మంచి వేరియేషన్స్ చూపించాడు. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అదాశర్మ ఈ సినిమాతో నటిగా కూడా మంచి మార్కులు సాధించింది. కూతురి్న పొగొట్టుకున్న తల్లి బాధను మనసుకు హత్తుకునేలా చూపించింది. తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి అనసూయ ఫరవాలేదనిపించింది. తన నుంచి అద్భుతమైన నటన ఆశించేవారికి మాత్రం నిరాశ తప్పదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు. తన పాత్రతో సినిమాకు కాస్త కామెడీ యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.