Monday, June 6, 2016

నేటినుండి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం


నేటినుండి ఉపవాస దీక్షలు ప్రారంభం
               రంజాన్‌కా చాంద్‌ నజర్‌ ఆగయా అంటూ ముస్లింసోదరులు ఒకరికొకరు ముబారక్‌ (శుభాకాం క్షలు) తెలుపుకున్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆధ్యాత్మిక, సోదరభావాన్ని పరిమ ళింపజేసే పవిత్రమాసంగా రంజాన్‌ను భావిస్తారు. ముస్లింల దైవం అల్లా తన దివ్య సందేశాన్ని మానవాళికి అందించిన దైవ సందే శాన్ని దూత అందరికీ చేరవేసిన మాసంగా భావిస్తారు. ప్రవక్త హజ్రత్‌ మహ్మద్‌ (సల్లలాహు వాలిహి వసల్లం) ద్వారా దివ్య ఖురాన్‌ దివినుండి భువికి దిగివచ్చిన పవిత్ర మాసంగా రంజాన్‌ మాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గడుపుతారు. ఈ మాసంలో ముస్లింలు నిష్టతో కూడిన ఉపవాస దీక్షలు పాటిస్తారు, ఉర్దూ క్యాలండర్‌ ప్రకారం సంవత్సరంలోని 9వ మాసంలో రంజాన్‌ నెల వస్తుంది. మొత్తం 29 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపడ తారు. ఈ దీక్షలను తెల్లవారు జామున సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నియమ నిష్టలతో పూర్తిచేస్తారు. దీక్షాసమయంలో సత్యసం భాషణ, నైతిక ధర్మాచారాలతో దైవవిశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఉపవాసంచేసేవారు సాయంత్రం దీక్ష విరమించే వరకూ నీటినికూడా తాగరు. కనీసం లాలా జలాన్ని కూడా గొంతుదాటి లోనికి వెళ్ల కుండా జాగ్రత్త పడతారు. తెల్లవారు జామున లేచి అల్పాహారం తీసుకుని దీక్షను ప్రారంభి స్తారు. దీనిని సహార్‌ అంటారు. సూర్యో దయానికి ఫజర్‌ నమాజ్‌, మధ్యాహ్నం జోహర్‌ నమాజ్‌, సాయంత్రం 4నుండి 5వరకు అసర్‌ నమాజ్‌ చేస్తారు. సాయంత్రం 6గంటలకు ప్రార్థనా మందిరాలు (మజీద్‌)కు చేరుకుని ఉపవాస దీక్షలను విడుస్తారు. తమవెంట తెచ్చుకున్న పండ్లతో దీక్షను విరమించి మగ్రీభ్‌ నమాజ్‌ చేస్తారు. అనంతరం భోజనా లు ముగించుకుని ఇషా నమాజ్‌ తర్వా త తరావీ నమాజ్‌కు సిద్ధమవుతారు.
సోదరభావాన్ని పెంపొందించే ఇఫ్తార్‌ ..

              రంజాన్‌ ఉపవాస దీక్షల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6నుండి 6.30లోపు దీక్షలు విరమించే సమయాన్ని ఇఫ్తార్‌ అంటారు. చిన్నాపెద్ద, ధనికపేద తేడా లేకుండా ఒకేచోట వరుసగా మస్‌జిద్‌ కూర్చుని సామూహిక ఇఫ్తార్‌ చేస్తారు. ఈ సమయాల్లో మస్‌జిద్‌లు కొత్త కాంతులు సంతరిం చుకుంటాయి. ముస్లింలతోపాటు హిందువులు, క్రైస్తవులు ఇఫ్తార్‌ విందులో పాల్గొని మతసామరస్యా న్ని చాటుతారు. నెలరోజులపాటు ఇఫ్తార్‌ విందులు కొనసాగుతాయి.
దైవభక్తిని పెంపొందించే తరావి నమాజ్‌ ..           రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా చేసే తరావీ నమాజ్‌ దైవభక్తిని పెంపొందిస్తుంది. ఈనెలలో 29 రోజులపాటు ప్రతిరోజూ చేసే ఐదు పూటల నమాజ్‌తోపాటు తరవీ నమాజ్‌ను అదనంగా చేస్తారు. సుమారు గంటన్నరనుండి రెండున్నర గంటలపాటు ఏకధాటిగా ఈనమాజ్‌ కొనసాగుతుంది. నమాజ్‌లో దివ్య ఖురాన్‌కు చెందిన 30 అధ్యాయాల్లోని పవిత్ర శ్లోకాలను ఒకటినుండి రెండున్నర పేరాల వరకూ హఫీజ్‌ ఏ ఖురాన్‌ (ఖురాన్‌ చూడకుండా చదివేవ్యక్తి) ప్రతిరోజూ కొన్నింటిని చదువుతారు. ఇక ఇషా నమాజ్‌ తర్వాత తరాబీ నమాజ్‌ చేస్తారు. రంజాన్‌ ప్రారంభానికి ఒకరోజుముందు మొదలయ్యే ఈ నమాజ్‌ 29రోజుల దీక్షల అనంతరం ఈదుల్‌ ఫితర్‌ పండగ పర్వదినానికి ఒకరోజు ముందు ముగుస్తుంది. పండగరోజు ఊరిచివరన ఉండే ఈద్గాలవద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఫిత్రా ..            రంజాన్‌ మాసంలో ముస్లింసోదరులు తన ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా తన సంపాదనలో కొంతమేరకు దానం చేయాల్సి ఉంటుంది. దీనినే ఫిత్రాగా పిలుస్తారు. కుటుంబ సభ్యుల లెక్కన నాణ్యమైన గోధుమలు, జొన్నలు కిలో విలువ లెక్కగట్టి ఆలెక్కప్రకారం ఒక మనిషికి ఒక కిలో విలువకట్టి డబ్బులు పేదలకు పంచిపెట్టడమే ఈ ఫిత్రా ఆనవాయితీ.
దురలవాట్లకు దూరంగా ..               సిగరెట్‌, బీడీ, మద్యపానం, గుట్కాలతో పాటు ఇతరాత్ర అలవాట్లు సాధారణమైనా రంజాన్‌లో ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం లంతా విధిగా రోజా పాటించి అల్లా నిర్ధేశించిన అన్నిరకాల నమాజ్‌ను ఆచరిం చాలని ఖురాన్‌ ఆదేశిస్తుంది. అనారోగ్యం, దూర ప్రయాణాలు, ఇరత కారణాలతో కొందరికి మినహాయిం పు ఉంటుంది. అధికశాతం ముస్లింలు రంజాన్‌లో ఉపవాస దీక్షలను పాటిస్తారు. దురవాట్లకు బానిసైన చాలా మందిసైత ం నెలరోజులు మాత్రం ఉపవాసం ఉంటారు. ఉపాదీక్షలు లేనివారుసైతం తరా వి నమాజులకు వెళ్తుంటారు.

పండ్లకు ప్రాధాన్యం ..
           రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నవారు తెల్లవారు జాము నుండి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహారంగాని మంచినీళ్లుగాని తీసుకోరు. అయితే దీక్ష విరమణకు పండ్లను ఆరగిస్తారు. ముఖ్యంగా ఖర్జూర పల్లకు మతపరంగా ప్రాధాన్యముంది. మహ్మద్‌ ప్రవక్త ఉపవాస దీక్షను ఖర్జూర పళ్లుతిని విరమించారని ప్రతీతి. అందువల్ల ముస్లింలు రోజావిరమణ సమయంలో ఖర్జూర పళ్లను తినడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఇఫ్తార్‌లో జామ, సేపులు, ద్రాక్ష, పుచ్చకాయలు, అనాస, బొప్పాయి, సంత్రా, మోసంబి, అరటిపండ్లు తీసుకుంటారు. హలీం, హరీష్‌, దైవడ, ఇతర తి బండారాలకోసం ప్రత్యేకంగా హోటళ్లు వెలుస్తాయి.
29రోజులు.. 3 భాగాలు ..
               రంజాన్‌ నెలను మూడు భాగాలుగా భావిస్తారు. ఇందులో తొలి 10రోజులు ఉపవాస దీక్షలుండటాన్ని రహమత్‌ (దయను పొందుట), రెండో పదిరోజలు ఉపవాసముంటే మగ్‌ఫిరత్‌ (క్షమకోరడం), మూడోది పదిరోజులు ఉపవాసాలను జాహ్నంసే నజ్జత్‌ (నరకం నుంచి విముక్తి) అని పిలుస్తారు. చివరి 10రోజుల్లో వచ్చే బేసి సంఖ్యలైన 21, 23, 25, 27, 29 రోజుల్లో ఉపవాస రాత్రుల్లో ఖురాన్‌ను అల్లా భూమిమీదకు పంపినట్లు విశ్వసిస్తారు. ఆ రాత్రిని గుర్తించి జాగరణచేస్తే దేవుడు పాపాలను తొలగించి కోర్కెలు తీరుస్తారని విశ్వాసం. ఈ రాత్రులను తఖ్రత్‌ అని పిలుస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ ..
              రంజాన్‌ మాసంలో 26వరోజున షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకుంటారు. ఆ రోజున 30 ఫారాల ఖురాన్‌ను పఠిస్తారు. ఖురాన్‌ పఠనం ఈరోజు ముగుస్తుంది. అదేరోజు రాత్రి మజీదులతోపాటూ తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) పాటిస్తారు. ఈ సందర్భంగా కొత్త బట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నెల రోజులపాటు ఖురాన్‌ను చదివి వినిపించిన హఫీజ్‌-ఎ-ఖురాన్‌(మౌల్విసాబ్‌)ను మస్‌జిద్‌ కమిటీల ఆధ్వర్యంలో సన్మానించి తమవంతు సహకారం అందజేస్తారు.

పేదల హక్కు జకాత్‌ ..
            ఇస్లాం నిర్ధేశించిన ఐదు సూత్రాల్లో జకాత్‌ ఒకటి. దీనినే దాన ధర్మాలకు ప్రతీకగా చెబుతారు. తమవద్ద ఉన్న ఆస్తిపాస్తులో కొంతైనా నిరుపేదలకు పంచివ్వాలన్నదే జాకత్‌ సారాంశం.
ఎతెకాఫ్‌ వ్రతం ..
              రంజాన్‌ మాసంలో 21వ రోజు రాత్రినుండి పండగ ముందురోజు వరకు ఉపవాస దీక్షాపరులు ఎతెకాఫ్‌ వ్రతాన్ని చేస్తారు. ఈ సందర్భంగా వారు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచి మస్‌జిద్‌లలో దైవ ప్రార్థనల్లో నిమగమవుతారు. నెలవంక కనిపిస్తే వ్రతాన్ని విరమిస్తారు. పండగరోజు నమాజ్‌ అనంతరం తమతమ ఇళ్లకు చేరుకుని షీర్‌ఖుర్మా సేవిస్తారు. ప్రధాన పట్టణాలు, మండలాల్లో ఉపవాస దీక్షల అనంతరం హలీం, హరీస్‌్‌, దైవడ, కద్దుకీఖీర్‌, డబుల్‌కామీఠా, ఖుర్బానీకామీఠా తదితర వంటకాలను భుజిస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ 26ట రోజున షబ్‌-ఎ-ఖాదర్‌ జరుపుకుంటారు. ఆరోజున 30పారాల ఖురాన్‌ను చదువుతారు. ఖురాన్‌ పఠనం ఈ రోజుతో ముగుస్తుంది. అదేరోజు రాత్రి మస్‌జిద్‌లతో పాటు తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) చేస్తారు. ఈ సందర్భంగా కొత్తబట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

రోజులు మారాయి..

 వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్