Sunday, August 26, 2012

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

 ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ ఇన్నింగ్‌ఇ్స 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు అలౌటయ్యింది. నాలుగు రోజుల్లోనే ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసింది. టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ విజయం సాధించింది. మెక్‌ కల్లమ్‌ (52), విలియమ్సన్‌ 42, మాత్రమే రాణించారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌చేసి 6 వికెట్లు నేలకూల్చాడు. ఓజా 3 వికెట్లు పడగొట్టాడు. యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 438 పరుగులు, కివీస్‌ 159 పరుగులు చేసింది. రెండో టెస్ట్‌ ఈనెల 31ను ఆహ్మదాబాద్‌లో రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.