తన లుక్ తో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్ లేటెస్ట్
మూవీ ఫ్యాన్, తొలి ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి వరకు
కేవలం డ్రామాగా మాత్రమే ఈ సినిమాను చూపిస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఫస్ట్
ట్రైలర్ లో ఇదో యాక్షన్ డ్రామగా రివీల్ చేశారు. ముఖ్యం రెండు విభిన్న
పాత్రల్లో షారూఖ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
ట్రైలర్ తోనే సినిమా కథను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. తన అభిమాన
నటుడి కోసం ఎంతకైన తెగించే వ్యక్తి ఆ నటుడికే శత్రువుగా మరటం, ఆ తరువాత
పరిణామాలే ఈ సినిమా కథగా కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో
తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 15న రిలీజ్ కు
రెడీ అవుతోంది.
Monday, February 29, 2016
మరో యంగ్ హీరో మూవీలో అనసూయ?
క్షణం మూవీ సాధించిన విజయంతో జోరుమీదున్న యాంకర్ అనసూయ మరింత
దూసుకుపోతోంది. టాలీవుడ్లో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం
అనూయను సంప్రదించినట్లు సమాచారం. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్
బ్యానర్లో చిత్రం తెరకెక్కబోతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు
తెలుస్తోంది. దీంతోపాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో
ఆమె ఓకే చెప్పినట్లు టాలీవుడ్ టాక్.
రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో ఘనవిజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. .
రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణమురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయ. దాదాపుగా 'ధ్రువ' అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా సోగ్గాడే చిన్ని నాయనా' క్షణం మూవీలలో పెర్ఫార్మెన్స్, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో ఘనవిజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. .
రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణమురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయ. దాదాపుగా 'ధ్రువ' అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా సోగ్గాడే చిన్ని నాయనా' క్షణం మూవీలలో పెర్ఫార్మెన్స్, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Subscribe to:
Posts (Atom)