Sunday, November 28, 2010

మొదటి వన్డే భారత్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్‌ 40 పరుగుల తేడా విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 45.2 ఓవర్లలో 236 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. టేలర్‌ ఒక్కడే అర్థసెంచరీ చేశారు. మిగిత బ్యాట్‌మైన్‌ పెద్దగా రాణించలేకపోయారు. గుప్తిల్‌ 30, హౌ 9, విలియమ్‌సన్‌ 25, స్లైరిస్‌ 10, ఎలియట్‌ 5, హాప్కిన్స్‌ 16, టఫీ 4, మెక్‌కల్లమ్‌ 35, మిల్స్‌ 32 పరుగులకఁ ఔట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌, యువరాజ్‌ సింగ్‌, అశ్విన్‌ తలో మూడు వికెట్లు తీసుకొఁ మిడిల్‌ ఆర్డర్‌ను కట్టడి చేశారు. నెహ్రాకఁ ఒక వికెట్‌ లభించింది. 
అంతకముందు భారత్‌ 276 పరుగులకఁ ఆలౌటైంది. విరాట్‌ కోహ్లీ ( 105 )అద్బుత సెంచరీ చేశాడు.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కఁ దిగిన భారత్‌ ఓపెనర్లు విజరు 29, గంభీర్‌ 38, పరుగులకఁ ఔటయ్యారు. కోహ్లీ యువరాజ్‌తో కలసి మూడు వికెట్‌కఁ 88 పరుగుల స్కోరు అందించారు. యువరాజ్‌ 42 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. అ తర్వాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పెద్దగా రాణించలేకపోయారు. రైనా 13, వర్థమాన్‌ షా 4, ఆశ్విన్‌ 0, నెహ్రా 0, శ్రీశాంత్‌ 4, యుసుఫ్‌ పఠాన్‌ 29 పరుగులు చేశారు.న్యూజిలాండ్‌ బౌలర్లలలో మెకే నాలుగు, మిల్స్‌ మూడు, టఫే రెండు వికెట్లు దక్కాయి.

Wednesday, November 24, 2010

కొత్త సీఎంగా కిరణ్‌కూమార్‌రెడ్డి

 ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాజీనామా సమర్పించిన రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. కిరణ్‌కుమార్‌ రేడ్డి రేపు ఉదయం 10 గంటలకు స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తారు.

నేటి నుండి యాషెస్‌ పోరు


ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య 133 సంవత్సరాల పోరాటం మరోసారి కొనసాగనుంది. యాషెస్‌ సిరీస్‌గా పేరుగాంచిన ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ గురువారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఆండ్రూ స్ట్రాస్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా యాషెస్‌ సిరీస్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఈసారి విజేతగా నిలవాలని ఉబలాటంతో ఉంది. రికీ పాంటింగ్‌ తన నాయకత్వ గరిమను మరోసారి చాటుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. 1988 తరువాత గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా అదే రికార్డును కొనసాగించేందుకు సమయాత్తమవుతుండగా ఆసీస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని స్ట్రాస్‌ బృందం ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకుని శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉత్సుకతో ఉన్నాయి. ఇటీవలి కాలంలో సంచలన విజయాలు సాధిస్తున్న ఇంగ్లండ్‌ ఉత్సాహంతో ఉరకలేస్తుండగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్న ఆసీస్‌ వాటి నుండి పాఠాలు నేర్చుకుని తన ప్రాభవానికి ఎదురులేదని చాటుకోవాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఇటీవలికాలంలో ఆసీస్‌కు పెద్ద దిక్కుగా ఉంటున్న బోల్లింగర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేకపోవడంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు. మిచెల్‌ జాన్సన్‌పై ఆసీస్‌ ప్రధానంగా ఆధారపడుతోంది.సైమన్‌ కటిచ్‌, షేన్‌ వాట్సన్‌, మైఖేల్‌ క్లార్క్‌, మైఖేల్‌ హస్సే మాత్రమే కాదు మార్కస్‌ నార్త్‌ , బ్రాడ్‌ హాడిన్‌, జాన్సన్‌ కూడా పరుగుల వర్షం కురిపించగల సత్తా ఉన్నవారు. రికీ పాంటింగ్‌ ఈ యాషెస్‌ సిరీస్‌ను ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తున్నాడు. జాన్సన్‌తో పాటు సిడిల్‌, బెన్‌ హిల్ఫెన్హాస్‌ ఆసీస్‌ జట్టులో ప్రత్యర్థులను దెబ్బతీయగల బౌలర్లు. ఇంగ్లండ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కెవిన్‌ పీటర్సన్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌ ప్రత్యర్థులపాలిట సింహస్వప్నాలే. అలెస్టర్‌ కుక్‌ ఫామ్‌లో ఉన్నాడో, లేదో తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో పిచ్‌ ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలంగా మారగలదని నిపుణులు భావిస్తున్నారు.

Tuesday, November 23, 2010

' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదల



వెంకటేష్‌ నటించిన ' చంద్రముఖి ' సీక్వెల్‌ ' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదలయ్యే అవకాశముంది. వెంకటేష్‌ హీరోగా అనుష్క, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌ తారమణులుగా ఈ చిత్రం నటించనున్నారు. ఆడియో చాలా పెద్ద హిట్‌ కావడంతో సినిమా పై కూడాప్రేక్షకల్లో అంచనాలున్నాయి. వెంకటేష్‌ అభినయం హైలైట్‌ అవుతుంది. చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది.

నాగపూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం


న్యూజిలండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సీరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ గెలుచుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ద సీరీస్‌గా హర్భజన్‌, మ్యాన్‌ ఆప్‌ద మ్యాచ్‌గా ద్రవిడ్‌ ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సౌతీ 31 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంశ్‌ శర్మ , హర్బజన్‌ సింగ్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఓజా, రైనా ఇద్దరు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Sunday, November 21, 2010

రెండో రోజు భారత్‌ స్కోర్‌ 292/2




 న్యూజిలండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతక ముందు న్యూజిలాండ్‌ 148 పరుగులతో ఆట ప్రారంభించి మరో 45 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 292/2 పరుగులు చేసింది. సెహ్వాగ్‌, గంభీర్‌ ఇద్దరు ఆట ప్రారంభించి మొదటి వికెటు 113 పరుగుల వద్ద సెహ్వాగ్‌ వెట్లోరి బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ( 72 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్‌లతో ) 74 పరుగులు చేశాడు. గంభీర్‌ ( 127 బంతులలో 12 ఫోర్లు ) 78 పరుగులు చేశాడు. సచిన్‌ 57, ద్రావిడ్‌ 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలింగ్‌లో వెట్లోరి, సౌతీ చెరో వికెటు లభించింది. భారత్‌ 99 పరుగుల అధిక్యతం ఉంది.

Monday, November 15, 2010

న్యూజిలండ్‌ స్కోరు 273/4


భారత్‌ - న్యూజిలండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా దిశగా పయనిస్తుంది. నాల్గోవ రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 36 పరుగులు చేసి చివరి వికెటు కోల్పోయింది. భజ్జీ 116 బంతులలో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ర్‌ల సహయంతో సెంచరీ చేసి నాటౌట్‌గా మిగిలాడు. శ్రీశాంత్‌ 24 పరుగుల ఔట్‌ అయ్యాడు. భారత్‌ 122 పరుగుల అధికత్యం నిలిచింది. న్యూజిలండ్‌ రెండో ఇన్సింగ్‌ ప్రారంభించిన నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెకింతోష్‌ 49, గుప్తిల్‌ 18, టైలర్‌ 7, రైడర్‌ 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ బౌలింగ్‌లో ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీశాంత్‌ , రైనా చెరో వికెటు తీసుకున్నారు. న్యూజిలండ్‌ 115 పరుగుల లీడ్‌తో ఉంది.

Sunday, November 7, 2010

తీవ్రత తగ్గిన 'జల్‌'



కొద్దిరోజులుగా వణుకు పుట్టించిన జల్‌ తుపాను తీవ్రత తగ్గింది. తీవ్ర తుపాను నుండి సాధారణ తుపాను స్థాయికి జల్‌ తీవ్రత తగ్గినట్లు వాతావరణశాఖ ఆదివారం సాయంత్రం నిర్ధారించింది. ఇది మరింతగా బలహీనపడి చెన్నై, నెల్లూరుల మధ్య ఆదివారం రాత్రికే తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో 14 మంది, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. విశాఖ జిల్లాలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక వద్ద సముద్రంలో 15 మంది జాలర్లతో కూడిన సోనా బోటు చిక్కుకుంది. కృష్ణపట్నం రేవులో పదో నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. పులికాట్‌ సరస్సు పొంగుతోంది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల, కండలేరు జలాశయాలు నిండాయి. తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్దఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం కల్లోలంగా ఉంది.రాత్రి 7.30 గంటలకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం తుపాన్‌ చెన్నై తీరానికి 90 కిలోమీటర్లు దూరాన, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది.


దక్షిణ కోస్తా జిల్లాల వైపు నెమ్మదిగా కదులుతున్న తుపాను ఆదివారం రాత్రి 12 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను కొనసాగిస్తోంది.

అహ్మదాబాద్‌ టెస్టు : భారత్‌ 82/6


న్యూజిలండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 82 పరుగుల మాత్రమే చేసింది. లక్ష్మణ్‌ 34, భజ్జీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ గంభీర్‌ 0, సెహ్వాగ్‌ 1, ద్రావిడ్‌ 1, సచిన్‌ 12, రైనా 0, ధోని 22 పరుగులకే అవుట్‌ అయ్యారు. మార్టిన్‌ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీశాడు. భారత్‌ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Saturday, November 6, 2010

భారత్‌కు కివీస్‌ చెక్‌


uó²sÁÔYÔà ÈsÁT>·TÔáTq• yîTT<Š{ì fÉdŸT¼ eÖ«#YýË eTÖ&à sÃE qÖ«›ý²+&Ž €³eTTНd dŸeTjáÖ“¿ì ×<ŠT $¿³T¢ ¿ÃýËÎsTT 331/5 |ŸsÁT>·T\T #ûd¾+~. ÂsÕ&ƒsY 104 , $*jáTyŽTdŸHŽ 87,  yîT¿ù¿£\¢yŽT 65, fñ\sY 56 |ŸsÁT>·T\T #ûXæsÁT. uó²sÁÔY u…*+>´ýË  zC² Âs+&ƒT $¿³T¢ rdŸTÅ£”H•&ƒT. ÈVÓ²sY U²HŽ, çoXæ+ÔY,  VŸ²sÁÒÈHŽ d¾+>´ #îsà $¿³T rdŸTÅ£”H•sÁT. uó²sÁÔY ©&+>´ 156 |ŸsÁT>·T\T.

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

పరుగుల విందు



డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన బ్యాట్‌ పదునును న్యూజిలాండ్‌ బౌలర్లకు మరోసారి రుచి చూపించాడు. వరుస వైఫల్యాలతో నిరుత్సాహపరుస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి మొటేరా మైదానంలో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. వీరిద్దరూ విజృంభించి ఆడి సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌తో గురువారం నాడిక్కడ ప్రారంభమైన తొలి క్రికెట్‌ టెస్టులో భారత్‌ మొదటి రోజు మూడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్‌ తరహాలో బ్యాటింగ్‌ చేసిన సెహ్వాగ్‌ 173 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ద్రావిడ్‌104 పరుగులకు అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 237 పరుగులు జోడించి రికార్డు నెల కొల్పారు. వరుసగా తొమ్మిది టెస్టుల్లో టాస్‌ కోల్పో యిన ధోనీ ఈ టెస్టులో టాస్‌ గెలవడం తరువాయి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. బౌలర్లకు భారంగా పరిణ మించిన పిచ్‌పై భారత్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. 

తొలి వికెట్‌కు గంభీర్‌, సెహ్వాగ్‌ 12 ఓవర్లలోనే 60 పరుగులు చేసి శుభారంభం అందించారు. గంభీర్‌ అవుటైన తరువాత వచ్చిన ద్రావిడ్‌ ఆరంభంలో కొంత నిదానంగా ఆడినప్పటికీ తరువాత పుంజు కున్నాడు.సెహ్వాగ్‌తో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. సునీల్‌ గవాస్కర్‌, సురీందర్‌ అమర్‌నాథ్‌ 1976లో ఆక్లండ్‌లో 204 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును సెహ్వాగ్‌, ద్రావిడ్‌ జోడీ చెరిపేసింది. మొదటి రోజు ఆట టీ విరామం తరువాత భారత్‌ ఈ రెండు వికెట్లను కోల్పోయింది.సెహ్వాగ్‌కు టెస్టుల్లో ఇది 22వ సెంచరీ కాగా ద్రావిడ్‌కు 30వది.

Wednesday, November 3, 2010

సినిమా ఉసురు తీస్తున్నఫైరసి


కొన్ని వందల కోట్లు కర్చుపెట్టి, ప్రపంచంలోని వివిద దేశాలు తిరిగి సుందర ప్రదేశాలను అద్భుతంగా చూపించి, ఎండనక వాననక నిద్రాహారాలు మాని ఎంతో శ్రమించి నిర్మించిన సినిమా నేడు విడుదలైన రోజే ఇంటర్‌నెట్టులో ప్రత్యక్షమౌతోంది. దీంతో కోట్లు కర్చుపెట్టిన నిర్మాత కుదేలవుతున్నాడు. భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఏ నయాపైసా కర్చు లేకుండా ఇంటర్నెట్టుల్లో చూస్తూ దానికి తాము ఎంతో పొడిచినట్టు రాసే రివ్యూలు అబ్బో చేసే యాక్షన్‌లు అంతా ఇంతా కాదు. మరి సినిమా తీసిన వారిని విమర్శించే ముందు మనం వారు చేసిన దాంట్లో చిటికెన వేలంత అయినా చేయగలమా అని మనస్ఫూర్తిగా ఆలోచించే ధైర్యం చేస్తే మళ్లీ ఇలాంటి రివ్యూలు, ఎవరు రాయరు రాయలేరు. వీరు చేసే వెకిలి పని, వికారపు పని ఒక్క నిర్మాతనే కాదు అందులో పనిచేసే లైట్‌ బాయ్ దగ్గర నుంచి వేల మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టుల, మరియు వందల మంది సిబ్బంది జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఇంకా అర్థం అయినా కానట్టు నాదేం పోతుందిలే అని ఈ ఇంటర్నెట్‌ సినిమాయలో పడి చాలా మంది థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోకూర్చుని దర్జాగా సినిమాని చూస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు.

కాని ఎంతో కళాత్మకంగా అందిచిన ఆ సంగీతం 70 ఎంఎం థియేటర్‌లో వినిపిచినంత మధురంగా ఆ డొక్కు కంప్యూటర్‌లో వినిపిస్తుందా. వందల మందితో కలిసి చూసేటప్పుడు కలిగే ఆ థ్రిల్లింగ్‌, ఈ నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కూర్చుని చూస్తే వస్తుందా..? ఆ గ్రాఫిక్స్‌ మాయ కళ్ల నిండా వెలిగి గుండె నిండా వెదజల్లుతూ... థియేటర్‌ తెర మన మనసులో చేసే సందడి ఈ 28 ఇంచిల కంప్యూటర్‌ కలిగిస్తుందా...? అయినా ఒకే సారి రాకుండా ఆగుతూ ఆగుతూ వచ్చే తొస్సు మాటలలా వచ్చే డైలగాలు.... ఒక్కక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్‌ వందమందిని ఒకే సారి పంపించు అనే గాంభీర్యం గానీ..... వదల బొమాలి వదలా.......అనగానే మనసులో కలిగే ఓ భయంలాంటి ఆనందంగానీ.... ఆ వినీ పిచని స్ట్రక్‌ అవుతూ వచ్చే మాటలలో ఉంటుందా....? అంటే ఒక్క పర్సెంట్‌ కూడా ఉండదు కానీ వాటినే చూడటం వాటికోసం వెంపర్లాడటం తర్వాత ఏం బాగోలేదనో.. లేక ఆవరేజ్‌ అనో సైట్‌లలో రాసి పెడితే.. అది సదివిన వెర్రి ప్రేక్షకుడు సినిమాహాలుకు వెళ్లకుండా సినిమా బాగోలేదని కూర్చోవడం ఇదంతా సినిమా ఇండిస్టీ పతనానికి దారి తప్ప ఇంకోటి కాదు. ఇలా కంప్యూటర్ల మానిటర్లపై సినిమా చూడటం ఆరంభిస్తే ముందుముందు కాలంలో భారీ బడ్జెట్‌తో మగధీరా, రోబో లాంటి విన్యాసాలు, చూపేందుకు నిర్మాతలు ముందుకు రారు అలాంటప్పుడు, తెలుగు సినీ ఇండిస్టీ, లేదా మరే సినీ ఇండిస్టీ అయినా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రివ్యూలు చదివో, ఇంటర్నెట్‌లోకి సినిమాలు అప్‌లోడ్‌ చేసి, లేక వాటిని చూస్తూ ఆనందింస్తున్న వాళ్లు కనీస మానవతావాద దృక్ఫథంతో ఆలోచించి మనం చూస్తుంది, ఇంటర్నెట్‌ సినిమా కాదు వందల మంది నెత్తుటి బొట్టును చెమటచుక్కగా కరిగించి సినిమా తీసిన వారి నోటికాడి ముద్దని లాగేస్తున్నమని మర్చిపోవద్దు. సినిమానే జీవనాదారంగా బ్రతుకుతున్న జీవితాలతో ఆడుకుంటున్నామనే సంగతి కొద్దిగా ఆలోచించాలని ఆశిస్తూ ,,,,,,!
 

శ్రీలంక అద్భుత విజయం

ఆంజెలో మాథ్యూస్‌, లాసిత్‌ మలింగ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆస్ట్రేలియాతో బుధవారం నాడిక్కడ జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ జోడీ శ్రీలంకకు ఒక వికెట్‌ తేడాతో అనూహ్య విజయం సంపాదించిపెట్టారు. 240 పరుగులు చేయాల్సిన జట్టు 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోతే ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులు కోవాల్సిందే. అందుకు మాథ్యూస్‌, మలింగ ససేమిరా అన్నారు. తమ జట్టును గెలిపించే బాధ్యతను భుజస్కంథాలపై వేసుకుని చేసి చూపించారు. రణదీవ్‌ రనౌట్‌ అయిన తరువాత అసలు సంచలనం ప్రారం భమైంది. మాథ్యూస్‌తో మలింగ జత కట్టాడు. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు 132 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తమ జట్టును లక్ష్యానికి చేరువకు తీసుకెళ్లారు. 239 పరుగుల వద్ద, అంటే విజయానికి ఒక పరుగు కావాల్సిన దశలో మలింగ రనౌటయ్యాడు. ఈ దశలో చివరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ముత్తయ్య మురళీధరన్‌ను ఆసీస్‌ అవుట్‌ చేసి ఉంటే మ్యాచ్‌ టైగా ముగిసేది. అయితే ఆసీస్‌ బౌలర్లు, ముఖ్యంగా వాట్సన్‌ ఆ పని చేయలేకపోయాడు. శ్రీలంక 45వ ఓవర్‌లో వాట్సన్‌ బౌలింగ్‌లో రెండో బంతిని మురళీధరన్‌ బౌండరీకి తరలించడంతో శ్రీలంక విజయం సాధించింది. భారత జట్టు చేతిలో అటు వన్డే సిరీస్‌లోనూ, ఇటు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసిన ఆసీస్‌ వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. వన్డేల్లో తొమ్మిదో వికెట్‌కు మాథ్యూస్‌, మలింగ 132 పరుగులు జోడించి 27 కిందటి రికార్డును చెరిపివేసారు.

1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌, సయ్యద్‌ కిర్మాణీ నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేసారు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధసెంచరీని మలింగ నమోదు చేసాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాథ్యూస్‌ 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 44.2 ఓవర్లలోనే సాధించింది. అంతకుముందు పెరీరా 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకన్న ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్‌ హాడిన్‌ 49, మైక్‌ హస్సే 71, మార్ష్‌ 31 పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో కెప్టెన్‌ సంగక్కర 49 పరుగులు చేసాడు. మలింగ 48 బంతుల్లో 56 పరుగులు చేసి రనౌటయ్యాడు. తొలి వన్డే మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ బౌలర్‌ దోహర్తీ 46 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.