Friday, July 10, 2020

పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో నన్ను..

 ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న నిత్యా మీనన్ తాజాగా త‌న పెళ్లికి సంబంధించిన విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది. నిజానికి త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌న్న ఆస‌క్తి లేద‌ని, కానీ దుల్క‌ర్ స‌ల్మాన్ మాత్రం ఈ విష‌యంలో త‌న‌కు ఓ కుటుంబ స‌భ్యుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని పేర్కొంది. తెలుగు రీమేక్  ఓకె కాద‌ల్ స‌హా దాదాపు ఐదు సినిమాల్లో నిత్యామీన‌న్, దుల్క‌ర్  క‌లిసి  న‌టించారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేప‌థ్యంలో పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంద‌ని, చాలాసార్లు పెళ్లికి ఒప్పించే ప్ర‌యత్నం చేశాడ‌ని తెలిపింది.
అంతేకాకుండా పెళ్లి  చేసుకుంటే జీవితంలో వ‌చ్చే మార్పుల‌ను కూడా వివ‌రించాడ‌ని,  కొన్నిసార్లు అయితే దుల్క‌ర్   అంత గొప్ప‌గా చెబుతుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాల‌నిపించింది  అంటూ చెప్పుకొచ్చింది.  ప్ర‌ముఖ న‌టుడు మ‌మ్ముట్టి కుమారుడైన దుల్క‌ర్ స‌ల్మాన్ అమ‌ల్ సుఫియాను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వారికి అమీరా సల్మాన్ అనే కూతురు ఉంది. ఇక మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన స‌రే కాద‌ల్ క‌న్మ‌ణి ( ఓకె కాద‌ల్ ) సినిమాలోని తారా  పాత్ర త‌న‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంద‌ని న‌టి నిత్యా మీనన్ పేర్కొన్నారు. ఇటీవ‌లె త‌మిళంలో  మిస్కిన్ దర్శకత్వం వహించిన పిస్కో చిత్రంలో ఓ పోలీసు అధికారిగా నిత్యా మీన‌న్ న‌ట‌న‌కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా బ్రీత్2 ఇన్ టూ ద షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించింది.

Saturday, July 4, 2020

'నాకెవరూ అవకాశాలు ఇవ్వలేదు'

 ఈ విషయంపై నటి తమన్నా స్పందిస్తూ తాను 2005లో చాంద్‌ సా రోషన్‌ సహ్రా అనే చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్‌లో పరిచయం అయినట్లు చెప్పింది. తాను ముంబై నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ సాయం చేయలేదని పేర్కొంది. తన సొంత ప్రయత్నంలోనే దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌ అంతస్తును దక్కించుకున్నట్లు చెప్పింది.తన బాలీవుడ్‌ కల మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. అలా 2013లో హిమ్మత్వాలా చిత్రం ద్వారా మరోసారి తన బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అది ఆమెకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ దక్షణాదినే నమ్ముకుంది. ఆ తర్వాత కూడా ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో ఖామోషీ అనే హిందీ చిత్రంలో నటించింది. అది ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇలాంటి సమయంలో తమన్నా ఇటీవల ఒక భేటీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ నేపోటిజం ప్రభావం సినీ రంగంలో ఎంట్రి వరకే పనిచేస్తుందని చెప్పింది. ఆ తర్వాత జయాపజయాలు అనేవి ప్రతిభపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. వారసత్వం అన్నది సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉంటుందని పేర్కొంది. పలువురు ప్రముఖుల వారసులు ఎవరి సాయం లేకుండానే ఈ రంగంలో రాణిస్తున్నారని తమన్నా చెప్పింది.