Sunday, August 26, 2012

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

 ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ ఇన్నింగ్‌ఇ్స 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు అలౌటయ్యింది. నాలుగు రోజుల్లోనే ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసింది. టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ విజయం సాధించింది. మెక్‌ కల్లమ్‌ (52), విలియమ్సన్‌ 42, మాత్రమే రాణించారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌చేసి 6 వికెట్లు నేలకూల్చాడు. ఓజా 3 వికెట్లు పడగొట్టాడు. యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 438 పరుగులు, కివీస్‌ 159 పరుగులు చేసింది. రెండో టెస్ట్‌ ఈనెల 31ను ఆహ్మదాబాద్‌లో రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.

Saturday, August 18, 2012

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా : లక్ష్మణ్‌

  అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌లోని హెచ్‌సీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్‌ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 16 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. 134 టెస్టుల్లో 8781 పరుగులు, 17 శతకాలు, 56 అర్ధ సెంచరీలు, 86 వన్డేల్లో 2338 పరుగులు, 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై ఈనెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక స్కోర్‌ 281 పరుగులు చేశాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. యువతకు అవకాశం కల్పించేందుకే రిటైర్మెంట్‌ అవుతున్నానని చెప్పారు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, మిత్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి వాడినయ్యానని అన్నారు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మరవలేనిదని గుర్తుచేశారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.