జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కనున్న ' దమ్ము ' సినిమాలో పలువురు సినీ హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రెండు, కాదు మూడు కాదు ఏకంగా నాలుగురు లేక ఐదుగురి పేర్లు విని పిస్తున్నాయి. తొలుత హీరోయిన్గా శృతిహాసన్ నటించాల్సి వుండగా, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది శృతిహాసన్ ప్లేస్లో ' జోష్ ' ఫేం కార్తీక పేరు వినించింది.. అయితే కార్తీక పేరు తెరమరుగైపోయి.. కొత్తగా కాజల్ పేరు తెరపైకొచ్చింది. ' దమ్ము'లో కాజల్ హీరోయిన్గా నటించడం దాదాపు ఖాయమైపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో .. కాజల్కి బదులుగా త్రిషని తీసుకున్నారని సమాచారం. ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్తో త్రిష ఒక్క సినిమాలో కూడా నటించలేదు.