Sunday, June 29, 2014

బోనమెత్తి.. పరవశించి

శివసత్తులు ఊగంగా.. పోతరాజులు ఆడంగా.. తెలంగాణ ఆడపడుచులు బోనమెత్తి పరవశించిపోయారు. స్వరాష్ట్రంలో సగర్వంగా బోనమెత్తిన నగరం పులకించిపోయింది. గోల్కొండ కోట భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. గోల్కొండలో మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపునకు ఆత్మీయ స్వాగతం పలికారు. 


ఆలస్యంగా ప్రారంభం

బోనాల పండుగ మొదటి పూజ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మధ్యాహ్నం1.30కు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ రామకష్ణారావు పట్టువస్ర్తాలను తీసుకొని లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వస్ర్తాలను తీసుకెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ తీగుల్ల విజయ్‌కుమార్‌కు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి తొట్టెలకు పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌సింగ్, నాయకులు కావూరి వెంకటేష్, తూముకుంట అరుణ్‌కుమార్, కోడూరి శ్రీధర్‌సాగర్ తదితరులు నత్యం చేశారు.

విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు. 



కోట వద్ద పోతరాజుల విన్యాసాలు

గోల్కొండ కోట ప్రవేశ ద్వారం చౌరస్తా వద్దకు ఊరేగింపు చేరుకోగానే పోతరాజుల బందం చేసిన హడావుడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుపక్కల పోతరాజులు కలియతిరుగుతూ గోల్కొండ ఆలయం వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. అక్కడి నుంచి వేగంగా కోటపై ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు. దీంతో తొలి రోజు బోనాల ఉత్సవం ముగిసింది. 


ఊపిరిపీల్చుకున్న పోలీసులు

రంజాన్, బోనాల పండుగ తొలిపూజ ఆదివారమే కావడంతో నగర పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఉన్నతాధికారులు పలుమార్లు పీస్‌మైత్రి కమిటీ సమావేశాలను నిర్వహించారు. అంతేకాకుండా ఆదివారం భారీగా పోలీసులను మోహరించారు. బోనాల మొదటి పూజ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనలతో వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీలు లింబారెడ్డి, , గోషామహల్, ఆసిఫ్‌నగర్, ఏసీపీలు డి. శ్రీనివాస్, రాంభూపాల్‌రావు, బందోబస్తులో పాల్గొన్నారు. 

సందర్శకుల తాకిడి

బోనాల పండుగను పురస్కరించుకుని గోల్కొండ కోటలోని ఉచిత ప్రవేశం ఉండటంతో ఆదివారం రికార్డు స్థాయిలో గోల్కొండను సందర్శకులు సందర్శించారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు ఆదివారం ఒక్కరోజే గోల్కొండను సందర్శించడం విశేషం.    

Monday, June 16, 2014

'రన్‌ రాజా రన్‌' ఆడియో అవిష్కరణ

 ' రన్‌ రాజా రన్‌' ఆడియో అవిష్కరణలో ముఖ్య అతిధిగా ప్రభాస్‌, గోపిచంద్‌ హాజరయ్యారు. శర్వానంద్‌ హీరోగా యువిక్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ' రన్‌ రాజా రన్‌' ఈ సిఁమా ఆడియో ఆదివారం నాడు విడుదల జరిగింది. ఆడియో సీడీలను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఆవిష్కరించారు. గోపిచంద్‌ తొలి సీడీఁ అందుకఁన్నారు. ఈచిత్రంలో సంగీతం గిబ్రాన్‌, ఁర్మాతగా వి.వంశీకృష్ణరెడ్డి, దర్శకఁడు సుజిత్‌ అలాగే హీరోయిన్‌గా సీరత్‌ కపూర్‌గా నటించనున్నారు.
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ : '' ప్రమోద్‌, వంశీ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడు. కొరటాల శివను ఇంట్రడ్యూస్‌ చేసిన విధంగా ఇప్పుడు సుజిత్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. మది ఫోటోగ్రఫీ గురించి నేను ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీన్‌ ప్రెష్‌గా ఉంది. పాటలు బాగా కఁదిరాయి. శర్వానంద్‌ ఈ సిఁమా కోసం ఒక రూపాయి రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోలేదు. సిఁమా బాగా వస్తే చాలు తర్వాత చూద్దామఁ అన్న హీరో. ఇంకా బాహూబలికి కోసం అందరూ ఎందురు చూస్తున్నారు. అది వచ్చే సంవత్సరం జనవరి తర్వాత సిఁమా విడుదల అవుతుంది.

గోపిచంద్‌ మాట్లాడుతూ : '' ప్రమోద్‌ వంశీ చాలా కాలంగా తెలుసు. మంచి మిత్రులు. మిర్చి సిఁమాతో సూపర్‌హిట్‌ కొట్టి మంచి ప్రొడ్యూసర్స్‌గా పేరుతెచ్చుకఁన్నారు. ప్రతి సాంగ్‌లో వేరియేషన్‌ ఉంది. ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది. శర్వానంద్‌ నాకఁ తమ్ముడులాంటోడు. ఈ సిఁమా ఫస్ట్‌లుక్‌ చాలా బాగుంది. సిఁమా పెద్ద సెక్సెస్‌ అయ్యి యూవి క్రియేషన్స్‌ పెద్ద బ్యానర్‌గా పేరు తెచ్చుకోవాలి'' అఁ చెప్పారు.
శర్వానంద్‌ మాట్లాడుతూ : '' మా సిఁమాకి పఁ చేసిఁ ప్రతి ఒక్కరిఁ చాలా థాంక్స్‌. అందరూ చాగా కష్టపడి పఁచేశాం. సిఁమా అందరికి నచ్చుతుందఁ అనుకఁంటున్నారు.
చిత్ర దర్శకఁడు సుజిత్‌ మాట్లాడుతూ : హీరో శర్వానంద్‌ను నేనెలా చూపించాలనుకఁన్నానో అలాగే చూపించాను. హీరోయిన్‌ చక్కగా నటించింది. ఈ సిఁమాకి పఁచేసిన వాడిలో నేనే చిన్నవాణ్ణి మిగతా వారందరూ అనుభవంలో, వయసులో నాకంటే పెద్దవారు.అందరూ బాగా సపోర్ట్‌ చేశారు.







Saturday, June 14, 2014

తెలంగాణ శకుంతల కన్నుమూత

ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల కన్నుమూశారు. నిన్న( జూన్‌ 13) అర్థరాత్రి ఆమె హైదరాబాద్‌లో కొంపల్లిలోని ఆమె ఇంట్లో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించింది. సూరారంలోని నారాయణ హాస్పిటల్‌కు తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైధ్యులు తెలిపారు. గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతిచెందిన ప్రముఖ సినీ నటి తెలంగాణ శకఁంతలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నివాళులర్ఫించింది. అనంతరం ఆమె భౌతికకాయాఁకి అల్వాల్‌లోని శ్మశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
  శకు తల ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శకఁంతల భౌతికకాయాని అభిమానులు సందర్శనార్థం కొంపల్లిలోని ఆమె    నివాసం నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు తరలించారు. సినీ నిర్మాత డి. రామానాయుడు సహగద్దర్‌, వేణుమాదవ్‌, హేమా, ఝూన్సీ పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్బించారు. అనంతరం అంతిమయాత్ర             నిర్వహించి అల్వాల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె సుమారు 74 చిత్రాల్లో నటించిన శకు తల ప్రస్తుతం ఆర్‌. నారాయణమూర్తి నిర్మించిన రాజ్యాధికారం చిత్రంలో కీలకపాత్ర పోషించారు. మహారాష్ట్రలో పూనేలో 1949లో శకఁంతల జఁ్ని చింది. ఆవిడ పూర్తి పేరు కడియాల శకఁంతల ఒక బేబి, ఒక బాబు ఉన్నారు.

సినిమా రంగంలో 1979 నుంచి ...
1979లో మా భూమి ద్వారా తెలుగు సిని మా రంగంలో అడుగుపెట్టారు. 75కు పైగా సిఁమాలలో నటించారు. ఈమె నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద. ఈమెకు కుక్క సిఁమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.

Monday, June 9, 2014

ప్రారంభమైన ' గోపాల ... గోపాల '


విక్టరి వెంకటేష్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ల పవర్‌ పుల్‌ కాంభినేషన్‌లో సురేష్‌ ప్రోడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఁర్మిస్తున్న ' గోపాల ... గోపాల' చిత్రం వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోఁ రామానాయుడు స్టూడియో ప్రాంగణం చలన చిత్ర ప్రముఖుల సమక్ష్లఓ ఈ చిత్రం అత్యంత వైభవంగా చిత్రీకరణ మొదలైంది. దర్శకఁడు కిషోర్‌ పార్ధసాఁ ఈ చిత్రాఁకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ నాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకఁడు అనూప్‌ ఈ చిత్రాఁకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్‌ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్‌ పూర్తవుతుంది అఁ చిత్ర ఁర్మాతలు డి. సురేష్‌ బాబు, శరత్‌ మరార్‌లు తెలిపారు. వైభంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద ఁర్మాతలు డి రామానాయుడు. అల్లు అరవింద్‌, కె.ఎస్‌ రామావావు. జెమిఁ కిరణ్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి, బూరుగ పల్లి శివరామకృష్ణ, మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరి వెంకటేష్‌ తనయుడు మాస్టర్‌ ' అర్జన్‌' ప్రత్యేక ఆకర్షణగా ఁలిచారు.