Wednesday, October 14, 2015

ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌ ధోని
బ్యాటింగ్‌లో తడబడిన బౌలింగ్‌లో ఎదురుదాడి
 

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్టు 1-1 సమానంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 9 వికెట్ల నష్టాఁకి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన సౌతాఫ్రిక జట్టు 225 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి వికెటు వరకు పోరాడిన సౌతాఫ్రిక జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. డుప్లెసిస్‌ 51, డికాక్‌ 34 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మెన్స్‌ చెప్పుకోదగ స్కోరు చేయలేకపోయారు. మిడిల్డార్‌ బ్యాట్‌మెన్‌ డెవిడ్‌ మిల్లర్‌ (0) అవుట్‌ అయ్యాడు. బారత్‌ బౌలింగ్‌ భూవనేశ్వర్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ చెరో మూడు వికెట్లు తీయగా, హర్బజన్‌ సింగ్‌ 2, ఉమేష్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ చెరో వికెట్టు లభించింది. భారత్‌ బౌలింగ్‌లో మంచి హర్బజన్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరు మంచిగా బౌలింగ్‌ చేశారు. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (3) పరుగులకు రబాడా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా రహనే వచ్చాడు. ధావన్‌ (23), పరుగులు చేయగా, కోహ్లి అనవసరంగా పరుగు కోసం వెళ్లి రనౌట్‌గా అయ్యాడు. ( 12), రైనా (0) నిరాశపరిచాడు. కెప్టెన్‌ ఈ మ్యాచ్‌లో ఓంటరి పోరాటం చేశాడు. బౌలర్లతో కూడి ఒక్కోక పరుగు కోసం వెచ్చి చూశాడు. 86 బంతులల్లో నాలుగు సిక్స్‌లు, ఏడు పోర్లు సహయంతో 92 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో స్టెయిన్‌ మూడు వికెట్లు తీయగా, మోర్కెల్‌, తాహిర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, రబాడా ఒక వికెటు లభించింది.