Tuesday, May 29, 2012

క్యాన్సర్‌ను జయించారు వీళ్లు ...

 యువరాజునూ మార్చేసింది
గౌతమి రొమ్ము క్యాన్సర్‌
యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ 
నెల్సన్‌ మండేలా 
సినీ నటి లీసారే  











http://www.prajasakti.com/coverstory/article-354838

'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరోగా నటించాను నేను ...

 ' దూకుడు ' సినిమాలో చేసిన క్యారెక్టర్‌ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీనువైట్ల గారు నా పాత్ర గురించి చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 'మగధీర', 'సింహ', 'యమదొంగ', సినామాల్లో హీరో డైలాగుల్ని నాతో చెప్పించారు. థియేటర్‌లో ప్రేక్షకులు చూసిన ఆనందం చూసి సంతోషిచానాన్ను . అంతక ముందు చాలా సినిమాలో చేశాను. ఈ సినిమాలో చూసిన ఆనందం అంత ఇంత కాదు. ' మా నాన్న కు పెళ్లి', ' రామచక్కనోడు', ' సర్దుకుపోదాం' సినిమాలు నాకు నంది అవార్డుల్ని తెచ్చిపెట్టాయి.
http://www.prajasakti.com/cinema/article-354601

Sunday, May 27, 2012

ఐపీఎల్‌-5 విజేత కోల్‌కతా

ఐపీఎల్‌-5 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆవిర్భవించింది. చైన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా అదిలోనే ఓపెనరు గంభీర్‌ వికెటు కోల్పోయిడు. కానీ మరో ఓపెనర్‌ బిస్లా దిటుగా అడాడు. బిస్లా 89, కల్లిస్‌ 69, శుక్లా 3, యుసుఫ్‌ పఠాన్‌1 పరుగులు చేశారు. ఆఖర్లో షకిబుల్‌ 11, తివారీ 9 లాంఛనాన్ని పూర్తి చేశారు. చైన్నై బౌలింగ్‌లో హిల్ఫెనాస్‌ 2, మోర్కెల్‌, అశ్విన్‌, బ్రావో చెరో వికెటు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హస్సీ 54, విజరు 42, సురేష్‌ రైనా 73 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలింగ్‌లో షికిబుల్‌, కల్లిస్‌, భాటియా తలో వికెటు తీశారు.

జగన్మోహన్‌రెడ్డి అరెస్టు

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ, వెైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వెైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐపీసీ 120బి, 420, 409, 477-ఏ సెక్షన్‌ అవినీతి నిరోధక చట్టం 13-1 సీ మరియు డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ జగన్‌ను ఎ-1గా సీబీఐ పేర్కొంది. మూడో రోజు విచారణ అనంతరం సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. ఎంపీ సబ్బం హరి, జూపూడి ధ్రువీకరించారు. ఆస్తుల అరెస్టు కేసులో జగన్‌ది ఐదో అరెస్టు. సీబీఐ అధికారులు రేపు జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడో రోజు అరెస్టు తర్వాత జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

Saturday, May 26, 2012

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరిగింది. ... ?

 ఐపీఎల్‌ -5లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఏదో తప్పు జరుగుతుంది. అదే ఏమిటి అంటే చివరి రెండు మ్యాచ్‌లో ఓడిపోవడం. చూశారా చివరి రెండు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడం ఎంత తెలిగా జరిగింది. చివరి రెండు మ్యాచ్‌లు ఒకటి గెలిచినా ఫైనలో వెళ్లెంది. కాని ఒక మ్యాచ్‌ కూడా గెలవలేదు. చివరి రెండు మ్యాచ్‌లో వార్నర్‌, సెహ్వగ్‌ ఇద్దరు కావాలనే అవుట్‌ అయ్యారు. కాని ఇందులో మహేల జయవర్ణన్‌ రెండు మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు.
కాని చివరికి టైటిల్‌ చెన్నైకా కొల్‌కతా ... ?
( టైటిల్‌ చివరికి మీకా, మాకా అని ఘర్షనా జరుగుతుంది. ) 
 మనీ మోర్‌ ఎవరు ఎక్కువ ఇసై వాళ్లకే టైటిల్‌ ... ?
చెన్నై జట్టు పైనల్‌కు వెళ్లె పరిస్థితి తాడో పేడో తెలుచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న సమయంలో డెక్కన్‌ ఛార్జర్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగుళూరు రాయల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లో గెలిచి డెక్కన్‌ చార్జర్స్‌ గెలిచి ఫైనలో చెన్నై జట్టును పంపించింది. చూశారు ఎంత తెలివిగా జరిగింది. కాని ఇది చూసేవారికి ఇది నిజం అనుకుంటారు.

Friday, May 25, 2012

8 గంటలకు పైగా విచారణ చివరికి ఏమిటి ... ?

 దిల్‌కుషా అతిధి గృహంలోని సీబిఐ కార్యాలయంలో కడప ఎంపీ. జగన్‌ వివచారణ ఈరోజు ప్రారంభంమైయింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు సంబంధించి విచారించేందుకు జగన్‌ను పిలిపించిన సీబీఐ. ఇప్పటికే అరెస్టు కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మనందరెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో కలిపి జగన్‌ను విచారిస్తున్న సీబీఐ. సాయంత్రం 7 గంటలవరకూ విచారణ కొనసాగిపు. అన్ని ఏర్పాటు అక్కడే చేశారు. రేపు కూడా సీబీఐ జగన్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
వేర్వేరు గదుల్లో విచారణ ఎందుకు ... ?
జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందంరెడ్డిలను సీబీఐ వేర్వేరు గదుల్లో విచారిస్తుంది. ఎందుకు అన్ని వేర్వేరు గదుల్లో విచారణ. ఒకే చోట విచారణ లేదా ? అలా విచారిస్తే ఏమవుతుంది.  

రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారని జగన్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానన్నారు. రేపు 10.30 గంటలకు జగన్‌ విచారణకు హాజరు అవుతారు.
 

దరువు రివ్వూ

                                  దరువు రివ్వూ 

Thursday, May 24, 2012

పైనల్‌లో మళ్లీ నేనే

ఐపీఎల్‌-5లో భాగంగా క్వాలిఫైర్‌-2లో ఫైనలో మళ్లీ నేనే గెలిచి పైనలో వెళ్తుతాను. ఈ రోజు జరిగే ఫైనలో ఢిల్లీపై గెలిచి ఫైనలో కొల్‌కతాతో ఢ. ఎంత ఆశా కెప్టెన్‌ ధోనికి మళ్లీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టి కప్‌ గెలిచితీరుతామాన్ని ధీమా. కానీ ఎవరోఒకరు చెన్నై చిత్తు చిత్తుగా ఓడించి కప్‌ మాత్రం కొల్‌కతా లేదా, ఢిల్లీ దక్కుతుంది. ఇది మాత్రం నిజం.

Wednesday, May 23, 2012

వివాదాల క్రికెట్‌ లీగ్‌

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇటీవల వెలుగు చూస్తున్న వివాదాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. 2008లో పరిమిత ఓవర్లలో ఐపిఎల్‌ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి ఐపిఎల్‌ ప్రారంభమూ క్రికెట్‌ అభిమానుల క్రీడానందానికి పర్యాయపదమా అన్న భావన కలిగించింది. కానీ ఒక దాని వెంట ఒకటిగా వివాదాలు తన్నుకొస్తున్న తీరు అన్ని వర్గాలనూ నీరసింపజేస్తోంది. ఒక్క మాటలో వినోదానికి డబ్బు జబ్బు తోడైతే ఏం జరుగుతుదో అదే జరుగుతోంది. ముఖాముఖి ముష్టిఘాతాలకు సిద్ధపడే ఫ్రాంచైజీలు, పంతాలతో మైదానంలోనే పరస్పర దూషణ-భాషణాలకు దిగబడే ఆటగాళు ్ల అన్నిటిని మించి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఐపిఎల్‌ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.ఐపిఎల్‌ల్లో చోటు చోసుకున్న ప్రధాన వివాదాలు పరిశీలిస్తే...
స్పాట్‌ ఫిక్సింగ్‌ : ఐపిఎల్‌ ప్రతిష్టకు మొదటి గండం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపంలో ఎదురైంది. ఒక ప్రైవేటు టివి ఛానలు నిర్వహించిన అపరాధపరిశోధనలో ఐపిఎల్‌ అటగాళ్లు మైదానం వెలుపల డబ్బుకు అమ్ముడుపోయారని తేలింది. జట్ల యాజమాన్యాలకు ఇందులో భాగస్వామ్యం ఉందని, ఫ్రాంఛైజీలు తక్కువ తినలేదని తేల్చింది. సదరు మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో మ్యాచ్‌ మధ్యలో నోబాల్‌ వేసే అంశంపై ఆటగాళ్లు చర్చలు జరపడం ఉంది. దీనితో ప్రమేయమున్న ఐదుగురు ఆటగాళ్ల మీద వేటు వేస్తూ ఇండియన్‌ క్రికెట్‌ బోర్డ్‌ కఠినంగా వ్యవహరించింది. కాగా ఈవివాదంపె దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేసే బాధ్యతను బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగ అధిపతి రవి సవానీకి అప్పగించారు.

లలిత్‌ మోడీ ఉద్వాసన : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏర్పాటుకు సూత్రధారి లలిత్‌మోడీ అన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన అభియోగంతో పాటుగా బెట్టింగు, మనీ లాండరింగు వంటి తీవ్ర అబియోగాలు వెలుగు చూడటంతో 2010లో ఐపిఎల్‌ ఛైర్మన్‌ పదవి నుంచి లలిత్‌ మోడీకి ఉద్వాసన పలికారు. ఒక రకంగా మోడీ తన ఉద్వాసనకు తనే బీజాలు వేసుకున్నాడని చెప్పాలి. ఐపిఎల్‌లోకి కొత్తగా ప్రవేశించిన కొచ్చి టస్కర్స్‌ కేరళ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ తన ట్విటర్‌లో ఆయన స్వయంగా రాసుకున్న అంశాలే తుదకు ఉద్వాసనకు దారి తీశాయి. నాటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్‌ శశిథరూర్‌ పదవికి ఎసరు తెచ్చాయి. ఇంత జరిగినా తప్పేమీ జరగలేదంటూ మోడీ వితండ వాదన కొనసాగించడం విశేషం.


ముష్టిఘాతాలు : ఐపిఎల్‌ ఆరంభం ఎంత ఘనంగా ప్రారంభమైందో అంతే శీఘ్రంగా వివాదాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్‌ 25న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులోని ఆటగాడు ఎస్‌ శ్రీశాంత్‌ను ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు హర్జజన్‌సింగ్‌ లాగి లెంపకాయకొట్టాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దశలో దురదృష్టమంటూ హర్భజన్‌ను అనడమే శ్రీశాంత్‌ తప్పిదంగా తుదకు తేలింది. వీడియోక్లిప్పింగుల పరిశీలన అనంతరం హర్భజన్‌ సింగ్‌ను తొలి ఐపిఎల్‌లో జరగాల్సిన 11 మ్యాచ్‌ల్లో ఆడటానికి వీల్లేదంటూ సస్పెండ్‌ చేశారు.

షారుఖ్‌ జగడం : ఇక తాజా వివాదం బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ది. కొల్‌కత నైట్‌ రైడర్స్‌కు షారుఖ్‌ సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16న ముంబయి ఇండియన్స్‌ జట్టు మీద తన జట్టు గెలుపొందిన తరువాత ఈ జగడం చోటు చేసుకుంది. ముంబయి క్రికెట్‌ అసొసియేషను అధికారులో షారుఖ్‌ ముఖాముఖి తలపడినట్లుగాను దుర్భాషలాడినట్లుగాను సమాచారం. మ్యాచ్‌ జరిగే సమయంలో వాస్తవానికి షారుఖ్‌ స్టేడియంలోనే లేడు. ఆట ముగిశాక ఆటను తిలకించే తనకుమార్తెను తీసుకు వెళ్లేందుకు స్టేడియానికి వచ్చాడు. పనిలో పనిగా ఆటగాళ్లను అభినందించాడు. అంతే అక్కడి భద్రత సిబ్బందితో జగడం మొదలైంది. దీనిపై షారుఖ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. తన కుమార్తె కూడా ఉన్న పిల్లల బృందం మీద స్టేడియం భద్రత సిబ్బంది బలప్రయోగానికి దిగారనేది షారుఖ్‌ వాదన. ఫిర్యాదు తదితర అంశాలను పరిశీలించిన తరువాత షారుఖ్‌ను ఐదేళ్లపాటు ఎంసిఎలో ప్రవేశించకుండా నిషేదం విధిస్తున్నట్లు ఎంసిఎ అధ్యక్షుడు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ఎంసిఎ పాలక మండలిలో షారుఖ్‌ ఖాన్‌ స్వయంగా సభ్యుడు కావడం విశేషం.

అత్యాచార అభియోగం : రాయల్‌ ఛాలంజర్స్‌ బెంగళూరు జట్టులోని ల్యూక్‌ పోమర్స్‌బాచ్‌ మీద అత్యాచార అభియోగం నమోదైంది. భారత సంతతి అమెకన్‌ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అభియోగంపై పోమర్స్‌బాచ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.


విందు విలాసాలు : ఐపిఎల్‌లో మ్యాచ్‌ ముగిసాక జరిగే విందులు విలాసాలకు ఒకప్రత్యేకత వుంది. ఏమిటంటారా ..హద్దుపద్దూ లేకుండా పెచ్చరిల్లడమేనని చెప్పవచ్చు. విందులో పాల్గొనే ఏ ఆటగాడినైనా లేదా ఏ బాలీవుడ్‌ నటుడితోనైనా కరచాలనం చేయవచ్చు. దీనికి భిన్నమైన కథనం దాగుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఛీర్‌లీడర్‌ తన బ్లాగులో పేర్కొనే వరకు సమాజానికి తెలయదు. 2011లో ఒక పార్టీ అనంతరం ఛీర్‌ లీడర్లను నడిచే శృంగార భామలుగానూ క్రికెటర్ల హద్దులు దాటిన ప్రవర్తనను గేబ్రియల్ల పస్కలోటో సవిరంగా అభివర్ణించారు. అంతే రహస్యాలను రచ్చ చేస్తోందంటూ ఆమెను ఇంటికి సాగనంపారు. తప్ప ఆమె తన బ్లాగులో రాసుకున్న కథనాలు వాస్తవాలా కాదా అనే అంశాన్ని పట్టించుకోక పోవడం నిజంగా విశేషమేనని చెప్పాలి. ఉద్వాసనకు గురయిన లలిత్‌ మోడీ స్థానంలో నూతన కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన చిరయూ అమీన్‌ వచ్చీ రావడంతోనే ఆట తరువాత విందు విలాసాలకు తెర దించేశారు.

సెహ్వాగ్‌ తప్పు చేశాడు...

ఐపీఎల్‌-5 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 144 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ జట్టులో ఆరవ బ్యాట్స్‌మెన్‌గా నెగిని బ్యాటింగ్‌ దిప్పి తప్పు చేశాడు. అతను కాక ఇక ఇర్పాన్‌ పఠాన్‌, టేలర్‌ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరి పంపిస్తే జట్టు గెలిచింది. నిర్లక్ష్యం వల్లనే నిన్న జట్టు ఓడిపోవడం అయ్యింది. అతను అడాలకుంటే తప్పని సరిగా అడి జట్టును గెలిచిపించేవాడు. మరి ఇంత తొందరపాటు పనికి రాదు. సరే ఒక విధంగా అనుకుంటే అతను అవుట్‌ అయితే మిగితా బ్యాట్స్‌మెన్స్‌ని ఎలా పంపిచాలో అలోచించాలి.

Sunday, May 20, 2012

చివరిలో సత్తా

చివరి రెండు మ్యాచ్‌లో సత్తా చాటినా డెక్కన్‌ ఛార్జర్స్‌. ఐపీఎల్‌-5లో భాగంగా డెక్కన్‌ చార్జర్స్‌ 16 మ్యాచ్‌లల్లో 11 మ్యాచ్‌లల్లో ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లల్లో గెలిచి తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 18వ రోజు జరిగిన మ్యాచ్‌లల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తప్పని సరిగా గెలవలసినా మ్యాచ్‌ల్లో డెక్కన్‌ ఛార్జర్స్‌ షాక్‌ ఇవ్వడంతో పైనల్‌ అవకాశం కోల్పోయింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు మ్యాచ్‌ల్లో డెక్కన్‌ మరో షాక్‌ ఇవ్వడంతో బెంగుళూరు పైనల్‌ అవకాశం కోల్పోయింది. చివరికి చెన్నై అవకాశం దక్కింది.