Sunday, October 2, 2016

ముందు ఎవరితో?


మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ‘జన గణ మణ’ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’.. రెండూ హిట్టే. దాంతో ‘జన గణ మణ’ ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా కోసం కూడా పూరి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘ఆంధ్రావాలా’ ఆశించిన విజయం ఇవ్వలేదు.

  కానీ, ఎన్టీఆర్-పూరిలు ‘టెంపర్’తో టార్గెట్ రీచ్ అయ్యారు. పూరి మార్క్ హీరోయిజంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ విడుదలకు సిద్ధమైంది.

 ఈ నెల 5న ఆడియో, 20న సినిమా రిలీజ్. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇద్దరితోనూ తదుపరి సినిమాలు చేయబోతున్నట్టు ఆదివారం పూరి చెప్పారు. ముందు ఎవరితో చేస్తారు? అనేది ఇక్కడి ప్రశ్న. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ లైన్‌లో ఉన్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చిన్న ఎన్టీఆర్ మరో సినిమా అంగీకరించలేదు. సో, ముందు మొదలయ్యేది ఎన్టీఆర్ సినిమానేనా? వెయిట్ అండ్ సీ!

ఆ విషయం రానాకు ముందే తెలుసు..!

 ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన చైతూ, సమంతల పెళ్లి విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు నాగచైతన్య. ఇప్పటికే తను పెళ్లి చేసుకోబోయేది సమంతనే అంటూ ప్రకటించేసిన ఈ యంగ్ హీరో ఈ విషయం తన తల్లి దండ్రుల కన్నా ముందే మరోకరికి తెలుసని చెప్పాడు.
తాను సమంతను ఇష్టపడుతున్న విషయం రానాకు ముందే తెలుసని చెప్పాడు. 'రానా నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, తను నా కజిన్ కూడా ఇద్దరం కలిసే పెరిగాం. అందుకే నా ఇష్టా ఇష్లాలన్ని ముందు తనతోనే షేర్ చేసుకుంటాను. అందుకే సమంత విషయం కూడా నాన్న కన్నా ముందే రానాకు తెలుసు' అని చెప్పాడు.

బికినీకి సై


నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి.

  అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.

 తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు