Saturday, May 28, 2011

ఐపీఎలోల్‌ వరుసగా రెండో సారి టైటిల్‌ కైవసం చెన్నయ్

చెన్నయ్ అన్నుంది సాధించి ఇట్టు బ్యాటింగ్‌లో, అటు బౌలంగ్‌లో రాణించి విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుని ఎలా కట్టడి చేయాలో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నిరుపించుకున్నాడు.
ఐపీఎల్‌ -4లో టోర్నిలో వరుసగా రెండోసారి చెన్నయ్ విజయం సాధించింది. ఈ సారి మాత్రం కోల్‌కతా, ముంబయి, బెంగుళూరుకు టైటిల్‌ వస్తుంది అని భావించాను. కాని చెన్నయ్ అ అవకాశం ఎవరికి ఇవ్వకుండా తనే హిట్లరుగా భావించింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి 10 ఓవర్లలో చెన్నరు 94 పరుగుల చేసింది. విజరు 49, హాస్సీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. అతరువాత ఇద్దరికి బ్యాట్‌మెన్స్‌లకు చెరో అవకాశం దోరికింది. హాస్సీ 43 బంతులలో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో సహయంతో 63 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. 52 బంతులలో నాలుగు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. కెప్టెన్‌ ధోని 22 , మోర్కెల్‌ 2, రైనా 8 పరుగులు చేశారు. 20 ఓవర్లలో చెన్నయ్ 205 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు అదిలోనే క్రిస్‌గేల్‌ డకౌట్‌ అయ్యాడు. అశ్విని బౌలింగ్‌లో కీపర్‌ ధోని క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అశ్విని తన రెండో ఓవర్లలో మరో ఓపెనరు అగవ్రల్‌ 10 పరుగులకే అవుట్‌ చేశాడు. అతరువాత కోహ్లీ, డివిల్లర్‌ ఇద్దరు క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌లో కొత్త అశలు వచ్చాయి. క్రీజులో మంచిగా అడుతున్న సమయంలో మళ్లీ వికెటు పడింది. జకాతి మొదటి ఓవర్లలో డివిల్లర్‌ను ఎల్‌బిడబ్లుగా పెవిలియన్‌క పంపడాడు. అలా వరుసగా ఒక ఓవరు తరువాత మరోకరి వికెట్లు పడుతునే ఉంది. పరుగుల మాత్రం రావడం లేదు. మ్యాచ్‌ పూర్తిగా చెన్నయ్ వైపు వెళ్లింది. కొద్దిలో కొద్ది విరాట్‌ కోహ్లీ 35 పరుగులు చేశాడు. బెంగుళూరు 20 ఓవర్లలో 147 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరిలో తివారి 42 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు.