Tuesday, April 10, 2012

డేరింగ్‌ విక్టరీ

సెహ్వాగ్, పీటర్సన్ మెరుపులు
ఢిల్లీ ఇరగదీసింది! బౌలింగ్‌లోనా బ్యాటింగ్‌లోనా? ఈ రెంటితో పాటు అద్భుతమైన గ్రౌండ్ ఫీల్డింగ్‌తో! అవును.. నాలుగు రనౌట్లతో చెన్నైకి దిమ్మతిరిగేలా చేసింది. ఫలితం.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చెన్నై రనౌటైంది. నామమాత్ర లక్ష్యా న్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. మంగళవారం పూరి ఏకపక్షంగా జరిగన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సెహ్వాగ్ జట్టు.. ధోనీమెన్‌పై 8 వికెట్ల తేడా తో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ సెహ్వాగ్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐతే. అంతకుముందు మ్యాచ్‌లో వెట్టోరి తరహాలో వీరూ నిర్ణయం బెడిసికొట్టదు కదా! అనే సందేహాలకు ఢిల్లీ ఫీల్డర్లు తమ మెరుపు ఫీల్డింగ్‌తో తెరదించారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులకే పరిమితమైంది. మోర్నీ మోర్కెల్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. జట్టులో చేరిన బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ (26 బంతు ల్లో 43 నాటౌట్; 4x3, 6x2) మెరుపు బ్యాటింగ్‌తో అలరి స్తే, జయవర్దనే 20 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు సెహ్వాగ్ (21 బంతుల్లో 33; 4x4; 6x1)... నమన్ ఓఝా (14)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. అల్బీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోని తొలి మూడు బంతుల్ని ఓఝా బౌండ్రీకి తరలిస్తే, తర్వాత అతని ఓవర్లోనే సెహ్వాగ్ వరుసగా 4, 6 కొట్టి హల్‌చల్ చేశాడు. ఈ జంట తొలి వికెట్‌కు 8.2 రన్‌రేట్‌తో 32 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు ఔటయ్యాక జయవర్దనే-పీటర్సన్‌లు అబేధ్యమైన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. మోర్నీ మోర్కెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.



Raina చెన్నై ‘పరుగో పరుగు’!
దిగ్గజాల చేరిక ఢిల్లీకి ఉత్సాహాన్నిచ్చిందో ఏమోగానీ ఢిల్లీ జట్టు అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసింది. ఫలితంగా 4 రనౌట్లు! దీనికి తొలి బంతితోనే బీజంపడింది. సింగిల్ తీసే క్రమంలో డుప్లెసిస్ తడబాటు పాపం ఒక్క బంతి కూడా ఆడకుండానే విజయ్‌ని రనౌట్‌గా బలిగొంది. అంతేనా.. కొద్దిసేపటికే తనూ రనౌటయ్యాడు డుస్లిసిస్. ఫలితంగా 26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది చెన్నై. ఈ దశలో రైనా రెండు సిక్సర్లతో హల్‌చల్ చేసినా లేని సింగిల్‌కు కక్కుర్తిపడి యోగేశ్ నాగర్ వేసిన అద్భుతమైన త్రోకు అతనూ రనౌటయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిశాయో లేదో బద్రీనాథ్ కూడా రనౌట్‌గానే వెనుదిరగాల్సివచ్చింది. అప్పటికి చెన్నై స్కోరు 9.4 ఓవర్లలో 64. ఇక మ రుసటి ఓవర్లో దక్కన్‌పై పేలిన జడేజా (13) కూడా వెనుదిరగడంతో చెన్నై భారీస్కోరు ఆశలకు గండిపడింది. భారీ హిట్టింగ్‌తో అ లరిస్తాడనుకున్న ధోనీ 18 బం తులో 11 రన్స్ చేసి ఔటయ్యాడు.

యువరాజ్ వచ్చేశాడు

yuviభారత స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసుకొని సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి షబ్న మ్, భారీ సంఖ్యలో అభిమానుల స్వాగతం మధ్య యువరాజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాక్షిశయంలో అడుగుపెట్టాడు. కీమోథెరపీ కారణంగా జుత్తు పూర్తిగా కోల్పోయిన యువీ.. ఎరుపు రంగు స్పోర్ట్స్ క్యాప్, టీ షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి ఎయిర్‌పోర్టు వెనక గేటు గుండా బయటికి వచ్చాడు. అభిమానుల్ని చూడగానే ఉబికివచ్చిన ఉద్వేగాన్ని కళ్లద్దాల వెనక అణచుకుంటూ చిరునవ్వుతో విక్టరీ చిహ్నాన్ని చూపుతూ కారులో ఇంటికి బయలుదేరాడు. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స తీరుతెన్నుల్ని, తన భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నాడు. కాగా, గుర్గావ్‌లోని తన నివాసానికి చేరుకున్నాక అతని రాకకోసం నిరీక్షిస్తున్న అభిమానులకు బాల్కనీ నుంచి యువీ అభివాదం చేయగా, అతని తల్లి షబ్నమ్ మీడియాతో మాట్లాడారు.

సినిమాలకు గుడ్‌బై?

ముగ్ధమనోహర సౌందర్యంతో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐష్ గత కొంతకాలంగా సినిమాలకు పూర్తి దూరంగా వుంటోంది. ‘హీరోయిన్’ చిత్రం నుంచి అర్థాంతరంగా తప్పుకున్న తర్వాత ఐశ్వర్య మరే చిత్రంలోనూ నటించలేదు. డెలివరీ తర్వాత ఓ సంవత్సరం విరామం తీసుకొని సినిమాల్లో నటిస్తానని ఐష్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితిని గమనిస్తే ఇక ఏ మాత్రం సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్యన రెండు భారీ చిత్రాల్లో నటించడానికి ఐశ్వర్యకు ఆఫర్లు వచ్చాయి. తల్లి కావడం వల్ల ఐశ్వర్య కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. దీంతో ఆఫర్లతో ముందుకొచ్చిన నిర్మాతలు ఈ సుందరి మళ్లీ మునుపటిలా ఒక్కపల్చగా తయారవ్వాలనే షరతులు ముందుంచారట. అయితే చక్కటి డైటింగ్‌తో నాజూకు అందాల్ని సొంతం చేసుకునే వీలున్న, ఆ సమయంలో తన పాప ఆలనాపాలనకు దూరమౌతానేమోనన్న బెంగపట్టుకుందట ఐష్‌కు. దీంతో భారీ పారితోషికాలతో వచ్చిన ఆఫర్లను కూడా ఈ మద్దుగుమ్మ తిరస్కరించిందని తెలిసింది. ఈ సమయంలో తనకు పాపే ముఖ్యమని భావిస్తున్న ఐశ్వర్య పాప కోసం సినిమాల్ని వదులుకోవడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. దీంతో వెండితెరపై ఈ సుందరి సమ్మోహన రూపం చూసే అదృష్టం ఇక వుండబోదని ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.