Tuesday, May 31, 2016

బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు

 అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డు ను సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా త్వరలో గుడ్‌న్యూస్ తెలియజేస్తానని ...


 
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో గోవా భామ ఇలియానా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన అనేక సినీ వేడుకల్లో ఈ జంట కలిసి సందడి చేశారు. తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా ఇంతవరకు పెదవి విప్పలేదు. 
వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయడం తనకు ఇష్టం వుండదని, సమయం వచ్చినప్పుడు తన లవ్‌ఎఫైర్ గురించి తెలియజేస్తానని చెప్పింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలతో ముడిపడి వుంటుంది. పరస్పర సమ్మతి వున్నప్పుడే అలాంటి సున్నితమైన విషయాల గురించి బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. నేను వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో విలువిస్తాను. అనుమతి లేనిదే ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై ప్రజలకు ఆసక్తి వుండటం సహజం. దానిని అలుసుగా తీసుకొని అదే పనిగా గాసిప్స్ ప్రచారం చేయడం మంచిది కాదు. సరైన సమయంలో కాబోయే జీవిత భాగస్వామి ఎవరనేది అభిమానులకు తెలియజేస్తాను. కొద్దిరోజులు ఓపికి పడితే అందరికీ శుభవార్త చెబుతాను అని తెలిపింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన రుస్తుం చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే?



 భారీ అంచనాల మధ్య హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ప్రియాంక చోప్రా. ఆమె మొదటి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'. డ్వాయ్నె జాన్సన్‌, జాక్‌ ఎఫ్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇటీవల ఫస్ట్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక లేకపోవడం ఆమె అభిమానుల్ని షాక్‌ గురిచేసింది.
'బేవాచ్‌' సినిమాలో ప్రియాంక నెగిటివ్‌ పాత్రలో విలన్‌గా కనిపిస్తుండటంతో ఆమెను ఫస్ట్ పోస్టర్‌లో చూపించలేదనే టాక్ వినిపించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ చిత్ర యూనిట్‌ ప్రియాంక అభిమానుల్ని ఆనందంలో ముంచే విషయాన్ని తెలిపింది. ప్రియాంక కోసమే ఒక సెపరేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందట. 'సినిమా ప్రమోషనల్‌ విషయంలో చిత్ర యూనిట్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకువెళుతోంది. ప్రియాంకను యూనిట్‌ పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని భావిస్తోంది. అందులోభాగంగా తదుపరి వచ్చే పోస్టర్‌లో ప్రియాంక మాత్రమే ఉంటుంది. ఆమె విలన్ పాత్ర పోషించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కేలా ఈ పోస్టర్‌ను ప్లాన్ చేశారు' అని 'బేవాచ్‌'  చిత్రయూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'నేను యువరాజ్ కు పెద్ద అభిమానిని'

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు తాను పెద్ద అభిమానినని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. యువరాజ్ ఆటను ఎక్కువ ఇష్టపడటం కాకుండా, అతనినే ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు.'నేను తరచు యువరాజ్ సింగ్ క్రికెట్ ను చూస్తూ ఉంటా. నేను యువరాజ్ కు అతి పెద్ద అభిమాని కావడంతోనే అతని ఆటపై మక్కువ పెంచుకున్నా. నాకు యువరాజ్ సింగే స్ఫూర్తి' అని  కృనాల్ తెలిపాడు. ఆల్ రౌండర్లలో ఎవర్నీ ఎక్కువ ఇష్టపడతారు అనే ప్రశ్నకు కృనాల్ పై విధంగా స్పందించాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కృనాల్ 37 బంతుల్లో 86 పరుగులు చేసి ముంబై భారీ విజయంలో సహకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తన ప్రస్తుత ఐపీఎల్ ఆట తీరు పట్ల కృనాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తనకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించినట్లు కృనాల్ అభిప్రాయపడ్డాడు.  భవిష్యత్తులో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తానని తెలిపాడు. మన ప్రతిభ బయట తీసిన మరుక్షణమే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని కృనాల్ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.