Monday, September 23, 2013

జగన్ కు బెయిల్ మంజూరు





Wednesday, September 18, 2013

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానిక తరలింపు


ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనంలో యువతి, యువకులతో పాటు పెద్దలు తరలివచ్చారు. ఖైరతాబాద్‌ వినాయకుడు దగ్గర జనం విచల విడిగా ఉన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడు ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నాడు. ఇందుకు కనీసం 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. నగరంలో అత్యంత పెద్దదైన ఖైరతాబాద్‌ గణనాధున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు. నగరంలో మొదట బాలాపూర్‌ వినాయకుడి తరలింపుతో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సాగర్‌ తీరానికి తరలిస్తారు. అలాగే రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది బొజ్జ గణపయ్యలు వివిధ రూపాలతో భక్తులకు కనువిందు చేస్తూ ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, సఫిల్‌గూడ ... తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనానికి వినాయకుని విగ్రహాలు తరలివస్తున్నాయి. కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి 500 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాళ మరో 700 విగ్రహాల వరకు ప్రగతినగర్‌ చెరువులో నిమజ్జనం అయ్యే అవకాశంముంది. దీనికోసం పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లక్షలు పలికిన లంబోదరుడి లడ్డూ ప్రసాదాలుఅమీర్‌పేట లడ్డూ రూ. 12,01,116
బాలాపూర్‌ లడ్డూ రూ. 9.26 లక్షలు

హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గణేష్‌ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వినాయకుడి పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలను వేలం వేశారు. అమీర్‌పేటలో వినాయకుని లడ్డూ ఈ సారి రికార్డు ధర పలకడం విశేషం. 12 లక్షల వెయ్యినూట పదహారు రూపాయాలకు ఈ లడ్డూను వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థ సీఈవో బీఎస్‌ఎస్‌ మూర్తి కైవసం చేసుకున్నాడు. అలాగే బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ మాజీ మేయర్‌, తెదేపా నేత, టీకేఆర్‌ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అత్తాపూర్‌ వినాయకుడు లడ్డూది. 3.25 లక్షలు పలికింది. 

నిమజ్జనం సందర్శకులకు అల్పాహారాలు పంపిణీలు
గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం సందర్శించడానికి తరలివచ్చే భక్తులకు, మండపాల నిర్వాహకులకు పలు స్వచ్చంద సంస్థలు ఉచిత అల్పాహార శిబిరాలను ఏర్పాటు చేశాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లతో పాటు దారిపోడవునా అల్పాహారం పొట్లాలను, ప్రసాదాలను అందజేస్తున్నారు.


జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలితో పాలు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాయి.


Tuesday, September 17, 2013

రెండో వన్డేలో భారత్‌' ఎ' ఓటమి



వెస్టిండీస్‌'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో భారత్‌ 'ఎ' జట్టు 55 పరుగుల తేడాతో పరాజయం అయ్యింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకఁంది. వెసిండీస్‌ ' ఎ' జట్టు ఁర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 279 పరుగులు చేసింది. కార్టర్‌ ( 133 ) సెంచరీ సాధించాడు. జాన్‌సన్‌ 39, ఎడ్‌వర్స్‌ 36 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో వినరుకఁమార్‌ మూడు, పఠాన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం 280 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు 48.4 ఓవర్లలో 224 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువీ ఈ మ్యాచ్‌ల్లో అతనే మళ్లీ టాప్‌ స్కోరుగా ఉన్నాడు. యువీ 40, చాంద్‌ 38, జాదవ్‌ 35, ఓజా 34, పరుగులు చేశారు. యుసుఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయగా బ్యాటింగ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో సమనంగా ఉన్నాయి.

వన్డే సిరీస్‌ ఆస్ట్రేలియా

క్లార్క్‌ అర్థసెంచరీ
వాట్సన్‌ సెంచరీ
స్ట్రోక్స్‌ ఐదు వికెట్లు


ఆస్ట్రేలియా , ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్‌పై 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. సిరీస్‌ కైవసం చేసుకఁంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వాట్సన్‌ మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లల్లో 298 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. వాట్సన్‌ 143, క్లార్క్‌ 75 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ తకఁ్కవ స్కోరు అవుట్‌ అయ్యారు. మిడిలాడ్డ్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు అదుకోలేకపోయారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో స్ట్రోక్స్‌ ఐదు వికెట్లు, జోర్డ్‌న్‌ మూడు వికెట్లు రూట్‌, రాన్‌కింగ్‌ చెరో వికెటు తీశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 48 ఓవర్లలో 249 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. బోపారా 62, బ్లూట్టర్‌ 42, మోర్గాన్‌ 30 పరుగులు చేశారు. పీటరసన్‌ ఈ మ్యాచ్‌లో రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ కొద్దిగా కష్టాల్లో ఉంది. అతరువాత మిడ్డిల్‌ అర్డర్‌లో బోపారా, బ్లూట్లర్‌ ఇద్దరు ఉన్నంత వరకఁ మ్యాచ్‌ ఇంగ్లండ్‌దే అన్న దీమ ఉంది. మూడు పరుగుల తేడాతో వీరిద్దరు అవుట్‌ కావడంతో మ్యాచ్‌ పూర్తిగా మారిపోయింది. హుగోస్స్‌, ఫించ్‌ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఆస్ట్రేలియా 13 పరుగులు వద్ద హోగొస్స్‌ రూపంలో మొదటి వికెటు కోల్పోయింది. వన్‌డౌన్‌గా వాట్సన్‌ వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు పెంచె సమయంలో ఆటకఁ వర్షం రావడంతో 15 ఁమిషాలు ఆటను ఁలిపివేశారు. అప్పటికే వాట్సన్‌ 10, ఫించ్‌ 26 పరుగులతో ఉన్నారు. ఁరంతంరం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ 26, వాడే 0 రూపంలో వికెట్లు కోల్పోయింది. అతరువాత కెప్టెన్‌ క్లార్క్‌ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు మరో వికెటు పడకఁండ జాగ్రత పడ్డారు. వాట్సన్‌ మరోసారి బ్యాట్‌కఁ పదునుపెంటాండు. వాట్సన్‌ 49 బంతులల్లో ఆరు ఫోర్లు సహాయంతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్‌ క్లార్క్‌ అతఁకి సహయపడుతు స్కోరు బోర్డును ముందుకఁ నడిపిస్తున్నాడు. కెప్టెన్‌ క్లార్క్‌ 58 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్‌తో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇదే సరియైన సమయం అఁ బావించి కెప్టెన్‌ క్లార్క్‌, వాట్సన్‌ ఇద్దరు జాగ్రత వహించారు. చివరిలో వికెట్లు త్వరగా పడడంతో ఆస్ట్రేలియా జట్టు 298 పరుగులకఁ అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌గా కెప్టెన్‌ క్లార్క్‌.

Tuesday, July 2, 2013

భారత్‌ 161 పరుగుల తేడాతో ఘోర పరాజయం

భారత్‌ 187 పరుగులకు అలౌట్‌
శ్రీలంక 348/1
తరంగా 174
జయవర్థన్‌ 107



లంక, భారత్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో లంక టీమిండియాపై 161 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయింది. బౌలింగ్‌లో విఫలమైన బ్యాటింగ్‌లో మాత్రం తడబడింది. శ్రీలంక ఇదే అవకాశం అన్ని భారత్‌పై రెచ్చిపోయి అడింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 187 పరుగులకు అలౌట్‌ అయ్యింది. జడేజా ఒక్కేడే 49 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. ఛాంపియన్‌ ట్రోఫీ నుంచి భారత్‌ నేరుగా సెల్‌కాన్‌ మొబైల్‌ టోర్నమెంట్‌ వెళ్లింది. ఫ్రాక్టిస్‌ మ్యాచ్‌ కూడా అడకుండ వెళ్లింది. సెల్‌కాన్‌ మొబైల్‌ కప్‌ టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌ ఇప్పటి వరకూ రెండుంటిలో పరాజయం పాలైయింది. సెల్‌కాన్‌ మొబైల్‌ కప్‌ టోర్నమెంట్‌లో భాగంగా శ్రీలంక, భారత్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో లంక 50 ఓవర్లలో ఒక వికెటు నష్టానికి 348 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 213 పరుగుల భాగ్యస్వామం చేశారు. ఉప్పల్‌ తరంగా 159 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో 174 పరుగులు చేసి బెస్ట్‌ స్కోరు చేశారు. మరో ఓపెనరు మహేల జయవర్థన్‌ 112 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో యాదవ్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి స్లోగా అడి వికెటును కాప్పాడారు. 20 ఓవర్ల తరువాత రన్‌రెట్‌ పెంచారు. అతరువాత స్కోరుబోర్డును పెంచారు. ఇద్దరు అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలతో రెచ్చిపోయారు. వన్‌డౌన్‌గా మాథ్యూస్‌ వచ్చాడు. తరంగా, మాద్యూస్‌ ఇద్దర కలసి చివరి పది ఓవరల్లో 124 జోడించారు. మాధ్యూస్‌ 29 బంతుల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. భారత్‌ బౌలర్లు వికెటు తీయడంలో నిరాశపరిచారు.

Sunday, June 30, 2013

ఒక వికెటు తేడాతో వెస్లిండీస్‌ విజయం

చార్లెస్‌ సెంచరీ మిస్‌ 18 పరుగులు చేస్తే విజయం సాధింస్తుంది. వెస్లిండీస్‌ చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. ఒకొక్కపరుగు సాధించి చివరికి బౌలర్లులు విజయం సాధించింది. 

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనరు క్రిస్‌గేల్‌ 9 బంతులల్లో రెండు ఫోర్లులతో 11 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో రైనా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన స్మిత్‌ పరుగులు ఏమిచేయకుండనే యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన శ్యాముల్స్‌ ఒక పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కష్టాలలో ఉన్న జట్టును చార్లెస్‌, బ్రావో ఆదుకున్నారు. నాల్గొవ వికెట్టుకు 116 పరుగుల బాగ్యస్వామం నెలకొల్పారు. బ్రావో 55 చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బాట్స్‌మెన్‌లు పొల్లాడ్‌ 4, రామ్‌దిన్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచారు. అప్పటి భారత్‌ విజయం ఆశలు నిరాశగఉన్నాయి. క్రీజులో చార్లెస్‌, స్వామి ఉన్నారు. స్వామి వచ్చి రావడంతో ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. 25 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కోట్టి మరో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. 36 పరుగులు చేస్తే వెస్టిండీస్‌ గెలుస్తుంది. చివరికి చార్లెస్‌ 100 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 97 పరుగులు చేసి మూడు పరుగుల వద్ద సెంచరీ మిస్‌ అయ్యాడు. చివరికి బౌలర్లు ఒక్కొక్కపరుగు జోడించి విజయ లక్ష్యం సాధించింది. భారత బౌలింగ్‌లో యాదవ్‌ మూడు, అశ్విన్‌, శర్మ చెరో రెండు వికెట్లు, రైనా, కుమార్‌ చెరో ఒక వికెటు లభించింది.

Saturday, June 29, 2013

సీఎం కాన్వాయ్‌పై కూలిన భారీ వృక్షం

 సచివాలయంలో సమత బ్లాక్‌ వద్ద సీఎం కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. సీఎం కాన్వాయ్‌లోని జామర్‌ వాహనం, అంబులెన్స్‌ పాక్షికంగా ధ్వంసమయ్యాయి.












Friday, June 28, 2013

లంకపై ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఘన విజయం

గేల్‌ సెంచరీ

 వెస్లిండీస్‌, లంక మధ్య జరుగుతున్న వెస్లిండీస్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన లంక 208 పరుగులకే అలౌట్‌ అయ్యింది. జయవర్థనే, మాథ్యూస్‌ ఇద్దరు అర్థసెంచరీతో జట్టును అదుకున్నారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు ఔట్‌ అయ్యారు. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో రామ్‌పాల్‌ మూడు, నరెన్‌ నాలుగు వికెట్లు తీశారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాదించింది. గేల్‌ సెంచరీ చేశాడు. చార్లేస్స్‌ 29, బ్రావో 27, పోల్లార్డ్‌ 0 పరుగులు చేశారు. శ్వాముల్స్‌ 15, బ్రావో 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో మరియు బ్యాటింగ్‌లో రాణించడంతో జట్టు విజయం సాధించింది.  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గేల్‌

Tuesday, June 25, 2013

'సింగమ్‌' గీతాలు


 తమిళ నటుడు సూర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం 'సింగమ్‌'( యముడు-2). హరి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా సమర్పిస్తున్నారు. చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగింది. చిత్రంలోని తొలిపాటను కార్తి, రెండోపాటను లక్ష్మణ్‌కుమార్‌, మూడో పాటను హరి, నాలుగో పాటను శశాంక్‌ వెన్నెలకంటి, ఐదో పాటను అనుష్క ఆవిష్కరించారు. సినిమా థియేటర్‌ ట్రైలర్స్‌ సూర్య ఆవిష్కరించారు. ఆడియో సిడిలను దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేసి, కార్తికి అందజేశారు.
గేయ రచయిత సాహితి మాట్లాడుతూ..'పవర్‌ ప్యాక్‌డ్‌ సినిమా ఇది. సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. పోలీస్‌ వ్యవస్థపై హరి పరిశోధన చేశారు. దేవిశ్రీ ఎనర్జిటిక్‌ పాటలిచ్చారు. ఆధునికంగా ఉన్నాయి. ఒకే ట్యూన్‌లో రెండు కోణాలున్న పాటలు కూడా ఉన్నాయి. ఇందులో ఓ ఐటెం సాంగ్‌, పోలీస్‌లోపలి వ్యక్తిని గురించి ఓ పాట రాశాను' అని అన్నారు.
 

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ..'యముడు' చిత్రాన్ని పెద్ద విజయం చేసినందుకు థాంక్స్‌. దర్శకుడు హరి, సూర్య, జ్ఞానవేల్‌రాజాకు ధన్యవాదాలు. 'సింగం' అనేది బ్రాండ్‌ అయింది. హిందీలో కూడా హిట్‌ అయింది. తెలుగువారు అందరూ ఆదరిస్తా'రని తెలిపారు.
శశాంక్‌ వెన్నెలకంటి మాట్లాడుతూ.. 'తోటకూర తినేవాడికి వేటకూర తిన్నట్టు ఉంటుంది..హరి సినిమాకు పనిచేయటం. ఈ సినిమాలో పంచ్‌ డైలాగ్స్‌ రాస్తుంటే, చాలా ఆనందంగా, పండుగలా అనిపించింది. ఇప్పటికీ కంపోజింగ్‌ను నమ్మి సంగీతం చేసే వ్యక్తి దేవిశ్రీప్రసాద్‌. 'గజని' సినిమాతో మా ప్రయాణం మొదలైంది. వారి బ్యానర్‌లో కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ..'సింగం' నా 12వ సినిమా. సూర్య, దేవిశ్రీప్రసాద్‌తో ఇది నా నాలుగో సినిమా. 'యముడు' నుంచి 'సింగమ్‌' వేరే డైమెన్షన్‌తో ఉంటుంది. వంద శాతం కమర్షియల్‌ మూవీ ఇది. విత్‌ లాట్‌ ఆఫ్‌ లాజిక్‌. అందరూ ఇష్టంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరి కష్టం సినిమాలో కనిపిస్తుంది. సినిమా బావుంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను' అని తెలిపారు.
తమిళ హీరో కార్తి మాట్లాడుతూ.. 'యముడు' చిత్రాన్ని చాలా పెద్ద సక్సెస్‌ చేశారు. ఈ సినిమాలో అంతకు మించి పవర్‌ ప్యాక్‌ ఉంది. అన్నయ్య 'సింగమ్‌' చూశాక నాక్కూడా ఖాకీ బట్టలు వేసుకోవాలనిపిస్తుంది' అని అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. 'నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మా కుటుంబంలో అందరూ నన్నూ గొప్పగా చూస్తున్నానంటే దానికి కారణం తెలుగువారి అభిమానమే. మంచి సినిమా ఇది. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజికల్‌ హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. నిజ జీవితంలో పోలీస్‌ అందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు.

Monday, June 24, 2013

ఛాంపియన్స్‌ ట్రోపీ భారత్‌

                వర్షం కారణంగా వన్డే మ్యాచ్‌ టీ 20
 ఛాంపియన్స్‌ ట్రోపీలో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న పైనల్‌ వన్డే మ్యాచ్‌కి వరుణుడి దెబ్బకి టీ 20గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించే అవకాశం ఉంది. మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన ఆటను టీ 20 మ్యాచ్‌గా కుదించారు. టాస్‌ గెలిచి ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్‌ ట్రోపీలో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో భారత్‌ 5 పరుగుల తేడాతో విజయ సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ చివిరి మూడు ఓవర్లలో 14 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యనికి దూరం అయ్యింది. ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ట నష్టానికి 124 పరుగులు చేసింది. ఆదిలోనే ఇంగ్లండ్‌ వికెటు కోల్పోయింది. కెప్టెన్‌ కుక్‌ 9 బంతులల్లో 2 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌గా ట్రాట్‌ వచ్చాడు. ఫామ్‌లో ఉన్న ట్రాట్‌ని అశ్విన్‌ స్పిన్‌ మాయజలంతో (స్టంప్‌) అవుట్‌ చేశాడు. అతడు 14 బంతులల్లో రెండు ఫోర్లుతో 20 పరుగులు చేశాడు. రూట్‌ 7 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇయాన్‌ బెల్‌ 13 పరుగులు చేసి (స్టంప్‌) అవుట్‌ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కష్టాలలో ఉన్న ఇంగ్లాండ్‌ని మోర్గాన్‌, బొపారా మరో వికెటు పడకుండ జాగ్రత పడ్డారు. విజయలక్ష్యం దిశగా పయనిస్తున్న సమయంలో ఇషాంత్‌ శర్మ ఓకే ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని కష్టాలల్లో నెట్టాడు. మోర్గాన్‌ ఇషాంత్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు 30 బంతులల్లో మూడు ఫోర్లు, ఒక సిక్‌తో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్‌ బొపారా 25 బంతులల్లో రెండు సిక్సతో 30 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. బట్టర్‌ 0, బ్రెన్నస్‌ 2 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. బ్రాడ్‌ 7, ట్రేడ్‌వెల్‌ 5 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ బౌలర్లకు సహకరించింది. ధావన్‌, రోహిత్‌ శర్మ ఆట ప్రారంభించారు. భారత్‌ మొదటి వికెటు 19 పరుగుల వద్ద కోల్పోయింది. రోహిత్‌ శర్మ 14 బంతులల్లో ఒక బౌండరీతో 9 పరుగులు చేసి బ్రాడ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌగా కోహ్లీ వచ్చాడు. వర్షం మాత్రం ఆటకు ఆడ్డం కలుగుతుంది. 6 ఓవర్లలో వర్షం రావడంతో ఆటను ఏకంగా 45 నిమిషాలు నిలిపివేశారు. అంపైర్లు ఫిచ్‌ను పరిశిలించి ఆట మళ్లీ ప్రారంభించారు. వర్షంతో ఫిచ్‌ పూర్తిగా తడిసింది. ఆట ప్రారంబంమైన కొద్దిసేపటికే ధావన్‌ బోపారా బౌలింగ్‌లో ట్రెడ్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు 24 బంతులల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌లతో 31 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్‌ దినేష్‌ కార్తిక్‌ 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. రవి బోపారా ఒకే ఓవర్లలో సురేష్‌ రైనా, ధోని ఇద్దరి అవుట్‌ చేసి భారత్‌పై ఒత్తిడిచేశారు. 



 సురేష్‌ రైనా స్లో బౌలింగ్‌లో కుక్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అదే ఓవర్లలో బోపారా బౌలింగ్‌లో ధోని భారీ షాట్‌కు వెళ్లి బౌండరీ దగ్గర ట్రేడ్‌వెల్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. కోహ్లీకి అండగా జడేజా వచ్చాడు. కోహ్లీ 34 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్‌లతో 43 పరుగులు చేసి అండరసన్‌ బౌలింగ్‌లో బొపారా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అశ్విని 1 పరుగు చేసి రనౌట్‌గా అయ్యాడు. చివరిలో జడేజా 25 బంతులల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 33 పరుగులు చేశాడు.

స్కోరు బోర్డు భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (బి) బ్రాడ్‌ 9, ధావన్‌ (సి) ట్రేడ్‌వెల్‌ (బి) బొపారా 31, కోహ్లీ (సి) బొపారా (బి) అండరసన్‌ 43, దినేష్‌ కార్తిక్‌ ( సి) మోర్గాన్‌ ( బి) ట్రేడ్‌వెల్‌ 6, సురేష్‌ రైనా (సి) కుక్‌ (బి) బొపారా 1, ధోని ( సి) ట్రెడ్‌వెల్‌ ( బి) బొపారా 0, జడేజా 33 నాటౌట్‌, అశ్విన్‌ 1 రనౌట్‌, భువనేశ్వర్‌ కుమార్‌ 1 నాటౌట్‌ ( ఎక్స్‌ట్రా 4)
ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ : అండరసన్‌ 4-0-24-1, బ్రాడ్‌ 4-0-26-1, బ్రెన్నస్‌ 4-0-34-0 ట్రెడ్‌వెల్‌ 4-0-25-1, బోపారా 4-1-20-3
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ : కుక్‌ (సి) అశ్విన్‌ (బి) యాదవ్‌ 2, ఇయాన్‌ బెల్‌ ( స్టంప్‌) ధోని( బి) జడేజా13, టాట్‌ ( స్టంప్‌) ధోని( బి) అశ్విన్‌ 20, రూట్‌ (సి) ఇషాంత్‌ శర్మ (బి) అశ్విన్‌ 7, మోర్గాన్‌ (సి) అశ్విన్‌ (బి) ఇషాంత్‌ శర్మ 33, బొపారా ( సి) అశ్విన్‌( బి) ఇషాంత్‌ శర్మ 30, బుట్లర్‌ (బి) జడేజా 0, బ్రేన్నస్‌ రనౌట్‌ (రోహిత్‌ శర్మ , ధోని) 2, బ్రాడ్‌ 7, ట్రేడ్‌వెల్‌ 5 నాటౌట్‌ (ఎక్స్‌ట్రా 5)
భారత్‌ బౌలింగ్‌ : కుమార్‌ 3-0-19-0, ఉమేష్‌ యాదవ్‌ 2-0-10-1, జడేజా 4-024-2, అశ్విన్‌ 4-1-15-2, ఇషాంత్‌ శర్మ 4-036-2 , సురేష్‌ రైనా 3-019-0

Friday, June 7, 2013

ఐపిఏల్‌లో దొంగలు పడ్డారు ...

ఐపీఎల్‌లో దొంగలు పడ్డారు. అంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి. అన్న సమెత ఇప్పుడు అర్థమైయింది. టోర్నమెంట్‌ ప్రారంభంయినప్పటి నుంచి ఐపీఎల్‌లో స్ఫాట్‌ఫిక్సింగ్‌, బెట్టింగులకు పాల్పడ్డారు. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌ జట్టు గుర్తించారు. ఇప్పుడు కూడా రాజస్థాన్‌ జట్టులో ప్రస్తుతం ముగ్గురు సభ్యులు గుర్తించారు. రాజస్థాన్‌ జట్టు యాజమాని కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ పైసలతో కూడిన వ్యవహారం. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో నితి నిజాయితో అడిన మ్యాచ్‌లు తక్కువనే. కొన్ని మ్యాచ్‌లు మాత్రం బెట్టింగుకు పాల్పపడి చాలా వరకు పెద్ద మొత్తం డబ్బులుతో అడుకున్నారు. ఐపీఎల్‌-6లో చివరిలో చెన్నెరు జట్టు యాజమాన్యం కూడా ఇద్దులో హస్తం ఉంది. తెలిసింది.

Monday, May 13, 2013

ఐపీఎల్‌-6లో ప్లేఆప్‌కు ఇప్పటి వరకు బెర్త్‌కు ఖరారు కాలేదు ... ?

ఐపీఎల్‌-6లో ప్లేఆప్‌కు నాలుగు జట్లు ఖరారు కాలేదు. ప్రస్తుతం ముంబయి, రాజస్థాన్‌, చెన్నై జట్లు 20 పాయింట్లతో వరుసగా ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్‌ జట్లు 16 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానంలో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు మొదటి స్థానం ఇంకా ఖరారు కాలేదు. 
 ముంబయి : ముంబయి జట్టు 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు అడాలిఉంది. ఒకటి రాజస్థాన్‌తో మరోకటి పంజాబ్‌తో అడాలి. రెండింటిలో ఒక మ్యాచ్‌ల్లోనైనా గెలిచి ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. లేక వరుసగా రెండు మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోయినప్పటికి రన్‌రేట్‌తో ప్రకారం ప్లేఆప్‌ అవకాశాలు కొంతలోకొంత అవకాశాలు ఉంటాయి. ముంబయి జెట్టు ఒక వేళ రెండు మ్యాచ్‌లో ఓడిపోతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ప్లేఆవకాశాలు ఉంటాయి. కాని సన్‌ రైజర్స్‌ జట్టు మిగిలి రెండు మ్యాచ్‌లు మెరుగైన రన్‌రేటుతో గెలిచి ప్లేఆవకాశాలు ఉంటాయి. దీనితోపాటు బెంగళూరు జట్టు కూడా అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. బెంగళూరు జట్లు కూడా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి పంజాబ్‌తో మరోకటి చెన్నైతో ఉన్నాయి. బెంగళూరు జట్టు కూడా రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నాయి. ముంబయి జట్టుకు బెంగళూరు జట్టు, సన్‌రైజర్‌ హైదరాబాద్‌ జట్టు పోటిగా ఉన్నాయి.

చెనై : చెన్నై జట్టు 20 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు జట్లు. రెండుంటిలో ఒక మ్యాచ్‌ అయిన గెలిచి ప్లేఆప్‌ వెళుతుంది. కాని రెండు మ్యాచ్‌లో వరుసగా ఓడిపోతే రన్‌రేట్‌ ప్రకారం ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. రేపు జరగబోయే మ్యాచ్‌ ఢిల్లీ ఉంది. ఇందులో తప్పని సరిగా గెలిచితీరాలి. ఒక వేళ ఓడిపోతే మాత్రం తరువాత మ్యాచ్‌ బెంగళూరుతో ' ఢ ' కోనబోతుంది. అందులో తప్పని సరిగా గెలిచి తీరాలి.

రాజస్థాన్‌ : రాజస్థాన్‌ జట్టు 20 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి ముంబయి మరోకటి సర్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు. ఇందులో ఒక మ్యాచ్‌నైనా గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి.

బెంగళూరు : బెంగళూరు జట్టు 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. దీనికి తోడు సర్‌రైజర్‌ హైదరాబాద్‌ జట్టు పోటిగా ఉంది. బెంగళూరు జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి పంజాబ్‌ మరోకటి చెన్నై జట్టు. ఇందులో మాత్రం బెంగళూరు జట్టు రెండు మ్యాచ్‌లో గెలిచి ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. ఒక మ్యాచ్‌ల్లో గెలిచితే రన్‌ రేట్‌తో ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి.




సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జట్టు -16 పాయింట్లతో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్‌ రాయల్స్‌, మరొకటి కొల్‌కతా జట్టుతో ఉంది. రెండు మ్యాచ్‌ల్లో తప్పని సరిగా మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. 

 ప్లేఆప్‌ అవకాశాలు 
ముంబయి
చెన్నై
రాజస్థాన్‌
బెంగళూరు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Tuesday, April 23, 2013

బెంగుళూరులో గేల్‌ తుఫాను ...

ఆంధ్రప్రదేశ్‌లో వడగళ్లవానలు కురుస్తోంటే బెంగుళూరులో ఏకంగా తుపానే వచ్చేసినట్లయింది. బెంగుళురు చిన్నస్వామి స్టేడియంలో ' గేల్‌' తుఫాను చూసి ప్రేక్షకులు ఆనందతాండవం చేస్తున్నారు. గేల్‌ కొట్టే బంతి ఏ పక్క నుంచి వచ్చి పడుతుందో అని ప్రేక్షకులు చూస్తున్నారు. గేల్‌ 30 బంతులల్లో సెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతను వేసుకున్న షర్ట్‌ 333 పేరిట ఉంది. 
 మెక్‌కల్లమ్‌ రికార్డుడను అధిగమించిన గేల్‌ బెంగుళూరులో గేల్‌ పరుగుల తుఫాన్‌ కొనసాగుతోంది. మెక్‌కల్లమ్‌ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డును గేల్‌ అధిగమించాడు. గేేల్‌ 30 బంతుల్లో శతకం సాధించాడు. ఐపీఎల్‌లో మెక్‌కల్లమ్‌ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డున గేల్‌ తిరగరాశాడు. 66 బంతులల్లో 17 సిక్స్‌లు, 13 ఫోర్లు సహయంతో 175 పరుగులు చేశాడు. ఐపీఎల్‌-6లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Thursday, March 21, 2013

నిత్యామీనన్‌ ...

పెళ్ళి అనే పదం వచ్చే వరకు స్రీలల్లో అనేక మార్పులు కనిస్తాయి. ఇక్కడ కూడ అదే కనిస్తుంది. అది ఎవరో కాదు మన సినిమా హీరోయిని. అమె చూపులో చాలా అందం ఉంది. కాని పెళ్లి మాట వచ్చే సరికి ఎక్కడ లేని బాద కనిపిస్తుంది. ఒక్క సారి చూడండి. 










































































  చివరికి పెద్ద వాళ్ళు తెచ్చిన సంబదం కాదనలేకా ఓకే అని చేప్పి చివరికి ఇలా నవ్వుత్తూ కనిపిచింది.

Tuesday, February 5, 2013