Monday, August 22, 2011

ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌

ఇంగ్లాండ్‌ 4-0 కైవసం
సచిన్‌ సెంచరీ మిస్‌ 
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ ఎనిమిది పరుగులతో ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. సిరిసీను 4-0తో ఇంగ్లాండ్‌ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగులు చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 129/3తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగో వికెటుకు 144 పరుగులు జోడించింది. సచిన్‌, మిశ్రా ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. కనీసం ఈ మ్యాచ్‌నైనా డ్రా చేసుకోవాలిని భారత జట్టు భావిస్తోంది. చివరికి ఆశ నిరాశగా మిగిలిపోయింది. లంచ్‌ వరకు భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 216/3 పరుగులు చేసింది. సచిన్‌ 72, మిశ్రా 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మరో వికెట్టు పడ్డకుండా జాగ్రత పడ్డారు. చివరికి అమిత్‌ మిశ్రా స్వాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 141 బంతులలో 10 ఫోర్లు సహయంతో 84 పరుగులు చేశాడు. 16 పరుగులు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మరుసటి ఓవర్లలో బెన్నస్స్‌ బౌలింగ్‌లో ఎల్‌ బిడబ్యూగా సచిన్‌ అవుట్‌ అయ్యారు. 172 బంతులలో 11 ఫోర్లు సహయంతో 91 పరుగులు చేశాడు. తోమ్మిది పరుగుతో సెంచరీ కోల్పోయ్యాడు. సచిన్‌ తన 100వ సెంచరీ చేసి డ్రాగా ముగించాలిన భావించాడు. కాని సచిన్‌ సెంచరీ చేయలేదు. అతరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు కనీసం ఒక్కరు కూడా క్రీజులో ఉండాలని ప్రయత్నించాల లేదు. సురేష్‌ రైనా 0, కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని 3, ఆర్‌ పి సింగ్‌ 0, గంభీర్‌ 3, శ్రీశాంత్‌ 6 పరుగులు చేసి అలౌట్‌ అయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో స్వాన్‌ 6, బ్రాడ్‌ 2, బెన్నస్‌ , అండర్సన్‌ చెరో వికెటు లభించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇయాన్‌ బెల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ బ్రాడ్‌ లభించింది. దీంతో భారత్‌ మూడవ స్థానానికి దిగజారింది. ఇంగ్లండ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది.