Tuesday, May 31, 2016

బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు

 అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డు ను సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా త్వరలో గుడ్‌న్యూస్ తెలియజేస్తానని ...


 
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో గోవా భామ ఇలియానా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన అనేక సినీ వేడుకల్లో ఈ జంట కలిసి సందడి చేశారు. తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా ఇంతవరకు పెదవి విప్పలేదు. 
వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయడం తనకు ఇష్టం వుండదని, సమయం వచ్చినప్పుడు తన లవ్‌ఎఫైర్ గురించి తెలియజేస్తానని చెప్పింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలతో ముడిపడి వుంటుంది. పరస్పర సమ్మతి వున్నప్పుడే అలాంటి సున్నితమైన విషయాల గురించి బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. నేను వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో విలువిస్తాను. అనుమతి లేనిదే ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై ప్రజలకు ఆసక్తి వుండటం సహజం. దానిని అలుసుగా తీసుకొని అదే పనిగా గాసిప్స్ ప్రచారం చేయడం మంచిది కాదు. సరైన సమయంలో కాబోయే జీవిత భాగస్వామి ఎవరనేది అభిమానులకు తెలియజేస్తాను. కొద్దిరోజులు ఓపికి పడితే అందరికీ శుభవార్త చెబుతాను అని తెలిపింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన రుస్తుం చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే?



 భారీ అంచనాల మధ్య హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ప్రియాంక చోప్రా. ఆమె మొదటి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'. డ్వాయ్నె జాన్సన్‌, జాక్‌ ఎఫ్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇటీవల ఫస్ట్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక లేకపోవడం ఆమె అభిమానుల్ని షాక్‌ గురిచేసింది.
'బేవాచ్‌' సినిమాలో ప్రియాంక నెగిటివ్‌ పాత్రలో విలన్‌గా కనిపిస్తుండటంతో ఆమెను ఫస్ట్ పోస్టర్‌లో చూపించలేదనే టాక్ వినిపించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ చిత్ర యూనిట్‌ ప్రియాంక అభిమానుల్ని ఆనందంలో ముంచే విషయాన్ని తెలిపింది. ప్రియాంక కోసమే ఒక సెపరేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందట. 'సినిమా ప్రమోషనల్‌ విషయంలో చిత్ర యూనిట్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకువెళుతోంది. ప్రియాంకను యూనిట్‌ పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని భావిస్తోంది. అందులోభాగంగా తదుపరి వచ్చే పోస్టర్‌లో ప్రియాంక మాత్రమే ఉంటుంది. ఆమె విలన్ పాత్ర పోషించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కేలా ఈ పోస్టర్‌ను ప్లాన్ చేశారు' అని 'బేవాచ్‌'  చిత్రయూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'నేను యువరాజ్ కు పెద్ద అభిమానిని'

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు తాను పెద్ద అభిమానినని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. యువరాజ్ ఆటను ఎక్కువ ఇష్టపడటం కాకుండా, అతనినే ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు.'నేను తరచు యువరాజ్ సింగ్ క్రికెట్ ను చూస్తూ ఉంటా. నేను యువరాజ్ కు అతి పెద్ద అభిమాని కావడంతోనే అతని ఆటపై మక్కువ పెంచుకున్నా. నాకు యువరాజ్ సింగే స్ఫూర్తి' అని  కృనాల్ తెలిపాడు. ఆల్ రౌండర్లలో ఎవర్నీ ఎక్కువ ఇష్టపడతారు అనే ప్రశ్నకు కృనాల్ పై విధంగా స్పందించాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కృనాల్ 37 బంతుల్లో 86 పరుగులు చేసి ముంబై భారీ విజయంలో సహకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తన ప్రస్తుత ఐపీఎల్ ఆట తీరు పట్ల కృనాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తనకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించినట్లు కృనాల్ అభిప్రాయపడ్డాడు.  భవిష్యత్తులో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తానని తెలిపాడు. మన ప్రతిభ బయట తీసిన మరుక్షణమే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని కృనాల్ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

Monday, May 30, 2016

నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్


జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు ఎప్పుడూ అలా చేయడని అన్నాడు.
తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని విజ్ఞప్తి చేశాడు.

తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు. ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

నితిన్ కు పవన్ ప్రత్యేక కానుక

 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్ కు మరోసారి ప్రత్యేక కానుక అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్ కు పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు. పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్.. నితిన్ కు మామిడి పళ్లను పంపాడు.

గప్‌చుప్‌గా రణ్‌వీర్‌ని కలిసిందట

 బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె రహస్యంగా తన ప్రియుడు రణ్‌వీర్‌ సింగ్‌ని కలిసిందట. దీపిక హాలీవుడ్‌లోనటిస్తున్న ట్రిపులెక్స్‌-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. మరో పక్క రణ్‌వీర్‌ బేఫికర్‌ చిత్ర షూటింగ్‌ కోసంపారిస్‌లో ఉన్నాడు. ఎలాగూ షూటింగ్‌ పూర్తయింది కదా అని దీపిక వారం క్రితం రణ్‌వీర్‌ కోసం పారిస్‌ వెళ్లిందట.
కానీ అక్కడ దీపికకి నిరాశే ఎదురైంది. దీపిక తన పారిస్‌ ట్రిప్‌ని సీక్రెట్‌గా ఉంచాలనుకుంది. కానీ కొందరు అభిమానులు దీపికను గుర్తుపట్టి ఫొటోలు తీయబోతుంటే ఎవరూ దీపిక ఫొటోలు తీయడానికి వీల్లేదంటూ చిత్రబృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
దీంతో దీపిక బేఫికర్‌ సెట్స్‌లో కాసేపు సరదాగా ఎంజాయ్‌ చేసిందే కానీ రణ్‌వీర్‌ని మాత్రం పర్సనల్‌గా కలవలేకపోయిందట. ‘దీపిక పని విషయంలో చాలా ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్‌తో ఉంటుంది. అదీ కాకుండా షూటింగ్‌ కోసం అటు రణ్‌వీర్‌ పారిస్‌లో, ఇటు దీపిక టొరంటోలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరూ కలుసుకోలేదు. ఎంత స్టార్‌ అయినా దీపిక కూడా ఓ ప్రేమలో ఉన్న ఆడపిల్లే. ఇంటికి వెళ్లే ముందు ఓసారి ప్రియుడిని కలవాలనుకోవడంలో తప్పేముంది’ అంటూ సినీ వర్గాలు దీపికకే మద్దతు ఇస్తున్నాయి.

Sunday, May 29, 2016

కొత్త చాంపియన్‌ ఎవరో


నువ్వా.. నేనా..
ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఒంటి చేత్తో తమ జట్లను గెలిపిస్తున్నారు. ఆయా జట్ల తరఫున వారే టాప్‌ స్కోరర్లు. కెప్టెన్లుగా జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు. అందుకే ఫైనల్‌ పోరులో విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌ మధ్య పోరాటం అత్యంత ఆసక్తి రేపిస్తోంది. అసాధ్యమనుకున్న దశ నుంచి బెంగళూరును కోహ్లి తన అద్భుత బ్యాటింగ్‌, నాయకత్వంలో ప్లేఆఫ్స్‌కు చేరిస్తే.. వార్నర్‌ ఆరంభం నుంచి తన జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. కోహ్లి విధ్వంస విన్యాసాల వల్ల మరుగుపడిపోయాడు కానీ..వార్నర్‌ కూడా ఎంతో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరి తుది పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


బెంగళూరుకు బ్యాటింగే బలం
రెండు జట్లూ తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్నవే. రెండూ స్ఫూర్తిదాయక విజయాలతో ముందంజ వేసినవే. ఎవరి బలం వారిది. కోహ్లి రూపంలో బెంగళూరుకు, వార్నర్‌ రూపంలో సన్‌రైజర్స్‌కు స్ఫూర్తిదాయక నాయకులున్నారు. ఐతే ఫైనల్లో ఆర్‌సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టుకు రెండు సార్లు 2009, 2011లో ఫైనల్‌ ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ అత్యుత్తమ ప్రదర్శన ప్లేఆఫ్‌ (2013) మాత్రమే. పైగా బెంగళూరు భీకర ఫామ్‌తో ఫైనల్‌ చేరింది. ఆరంభంలో తడబడ్డ బెంగళూరు ఫ్లేఆఫ్‌ ముంగిట అత్యుత్తమ ఫామ్‌ను అందుకుంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే నెగ్గాల్సిన చివరి నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ జట్టు ఇప్పుడు జోరుమీదుంది. ముఖ్యంగా బ్యాటింగే బెంగళూరు ప్రధాన బలం. కెప్టెన్‌ కోహ్లి, డివిలియర్స్‌లు భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. గేల్‌ కూడా టచ్‌లోనే ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. తీవ్రంగా తడబడ్డ బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌ల్లో కుదురుకోవడం, ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు సంతోషాన్నిచ్చే అంశం. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్‌ వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ వాట్సన్‌ కూడా 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించాలని బెంగళూరు ఆశిస్తోంది.

సన్‌రైజర్స్‌కు బౌలింగే ఆశ
సన్‌రైజర్స్‌ కూడా చక్కని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు.. విరాట్‌ కోహ్లిపై ఆధారపడ్డట్లే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో తన కెప్టెన్‌ వార్నర్‌పై బాగా ఆధారపడి ఉంది. 16 మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేసిన వార్నర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్వాలిఫయర్‌-2లో ఛేదనలో జట్టును దాదాపుగా ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా అతడికి చక్కని సహకారాన్నిస్తున్నాడు. ఐతే కొన్ని విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన యువరాజ్‌ ఫైనల్లో తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలని, హెన్రిక్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ ఆశిస్తోంది. బెంగళూరుతో తలపడ్డ గత మ్యాచ్‌లో గెలవడం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశమే. ఐతే సన్‌రైజర్స్‌ అసలు బలం మాత్రం బౌలింగ్‌లోనే ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య పోరుగా అభివర్ణించవచ్చు. సీమర్లు భువనేశ్వర్‌ (16 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌తో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా వారి బౌలింగ్‌లో పరుగులు చేయడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో వారి బౌలింగ్‌ అద్భుతం. నెహ్రా గాయంతో దూరమైనా భువి, ముస్తాఫిజుర్‌ తమ జట్టు పదును తగ్గకుండా చూశారు. బరిందర్‌ శరణ్‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఐతే ముస్తాఫిజుర్‌ ఫిట్‌నెస్‌ సన్‌రైజర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. అతడు ఫిట్‌గా లేకపోతే బౌల్ట్‌ మ్యాచ్‌ ఆడతాడు. 
తుది జట్లు(అంచనా)

ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా, ఎస్ అరవింద్, చాహాల్

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధవన్, హెన్రీక్యూస్,యువరాజ్ సింగ్,దీపక్ హూడా,కట్టింగ్,నమాన్ ఓజా,బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్,బరిందర్ శ్రవణ్, ట్రెంట్ బౌల్ట్

Saturday, May 28, 2016

నాగశౌర్య ఏం రాశాడో చూడండి!

 శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘జ్యో అచ్యుతానందా’. ఈ చిత్రం సెట్‌లో యూనిట్‌ సభ్యులు చాలా సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా దిగిన ఒక ఫొటోను శ్రీనివాస్‌ అవసరాల తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందులో నాగశౌర్య స్కెచ్‌లు పట్టుకుని ఉండగా.. శ్రీనివాస్‌ అవసరాల చేతికి కట్టుకట్టి ఉంది. ఈ కట్టుపై ‘సువర్ణ’ అని రాసి ఉంది. దీనికి శ్రీనివాస్‌ క్యాప్షన్‌గా... ‘నేను అతడి కోసం రెండు స్క్రిప్టులు రాశాను. నా కోసం అతడు ఇది రాశాడు’ అని పోస్ట్‌ చేశారు. మరి ఆ ‘సువర్ణ’ అనే పేరు సినిమాలో హీరోయిన్‌దా.. లేక మరేదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు నాదే బాధ్యత'


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు భారీ విజయం తర్వాత విడుదలైన ఆయన సినిమా బ్రహ్మోత్సవంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ అభిమానుల అంచనాలను బ్రహ్మోత్సవం అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు దర్శకుడిని నిందించరాదని మహేష్ బాబు అన్నాడు. ఓ జాతీయ వార్త సంస్థతో మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని చెప్పాడు. ఓ సినిమా హిట్ కావడానికి, కాకపోవడానికి ఎన్నో కారణాలుంటాయని అన్నాడు. దర్శకుడిని ఎంచుకోవడమన్నది తన నిర్ణయమని, నా అభిప్రాయం తప్పుకావచ్చని మహేష్ చెప్పాడు.

మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా సత్యారాజ్, రావు రమేష్, నరేశ్, రేవతి, సాయాజీ షిండే తదితర భారీ తారగణం నటించారు.

Wednesday, May 25, 2016

'ఆ సీన్లు ఉంటే బాగుండేది'

  తాను చేసే ప్రతి పనిలో ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉంటానని బాలీవుడ్ నటి రిచా చద్ధా అంటోంది. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా చద్ధా. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి. ఓమంగ్ కుమార్ తీస్తున్న 'సరబ్ జిత్' మూవీ నిడివిగా తగ్గించారని చెప్పింది. దీంతో తాను నటించిన 10 సీన్లలో దాదాపు 8వరకు తొలగించనున్నారని, అంతేకాదు ఐశ్వర్యరాయ్ చేసిన 20 సీన్లలో 6 సీన్లకు కత్తెర వేశారట. 'సరబ్ జిత్' లో నటనకుగానూ ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సీన్లు కట్ చేశారని తాను కంప్లెంట్ చేయడం లేదని జస్ట్ ఈ విషయాన్ని చెబుతున్నానంది. ఇలాంటి విషయాలను తాను లెక్కచేయనని, చేసే పనిపై ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉండటం అలవాటని చెప్పుకొచ్చింది. తాను నటించిన సీన్లు తొలగించకపోతే మూవీకి ఎంతో ఉపయోగపడేవని, చివరికి మూడు, నాలుగు సీన్లే మిగిలాయని ముద్దుగుమ్మ కాస్త దిగులు చెందుతోంది. క్యాబరే'లో స్మోకింగ్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. డైరెక్టర్ చెప్పినట్లు రియల్ గానే స్మోక్ చేయడంతో హెల్త్ అప్ సెట్ అయిన విషయం తెలిసిందే.

కోహ్లి ప్రియురాలిని కాపాడిన డివిలియర్స్!



ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్-9 తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ట్విటర్ లో పుంఖాను పుంఖాలుగా సరదా కామెంట్లు వచ్చాయి. పంచ్ లు విసిరారు, సలహాలు ఇచ్చారు. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ట్వీట్లు వదిలారు.
కోహ్లి సేనను కంగారు పెట్టిన ధవళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24) అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్ కూడా ఇన్ని వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వజ్ ఇట్ వెరీ షాట్? అంటూ ప్రశ్న సంధించారు. లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్ ను లాగేసుకున్నాడని ప్రీతి జింతా ట్వీట్ చేసింది.

సున్నాకే అవుటై కోహ్లి మిషన్ కాదు మనిషినని రుజువు చేసుకున్నాడని ఇంకొరు వ్యాఖ్యానించారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్‌ ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని పంచ్ విసిరారు. మ్యాచ్ గెలిపించి కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ విమర్శల బారిన పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లి-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ 'టైటానిక్'ను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్ సాంగ్ లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని సలహాయిచ్చారు.

Tuesday, May 24, 2016

నోరు జారె.. కాంట్రాక్టు పోయె!


 వచ్చే బిగ్‌బాష్‌ సీజన్లో క్రిస్‌ గేల్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతడితో కాంట్రాక్టును పునరుద్ధరించకోబోమని మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌ జట్టు ప్రకటించింది. గత బిగ్‌బాష్‌ సీజన్లో రెనగేడ్స్‌ తరఫున ఆడిన గేల్‌.. తనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ మహిళా టీవీ వ్య్లాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు చాలా మంది గేల్‌ ప్రవర్తనను తప్పుపట్టారు. రెనగేడ్స్‌ జట్టు కూడా గేల్‌కు జరిమానా విధించింది. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమవ్వకుండా చూసుకోవాలని గేల్‌ను హెచ్చరించింది కూడా. ఐతే ఈ హెచ్చరికలేవీ ఈ విండీస్‌ క్రికెటర్‌పై పనిచేయలేదు. తాజాగా గేల్‌ మళ్లీ నోరు జారాడు. ఈ సారి తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బ్రిటన్‌ పత్రికకు చెందిన ఓ మహిళా విలేకరితో అసభ్యకరంగా సంభాషించాడు. దీంతో గేల్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు రెనగేడ్స్‌ జట్టు ప్రకటించింది. రెనగేడ్సే కాదు... గేల్‌తో కాంట్రాక్టు ఉన్న కౌంటీ జట్టు సోమర్సెట్‌ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని వార్తలొస్తున్నాయి.

సినిమాకథ సినీ పరిశ్రమలో వాళ్లదే ఆధిపత్యం

 మహిళలు పురుషులతో అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. మగవాళ్లకు దీటుగా రాణిస్తున్నారు. సినిమాల్లో అయితే హీరోలతో పోటీపడి హీరోయిన్లు డ్యాన్స్ లు, ఫైట్లతో అదరగొడుతున్నారు. అయితే సినీ పరిశ్రమలో మగవాళ్లదే ఆధిపత్యమని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటోంది. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఎక్కడైనా వాళ్లదే రాజ్యమని చెబుతోంది.
'సినీ పరిశ్రమంలో మహిళలు, పురుషులు సమానమన్న మాటే లేదు. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఏదైనా మగవాళ్లదే డామినేషన్. ఈ నిజాన్ని దాచలేము' అని కాజోల్ అంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కాజోల్ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కాజోల్.. గతేడాది దిల్ వాలే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై కనిపించింది. పెళ్లి, వయసు అన్నవి తన కెరీర్ కు ఎప్పుడూ ప్రతిబంధకం కాదని ఆమె చెప్పింది.

ఆ ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురుచూపు

 ఒక స్మార్ట్‌ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. తాము త్వరలో విడుదల చేయబోయే ఎం3 నోట్ కోసం రెండు వారాల్లో 3 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మెయిజు ప్రకటించింది. రూ. 9,999 ధరలో ఉన్న ఈ ఫోన్ ఈనెల 31వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...

స్క్రీన్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పి10
సామర్థ్యం: 1.8 గిగాహెర్ట్జ్
ఫోన్ మందం: 5 మిల్లీమీటర్లు
ఓఎస్: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
స్టోరేజి: 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం
అదనపు హంగులు: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి860 జీపీయూ కూడా ఉందట.

Monday, May 23, 2016

మహేష్ ను మోసం చేసిన దర్శకులు!

 ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్ తో మహేష్ కు షాక్ ఇచ్చారు.
ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో  చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్ లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో నిరాశ పరిచింది.

రీసెంట్ గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు.

అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్ తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్ మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు.

తొలిరోజు యావరేజ్‌ కలెక్షన్లే!


ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్‌ తాజా చిత్రం 'సరబ్‌జిత్‌' తొలిరోజు కలెక్షన్ల విషయంలో తుస్సుమంది. పాకిస్థాన్‌ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్‌జిత్‌ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్‌ 'సరబ్‌జిత్‌'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్‌' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో రణ్‌దీప్‌ హుడా సరబ్‌జిత్‌గా, ఐశ్యర్యరాయ్‌ ఆయన సోదరిగా ఎమోషనల్‌ డ్రామాగా 'సరబ్‌జిత్‌' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథపరంగా, ప్రధాన పాత్రల నటనపరంగా ఈ సినిమా ప్రేక్షకులను కదిలింపజేస్తోంది. పాజిటివ్‌ మౌత్‌టాక్‌ వచ్చినప్పటికీ తొలిరోజు 'సరబ్‌జిత్‌' సినిమా కేవలం రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో మిగతా రెండు రోజుల్లో వచ్చే కలెక్షన్లు ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఈ సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నది.  

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట!


  హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది. అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు.  కొన్నాళ్లుగా ఈ వార్తలకు స్పందించని అనుష్క సడన్‌గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని  కాస్త ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు సెలైంట్ అయిపోయారట.

Saturday, May 21, 2016

తెలుగులో బంగారం..హిందీలో జాను!


 
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెలుగులోనే కాదు తమిళంలో (‘ఓకే కన్మణి’)  కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా రాయ్, శ్రద్ధా కపూర్ జంటగా షాద్ అలీ దర్శకత్వంలో ప్రముఖ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఓకే జాను’ని విడుదల చేస్తున్నట్లు కరణ్ ప్రకటించారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే


చిరంజీవి 150వ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోయినా ఇద్దరు సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలతో జతకడుతున్న నయనతార దాదాపు కన్ఫామ్ అని భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా అనుష్క పేరు తెర మీదకు వచ్చింది. ఇంకా హీరోయిన్ పేరు ఫైనల్ కాకముందే స్పెషల్ సాంగ్ లో ఆడిపాడేందుకు ఓ కుర్ర హీరోయిన్ను ఫైనల్ చేశారట. ఈ మధ్యే సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో బిజీగానే ఉన్నా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథరిన్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Thursday, May 19, 2016

తన రికార్డులు తానే బ్రేక్ చేస్తున్నాడు ...



శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్ బాబు, తన తాజా చిత్రం బ్రహ్మోత్సవంతో తన రికార్డ్ లు తానే బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు రాజకుమారుడు. ఈ సినిమా రూ.85 కోట్లకు పైగా బిజినెస్ చేసేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ కు మరింత బలం చేకూరుస్తూ.., ఏ ఏ ఏరియాల్లో ఎంత బిజినెస్ చేసిందో లెక్కలతో సహా చెపుతున్నారు ఫ్యాన్స్. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెంబర్స్ తో సూపర్ స్టార్ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవం రైట్స్  నైజాం ఏరియా 18 కోట్లు, సీడెడ్ 8.5 కోట్లు, ఆంధ్రా 25.5 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు కర్ణాటక హక్కులు 6.5 కోట్లకు,  రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి 2 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఇక మహేష్ మార్కెట్ కు కంచు కోట లాంటి ఓవర్ సీస్ లో బ్రహ్మోత్సవం రికార్డ్ స్థాయిలో 13 కోట్లకు అమ్ముడయ్యింది. ఈ మొత్తం 74 కోట్లుగా లెక్క తేలగా, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 11 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. మొత్తంగా మహేష్, బ్రహ్మోత్సవం రిలీజ్ కు ముందే 85 కోట్ల బిజినెస్ చేసి టాలీవుడ్ శ్రీమంతుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. భారీ బడ్జెట్ తో టాప్ కాస్టింగ్ తో పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే రిలీజ్ కు ముందే శ్రీమంతుడు సినిమాను మించి బిజినెస్ చేసిన బ్రహ్మోత్సవం, రిలీజ్ తరువాత కూడా శ్రీమంతుడు కలెక్షన్లు మించి సాధిస్తే గాని సినిమా హిట్ లిస్ట్ లోకి చేరదు. మరి మహేష్ మరోసారి మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి.

డిసెంబరులో సల్మాన్‌ పెళ్లి?

 బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఆశలు త్వరలో ఫలించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌, ఆయన ప్రేయసి యులియా వాంటూర్‌ల వివాహ తేదీని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. 2016 డిసెంబరు 27న వీరు ఒకటి కానున్నారట. ఇదే రోజు సల్మాన్‌ ఖాన్‌ తన 51వ పుట్టినరోజు జరుపుకోవడం మరో విశేషం.
సల్మాన్‌, యులియాల నిశ్చితార్థం ఇటీవల జరిగినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. సల్లూభాయ్‌ తల్లి ఆరోగ్యం అంతగా బాగోలేదని, తన కుమారుడు ఓ ఇంటివాడైతే చూడాలనుకుందని అందుకే అమ్మ కోసం భాయ్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కి స్వస్తి చెప్పనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

Wednesday, May 18, 2016

ఆ విషయంలో చాలా హర్ట్‌ అయ్యా!

 పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి స్పష్టం చేశారు.నాగబాబు కుమార్తె నిహారిక, నాగశౌర్య జంటగా నటించిన ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పవన్‌.. పవన్‌.. అంటూ కేకలు వేశారు. దీంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. ‘‘మీరంతా ఎంతగా అరిచినా పవన్‌కల్యాణ్‌ గురించి నేను మాట్లాడను... మాట్లాడలేను. ఆయన మీద ఉన్న ఇష్టాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీరంగంలో చిరంజీవి తర్వాత నన్ను సపోర్ట్‌ చేసింది పవన్‌కల్యాణే’’ అన్నారు.
ఫ్యామిలీకి సంబంధించిన ఈ అంశంపై ఏం మాట్లాడినా అపార్థాలే వస్తున్నాయని... అభిమానులు కేకలు వేస్తూ.. తనను వంద రెట్లు హర్ట్‌ చేశారన్నారు. సోషల్‌ మీడియాలో వస్తోన్న అనేక కామెంట్లు తనను చాలా బాధించాయని ఆవేదనగా చెప్పారు. అలాంటి కామెంట్లు చేయొద్దని పవన్‌ను, తనను ఇష్టపడే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటి కామెంట్లతో తమ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని.. తన మూలంగా అందరికీ మచ్చరావడం ఇష్టం లేదన్నారు. అభిమానులంతా మంచి ప్రవర్తనతో మెలుగుతూ తనను అర్థం చేసుకుంటారని అల్లు అర్జున్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!



టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలను హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాగ్ లాంటి స్టార్లు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటుంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్న హీరోలు మాత్రం తమ వయసుకు తగ్గ జోడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రం సీనియర్ హీరోలకు సూట్ అవుతుండటంతో వారి మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. అనుష్క బాహుబలి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సీనియర్ హీరోల సినిమాలు నయనతార చేతికి వెళుతున్నట్టుగా కనిపించాయి.
బాహుబలి షూటింగ్ చివరి దశకు రావటంతో సౌత్ ఇండస్ట్రీలో సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ముందు నుంచి నయనతార హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అనుష్క పేరును పరిశీలిస్తున్నారట. బాబు బంగారం షూటింగ్ విషయంలో నయన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక పోవటం కూడా ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3, తలా 57 సినిమాల్లో నటిస్తున్న అనుష్క, చిరు సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.

‘బ్రహ్మోత్సవం’ పిక్నిక్‌ మీరూ చూడండి!

 మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని బ్రహ్మోత్సవం... అనే పాట మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఓ పెద్ద కుటుంబం పిక్నిక్‌కు వెళ్లి... అక్కడ సంతోషంగా గడిపే సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ శుక్రవారం ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, కాజల్‌, ప్రణీత చిత్రంలో కథానాయికలుగా నటించారు. రేవతి, జయసుధ, నరేష్‌, సత్యరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

రాయ్‌లక్ష్మి కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని చూడండి!


కాంచనమాల కేబుల్‌టీవీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాయ్‌ లక్ష్మి. అధినాయకుడు, కాంచన తదితర చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రత్యేక గీతాలతో సైతం అభిమానులను అలరిస్తోంది. తాజాగా ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో చిందేస్తూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించిన రాయ్‌ లక్ష్మి బుధవారం ట్విట్టర్‌ ఖాతాలో తన పెంపుడు కుక్కపిల్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘నా కొత్త బాయ్‌ఫ్రెండ్‌.. మఫిన్‌(కుక్కపిల్ల పేరు)ను చూడండి, ఎంత బాగున్నాడో కదా’ అని ట్వీట్‌ చేశారు.

Tuesday, May 17, 2016

48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంబుధవారం ఉదయం చెన్నైకి తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా వైపు పయనిస్తుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి తుఫానుగా మారే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో ఈ దురుగాలులతో కూడి వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. చెన్నై నంగరంలోని చంబరంబాక్కం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. చెన్నై శివారులో రాత్రి వరకు 17.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగపట్నం, పుదుచ్చేరి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అప్రమత్తమైన ప్రభుత్వం
గత డిసెంబరులో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అరక్కోణం నుంచి 8 బృందాలు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సమాయత్తంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగాల్సిన అంబేద్కర్‌ లా యూనివర్సిటీ న్యాయ విద్య సెమిస్టర్‌ పరీక్షలను వాయిదాపడ్డాయి.

సేమ్ టు సేమ్!



బిడ్డలు ఎంత ఎదిగినా అమ్మానాన్నలకు చిన్నపిల్లల్లానే అనిపిస్తారు. అలాగే, ఎదిగాక కూడా అమ్మానాన్నల ముందు చిన్నపిల్లలైపోతారు బిడ్డలు. ఇటీవల అనుష్క అలానే చేశారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేసిన ఈ బ్యూటీ బెంగళూరు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేశారు. ఏదో పూజలు కూడా చేశారట. హాలీడే ట్రిప్ చివరి రోజున అమ్మానాన్నతో సరదాగా అనుష్క సెల్ఫీ దిగారు. కూతురు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టమంటే అనుష్క తల్లితండ్రులు ప్రఫుల్ల, విఠల్‌లు సరిగ్గా అలానే ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ దాదాపు సేమ్ టు సేమ్ ఉన్నాయి కదూ.