Wednesday, October 13, 2010

రెండవ టెస్టులో భారత్ ఘనవిజయం : సిరీస్ కైవశం


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెంటు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆసిస్‌ 21 పరుగులు చేసి ఆలౌటయింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 3 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. పుజారా 72, సచిన్‌ 53, విజయ్‌ 37, డ్రావిడ్‌ 21 సెహ్వాగ్‌ 7 పరుగులు చేశారు. చిన్నస్వామీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్‌కిది తొలి విజయం. ఈ విజయంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను భారత్‌ 15వ సారి ఓడించింది.