Thursday, August 18, 2011

దర్శకుడు బిజీ, హీరో బిజీ కాని, ఇద్దరి కాంబినేషన్‌లో మరొ సినిమా

ఎన్టీఆర్‌- పూరీ కాంబినేషన్‌లో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ' ఆంధ్రావాలా' వచ్చింది. ఈ జోడీ మరోసారి సినిమాకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ' ఊసరవెల్లి' , ' దమ్ము' చిత్రాలలో బిజీగా ఉండగా, దర్శకుడు పూరీ కూడా ' బిజినెస్‌ మ్యాన్‌ ' ' ఇండియట్‌ -2' చిత్రాలలో అంతే బిజీగా ఉన్నారు. కాబట్టి వీరి సినిమా దాదాపు 2012 సంవత్సరంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్యాయి.

రజనీకాంత్‌కు మరోసారి వైద్యపరీక్షలు

రాణా చిత్రం ఘాటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్‌కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.