Thursday, December 30, 2010

పరమవీర చక్ర ఆడియో విడుదల

బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమవీరచక్ర' ఆడియో విడుదల అభిమానుల కోలాహలంమధ్య శిల్పకళావేదికలో బుధవారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో వికలాంగులైన మాజీ సైనికులకు బాలకృష్ణ చేతులమీదుగా ఆర్థిక సాయం జరిగింది. మరోవైపు దాసరి 150 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కె. బాలచందర్‌ దాసరిని సత్కరించారు.

యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'

 వరుణ్‌సందేశ్‌, నిషా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా అందర్నీ మా చిత్రం ఆకట్టుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర సమర్పకులు అరిమిల్లి రామకృష్ణ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... నేను చేసిన తొలి సినిమానే సక్సెస్‌కావడం ఆనందంగా ఉందంటూ.. ప్రేక్షకులకు నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి.

Tuesday, December 28, 2010

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 111/3

లక్ష్యణ్‌ సెంచరీ మిస్‌ 96
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 228 అలౌట్‌
దక్షిణాఫ్రికా లక్ష్యం 303

 
 దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 303 పరుగుల లక్ష్మాన్ని ఉంచింది. ప్రస్తుతం ముడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 111/3 చేసింది. డివిల్లర్స్‌ 17, కల్లిస్‌ 12 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధిచాలంటే ఇంకా 192 పరుగుల చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకముందు ఆట ప్రారంభించిన భారత్‌ 228 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. లక్ష్మణ్‌ 96 పరుగుల చేసి చివరి బ్యాట్స్‌మైన్‌ అవుట్‌ ఆయ్యాడు. దక్షిణాఫ్రికా 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. స్మిత్‌ 37, ఆమ్లా 16, ఫిటరసన్స్‌ 26 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇంకా దక్షిణాఫ్రికా 192 పరుగులు చేయ్యాలి. క్రీజులో డివిల్లర్స్‌, కల్లిస్‌ ఇద్దరు బ్యాట్‌మైన్‌ ఉన్నారు. ఏ ఒక్కరు క్రీజులో ఉన్న విజయం దక్షిణాఫ్రికాదే. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ రెండు వికెట్లు హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెటు లభించింది. నాల్గవ రోజు ఆట బౌలర్లదా, లేక బ్యాట్‌మైన్‌దా ?

జనవరి 12న 'మిరపకాయ్'

 రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా నటిస్తోన్న 'మిరపకాయ్' జనవరి 12న రానుంది. ఈ విషయాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల తెలియజేశారు. ఎల్లో ఫ్లవర్స్‌ బ్యానర్‌పై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ...'ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. థమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో హిట్‌ అయింది. కిక్‌ తర్వాత రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న పాటలవి. మా బ్యానర్‌లో ఎంతో రిచ్‌గా తీశాం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వస్తోంది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే స్టోరీ. సీనియర్‌ నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.

Monday, December 27, 2010

భారత్‌ 92/4

<b>ప్రస్తుత ఆధిక్యం 166 పరుగులు </b>
  భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ 32, మురళీవిజరు 9, ద్రావిడ్‌ 2, సచిన్‌ 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ 166 పరుగుల ఆధిక్యంతో ఉంది. స్టెయిన్‌, మార్కెల్‌ చెరో వికెట్‌ తీసుకోగా, సొత్సెబె రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతక ముందు రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 205 పరుగులకు అలౌట్‌ అయ్యాది. 

దక్షిణాఫ్రికా 131 అలౌట్‌
దక్షిణాఫ్రికా 131 పరుగులకే అవుట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాట్‌మెన్స్‌లో ఏఒకరు రాణించలేకపోయారు. పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, ఆమ్లా 33, కల్లిస్‌ 10, డివిల్లీర్‌ 0, ప్రిన్స్‌ 13, బౌచర్‌ 16, స్టెయిన్‌ 1, హరిస్‌ 0, మోర్కెల్‌ 10, సొత్సెబె 0 పరుగులు చేశారు. ఆమ్లా 33 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ 4, జహీర్‌ ఖాన్‌ 3, శ్రీశాంత్‌, శర్మ చెరో వికెటు తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల అదిక్యత సాధించింది. రెండో రోజు వికెట్లు పతనం మొదలైయింది. ఒక్కే రోజు రెండు జట్ల మధ్య 18 వికెట్లు పడ్డాయి. లక్ష్మణ్‌ 23, పుజారా 10 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ కనీసం 300- 350 పరుగులు చేస్తే విజయ అవకాశాలు ఉంటాయి.

Sunday, December 26, 2010

మళ్లీ అదే కథ : భారత్‌ 183/6

 డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకున్నది. తొలి రోజు భారత్‌ 183/6 పరుగులు చేసింది. హర్భజన్‌ సింగ్‌ 15, దోనీ 20 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. గంభీర్‌ స్థానంలో వచ్చిన మురళీ విజరుతో సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25, విజరు 19, ద్రవిడ్‌ 25, సచిన్‌ 13, లక్ష్మణ్‌ 38, పుజరా 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. రైనా స్థానంలో పుజరా అలాగే గంభీర్‌ స్థానంలో మురళీ విజరు జట్టులో ఉన్నారు. ఇద్దరు 19 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయాన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.

బాలయ్యతో రవితేజ కుస్తీ

 బాలయ్యతో, రవితేజ మళ్ళీ ఢ ఇంతక ముందు ఇద్దరు ఒక్కేసారి సినిమా విడుదల అయ్యాయి. ' ఒక్కమగాడు'తో బాలయ్య 'కృష్ణ' తో రవితేజ బరిలోకిగారు. ఇద్దరు కుస్తీ పడి చివరికి రవితేజ, సినిమా హిట్‌ కొట్టి బాలయ్యను ఓడించాడు. ఈ సారి బాలకృష్ణ సినిమా 'పరమవీరచక్ర' సంక్రాతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే అదే సమయంలో రవితేజ సినిమా ' మిరపకాయ' కూడా సంక్రాతికే బరిలోకి దిగనుంది. మరి ఈ సారి ఆసీన్‌ రివర్స్‌ అవుతుందో మళ్లీ రిపీట్‌ అవుతుందో జనవరి 15 వరకు వేచి చూడాలి.

సుమంత్‌ - స్వాతి కాంబినేషన్‌లో ' గోల్కొండ హైస్కూల్‌ '

 సుమంత్‌ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ' గోల్కొండ హైస్కూల్‌ ' చిత్రం సంక్రాంతి బరిలోకి దూకనుంది. గత కొంత కాలంగా విజయాలు లేక సుమంత్‌ కష్టాల్లో ఉన్నాడు. 'బోణి ' తర్వాత కావాలని బ్రేక్‌ తీసుకున్నాడు. ఆష్టాచమ్మా వంటి హిట్‌ ఇచ్చిన మోహనకృష్ణ - స్వాతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ' గొల్కొండ హైస్కూల్‌ ' పై సుమంత్‌కి భారీ అంచనాలే ఉన్నాయి.

Tuesday, December 21, 2010

వన్డే జట్టులో మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తిరిగి వన్డే మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సచిన్‌ టెండూలర్‌ చోటు దక్కించుకున్నాడు. వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల్లో సచిన్‌ ఉన్నాడు. డర్బన్‌లో జనవరి 9న జరగనున్న టి20 మ్యాచ్‌లో సచిన్‌ ఆడకపోవచ్చు. తొలి వన్డే డర్బన్‌లో జనవరి 12న, రెండో వన్డే జోహన్నెస్‌బర్గ్‌లో 15న , మూడో వన్డే కేప్‌ టౌన్‌లో (జనవరి 18), పోర్ట్‌ఎలిజబెత్‌ (జనవరి 21), సెంచూరియన్‌ (జనవరి 23) జరుగుతాయి.

భారత జట్టు: మహేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కొహ్లి, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌; ఆశిష్‌ నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మునాఫ్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యూసుఫ్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, శ్రీశాంత్‌.
 
 రెండో ర్యాంక్‌లో సచిన్‌
బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో కుమార సంగక్కర (882) సచిన్‌ టెండూల్కర్‌(880), జాక్స్‌ కల్లిస్‌ (846), సెహ్వాగ్‌(832), డివిల్లీర్స్‌ 806, మహేలా జయవర్ధనే (781), శివనారాయణ్‌ చంద్రపాల్‌ (779), హసీం ఆమ్లా (768), జోనాథన్‌ ట్రాట్‌ (767) ఉన్నారు.   

Monday, December 20, 2010

నాగవల్లి

 వెంకటేష్‌ హీరోగా సినిమా వస్తోందంటే, ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌నే ప్రేక్షకులు ఎక్కువగా ఆశిస్తుంటారు.సాఫ్ట్‌ రోల్సోలో ఎక్కువగా కన్నించడానికి ఇష్టపడే వ్యక్తి వెంకటేష్‌, ఈ సారి వెరైటీ కాన్సెప్ట్‌తో .. అదీ రజనీకాంత్‌ గతంలో చేసిన ' చంద్రముఖి' సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే వుంటుంది.
ఐదుగురు హీరోయిన్లతో వెంకీ
అనుష్క, రిచా, కమిలిన, శ్రద్దాదాస్‌, పూనమ్‌కౌర్‌
సైకాలజిస్ట్‌గానూ, మహారాజ నాగభైరవగానూ వెంకటేష్‌ మొదటిసారి నెగెటివ్‌ రోల్‌ పోషించిన వెంకి, నాగబైరవగా ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో మెప్పించడం ఖాయం.
అనుష్క ; ' అరుంధతి' తర్వాత అనుష్క ఆ స్థాయిలో నటనకు ప్రదర్శించేందుకు ఛానొచ్చిన సినిమా ' నాగవల్లి' తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
శ్రద్దాదాస్‌  ;తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కీలక సన్నివేశంలో శ్రద్దాదాస్‌ తన పెర్ఫామెన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది.
కమలినీ ముఖర్జీ ; పేషెంట్‌టా కన్నించడం బాలేదు.... అయితే డాన్స్‌ కాస్ట్యూమ్స్‌లో చాలా బావుంది.
రిచా గంగోపాధ్యాయ ; అందంగా వుంది. పూనమ్‌కౌర్‌ది తక్కువ పాత్రే అయినా తళుక్కువ మెరిసింది.
రేటింగ్‌లో నాగవల్లి 3.25/5 సాధించింది.

అనుష్క , త్రిష మధ్య అధిపత్య పోరు

 అనుష్క కథానాయాకగా నటించిన రగడ, త్రిష నటించిన మన్మథ బాణం డిసెంబర్‌ 23న విడుదల కానున్నాయి. మన్మథ బాణం అనువాద చిత్రమే అయినా కానీ కమల్‌హాసన్‌ కథానాయకుడు కావడంతో ఈ చిత్రంపై కూడా అంచానాలు భారీగా ఉన్నాయి. త్రిష ' మన్మథ బాణం' తో హిట్టు కొట్టి తెలుగు, తమిళనాడుల్లో సత్తా చాటాలని త్రిష ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ' రగడ' పై కూడా అంచనాలు ఘనంగానే ఉన్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి పాటల వరకు అంతా మాస్‌ మయమైన ఈ చిత్రం దుమ్ము రేపుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ' మన్మథ బాణం ' చిత్రాన్ని ' రగడ'తో సమానంగా విడుదల చేయాడానికి ఆ చిత్ర నిర్మాతలు కూడా ప్లాన్‌ చేసుకోవడంతో ఈ రెండింటి మధ్య పోటీ తప్పదనిపిస్తోందిసో .... రెండు సినిమాలతో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు అమీ తుమీ తేల్చుకోనున్న ఈ సందర్బంలో విజయం ఎవరిని వరిస్తుందనేది తేరపై చూడాలి.

Friday, December 10, 2010

భారత్‌ 5-0 తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ విభాగంగా రాణించి సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్‌ - న్యూజిలాండ్‌ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో ఫ్రాంక్లింగ్‌ 24 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మైన్‌లు అంతగా రాణించలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో ఆశ్విన్‌ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్‌, యుసుఫ్‌ పఠాన్‌, నెహ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ ఒక వికెటు తీసుకున్నారు. 104 పరుగుల లక్ష్యంతో భ్యాటింగ్‌ దిగిన భారత్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ే గంభీర్‌ 0, విరాట్‌ కోహ్లీ 2 పరుగులకే అవుట్‌ అయ్యారు. ఓపెనరుగా వచ్చిన పార్థీవ్‌ పటేల్‌ అర్థ సెంచరీ చేశాడు. (56) పార్థీవ్‌ పటేల్‌ అండగా యువరాజ్‌ సింగ్‌ 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Monday, December 6, 2010

ఘాటెక్కిస్తానంటోన్న ' రిచా '

తొలి చిత్రం ' లీడర్‌'లో పద్దతిగా కన్పించిన రిచా గంగోపాధ్యారు, ' మిరపకారు' సినిమాకొచ్చేసరికి చాలా ఘూటుగా కన్పిస్తోంది.' మిరపకారు ' సినిమాతో తన గ్లామర్‌ ఘాటు ఏంటో చూపిస్తానంటోన్న రిచా వెంట టాలీవుడ్‌ దర్శక నిర్మాతక ఇప్పుడు క్యూ కడ్తున్నారట.నిన్న జరిగిన ' మిరపకాయ' సినిమా ఆడియో విడుదల వేడుకలో అందరి కళ్ళూ రిచాపైనే పడ్డాయంటే ఆమె ఎంత గ్లామర్‌ని వెద జల్లిందో అర్ధం చేసుకోవచ్చు. రేంజ్‌ని ఎంతవరకు పెంచుతుందోగానీ, ' మిరపకారు' సినిమాపై మాత్రం టాలీవుడ్‌లో అంచనాలు బాగానే వున్నాయి.

భూవివాదంలో అనుష్క

అందాల అనుష్క నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా మన సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా వుంటుంది. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొంది.రెండేళ్ల క్రితం వైజాగ్ లో కొందరు సినీప్రముఖులతో కలిసి అనుష్క కూడా విశాఖ జిల్లా భీమిలిలో కొంత భూమి కొనుగోలు చేసింది.అయితే ఆ స్థలం తనదేనని తనకి తెలియకుండా ఎవరో అక్రమంగా అనుష్కకి అమ్మేశాడని ఓ ఎన్నారై కోర్టు కెక్కాడు. ఈ కేసు విషయమై కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అనుష్క వాటిని పట్టించుకోలేదు.దీంతో ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి జనవరి 28 న అనుష్క వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరి దీనిని ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి! తరలిపోతున్న టాలీవుడ్..

Saturday, December 4, 2010

మూడు వన్డేలో భారత్‌ ఘన విజయం


కెప్టెన్‌ గంభీర్‌ 126 ( 117) సెంచరీ, విరాట్‌ కోహ్లీ 63 (70) అర్థసెంచరీలతో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరికొద్ది రోచేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ విజయం టీం ఇండియాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓపెనర్‌ విజరు 30( 50)తో గౌతమ్‌ గంభీర్‌లు మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత్‌ను పటిష్ఠ స్థితిలో ఉంచింది.

అంతకు ముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్థీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుప్తిల్‌ 12, మెక్‌కలమ్‌ 0, విలియమ్‌సన్‌ 21, టేలర్‌ 4, స్లైరిస్‌ 22, వెట్లోరి 3, హాప్కిన్స్‌ 6, మెక్‌కలమ్‌ 43, మిల్స్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఫ్రాంక్లిన్‌ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌ బౌలర్లలలో జహీర్‌ , అశ్విన్‌,పఠాన్‌ రెండేసి వికెట్లు తీయగా, మునాఫ్‌ పటేల్‌కు ఓ వికెట్‌ దక్కింది.