Tuesday, January 18, 2011

మరి విజయం మనదే...

 భారత్‌ , దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతన్న మూడో వన్డేలో భారత్‌ రెండు వికెట్ల తేడా ఘనవ విజయం సాధించింది. అద్యంతం ఉత్కంటబరితంగా సాగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి 2-1 తేడాతో ముందంజలో ఉంది. యూసుఫ్‌ పఠాన్‌ 50 బంతులలో ఆరు ఫోర్లులతో మూడు సిక్స్‌ సహయంతో 59 పరుగులు చేశాడు. చివరిలో హర్భజన్‌ సింగ్‌ 23, జహీర్‌ ఖాన్‌ 14 పరుగులు చేశారు. యూసుఫ్‌ పఠాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 220 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. డుమినీ, ప్లెయిస్‌ ఇద్దరు అర్థ సెంచరీతో అదుకున్నారు. మిగితా బ్యాట్‌ మైన్‌లు ఎవరు రాణించలేకపోయారు.

మరి మిరపకాయ ఎంత ఘాటు

 సంక్రాంతికి రిలిజ్‌ అయిన మూడు సినిమాలో ఏది హిట్‌ అయ్యింది. పరమవీరచక్ర, మిరపకాయ, అనగనగా ఓ ధీరుడు మూడు సినిమాలు సంక్రాంతి విడుదల చేశారు. ఒకటి గ్రాఫిక్స్‌ పరంగా బాగుంటే, మరోకటి విలువలు పరంగా స్కోర్‌ చేసింది.దాంతో మాస్‌ జనానికి కేవలం ' మిరపకారు' మాత్రమే ఘూటుగా అనిపించింది. అంతే రవితేజ పంట పడింది. రవితేజ ఎనర్జిటిక్‌ కామెడీ, తమన్‌ సంగీతం ఈ చిత్రంలో హైలైట్స్‌. ఒకే తరహా నటనే అయినప్పటికీ రవితేజ ప్రేక్షకులను ఎప్పటిలానే వినోదపరుస్తారు. యాక్షన్‌, డాన్స్‌లు కూడా బాగా చేశాడు. ఈ సినిమాలో రవితేజ పోలీసు అధికారిగా పనిచేస్తాడు.

మూడు పాత్రలు చేసినా లాభం ఏమిటి ?

బాలకృష్ణ గారు మీరు ఎన్ని పాత్రాలు వచ్చిన లాభం లేకపోయింది. జనాలలో మీకు పోత్రహం లేకపోయింది. అందుకు మీరు ఇంకోసారి సమరసింహ రెడ్డి, లక్ష్మీనారాయణ లాంటి సినిమాలు తీసుకోగలరు. అంతే తప్ప మీరు ఎన్ని పాత్రాలు వచ్చిన లాభము లేదు. కనుక మీరు గెటపు మార్పు చేయవలేను అని కోరుకుంటున్నాను. అభిమానులను రంజింప చేసే అన్ని సినిమా తీయగలరు. మీరు తీసే సినిమాలో ఫ్యామిలి, కామేడీ, అలాగే పాటలు మంచి హిట్టుకోట్టే సినిమా తీసి మళ్లీ మీరు నందమూరి వంశం పేరు ప్రతిష్ఠ నిలబెట్టగలరు. ప్రతి సినిమాలో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయ పాత్రలు చేస్తు ప్రేక్షకులను అభిమానులకు రోతపుట్టించవద్దు.