Thursday, January 13, 2011

బెంగాల్‌ టైగర్‌ "దాదా గిరి"

 ఉట్టిపడే రాజసం.. గ్రౌండ్‌లో అడుగిడుపెడితే ఆటకే ఒక కళ.. తప్పు జరిగితే జూనియర్లు సీనియర్లు అన్న తేడాలేకుండా అందరినీ హెచ్చరించే నైజం. గడ్డు పరిస్థితుల్లో ఉన్న క్రికెటర్లకు వెన్నంటి ఉండి వారిలో మనో మనోస్థైర్యాన్ని నింపి వారు మళ్లీ రాణించేలా ప్రోత్సాహాన్ని అందిచడం. ఎదుటి జట్టును ట్రిక్కులతో.. అవసరమైతే టెక్కులతో.. సైతం అధరగొట్టే తత్వం. అతను ఒక అనితరసాధ్యుడు బ్యాట్‌మెన్‌గా టన్నులకొద్దిపరుగులు సాధించి టెస్టుల్లో వన్డేల్లో అనేక సెంచరీలు, రికార్డులు సాధించి.. అవసరమైతే బాల్‌తోనూ అద్భుతాలు సృష్టించి... కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించి గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్‌రూంలో సభ్యులను ఏక తాటిపై నడపడం... 

హాయ్ ప్రెండ్స్‌ తెలుగు బ్లాగులందరికి నాయొక్క సంక్రాంతి శుబాకాంక్షలు.

ఆదిలోనే షాక్‌........

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లలో 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది. దక్షాణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఆమ్లా 50, డివిలియర్స్‌ 76, డుమినీ 73లు రాణించి దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించడంలో కీలకపాత్ర వహించారు. కెప్టెన్‌ స్మిత్‌ 11, ఇంగ్రామ్‌ 5 , జొహాన్‌ బోథా 23, వేన్‌ పార్నెల్‌ 21, మిల్లర్‌ 9, స్టెయిన్‌ 7, మోర్కెల్‌ 0 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 13 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియమ్‌ చేరుకున్నారు. రోహిత్‌ శర్మ 11, యువరాజ్‌ సింగ్‌ 2, కెప్టెన్‌ దోని 25, రైనా 32, హర్భజన్‌ సింగ్‌ 0, జహీర్‌ ఖాన్‌ 6, నెహ్రా 1 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కోహ్లి ఒక్కడే అర్థసెంచరీ చేశాడు. రైనా కొద్దిసేపు పోరాటం చేసి సొత్సొబె బౌలింగ్‌లో ఇంగ్రామ్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.