Saturday, January 30, 2016

హిట్ వచ్చింది... పారితోషికం పెంచేసింది

 విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఫలితంగా ఈ వర్ధమాన తారకు తమిళం, తెలుగు భాషలలో విజయం వరించింది.

  తెలుగులో రామ్‌తో నటించిన నేను శైలజ చిత్రం కీర్తిసురేష్ విజయానికి పునాది వేసింది. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం దాన్ని కొనసాగించింది. దీంతో కీర్తి తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కీర్తి కొట్టి పారేస్తున్నారు. తనేమంటున్నారో చూద్దాం. నేను నటించిన తెలుగు చిత్రం నేను శైలజ తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు నా బాధ్యత పెరిగింది.

 సాధారణంగా చిత్ర జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే మా అమ్మ మేనక నటి అవడంతో నాకు మార్గదర్శిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక తమిళంలో బాబీసింహాతో నటిస్తున్న పాంబు సండై, ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసనే మరో చిత్రం చేస్తున్నారు. అదే విధంగా నేను పారితోషికం పెంచేశాననే ప్రచారంలో నిజం లేదని కీర్తిసురేష్ స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కొత్త షేర్ ఆప్షన్..!

 సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. యూజర్లకు మరో కొత్త అవకాశం కల్పిస్తోంది. వినియోగదారుల కోసం తమ ఈవెంట్స్ పేజీలో సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతోంది. అందులో చేరినవారు.. తమ రైడ్స్ (సవారీ) ను పంచుకునే వీలు కల్పిస్తోంది. రైడ్ షేరింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, ఫేస్ బుక్ కూడా తమ ఈవెంట్ పేజీలో ఈ ఆప్షన్ కు శ్రీకారం చుడుతోంది. ఈ అవకాశంతో ఒకే దారిలో వెళ్లేవారు ఫేస్ బుక్ ద్వారా క్యాబ్ రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఫేస్ బుక్ పేటెంట్ అప్లికేషన్.. తమ్ ఈవెంట్ పేజీ స్టోర్ లో మరిన్ని ఆసక్తికరమైన ప్రణాళికలు చేపట్టనున్నట్లు సూచిస్తోంది. ఈవెంట్ పేజీలోని రైడ్ షేరింగ్ సెంటర్ ను రెట్టింపు చేయనున్నట్లు చెబుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వీలుగా ఫేస్ బుక్ ఈవెంట్ పేజీలో ప్రధానంగా  'గోయింగ్' అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. దీనికి రెండు ఉప జాబితాలనూ జోడించింది. 'గోయింగ్ అండ్ డ్రైవింగ్' 'గోయింగ్ బట్ నాట్ డ్రైవింగ్'  పేరుతో ఉన్న ఈ ఆప్షన్లను వినియోగించుకొని యూజర్లు రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న మొత్తం మూడు ఆప్షన్లలో గోయింగ్, నాట్ గోయింగ్ ఆప్షన్లపై జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ ఆసక్తికి అనుగుణంగా  రైడ్స్ ను షేర్ చేసుకునేందుకు ఫేస్ బుక్ వీలుకల్పిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసిన ఈ కొత్త అవకాశాన్ని అమెరికాలో ఫేస్ బుక్ వినియోగదారులు ఇప్పటికే మెసెంజర్ ద్వారా వినియోగిస్తున్నారు. మెసెంజర్ లో ముందుగా తమ స్నేహితులతో చాట్ చేసి,  క్యాబ్ ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాన్ని వాడకంలోకి తెచ్చారు.