Thursday, April 28, 2011

క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ...

ఐపీఎల్‌-4లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరకుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయి. ఐదు మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అందరు సమిష్టగా రాణించడంతో విజయం సాధింస్తున్నారు. ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెహ్వాగ్‌, వార్నర్‌, వేణగోపాల్‌రావ్‌, ఫించ్‌, హౌప్ప్‌, నాయార్‌, ఓజా బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వీటికి తోడుగా పఠాన్‌ రాణించడంతో ఢిల్లీ జట్టు సంపూర్ణ, సమిష్టగా రాణిస్తుంది. బౌలింగ్‌లో మోర్కెల్‌, దిండా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యాదవ్‌ రాణించడంతో విజయం సాదిస్తున్నారు.
 దీన్నిలో ఒక మాట కూడ వాస్తవం కాదు 
 ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఒకరు కూడా సరిగా అడకపోవడంతో అట్టడుగునా ఉంది. ఈ సారి మాత్రము ఢిల్లీ జట్టులో ( దమ్మ్‌ లేదు, డేర్‌ అండ్‌ డ్యాష్‌ లేదు. ) గేలవాలన్నా ఓపికా లేదు. గెలిచిన ఆనందంము జట్టులో ఒక్క సభ్యుడుకు అ ఆనందంలేదు.  ఢిల్లీ జట్టు ఐపీఎల్‌ -1 లో సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -2లో కూడా సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -3 లో సెమీఫైనల్‌లో రాలేదు. ఇప్పడు ఇంకా అంతకన్నా ఘోరంగా అడుతుంది.
ఐపీఎల్‌-4లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు
మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 95 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది.
రెండోవ మ్యాచ్‌ రాజస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది.
మూడోవ మ్యాచ్‌ పూణే వారియర్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాల్గొవ మ్యాచ్‌ డెక్కన్‌ ఛార్జస్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదోవ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 29 పరుగులతో విజయం సాధించింది.
ఆరోవ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఏడవ మ్యాచ్‌లో కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.