Tuesday, January 31, 2017

మర్చిపోలేని రోజు.. నాగచైతన్య

 అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే వీరందరికీ నాగచైతన్య మంగళవారం ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబంతో కలిసి దిగిన చక్కని ఫొటోలను పోస్ట్‌ చేశారు. అది మర్చిపోలేని రాత్రని, కొత్త ఆరంభమని పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పారు.
చైతూ, సమంతల నిశ్చితార్థం పట్ల పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. జంట చక్కగా ఉందంటూ.. ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరి పెళ్లి త్వరలోనే హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

Monday, January 30, 2017

లాస్యకు కాబోయే వరుడు ఇతడే..


ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్ మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య.
ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్ పోస్ట్ గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు.

దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది. అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది. మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది.

Sunday, January 29, 2017

ఒకే తరహా పాత్రల్లో నటించడం నచ్చదు

 బాలీవుడ్‌లో కెరీర్‌ని మొదలు పెట్టినప్పటికీ.. తెలుగులో ‘హార్ట్‌ఎటాక్‌’.. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆదా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘కమాండో2’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి ఒకే తరహా పాత్రల్లో నటించడమంటే అస్సలు నచ్చదంట.
‘‘ ఒకే విధమైన పాత్రల్లో నటించడమంటే నచ్చదు. విభిన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. అలాంటి పాత్రలు దొరికితే ఎక్కడైనా సంతోషంగా నటిస్తా. దక్షిణాదిలో ఇప్పటివరకు ఎమోషనల్‌ పాత్రల్లో మాత్రమే నటించా. అయితే ‘కమాండో2’లో మాత్రం ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రంలో నాపై యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇందులో నేను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపిస్తున్నా. ఇంతకముందు ఎప్పుడూ గన్‌ని పట్టుకోలేదు. కానీ ఈ సినిమా కోసం గన్‌ పట్టుకున్నా. అలాగే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించేందుకు.. గన్‌ సరిగ్గా పట్టుకోవడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఇందులో నటించడం చాలా సరదాగా అనిపించింది.’’ అని చెప్పుకొచ్చింది ఆదాశర్మ.

Friday, January 27, 2017

'టాప్' లేపిన డేవిడ్ వార్నర్!

 కెరీర్‌లో ఉన్నత దశలో ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో శతకాల మోత మోగించిన వార్నర్‌ 367 పరుగులతో రాణించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కెరీర్‌లో తొలిసారిగా ఆసీస్ ప్లేయర్ ఫస్ట్ ర్యాంకును సాధించాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి మారాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక స్థానం మెరుగు పరుచుకుని 13వ ర్యాంకు సాధించగా, గాయాలతో సతమతమవుతున్న రోహిత్ శర్మ మూడు స్థానాలు దిగజారి 12వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్‌తో సంయుక్తంగా శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్ 57 స్థానాలు మెరుగు పరుచుకుని 47వ ర్యాంకు దక్కించుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌లో నో ప్లేస్
 ఏ భారత బౌలర్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకోలేదు. మూడు స్థానాలు దిగజారిన అక్షర్ పటేల్ 12వ స్థానంలో, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా బౌలింగ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా వన్డేల్లో మూడో స్థానాన్ని అలాగే కొనసాగించింది.

Wednesday, January 25, 2017

రివ్యూ: రయీస్‌


 ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలు పండించాలన్నా.. మాస్‌ని మెప్పించాలన్నా.. కుర్రకారుకు కిక్కిచ్చే రొమాన్స్‌ పండించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అందుకే షారుక్‌ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు వినోదపు విందు దొరికినట్లేనని భావిస్తారు. ఆయన తాజా చిత్రం ‘రయీస్‌’ పైనా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని గతేడాది జులైలో రంజాన్‌ సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ.. సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ రావడంతో వాయిదా వేశారు. ఆరు నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం సినీ అభిమానులను ఏ మేరకు అలరించింది? ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? అన్నది చూస్తే..
కథేంటి?: గుజరాత్‌లోని ఓ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న ఆ రాష్ట్రంలో 1980.. 90 మధ్య కాలంలో జరిగిన అక్రమ వ్యాపారం నేపథ్యంతో సాగుతుంది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన రయీస్‌ (షారుక్‌ ఖాన్‌) అక్రమ మద్యం వ్యాపారానికి అధిపతిగా ఎదుగుతాడు. తాను చేసేది తప్పా.. ఒప్పా అన్నది పట్టించుకోకుండా వ్యాపారం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు.
తన వ్యాపారానికి అడ్డు చెప్పిన వారిని అంతమొందించేందుకూ వెనకాడడు. రాష్ట్రంలోని రాజకీయ.. పోలీసు.. కార్పొరేట్‌ వర్గాలను తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి చేరుకుంటాడు. అయితే.. ఒక్కసారిగా రయీస్‌ జీవితం తలకిందులవుతుంది. వ్యాపారాధిపతిగా ఉన్న రయీస్‌ జీవితం ఒక్కసారి మారిపోవడానికి గల కారణాలేంటి? అతని అవినీతి అక్రమాలను ఎవరు.. ఎలా నిలువరించారు? చివరికి రయీస్‌ ఏమయ్యాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: అక్రమ మద్యం వ్యాపారాన్ని కథాంశంగా తీసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాల్లో ఛాలెంజింగ్‌ ఛేజ్‌లు చేసిన షారుక్‌ మొదటి భాగాన్ని తన భుజాలపై నడిపించాడు. ద్వితీయార్ధంలో ఎమోషనల్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కంటెంట్‌ లేకుండానే కథ సాగినట్లు అనిపిస్తుంది. ముందుగానే వూహించేలా సన్నివేశాలు ఉంటాయి. కత్తెరకు మరికాస్త పని చెబితే బాగుండేది.
బలమైన కథ ఉన్నప్పటికీ కథనం మాత్రం దారి తప్పింది. రయీస్‌ అక్రమ బాగోతాలను బహిర్గతం చేసేందుకు నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా నవాజుద్దీన్‌ సిద్దిఖీ వేసే ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తాయి. సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
 
ఎవరెలా?: ఐదు పదుల వయసులోనూ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో షారుక్‌ ఖాన్‌ మెప్పించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ను చాటుకున్నారు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లో నటించడమంటే నవాజుద్దీన్‌ సిద్ధిఖీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రంలోనూ ఆయన తన మార్కును చాటుకోగలిగారు. నిజాయతీపరుడైన పోలీసు అధికారి పాత్రలో నవాజ్‌ ఒదిగిపోయారు. పాకిస్థానీ ముద్దుగుమ్మ మహీరా ఖాన్‌ నటన పర్వాలేదనిపిస్తుంది. ప్రత్యేక గీతంలో వచ్చిన సన్నీ లియోని ప్రేక్షకులకు హుషారెత్తిస్తుంది.
చివరగా.. ‘రయీస్‌’ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది  

Sunday, January 22, 2017

నేను.. అతడు.. ఆమె

ఈ వీకెండ్‌ సమంతకి ఎప్పటికీ గుర్తుండే మెమరబుల్‌ మూమెంట్‌ అనే చెప్పాలి. చల్లగాలిలో చెలికాడితో కలసి షికారుకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్ని ‘నేను, అతను మరియు ఆమె’ అని సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక్కడ ‘నేను’ అంటే సమంత. ‘అతడు’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ... సమంత ప్రేమికుడు అక్కినేని నాగచైతన్యే! మరి, ‘ఆమె’ ఎవరు? అనుకుంటున్నారా! సూపర్‌ఫాస్ట్‌ స్పోర్ట్స్‌ కార్‌. నాగచైతన్యకి బైక్స్‌ అండ్‌ కార్స్‌ అంటే చాలా ఇష్టం.
వీలు చిక్కినప్పుడు... కారులో షికారుకి వెళ్లడం చైతూకి అలవాటు. అంతకు ముందు సోలోగా రేసింగ్‌ కారులో రయ్‌ రయ్‌మంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కదా! ప్రేయసి, త్వరలో కాబోయే శ్రీమతి సమంతతో కలసి శనివారం ఢిల్లీ శివార్లలోని రేసింగ్‌ సర్క్యూట్‌లో ఎంజాయ్‌ చేశారు. ఆ హ్యాపీ మూడ్‌లో ‘మా శ్రీమతి తీసిన ఫొటోలు’ అని నాగచైతన్య సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ లవ్‌బర్డ్స్‌ పెళ్లి చేసుకుని ఒకే గూటిలో ఉండే సమయం దగ్గర్లోనే ఉంది.

Friday, January 20, 2017

యువీని చూసి మీరేం నేర్చుకుంటారు!

 పర్యాటక ఇంగ్లాండ్‌ జట్టుతో కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో యువరాజ్‌, ధోనిలు చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. ఈ జోడీపై ఒకప్పటి డాషింగ్‌ ఓపెనర్‌, ట్విటర్‌ కింగ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరినీ ఆకాశానికెత్తేస్తున్నారు.
‘పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్‌, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని’ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ వ్యక్తి క్యాన్సర్‌ను జయించాడు. అతడు మాత్రమే ఈ రోజు ఇంగ్లీష్‌ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని’ యువరాజ్‌సింగ్‌ను ఉద్దేశించి సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. మైదానంలో యువీ, ధోనిల ఫోటోతో పాటు యువరాజ్‌సింగ్‌ క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్న తర్వాత తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

Wednesday, January 18, 2017

సంజయ్‌కు కుమార్తె దొరికింది!

 బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘భూమి’ చిత్రంలో నటి అదితిరావు హైదరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంజయ్‌ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాళ్లు ఈ పాత్రకు తగిన నటి కోసం అన్వేషించిన చిత్ర బృందం అదితిని ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపింది. ఒమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో తన పాత్ర కోసం అదితి సిద్ధమౌతున్నారట. ఫిబ్రవరిలో ‘భూమి’ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

Tuesday, January 17, 2017

అతడితో డేటింగ్‌లో ఉన్నా

 బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లుగా కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది సోనమ్‌.
ఇటీవల సోనమ్‌కపూర్‌.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్‌ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్‌.. ‘‘లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌ చేస్తున్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండి. నా పర్సనల్‌ విషయాల గురించి అంతకంటే ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దాన్ని నేను చాలా పవిత్రంగా భావిస్తున్నా. కాబట్టి నా వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.’’ అని చెప్పుకొచ్చింది సోనమ్‌ కపూర్‌.

Friday, January 13, 2017

ప్రియుడి కోసం ఏం చేసిందో తెలుసా?

 ప్రేమకోసం.. ప్రియురాలి కోసం ప్రియుడు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు. విలన్లతో పోరాడుతాడు. దెబ్బలు తింటాడు. జైలుకెళ్తాడు. ప్రేమను గెలుపించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. ఇది సహజం. కానీ.. ప్రియుడు కోసం ఓ ప్రియురాలి చేసిన సాహసం గురించి చెబితే.. ఔరా! అంటూ ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ఏం చేసిందంటే..
వెనుజులాకి చెందిన 25ఏళ్ల ఆంటోనిటా రొబుల్స్‌ సౌడా బార్సిలోనాలోని ప్యుంటె అయేలా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జోస్‌ ఆంటోనియోను చూసేందుకు వచ్చింది. ఆమెతో పాటు తన పాపను.. గులాబి రంగు సూట్‌కేస్‌ను వెంట తెచ్చుకుంది. ఈ జైల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన వారు రాత్రంతా అక్కడే గడిపే వెసులుబాటు ఉంది. దీంతో సౌడా తన ప్రియుడితో రాత్రంతా గడిపింది. మరుసటి రోజు సౌడా తాను తెచ్చుకున్న గులాబి రంగు సూట్‌కేసులో ప్రియుడిని కుక్కి పడుకోబెట్టి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాదాపు తప్పించుకున్నారన్న సమయంలో జైలు ద్వారం వరకు సూట్‌కేసును మోసుకెళ్లిన సౌడా ద్వారం గడపను దాటించేందుకు చాలా అవస్థలు పడింది. సూట్‌కేసులో ప్రియుడు ఉండటంతో అది బరువైక్కింది. దాన్ని సౌడా ఒక్కతే మోయలేకపోయింది. వచ్చేటప్పుడు సౌడా సూట్‌కేసును అవలీలగా మోసుకెళ్లింది. ఇప్పుడు మోసేందుకు శ్రమిస్తుడంటంతో అనుమానం వచ్చిన పోలీసులు సూట్‌కేసును తెరిచారు. అందులో ఆమె ప్రియుడు జోస్‌ ఆంటానియో ఉండటం చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. వెంటనే అతన్ని మళ్లీ జైలు గదికి పంపి.. సౌడాను కోర్టులో హాజరుపర్చారు. తొందరల్లో ఆమెకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. వారి పాపను సోషల్‌ సర్వీస్‌ శాఖకు అప్పగించనున్నారు.

Thursday, January 12, 2017

గౌతమీపుత్ర శాతకర్ణి ఎర్లీ రివ్యూ!


నందమూరి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరో అంటారు. ఆయ‌న సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సంద‌డే సంద‌డి. ఇప్పుడు మ‌రోసారి పండ‌గ సంద‌ర్భంగానే బాల‌య్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈసారి వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌త్యేక‌మైన‌ది. బాల‌కృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క‌మైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రక క‌థ‌తో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రక పాత్ర‌ల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ త‌ర‌హా క‌థ‌లని న‌మ్మి సినిమా చేయ‌డంలోనూ త‌న‌కి తానే సాటి అయిన బాల‌య్య త‌న వందో చిత్రంగా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చేయ‌డం విశేషం. తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌లో బాల‌య్య‌ను.. ఆయ‌న హావ‌భావాల్ని.. పౌరుషంతో చెప్పిన సంభాష‌ణ‌ల్ని ప్ర‌చార చిత్రాల్లో చూసిన‌ప్ప‌ట్నుంచి ప్రేక్ష‌కుల్లో ఆత్రుత‌.. అంచ‌నాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే బాల‌య్య తెర‌పై విజృంభించాడా? చ‌రిత్ర ఆధారంగా కొద్దిగానే తెలిసిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఎలాంటిది? ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎలా చిత్రీక‌రించార‌న్న‌ది చూస్తే..

కథేంటంటే: ఒకే రాజ్యం... ఒకే యుద్ధం.. అడ్డు గోడ‌లు లేని అఖండ భరత జాతి... అనే కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాల‌కృష్ణ‌) . చిన్న‌ప్పుడే తాను క‌న్న క‌లని సాకారం చేసుకోవ‌డమే ల‌క్ష్యంగా అడుగులేస్తుంటాడు. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గంతో పాటు మ‌రెన్నో రాజ్యాల‌ని త‌న రాజ్యంలో క‌లుపుకొంటాడు. సౌరాష్ట్రలో నహపాణుడి (కబీర్‌బేడీ) ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని కూడా సొంతం చేసుకొని ఉత్త‌ర, ద‌క్షిణాల్ని ఒక్క‌టి చేయాల‌నుకొంటాడు. అయితే అప్ప‌టికే శాత‌క‌ర్ణి పూర్వీకుల్ని ఓడించిన నహపాణుడు దీటుగా జ‌వాబిస్తాడు. నాతో యుద్ధ‌మే చేయాల‌నుకొంటే నీ బిడ్డ పులోమావిని తీసుకొని రా అంటాడు. నేను ఓడిపోతే నా వీర‌ఖ‌డ్గం నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నీ బిడ్డ‌ని నాకిచ్చి వెళ్లిపోవాలంటాడు. అందుకు శాత‌క‌ర్ణి ఒప్పుకొన్న‌ప్ప‌టికీ, ఆయ‌న భార్య వాశిష్టీ దేవి (శ్రియ‌) ఎలా స్పందించింది? త‌న బిడ్డ‌తో క‌లిసి యుద్ధానికి వెళ్లిన శాత‌క‌ర్ణి ఎలాంటి పోరాటం చేశాడు? మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛత్రాధిప‌త్యం కింద‌కి తీసుకొచ్చి శ‌క‌పురుషుడిగా ఆవిర్భ‌వించిన శాత‌క‌ర్ణిని దెబ్బ కొట్టేందుకు యుద్ధానికి దిగిన గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శాత‌క‌ర్ణిని ఓడించేందుకు అత‌డుఎలాంటి వ్యూహాల్ని ర‌చించాడు? అందులో గెలుపు ఎవ‌రిది? తిరుగులేని శాత‌క‌ర్ణికి మాతృమూర్తి గౌత‌మి (హేమ‌మాలిని) అండ‌గా నిలిచిన వైనం ఎలాంటిది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెండితెర‌పైన చూడాల్సిందే.
 

ఎలా ఉందంటే:. మ‌నదైన చ‌రిత్ర‌కి క్రిష్ బృందం క‌లిసిక‌ట్టుగా పెట్టిన ఓ బొట్టు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. బాల‌కృష్ణ త‌న వందో చిత్రంగా ఈ సినిమాని ఎంపిక చేసుకొన్న‌ప్పుడు భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బాల‌య్య చారిత్రక చిత్రాల్లో చ‌క్క‌గా ఒదిగిపోగ‌ల‌ర‌నే ఓ సానుకూలాంశం త‌ప్ప‌.. చ‌రిత్ర‌లో మాస్ అంశాలు ఏముంటాయి? అభిమానుల్ని మెప్పించ‌గ‌ల‌దా? అనే మాట‌లు వినిపించాయి. కానీ క్రిష్ మాత్రం మ‌న చ‌రిత్ర‌కి మించిన మాస్ అంశం ఏముంటుందని ఈ చిత్రంతో చాటి చెప్పారు. త‌న‌కు ల‌భ్య‌మైన ఆ కొద్దిపాటి చ‌రిత్ర‌నే సినిమాకి అనుగుణంగా చ‌క్క‌టి క‌థ‌గా తీర్చిదిద్దుకొన్నారు, అంతే చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చారు. క‌ళ్యాణ‌దుర్గం రాజ్యంపై శాత‌క‌ర్ణి దండెత్తడం నుంచి సినిమా క‌థ మొద‌లవుతుంది. క‌ళ్యాణ‌దుర్గంతో పాటు, స‌హ‌పాణుడిని ఓడించి మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంలోకి తీసుకొస్తాడు శాత‌క‌ర్ణి.
 

Wednesday, January 11, 2017

'ఖైదీ నంబర్ 150' మూవీ రివ్యూ


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఖైదీ నంబర్ 150 గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడా..?
 కథ :
తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి కథకు దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. దొంగతనాలు, మోసాలు చేసి కోల్ కతా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కత్తి శ్రీను (చిరంజీవి). ఆ జైలు నుంచి ఓ ఖైదీ పరారవ్వటంతో ఆ ఖైదీని పట్టుకోవడానికి జైలర్, కత్తి శ్రీనును సాయం అడుగుతాడు. ఖైదీని పట్టించి శ్రీను జైలు నుంచి పారిపోతాడు. ఇండియాలో ఉంటే పోలీసులను తప్పించుకోలేమని తన ఫ్రెండ్(అలీ) సాయంతో బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో లక్ష్మీ(కాజల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి, బ్యాంకాక్ ప్రయాణం మానుకొని ఇండియాలో ఉండిపోతాడు.

లక్ష్మీ అడ్రస్ ఎలా సాధించాలని ఆలోచిస్తుండగా అచ్చు శ్రీనులానే ఉన్న శంకర్(చిరంజీవి) ను కొంత మంది వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ ను కాపాడి శంకరే శ్రీను అని పోలీసులు నమ్మేలా తన వస్తువులు శంకర్ దగ్గర ఉంచి వెళ్లిపోతాడు. దీంతో శంకర్ ను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకున్న శ్రీను తిరిగి బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో శంకర్ కు సంబంధించిన వాళ్లు శ్రీనును శంకర్ అనుకొని తీసుకెళతారు. అదే సమయంలో శంకర్ ను చంపడానికి ప్రయత్నించిన కార్పోరేట్ ఇండస్ట్రియలిస్ట్ అగర్వాల్(తరుణ్ అరోరా) శ్రీనును పిలిపించి 25 కోట్లు ఇస్తా నీతో ఉన్న ముసలి వాళ్లను వదిలేసి వెళ్లిపోమని చెపుతాడు. అందుకు ఒప్పుకున్న శ్రీను డబ్బు తీసుకొని బయల్దేరతాడు.

కానీ శంకర్ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అతని పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను.. మనసు మార్చుకుంటాడు. నిజాయితిగా శంకర్ చేస్తున్న పోరాటం గెలవటం కష్టమని.. తానే శంకర్ గా మారి రైతులను గెలిపించాలని నిర్ణయించుకుంటాడు. అసలు శంకర్ చేస్తున్న పోరాటం ఏంటి..? ఓ టీవీ రిపోర్ట్ కూడా పట్టించుకోని సమస్యను శ్రీను దేశం దృష్టిలో పడేలా ఎలా చేశాడు..? చివరకు శంకర్ ఆశయం గెలిచిందా..? శంకర్, శ్రీనులు కలిసారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి  రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్.
ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150.. మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరించే పక్కా కమర్షియల్ సినిమా. బాస్ ఈజ్ బ్యాక్

Monday, January 9, 2017

ధోనీ రిటైర్మెంట్‌ పై వివాదం

  టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ గా మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ ను దృష్టిలో ఉంచుకుని కొత్త సారథిని ఎంపిక చేసేందుకు వీలుగా ధోనీ వైదొలగాడని పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి చేసినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహీ స్వతహాగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోలేదని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌ కే ప్రసాద్‌ స్పందించాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని ప్రసాద్‌ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌ గురించి తనతో మాట్లాడినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్‌ తెలిపాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని ఎంఎస్ కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. విరాట్‌ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన నిర్ణయమని, అతనికి ధోనీ గైడ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌ తో జరిగే వన్డే, టి-20 సిరీస్ లకు విరాట్‌ కోహ్లీని కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించారు.

Saturday, January 7, 2017

‘దృశ్యం’ చూసి హత్య చేశారు..!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని చూసి ప్రేరణ పొంది తండ్రీకొడుకులు ఓ వడ్డీ వ్యాపారిని హతమార్చారు. ఆ చిత్రంలో హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఆధారాలు నాశనం చెయ్యాలని ప్రయత్నించారు.. కానీ వారి ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని కుదల్‌క్వాడి ప్రాంతానికి చెందిన సమిద్దుల్లాహ్‌ మనియార్‌, మెహబూబ్‌ మనియార్‌ తరచూ శ్రీరాం శివాజీ వాలేకర్‌ అనే వ్యక్తి దగ్గర రూ.5లక్షలు అప్పు చేశారు. అలా ప్రతి చిన్నదానికి అప్పులు చేస్తున్నారే కానీ వాటిని తీర్చడం లేదు. అప్పు తీర్చాల్సిందిగా వాలేకర్‌ వారిని హెచ్చరించడంతో ఆ తండ్రీకొడుకులు ఆయన్ని హతమార్చాలని భావించారు. అందుకోసం పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. చిక్లి ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో మనియార్‌, ఆయన కొడుకు మెహబూబ్‌ అద్దెకు ఉంటున్నారు. ఒకరోజు డబ్బులిస్తాం రమ్మని వాలేకర్‌ను పిలిచి తండ్రీకొడుకులిద్దరూ కలిసి హత్యచేశారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాలేకర్‌ మృతదేహాన్ని నలుపురంగు ప్లాస్టిక్‌ సంచిలో కట్టేసి పెట్టి అక్కడి నుంచి ఉడాయించారు.
గతేడాది సెప్టెంబరు 28న వాలేకర్‌ కనిపించకుండా పోయినట్లు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వాలేకర్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా ఎక్కువసార్లు మనియార్‌ ఫోన్‌ నుంచి కాల్స్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. మృతదేహాన్ని ఉంచిన ప్రదేశాన్ని పోలీసులకు తెలియజేయడంతో శుక్రవారం వాలేకర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Friday, January 6, 2017

మళ్లీ జోడీ కడతారా?

ఒక క్రేజీ జంటను సెట్‌ చేయడం అంత సులభం కాదు. నటుడు విక్రమ్, నటి నయనతార కలిసి నటించడానికి చాలా ఏళ్లే పట్టిందన్న సంగతి తెలిసిందే. చిన్న ఈగోనే ఇందుకు కారణం అనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది ఎట్టకేలకు ఇరుముగన్ చిత్రంలో వీరి జత కుదిరింది.చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ హిట్‌ పెయిర్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అందుకోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చాలా ప్రయత్నిస్తున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. శింబు హీరోగా అచ్చయం ఎన్భదు మడమైయడా చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌మీనన్ తాజాగా ధనుష్‌తో ఇన్నై నోక్కి పాయుం తోటా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం అనే చిత్రాన్ని చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చిత్రం ఈ నెల రెండవ తేదీనే సెట్‌పైకి రావలసింది. కానీ అలా జరగలేదు. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో విక్రమ్‌కు జంటగా నటి నయనతారను నటింపజేయాలని దర్శకుడు భావించారట.ఆ విషయమై నయనతారను సంప్రదించగా తను డిమాండ్‌ చేసిన పారితోషికం దర్శకుడు గౌతమ్‌మీనన్ కు ముచ్చెమటలు పట్టించిందని టాక్‌. అయినా ధ్రువనక్షత్రంలో నాయకి పాత్రకు నయనతారనే కరెక్ట్‌ అని భావించిన దర్శకుడు ఆమెను పారితోషికాన్ని తగ్గించుకోమని రిక్వెస్ట్‌ చేసే పనిలో ఉన్నారట.
అయితే ప్రస్తుతం లేడీఓరియెంటెడ్‌ చిత్రాలు, యువ హీరోలతో చిత్రాలు అంటూ యమ బిజీగా ఉన్న టాప్‌ నాయకి నయనతార గౌతమ్‌మీనన్ కోసం దిగి వచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుంటారా? మళ్లీ విక్రమ్‌తో జోడీ కుదురుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ధ్రువనక్షత్రం చిత్రం అనుకున్నట్లు ప్రారంభం కాకుండా జాప్యం జరగడంతో అసహనానికి గురైన విక్రమ్‌ దుబాయ్‌కి చెక్కేసారని కోలీవుడ్‌లో టాక్‌. త్వరలో చిత్రం ప్రారంభం అయ్యిందా సరే. లేకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి వాలు చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి రెడీ అవుతారని సమాచారం.

ధోనికి పొగ పెట్టారా?

  భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని ఆకస్మికంగా వైదొలగాడనికి ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్రస్థాయిలో కసరత్తు జరిపినట్లే కనబడుతోంది. ధోనిని నేరుగా పొమ్మనకుండా.. పొగ పెట్టి మరీ అతను కెప్టెన్సీ నుంచి సాగనంపారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు పగ్గాలను ఉన్నపళంగా ధోని వదులుకోవడానికి కారణం మన సెలకర్లే అంటూ ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇందుకు  బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ వ్యవహరించిన తీరు కూడా బలాన్నిస్తోంది.

ప్రధానంగా త్వరలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో తగినంత ప్రాక్టీస్ చేసుకోవాలని భావించిన ధోని.. గుజరాత్-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్ లో ధోని ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, జార్ఖండ్ జట్టుకు అనధికార మెంటర్ గా వ్యహరించాడు. తన రాష్ట్ర జట్టులోని సభ్యులకు కొన్ని విలువైన సలహాలిస్తూ వారితో తన అనుభవాల్ని పంచుకున్నాడు. ఇదే క్రమంలో ఆ జట్టు ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. అయితే  గడిచిన బుధవారం నాల్గో రోజు ఆటలో అక్కడ ఉన్నట్టుండి చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ దర్శనమిచ్చారు. ధోనితో కూడా సమావేశమైన ఎంఎస్ కే.. సుదీర్ఘంగా చర్చించారు. ఇదంతా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు కోహ్లికి జట్టు పగ్గాలు అప్పచెప్పాలని ఉద్దేశంతోనే ఐదుగురు సభ్యులతో కూడిన మన సెలక్టర్లు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు కనబడుతోంది. ఆ క్రమంలోనే ఎంఎస్ కే అక్కడకు వెళ్లి ధోనికి అసలు విషయం చెప్పినట్లు సమాచారం. ఎంఎస్ కే తో సమావేశమైన అదే రోజు ధోని తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించడం కూడా అందుకు మరింత బలాన్నిస్తోంది. మరొకవైపు ధోని కెప్టెన్సీ నుంచి నిర్ణయం తీసుకున్న తరువాత ఎంఎస్ కే ఇచ్చిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఏడాది క్రితం కానీ, ఆరు నెలల క్రితం కానీ ధోని తీసుకుని ఉంటే తాము తప్పకుండా బాధపడేవాళ్లమంటూ ఎంఎస్ కే పేర్కొన్నాడు. ధోని సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి వైదొలగాడంటూ ప్రశంసించాడు. అంటే ఇప్పుడు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే తమకు ఏమీ అభ్యంతరం లేదనే విషయాన్ని ఎంఎస్కే  చెప్పకనే చెప్పేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ గా ఎంఎస్ కే చేసిన ప్రకటనపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. విరాట్ కు పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పజెప్పాలనే సెలక్టర్లు భావించి ముందుగా ధోనికి ఆ విషయాన్ని తెలిపి ఉండవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించిన  ధోని ఈ నిర్ణయాన్ని స్వతహాగా తీసుకున్నాడా? లేక సెలక్టర్లే పొగ పెట్టారా?అనేది మాత్రం కచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Thursday, January 5, 2017

ఆ పాట వింటే నా వెంటే!

  ‘డాడీస్‌ లిల్‌ గర్ల్‌’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. అందుకే ఇలా పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రియాంక తండ్రి అశోక్‌ చోప్రా చనిపోయారు. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారని ఆమె అంటున్నారు. అప్పట్లో  అశోక్‌ చోప్రా ఓ పాట పాడారు. ఆ పాటను రిలీజ్‌ చేద్దామని  ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లడం జరిగిపోయాయి.
ఇప్పుడా పాటను తాను నిర్మించి న తాజా పంజాబీ చిత్రం ‘శర్వాణ్‌’లో వాడారు ప్రియాంక. ‘‘మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్‌ మోడల్‌. నాన్న పాడిన పాట వింటున్నపుడు ఆయన నాతో ఉన్నారన్న భావన కలుగుతుంది. మా నాన్న మీద ఉన్న ప్రేమతోనే ‘శర్వాణ్‌’ నిర్మించా. ఆయన పాడిన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Wednesday, January 4, 2017

ఒక్క రోజు... రెండు విశేషాలు!

నాగచైతన్య (చైతూ) జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారనుందా? ... అవుననే చెప్పాలేమో! ఎందుకంటే... ఆ రోజు రెండు విశేషాలకు ముహూర్తాలు కుదిరాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చైతూ, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనుందనే వార్త ఎప్పట్నుంచో షికారు చేస్తోంది. దీనికి తోడు చైతూ హీరోగా బావ దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం కూడా ఆ రోజేనని సమాచారం. ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ రెండు వార్తల్నీ అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు) సంస్థలో చైతూ సినిమాలు చేశారు. మరో తాతయ్య (రామానాయుడు) నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క చిత్రం కూడా చేయలేదు.
నిజానికి, కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా మేనమామ సురేశ్‌బాబు ఓ చిత్రం నిర్మించాలనుకున్నారు. ఇప్పుడా చిత్రాన్నే రానా నిర్మించాలను కుంటున్నారట! మరి.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్లోనే నిర్మిస్తారా? రానా తన బేనర్‌కి వేరే పేరు పెట్టుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతూ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మాతృసంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది రెండు చిత్రాలు ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెరపై కనిపించిన చైతూ ఈ ఏడాది కూడా లెక్క తగ్గకుండా చూసుకుంటున్నా రనుకోవచ్చు. అన్నట్లు.. ఈ నెల 29న అటు నిశ్చితార్థం.. ఇటు సినిమా ప్రారంభం... రెండూ  జరుగుతాయా? వెయిట్‌ అండ్‌ సీ.

అలాంటి సినిమాల్లో నటించను: హీరో

  ‘బేఫికర్‌ ’  సినిమాలో హీరోగా నటించే అవకాశం ముందుగా తనకే వచ్చిందన్న రూమర్లను బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తోసిపుచ్చాడు. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా అటువంటి సినిమాలో తాను నటించబోనని స్పష్టం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసునని చెప్పాడు. ‘బేఫికర్‌ ’  సినిమా వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొన్నాడు. ప్రేమ పట్ల భారతీయ యువత ఆలోచనలను ప్రతిబింబించలేదని వివరించాడు.
సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డాడు. పింక్‌, నీర్జా, ధోని బయోపిక్‌ చిత్రాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. హిట్‌, మంచి సినిమాకు తేడా ఉందన్నాడు. భారీ అంచనాలతో విడుదలైన బేఫికర్‌’  బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే.

రణవీర్‌ సింగ్‌ తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఒకే ఏజ్‌ గ్రూపుకు చెందిన తామిద్దరం తగిన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నామని చెప్పాడు. రణ్‌వీర్‌ ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ ’పద్మావతి’ సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్‌ తాజా చిత్రం ’రబ్తా’ ఫిబ్రవరిలో విడుదలకానుంది.

Tuesday, January 3, 2017

దెయ్యాలున్నాయి జాగ్రత్త!

‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్‌డ్‌ బై డెవిల్‌’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్‌ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్‌. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ విడుదల చేశారు.
‘‘కృష్ణకార్తీక్‌ పక్కా ప్లానింగ్‌ వల్ల సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్  పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్‌ సాయివెంకట్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై.

మహానటి లిస్ట్ లో మరోపేరు

 దేశం గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగఅశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్న ఇంతవరకు పట్టా లెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది.
ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్ లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్ ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి.

Monday, January 2, 2017

పెళ్లి రోజే విడాకులు!

బాలీవుడ్‌లో విడాకుల పరంపర కొనసాగుతోంది. ‘హృతిక్‌ రోషన్‌–సుజానే ఖాన్, అర్భాజ్‌ ఖాన్‌–మలైకా ఆరోరా’ జంటలు ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్, నిర్మాత సుభోద్‌ మస్కరా ఈ జాబితాలోకి చేరనున్నారు. ఈ ఇద్దరూ జనవరి 2న పెళ్లి చేసుకున్నారు. 2010లో వివాహం జరిగింది. కట్‌ చేస్తే... ఈ జనవరి 2కి తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించారు. అందరూ న్యూ ఇయర్‌ సంబరాల్లో ఉంటే.. నందిత మాత్రం భర్త నుంచి తాను విడిపోతున్న విషయం ప్రకటించి, కొత్త సంవత్సరంలో తాను తీసుకున్న కీలక నిర్ణయం గురించి పేర్కొన్నారు. ఏడేళ్లుగా కలసి ఉన్న ఈ జంట కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు.
విడిపోతున్న విషయం గురించి నందిత మాట్లాడుతూ –‘‘అవును మేము విడిపోతున్నాం. ఈ విషయం చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. సుభోద్‌తో ఇక మీదట కలసి ఉండాలనుకోవడంలేదు. మేం స్నేహపూర్వకంగానే విడి పోవాలనుకుంటున్నాం. మా అబ్బాయి విహాన్‌ కంటే మాకేదీ ఎక్కువ కాదు. తన కోసమే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం గురించి చిలవలు పలవలు చేసి, మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను కూడా దీని గురించి మళ్లీ మాట్లాడదల్చుకోలేదు. ఇక మీదట నా కొడుకుతో, కుటుంబసభ్యులతో ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు.

జన వరి 2... నందిత జీవితంలో మర్చిపోలేని రోజవుతుంది. పెళ్లి తాలుకు ఆనందాన్ని, విఫలమైన పెళ్లి తాలూకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రోజుగా మిగిలిపోనుంది. నందిత సినిమా కెరీర్‌ విషయానికొస్తే.. ‘ఫైర్‌’, ‘ఎర్త్‌’, ‘బిఫోర్‌ ద రైన్స్‌’ వంటి ఆఫ్‌బీట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ‘ఫిరాక్‌’తో పాటు పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఫిరాక్‌’ చిత్రం ఆమెకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓ తమిళ చి్రతంలో నటిస్తున్నారు.

ఆయన అడిగితే కాదంటానా!

  ‘‘చెప్పలేను! ఎందుకంటే... చెప్పడం మొదలుపెడితే బోలెడు సినిమాల గురించి చెప్పాలి. అందుకే, నాకు ఆఫర్‌ చేసిన హిందీ సినిమాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఆ లిస్ట్‌ చాలా పెద్దది’’ అన్నారు ప్రియాంకా చోప్రా. గతేడాది మార్చిలో విడుదలైన ‘జై గంగాజల్‌’ తర్వాత ఆమె హిందీ సినిమాలేవీ అంగీకరించలేదు. ఎప్పుడెప్పుడు ప్రియాంకా చోప్రా హిందీ సినిమా చేస్తారా? అని ఎదురు చూస్తున్న హిందీ సినిమా ప్రేక్షకుల కోసమే అన్నట్టు... ముంబయ్‌ మీడియాలో ఓ వార్త షికారు చేస్తోంది. ఉర్దూ రచయిత సాహిర్‌ లుధియాన్వీ జీవిత కథతో షారుఖ్‌ఖాన్‌ హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటించనున్నారనేది ఆ వార్తల సారాంశం.
నిజమేనా ప్రియాంకా? అనడిగితే... ‘‘హిందీ చిత్రాల గురించి నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ, నా సినిమాలో నటించమంటూ సంజయ్‌ సర్‌ అడిగితే ‘నో’ చెప్పలేను. ఆయన అడిగితే కాదనలేను. ఆయనకు నా బలం ఏంటో.. నేను ఎలాంటి సినిమాలు చేయాలను కుంటున్నానో తెలుసు. మేమిద్దరం కలుస్తుంటాం. సినిమాల గురించి డిస్కస్‌ చేస్తుంటాం’’ అని చెప్పారామె. రెండు మూడు నెలలుగా పలువురు దర్శక–నిర్మాతలు ప్రియాంకకు కథలు వినిపించారట. అందులో నచ్చినవి చాలా ఉన్నాయనీ, ఈ నెలాఖరున కొత్త హిందీ సినిమా కబురు చెబుతాననీ ఆమె అన్నారు.

Sunday, January 1, 2017

షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్

 ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు.
2016 సమ్మర్ లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్ లో భారత్ తరుపున హై జంప్ లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు.