Thursday, September 9, 2010

రామానాయుడికి ఫాల్కే అవార్డు

సిని నిర్మాత మూవీ మొఘల్‌ డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు దాదాసాహేబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. 2009 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో ఎనలేని కృషి చేసినవారిని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవిస్తుంది. అవార్డుకింద 10 లక్షల రూపాయలు, స్వర్ణ కమలం అందజేస్తారు. ఫాల్కే పురస్కారానికి ఎంపికను దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. అక్టోబర్‌లో జరుగనున్న జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రామానాయుడు ఫాల్కే అవార్డు అందుకోనున్నారు.

Thursday, September 2, 2010

వై.ఎస్‌.కు సినీ పరిశ్రమ నివాళి




దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. హీరో శ్రీహరి, బైరవ చిత్ర నిర్మాత నట్టికుమార్‌లు పేద కళాకారులకు చీరలు పంపీణీ చేశారు.ఆ కార్యక్రమాలలో హీరో రాజశేఖర్‌, జీవిత పాల్గొన్నారు. వై. ఎస్‌ మృతి పట్ల రాష్ట్రానికి తీరని లోటని శ్రీహరి అన్నారు.

వైఎస్‌తో ఉన్న ఆత్మీయత గొప్పంది : రోశయ్య

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న అనుబంధం, ఆత్మీయత చాలా గొప్పదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. వైఎస్‌ ప్రధమ వర్థంతి కార్యక్రమాలకు వెళ్లాలని ఉన్నా ఆరోగ్య కారణాల వల్ల వెళ్లలేకపోతున్నానని ఆవేధన వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయన్నారు. వైఎస్‌ మరణం ఊహించలేనిదని రోశయ్య అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి నిమిషం ప్రజల ఆవేధన గురించి మాట్లాడుతు ఉండేవారు. ఎవరొచ్చి అడిగినా లేదనటం ఆయనకు చేతకాదని ముఖ్యమంత్రి రోశయ్య గుర్తు చేసుకున్నారు.