Thursday, April 27, 2017

నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి...!

 వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ నాలుగేళ్ల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం అతడితో ఒప్పందం కుదుర్చుకొంది. కుడిచేతి చూపుడు వేలి గాయంతో ఐపీఎల్‌ పదికి దూరమైన డికాక్‌ స్థానంలో శామ్యూల్స్‌ను తీసుకొంది. ఈ వెటరన్‌ క్రికెటర్‌ 71 టెస్టులు, 187 వన్డేలు, 55 టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.కోటి కనీస ధరతో వచ్చిన శామ్యూల్‌ను ఎవరూ కొనగోలు చేయలేదు. చివరి సారిగా 2013లో పుణె వారియర్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడు.

Wednesday, April 26, 2017

ఆ రోజు త్వరలోనే వస్తుంది!

 ఆ రోజు త్వరలోనే వస్తుంది అని నమ్మకంగా చెబుతోంది నటి కీర్తీసురేశ్‌. తంతే గారెల బుట్టలో పడ్డ చందాన మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వచ్చి పడ్డ నటి కీర్తీసురేశ్‌. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇళయదళపతి విజయ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకుంది. అంతేకాదు టాలీవుడ్‌లోనూ నటించిన రెండు చిత్రాలు విజయాన్ని చవిచూడడంతో అక్కడ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సూర్యతో తానాసేర్న్‌దకూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నడిగై తిలగైయార్‌(తెలుగులో మహానది)లో సావిత్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.

ఇందులో మరో క్రేజీ నటి సమంత కూడా నటించనున్నారు. ఈమె పాత్రికేయురాలిగా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తీసురేశ్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీర్తీ నటిగా ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని పేర్కొంది.

 భైరవా చిత్రంలో విజయ్‌తో జత కట్టానంది. ఆయనతో నటించిన అనుభవం గురించి తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంది. అదే విధంగా ప్రస్తుతం మరో స్టార్‌ హీరో సూర్యతో కలిసి తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇక మరో స్టార్‌ నటుడు అజిత్‌తో ఎప్పుడు రొమాన్స్‌ చేస్తారని అభిమానులు అడుగుతున్నారని, ఆ అవకాశం త్వరలోనే వస్తుందని నటి కీర్తీసురేశ్‌ చెప్పింది.

అంటే అజిత్‌ తదుపరి చిత్రంలో నాయకి ఈ అమ్మడేనా? అలాంటి చర్చలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తదుపరి విశాల్‌తో సండైకోళి 2 చిత్రంలో నటించనున్నట్లు కీర్తీ పేర్కొంది. మొత్తం మీద కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతో నటిస్తూ పుల్‌ జోష్‌లో ఉందన్నమాట.

Monday, April 24, 2017

కాఫీ ఇస్తానంటే పారిపోతాడు..

 తన చేత్తో కాఫీ పెట్టిస్తానంటే సూర్య అక్కడి నుంచి పరుగు తీసేవారని నటి జ్యోతిక అన్నారు. ఆమె, శరణ్య, వూర్వశి, భానుప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘మగాలిర్‌ మట్టం’ చిత్రం పాటల విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్య, కార్తీ, శివకుమార్‌, పాండిరాజ్‌, వూర్వశి, సుధ కొంగర, ఎస్‌.ఆర్‌. ప్రభు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. ‘సూర్య నా కారు దగ్గరకు వచ్చి మరీ రోజూ బాయ్‌ చెప్తారు. తర్వాతే తాను సినిమా షూటింగ్‌కు బయలుదేరుతారు. బ్రహ్మ తెలిసో, తెలియకో చిత్రంలోని పాత్ర కోసం సరైన మహిళను(తననే) ఎంచుకున్నారు. ఎందుకంటే.. నాకు వివాహమై పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో నా భర్త కోసం స్వయంగా కేవలం ఒక్క దోశ వేశాను. అది కూడా ఇటు దోశ, అటు చపాతీకి మధ్యలో తయారైంది. ఆ దోశ తిన్నందుకు ధన్యవాదాలు సూర్య. ఈ దోశను నేను నా పెళ్లి తర్వాతి రోజు వేశాను. తర్వాత దోశలు పోసే అవసరం లేదని అమ్మ చెప్పారు. కనీసం నా చేత్తో కాఫీ చేసి ఇస్తానన్నా సూర్య అక్కడి నుంచి పరుగు తీస్తారు. ఇందుకే నన్ను నటించడానికి పంపుతున్నారేమో అనిపిస్తుంది. కానీ సూర్య లేకుండా నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. థ్యాంక్యూ సూర్య’ అని చెప్పారు.