Tuesday, April 12, 2016

జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్

భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్  సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ కోడలు,  హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
           బ్రిటిష్‌ యువరాజు విలియమ్‌, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌   పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్‌ ఐష్‌ని విష్‌ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్  హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్‌ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్‌ ఐష్‌ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్‌ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు.

నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా 24 విన్నా - సూర్య

 ‘‘ ‘24’ నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా. ‘మనం’ సమయంలోనే ఈ  సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడే దర్శకుడు విక్రమ్‌కుమార్  ‘24’ కథ వినిపించారు. నాలుగున్నర గంటలపాటు కళ్లార్పకుండా ఆయన చెప్పిన కథే విన్నాను. ఈ కథ ఎంతగా నచ్చిందంటే వెంటనే నిర్మాతగా మారడానికి నిర్ణయించుకున్నా. వెంటనే సంగీత దర్శకుడు ఏ.ఆర్.రె హ్మాన్ తలుపు తట్టాం. ఇంతకాలం ఎందుకు గ్యాప్ వచ్చిందనే ప్రశ్నకుఈ చిత్రం ఓ సమాధానం అవుతుంది’’ అని హీరో సూర్య అన్నారు. ‘ఇష్క్’, మనం’ చిత్రాల ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన చిత్రం - ‘24’.
గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్త నిర్మాణంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. సమంత, నిత్యామీనన్ కథానాయికలు. ఏ.ఆర్.రెహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటలను హీరో కార్తీ విడుదల చేశారు.  ఏఆర్. రెహ్మాన్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా అవకాశం ఇచ్చినం దుకు సూర్య, విక్రమ్‌కుమార్‌లకు చాలా థ్యాంక్స్,  మా అబ్బాయి అమీన్ మొదట ‘ఓకే బంగారం’లో అరబిక్ పాట పాడాడు. మళ్లీ రెండో సారి ‘నిర్మలా కాన్వెంట్’లో ‘కొత్త కొత్త భాష’ పాట పాడాడు.

మీ ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడు అసలు దీన్ని తెరకెక్కించడం సాధ్యమా అని అనిపించింది. కానీ మాకు చెప్పిన దాని కన్నా బాగా విక్రమ్ ఈ సినిమా తీశారు’’ అని సమంత అన్నారు. ఈ వేడుకలో హీరోలు కార్తీ, అఖిల్, నిర్మాత సుధాకర్‌రెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

అనుష్కతో బ్రేకప్ ను ఇలా చెప్పాడా?

 టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్ లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్ నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ  కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!