Monday, January 24, 2011

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు

భారత్‌ మిడిల్‌ ఆర్డర్స్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు అన్న సందేహాం. యువరాజ్‌ సింగ్‌, రైనా, ధోని, వీరి ముగ్గురి మీద బాధ్యత. ఓ పెనరు రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌, వన్‌డౌన్‌ విరాట్‌ కోహ్లీ, టుడౌన్‌ యువరాజ్‌ సింగ్‌, త్రీ డౌన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఫోరుత్తు డౌన్‌ సురేష్‌ రైనా అతరువాత అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ అతరువాత బౌలర్ల బాధ్యత. ఇలా వరుసగా వస్తుంటారు. ముఖ్యంగా ఓ పెనర్లు విఫలమైన వన్‌డౌన్‌ మీద భాధ్యత ఉంటుంది. అతరువాత టుడౌన్‌ వచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి జట్టును ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ కూడా నమోదు కాలేదు. యువరాజ్‌ సింగ్‌ ఐదు వన్డే సిరీస్‌లో కేవలం 91 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో మాత్రము రాణించగలగాడు. రోహిత్‌ శర్మ ఐదు వన్డేలో 49 పరుగుల చేశాడు. కనీసం అర్థ సెంచరీ కూడ నమోదు కాలేదు. రైనా ఐదు వన్డేలో 111 పరుగులు చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ మూడు వన్డేలో 166 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ చేశాడు. మురళీ విజరు మూడు మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఐదు వన్డేలో 195 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యూసుఫ్‌ పఠాన్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించగలిగాడు.

ముచ్చటగా మూడో విజయం

 ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టెస్ట్‌ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్‌ వన్డేలో మాత్రం వరుస పరాజయాలు మూట కట్టుకుంటోంది. 3-0 తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా అదిక్యతం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 48 ఓవర్లలో 214 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. ట్రాట్‌ 84 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. బ్రెట్‌లీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.