Monday, July 27, 2015

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం హఠాన్మరణం

             నిరుపేదగా పుట్టావు. నింగికెగరాలని కలలు కన్నావు. నిప్పులు చిమ్మే రాకెట్లను చేశావు. నిగర్విగా పెరిగావు..నిరాడంబరునిగా మసలావు. అచార్యునిగా..శాస్త్రవేత్తగా గణుతికెక్కావు. రక్షణ రంగనిపుణునిగా ఎంత ఖ్యాతి గడించావో..  రాష్ట్రపతిగా అంతే రాణించావు. .ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతో ఒదిగి ఉన్నావు.ప్రకృతిఅన్నా..పసిబాలలన్నా..విద్యార్థులన్నా. విజ్ఞానమన్నా ఎంతో ప్రేమించావు. సాంకేతికరంగాన్ని ఎంత అధ్యయనం చేశావో ..సంగీతాన్ని అంతే ఇదిగా సాధన చేశావు చివరిక్షణం దాకా పాఠాలు చెపుతూనే ఉన్నావు. మరలిరాని లోకాలకు నువ్వేగినా... కలాం నిర్మలమైన నీ నవ్వును..నీవు చూపిన బాటనూ మరిస్తే కదా ఈ దేశం...!రి
      ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన అవుల్‌ ఫకీర్‌ జైనులాబ్దీన్‌ అబ్దుల్‌ కలాం...ఓ శాస్త్రవేత్తగా ఎదిగి..రాష్ట్రపతి పదవి పొందటం వెనుక నిరంతర శ్రమ, స్వయంకృషి...అన్నింటికీ మించి మంచి మనస్సు వుంది. జీవితంలో తనకు లభించిన స్థాయిని సమాజానికి అందించాలని తపనపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. తన నిరాడంబరత, నిజాయితీతో అత్యున్నత పదవులకు వన్నె తెచ్చారు. నాణ్యమైన విద్య అందుబాటులోకి తేవాలన్న బలమైన ఆకాంక్షను వెలిబుచ్చుతూ...తన చివరి శ్వాసను కూడా విద్యార్థుల మధ్యే విడిచారు.  ఆయన జీవితంలోని ముఖ్య విషయాల్ని ఇక్కడ కొంత అందజేస్తున్నాం..
 
గొప్ప శాస్త్రవేత్త కలాం
                కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డీఆర్డీవోలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్ర వేత్త విక్రం సారాభారు కింద ఇన్‌కాస్పర్‌ కమిటీలో పని చేశారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. ఇస్రో మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వీ-111) ప్రయోగానికి డైరెక్టర్‌గా పని చేశారు. జులై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పని చేయడం తన జీవితంలో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970లో స్థానికంగా తయారైన ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ డీఆర్డీవో ఇండియన్స్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పని చేశారు. 1998లో భారత దేశ పోఖ్రాన్‌-2 అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2002 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్తిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. కలాం 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌' ఇండియా 2020-ఎ విజన్‌ ఫర్‌ ది న్యూ మిలినియం' మై జర్నీ అండ్‌ ఇగ్నిటెడ్‌ మైండ్స్‌, అన్‌లిషింగ్‌ ది పవర్‌ విత్‌ఇన్‌ ఇండియా' అనే పుస్తకాలను రచించారు. ఆయనకు 30 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఆయనను భారత అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించారు. 

Tuesday, July 21, 2015

రుద్రమ దేవి నుంచి ముక్తాంబ పోస్టర్ విడుదల

 కాకతీయ వీర వనిత రుద్రమ దేవి జీవిత చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం రుద్రమ దేవి. త్వరలో ఈ చిత్రం తెర మీద సందడి చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ప్రధాన పోస్టర్‌లను దర్శకుడు గుణశేఖర్ విడుదల చేస్తూ సినిమాపై ఉత్కంఠ పెంచుతున్నాడు. తాజాగా ముక్తాంబ పాత్రధారి నిత్యామీనన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Wednesday, July 15, 2015

బంగ్లాదేశ్‌ హ్యాట్రిక్‌ విజయం

 బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జటైన దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్‌ను గెలిచి వరుసగా మూడో సిరీస్‌ విజయాన్ని  ఖాతాలో వేసుకుది. పాకిస్తాన్‌, భారత్‌లపై వన్డే సిరీస్‌లను గెలిచిన బంగ్లా తాజాగా మరో సిరిస్‌ని  సొంతం చేసుకుది. దక్షిణాఫ్రికాపై 2-1తేడాతో గెలిచింది. దీంతో బంగ్లాదేశ్‌ హ్యాట్రిక్‌ సిరీస్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. సౌమ్య సర్కార్‌ ( 90) పరుగులు చేశాడు. తమీమ్‌ ఇక్బాల్‌ 61 పరుగులు నాటౌట్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును దక్కించుకున్నాడు. మ్యాచ్‌ వర్షం కారణంగా 40 ఓవర్లకు  కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 168 పరుగులు చేయగా బంగ్లాదేశ్‌ మాత్రం ఒక వికెటు కొల్పోయి విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ పూల్‌ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌ జట్టు విజయనందంలో చిదులువేస్తున్నారు. చిన్న జట్నైనా విజయాలు దీటుగా వస్తున్నాయి.

Tuesday, July 14, 2015

మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం ... సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

 జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకఁన్న టీమిండియా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా జాదవ్‌ కాగా, మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ అంబాటి రాయుడు ఎంపికయ్యాడు. టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఆట ప్రారంభించిన ఇండియా 84 పరుగులుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయాయి. ఓపెనర్లు రహానే ( 15), విజరు ( 13), ఉతప్ప ( 31), తివారి ( 10 ) తకఁ్కవ స్కోరు అవుట్‌ కాగా తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ జాగ్రత పడ్డారు. మనీష్‌ పాండే, జాదవ్‌ ఇద్దరు కలిసి ఐదో వికెటుకఁ 144 పరుగుల భాగస్వామ్యాఁ్న నెలకొల్పారు. జాదవ్‌ 87 బంతులల్లో ఒక సిక్స్‌, 12 ఫోర్లు సహాయంతో సెంచరీ చేశాడు. వన్డేలలో తొలి శతకం సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో మజ్జీవ రెండు వికెట్లు తీయగా చిబాబా, మసకద్జ, ఉత్సేయ తలో వికెటు తీశారు. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 193 పరుగలకే అలౌట్‌ అయ్యింది. చిబాబా ( 82), చకబ్వ ( 27), ముతుంబి ( 22) పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ తకఁ్కవ స్కోరు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలర్లులో స్టువర్ట్‌ బిన్నీ 3 వికెట్లు తీయగా మోహిత్‌ శర్మ, హర్బజన్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మురళీ విజరుకఁ ఒక వికెటు లభించింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం


 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లకు సంబంధించి చెన్నై సూప్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లను ఐపీఎల్‌ నుంచి రెండేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ ఛీఫ్‌ జస్టిస్‌ రాజేంద్ర మాల్‌ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసింది. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మేయప్పన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ సహభాగస్వామి రాజ్‌ కుద్రాపై జీవితకాల నిషేదం విధించింది. వీరిద్దరూ క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుడా నిషేధం పెట్టింది. వీరిద్దరూ బీసీసీఐ, క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చారని కమిటీ అభిప్రాయపడింది.
రానున్న ఐపీఎల్‌పై ప్రభావం ?
        
ఐపీఎల్‌లో మొత్తం 8 జట్టు వున్నాయి. వీటిలో రెండు జట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌ విధించడంతో ఆరు జట్లు మాత్రమే వున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఐపీఎల్‌ కార్యవర్గం తర్వలో సమావేశం కానుంది. కొత్త జట్లను కూడా తీసుకఁనే అవకాశాన్ని పరిశీలించే అవకాశముంది.
' ధోని లేకుడా ఐపీఎల్‌ ను ఊహించుకోవడం కష్టం'
         
చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌ దూరమైతే దాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్ఫష్టం చేశాడు.

Thursday, July 9, 2015

' బాహుబలి' పై సంభాషనాలు, రూమారులు, కామెంట్లు ....

' బాహుబలి' మరి కొన్ని  గంటల్లో ప్రేక్షకు ల ముందుకు వస్తున్న తరుణంలో సిని మాపై పలు కామెంట్లు వస్తున్నాయి. 'బాహుబలి' సిఁమా ముందు అనుకున్న ప్రకారం సంవత్సరనరలో పూర్తి చేయాలని  అనుకున్న విషయం ప్రబాస్‌కు తెలియజేశారు. ఈ విషయం ప్రభాస్‌ సినిమాకు 15 కోట్ల పారితోషికం మాట్లాడుకు ఓప్పదం కుదుర్చుకున్నాడు. అది కాస్త రెండున్నర సంవత్సరాలు అయ్యింది. దాంతో పారితోషికును కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. సినిమా మ్తొతంగా పూర్తి అయ్యే వరకఁ 35 కోట్లు తీసుకున్నట్లు సిని వర్గాల ద్వారా సమాచారం.

' బాహుబలి' సినిమా ఒక్క రోజులో 700ల షోలు...
' బాహుబలి' సినిమాకఁ ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హైదరాబాద్‌లో దాదాపు 90 శాతంకఁ పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. రేపు విడుదలకు సిద్దమవుతున్న సిఁమా టికెట్ల కోసం ఇప్పటి వరకఁ ధియేటర్ల వద్ద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ధియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు అమ్ముడు పోగా, మరి కొన్ని కొత్తగా చేరిన థియేటర్లలో అడ్వాస్స్‌ బుకింగ్‌ ఇస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 700 ధియేటర్లలో వేయనున్నట్లు తెలుస్తుంది.

' బాహుబలి' అర్థరాత్రి బెన్‌ఫిట్‌ షో చూసి రివ్యూ మీకఁ అందించడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆంధ్రాహెడ్‌లైన్స్‌ మీకు రివ్వూను అందజేస్తుంది. అని  సమచారం వచ్చింది. ఇలా వస్తే సిఁమా చూసేవాలకి ఈట్రేష్‌టు పోతుంది.
బాహుబలి టికెట్లపై జోకులు
బాహుబలి టికెట్లకు ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం. వందలను దాటి, వేలలో ఈ టికెట్ల రేట్లు ఉన్నాయి. అయినా కూడా లక్షల కొద్ది టికెట్లు అడ్వాస్స్‌గానే అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది టికెట్లు తీసుకు సిసిమా కోసం ఎదురుచూస్తున్నారు. దొరకు అభిమానులు ఎంత బాధతో ఉన్నారు.
బాహుబలికి ప్లాప్‌ టాక్‌ రేటింగ్‌ 2/5మరో 24 గంటల్లో విడుదలయ్యే సిఁమాకఁ అప్పుడే రేటింగ్‌ వచ్చింది. ఈ విషయం అందరికి సందేహాలు రావచ్చు. ' బాహుబలి ' రేటింగ్‌ 2/5 ప్లాప్‌ సిని మా వచ్చింది. దుబారు సెన్సార్‌ బోర్డు సభ్యురాలు యూఏఈ ఎడిటర్‌ కియార సంధు సినిమా చూసి రేటింగ్‌ ఇచ్చింది. సంగీతం దర్శకత్వం, స్క్రీన్‌ప్లే ఏమాత్రం అకట్టుకునే విధంగా లేవు. అని ప్రేక్షకఁలు ఈ సినిమాకు వేల రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని చేప్పింది.




Wednesday, July 8, 2015

'బాహుబలి' టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు

 సిఁమా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్దమైయింది.నగరంలో విడుదలకు ముందే అన్ని ధియేటర్లలో టికెట్లు అమ్ముడుపోగా... రెండు రోజుల ముందుగానే ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ దాదాపు అన్ని ధియేటర్లలో అమ్ముడు పోయాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్లకు పైగా విడుదల చేయాలని నిర్ణయించారు. ' బాహుబలి' సినిమా ముందు అనుకు న్న ప్రకారం వన్‌ అండ్‌ హాఫ్‌ ఇయర్‌లోనే పూర్తి చేయాలనికు న్నారు. కానీ సమయం సరిపోలేదు. అందుకే రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇప్పటికే అభిమానులు సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. రెండు రోజుల ముందు తమన్నా ఇంటర్వూలో ' బాహుబలి' సినిమా మంచి అవకాశం లభించింది. ' బాహుబలి' తమ పాత్ర అతిలోక సుందరిలా ఉంది. దేవ కన్యగా నటిస్తుంది అని చేప్పింది. ఇక ఈసిఁమా ఫస్ట్‌కాపీ కూడా సిద్దం అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్మకృష్ణ తదితరులు నటిస్తున్నారు.