Sunday, November 16, 2014

సిరీస్‌ భారత్‌ క్లీన్‌ స్వీప్‌

మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ విరాట్‌ కోహ్లీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా మ్యాథస్‌
1982 తర్వాత శ్రీలంకను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి
5-0తో లంక ఘోరపరాజయం
సెంచరీలతో సమదానం చెప్పిన భారత్‌
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ
మ్యాథస్‌ వన్డేలో తొలి శతకం

              వెస్టిండీస్‌ పర్యటన అర్థంతరంగా ముగిసిందని బాధపడిన వాళ్ళలో సరికొత్త హుషారు. ధోని గైర్హాజరీలో టీమిండియా ఎలా ఆడుతుందోనని సందేహించిన వాళ్లలో చెప్పలేని సంతోషం.. కుర్ర జట్టు ఏం చేస్తుందోనని ఆందోళన చెందిన వాళ్లలో పట్టలేని ఆనందం? బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మూడు విధంలో భారత్‌ పూర్తిస్థాయి రాణించి శ్రీలంకను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.
భారత్‌, శ్రీలంక మధ్య ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు శతకాలతో చెలరేగిపోయారు. మొదటి వన్డేలో శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానే, రెండో వన్డేలో అంబటి రాయుడు, మూడో వన్డేలో ధావన్‌ (91), కోహ్లీ ( 54) పరుగులు చేసి 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోంది.
నాల్గొవ వన్డేలో రోహిత్‌ శర్మ వచ్చిన ఆవకాశం వదులు కోలేక జట్టులో స్థానం మళ్లీ ఏలా అని సందేహం లేకుండా లంకపై ఏకంగా డబులు సెంచరీ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతడిదే అత్యధిక స్కోరు. ప్రపంచ క్రికెట్లో మాత్రం రోహిత్‌ది రెండో స్థానం. అలె బ్రౌని ( 268), సర్రే) ముందున్నాడు. ఐదో వన్డేలో ఇరు జట్టు కెప్టెన్‌ సెంచరీలతో చెలరెగిపోయారు. చివరికి మాత్రం టిమిండియాదే పైచెయ్యి సాధించింది. మ్యాథస్‌ ( 139), కోహ్లి ( 139) పరుగులతో సమానంగా నిలిచారు.
ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన లంక జట్టు చివరి మ్యాచ్‌లనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న ఆశలు నిరాశగా మారిపోయింది. భారత్‌, లంక మధ్య జరిగిని చివరి వన్డేలో భారత్‌ ఎనిమిది బంతులు మిగిలిఉండగానే విజయలక్ష్యం సాధిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంబటి రాయుడు అర్ధసెంచరీ రాణించడంతో చివరి వన్డేలో గెలిచింది. లంక బ్యాట్స్‌మెన్‌ మ్యాథస్‌ 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇరు జట్ల కెప్టెన్‌లు సెంచరీతో కదం తొక్కారు. లంక చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలన్న ఆశలు నిరాశగా మిగిలాయి. లంక కెప్టెన్‌ మ్యాథస్‌ వన్డే మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోద్‌ చేశాడు.
లంక బోర్డు సభ్యులు నిరాశగామిగిలింది. అనుకోకుండా అట్టహస్థంగా మారిన ఓప్పదం కనుకనే ఈ వన్డే మ్యాచ్‌ టి20 మ్యాచ్‌గా నిలిచింది. ప్రత్యర్థి జట్టు లంకపై అవలోక గెలిచింది. కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలువకూడా భారత జట్టు లంకను క్లీన్‌స్వీప్‌గా చేసింది. భారత జట్టు ప్రయోగాలతో బరిలోకి దిగింది. అనుకోని రీతిలో జట్టులో ఒకరు కాకపోతే మరోకరుగా రాణించి విజయం సాధించారు. శ్రీలంక జట్టు మాత్రం ప్రత్యర్థి జట్టుకు మంచి స్కోరు కూడా నమోదు చేయలేకపోయింది.

భారత్‌ బ్యాటింగ్‌లో అందరు ఫామ్‌లో కోనసాగుతున్నారు. భారత్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుతున్న సమయంలో భారత్‌ ఆటగాళ్లు అందరు ఫామ్‌లో ఉండడం విశేషం. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో... అదిరిపోయే ప్రదర్శన చేసింది. భారత్‌ ఓపెనింగ్‌ సమస్యలతో కుడుకున్న సమయంలో ఏకంగా ముగ్గురు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌లు సెంచరీతో లంకపై చెలరెగిపోయారు. గత కొని రోజులుగా రోహిత్‌ శర్మ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు నాల్గొవ వన్డే మ్యాచ్‌లో డబ్బులు సెంచరీతో జట్టులో స్థానం సంపాధించాడు.
వన్డేలో టాప్‌ -5
రోహిత్‌ శర్మ 264 కోల్‌కతా శ్రీలంక నవంబర్‌ 2014
సెహ్వాగ్‌ 219 ాండోర్‌ వెస్టిండీస్‌, డిసెంబర్‌ 2011
రోహిత్‌ శర్మ 209 బెంగళూరు ఆస్ట్రేలియా, నవంబర్‌ 2013
సచిన్‌ 200 గ్వాలియర్‌ దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 2010
కొవెంట్రి 194 బులవాయో బంగ్లాదేశ్‌, ఆగస్టు 2009


ఉప్పల్‌ స్టేడియంలో 6వేల పరుగులు దాటిన కోహ్లీ


ఉప్పల్‌ భారత్‌, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో విశిష్ఠ అతిధి వచ్చారు. అది మరెవరో కాదు. విరాట్‌ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క. ఆదివారం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చుని శ్రద్దగా మ్యాచ్‌ చూసిన అనుష్క. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది. కోహ్లీ 60 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్‌ సహాయంతో అర్థ సెంచరీ చేశాడు. అ సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందిచింది. అ సమయంలో విరాట్‌ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు?